“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జులై 2016, శుక్రవారం

రెండేళ్ళ క్రితం చెప్పిన జ్యోతిషం ఇప్పుడు అక్షరాలా నిజమౌతోంది

జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా అద్భుతమైన శాస్త్రం.మనిషి జీవితంలోనే గాక,ప్రపంచంలో కూడా ముందు ముందు ఏమేం జరుగుతుంది?అన్న విషయాన్ని చెప్పగలిగేది ఈ ఒక్క శాస్త్రం మాత్రమే.అయితే దీనిని శుద్ధంగా నేర్చుకోవాలి.ఉపాసనా పూర్వకంగా నేర్చుకోవాలి.అప్పుడు అది ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి.ఇందులో ఏమీ అనుమానం లేదు.

నేను సెప్టెంబర్ 2014 లో 'రోహిణీ శకట భేదనం' అనే పోస్ట్ లు వ్రాస్తూ ఆ సీరీస్ చివరి పోస్ట్ లో ఎర్రని అక్షరాలతో ఇలా వ్రాశాను.
  • మార్చి-సెప్టెంబర్ 2016 ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన కాలం. ఎందుకంటే,ఒకటిన్నర నెల వ్యవధిలో రాశి మారే కుజుడు,ఆసమయంలో మాత్రం దాదాపు ఆరునెలల కాలం స్తంభన,వక్ర స్థితులలోకి ప్రవేశిస్తూ వృశ్చికంలో ఉన్న శనీశ్వరునితో కలసి ఉండబోతున్నాడు.ఆ సమయంలో వారిద్దరి భయంకరమైన సప్తమదృష్టి వృషభం మీద పడుతున్నది.కన్యారాశిలో ఉన్న రాహువు యొక్క పంచమదృష్టి కూడా ఆ సమయంలో వృషభం మీద పడుతున్నది.కనుక ఇదొక భయంకరమైన Compounding effect ను సృష్టించబోతున్నది.కాబట్టి ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భయంకర దుర్ఘటనలు ఖచ్చితంగా జరుగబోతున్నాయని నేను ఈరోజు(ఒకటిన్నర సంవత్సరం ముందుగా) చెబుతున్నాను.కావలసిన వారు వ్రాసి పెట్టుకోండి.అవి జరిగినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను.
ఆ పోస్ట్ లింక్ ఇక్కడ ఇస్తూ,ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రిడిక్షన్ ను ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. కావాలంటే ఆ పోస్ట్ ను ఇక్కడ చూడండి.


గత కొన్ని నెలలుగా గమనిస్తున్నారా?ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్ని జరుగుతున్నాయో? ఏదో ఒక పెద్ద దుర్ఘటన జరగకుండా ఈ మధ్యలో ఒక్కరోజు కూడా ప్రపంచం ముందుకు కదలడం లేదు.

ఇస్లామిక్ ఉగ్రవాద రాక్షసి ప్రపంచానికే పీడగా తయారైంది.దీని ఫలితంగా ఇంకొక పోస్ట్ లో వ్రాసినట్లు, కొన్ని దేశాల మధ్యన ఏకంగా యుద్ధ వాతావరణమే మొదలైంది.

ఈరోజున అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఈ పీడను వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్ధమౌతుంది.నిజానికి వాళ్ళు మాత్రమే దీనిని నిర్మూలనం చెయ్యగలరు.దురదృష్టవశాత్తూ గత కొన్ని దశాబ్దాలుగా మన ప్రభుత్వాల నయవంచన వల్ల ఇది మన సమాజంలో బాగు చెయ్యలేనంత స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు అమెరికాకు కూడా పెద్ద తలనొప్పిగా తయారౌతోంది.

ఒకవేళ ట్రంప్ గనుక అమెరికా అధ్యక్షుడైతే ఖచ్చితంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అణచివేసే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తాడు.దాని ఫలితంగా వారు అమెరికాను ఎదుర్కోలేక, అక్కడనుంచి బిచాణా ఎత్తేసి ఆసియాలోని ఇతర చిన్న దేశాలలో తమ కార్యకలాపాలు ముమ్మరం చేస్తారు. ఇప్పుడు మనం అమెరికాకు స్నేహితులం గనుక,పాకిస్తాన్ కు శత్రువులం గనుక, వారు అమెరికాను ఏమీ చెయ్యలేరు గనుక,మనదేశంలో లా అండ్ ఆర్డర్ పూర్ గనుక, ఆ కసితో ఖచ్చితంగా మన దేశంలో ఇంకా విధ్వంసాలు సృష్టిస్తారు. ముందు ముందు ఇది జరగడం మీరు కళ్ళారా చూడబోతున్నారు.దానికి కేంద్ర బిందువులు దక్షిణాదిన హైదరాబాద్, కేరళ, కర్నాటకలు కాబోతున్నాయి.

ఈ విధంగా రెండేళ్ళ క్రితం చెప్పిన దుర్ఘటనలన్నీ ఇప్పుడు అక్షరాలా జరుగుతున్నాయి. ముందు ముందు ఇంకా జరుగుతాయి.

దీనిని బట్టి చూస్తే, జ్యోతిష్యశాస్త్రం అనేది ఎంత గొప్ప విజ్ఞాన భాండాగారమో ఇప్పుడైనా అర్ధమౌతోందా మీకు?