“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, జులై 2016, ఆదివారం

జూలై 2016 - అమావాస్య ప్రభావం

రేపే అమావాస్య.

ఈ అమావాస్య చాలా దారుణమైన ప్రభావాలను చూపిస్తోంది.ఈ ప్రభావాలు వ్యక్తిగత జీవితాల మీదా, సామూహిక జనజీవనం మీదా సమానంగా ఉన్నాయి.

దానికి కారణం ఏమంటే - ఈసారి అమావాస్య చంద్రుని పైన బుధ,శుక్ర,కుజ,కేతువుల ప్రభావాలున్నాయి. దీనికి తోడుగా గురు రాహువుల సంయోగ యోగం ఇంకా అంతరిక్షంలో కొనసాగుతూనే ఉంది. అందుకని ఈ ప్రభావాలన్నీ కలసి మనుషులను నానా రకాలుగా ఊపుతాయి.

ముఖ్యంగా చంద్రునిపైన ఉన్న కుజ కేతువుల ప్రభావం వల్ల హింసాత్మక సంఘటనలు ఎక్కువౌతాయి. ప్రస్తుతం జరుగుతున్నవి అవేగా?

మొన్న హైదరాబాద్ లో ISIS తో సంబంధాలున్న తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేసి వారిదగ్గర బాంబులు తయారు చేసే రసాయనాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.గుడులనూ గోపురాలనూ టార్గెట్ చేసుకుని ఈ పధకాన్ని రచిస్తున్నామని అరెస్టైన వాళ్ళు చెబుతున్నారు. ఈ అరెస్టులు జరగకపోతే, హైదరాబాద్ ప్రజలకు రంజాన్ కానుకగా మరోసారి విధ్వంసం మాత్రమే దక్కేది.

బంగ్లాదేశ్ లో రోజుకొక హిందూ దేవాలయాన్ని ఎటాక్ చేస్తున్నారు.రోజుకొక హిందూ పూజారిని (వీరిలో చాలామంది వృద్ధులు) దారుణంగా చంపుతున్నారు.పూజారులను చంపితే ఆ ఆలయాలలో పని చెయ్యడానికి ఎవరూ ముందుకు రారు.కాలక్రమేణా అవి పాడుబడి పోతాయి.అప్పుడు వాటిని మసీదులుగా మార్చుకోవచ్చు.ఇదీ వాళ్ళ రాక్షస ప్లాన్.

సిరియాలో అయితే - తమ నగరం మీద తామే బాంబింగ్ చేసుకోవలసిన ఖర్మ ఆ దేశానికి పట్టించింది ఇస్లామిక్ ఉగ్రవాదం. తమ పౌరుల్ని తామే చంపుకుంటోంది ఆ దేశం. ఆ దేశంలో ఇస్లాం స్థాపిస్తున్న 'శాంతి' అలా ఏడిసింది.

నిన్న ఢాకాలో ఒక రెస్టారెంట్లో సివిలియన్స్ ను బందీలుగా పట్టుకున్న ఇస్లాం తీవ్రవాదులు 20 మందిని దారుణంగా గొంతులు కోసి చంపేశారు.వారిలో ఇటలీ వాసులు చాలామంది ఉన్నారు.జపనీయులున్నారు.మన దేశపు అమ్మాయి కూడా ఒకరున్నారు.విచిత్రం ఏమంటే - ఖురాన్ చదవగలిగిన వారిని ఏమీ అనకుండా, వారిని పక్కకు తీసి భోజనాలు కూడా పెట్టి బాగా చూచుకున్నారు. ఖురాన్ చదవలేని వారిని మాత్రం నానా చిత్రహింసలూ పెట్టి గొంతులు కోసి చంపేశారు.

మరోవైపు 'ఇస్లాంకు చెడ్డపేరు తేకండి' అని బంగ్లాదేశ్ ప్రధాని ప్రకటన చేసింది. అంటే - మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు.ఎంతమంది దారుణంగా చంపబడ్డారనేది ముఖ్యం కాదు. ఒక మతానికి వచ్చే చెడ్డపేరే వాళ్ళకు ముఖ్యం !! పైగా ఎన్ని చెడుపనులు చేసినా సరే, చెడ్డ పేరు మాత్రం రాకూడదట.భలే గొప్ప మతం కదూ !! ఇంత జరుగుతున్నా కూడా ఇస్లాం అంటే 'శాంతి' అని మనం నమ్మే తీరాలి !!

పైగా ఆమె ఇంకో మాటంది. ఈ తీవ్రవాదులెవరూ మదరసాల నుంచి రాలేదట.వీళ్ళంతా బాగా చదువుకున్న యూనివర్సిటీ పిల్లలట. ఆమె ఏం చెప్పాలనుకుంటోంది? అంటే మా దేశంలో చాందస ఇస్లాం ఎంతమాత్రం లేదు.మదరసాలలో తీవ్రవాదం నూరిపొయ్యడం లేదు అని చెప్పాలనుకుని అంతకంటే ఇంకో ఘోరమైన స్టేట్మెంట్ ఇచ్చేసింది. అదేంటంటే - మా యూనివర్సిటీలే ఇప్పుడు విధ్వంసకర ఇస్లాం కు అడ్డాలుగా మారాయి.ఇక మాకు మదరసాలతో పనేముంది అని నోరుజారి ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది.

చదువుకూ సంస్కారానికీ ఏమీ సంబంధం లేదన్న విషయం సివిల్ ఇంజనీరింగూ పబ్లిక్ అడ్మినిష్ట్రేషనూ చదువుకున్న బిన్ లాడెన్ ఎప్పుడో ప్రూవ్ చేశాడు.ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ ప్రధాని చెప్పవలసిన పని లేదు.ఈ సోది మాటలు ఆపి ఆ దేశంలో హిందువులకు రక్షణ కల్పిస్తే చాలు.

ఒకవైపు పాకిస్తాన్ నూ మరోవైపు బంగ్లాదేశ్ నూ తమ అడ్డాలుగా మార్చుకుని, అక్కడనుంచి ఇండియాలో అల్లకల్లోలం సృష్టించడమే తమ ఆశయం అని ISIS రాక్షసులు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నారు.

బ్రిటన్ విమానాశ్రయాన్ని ఎటాక్ చేస్తామని ఓపన్ గా ప్రకటన చేశారు.

ఇవన్నీ చూస్తూ కూడా ఇస్లాం అంటే శాంతే అని మనం నమ్మాలి !!!

వాటే జోక్ !!

ఇస్లాంలో మొదటినుంచీ రెండు రకాలైన వర్గపోకడలున్నాయి.ఒక వర్గమేమో మా మతం అంతా శాంతి అని నీతులు వల్లిస్తూ ఉంటారు.ఇంకొక వర్గమేమో ఇతర మతాల వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళూ వీళ్ళూ దోస్తులే. లోపల్లోపల ఒకరికొకరు చక్కగా హెల్ప్ చేసుకుంటూనే ఉంటారు. బయటకు మాత్రం నాటకం ఆడుతూ ఉంటారు.ఈ నాటకం నిన్న గాక మొన్న పుట్టిన చిన్న పిల్లాడికి కూడా తెలుసు.

చరిత్రను పరికిస్తే పఠిస్తే ఒక భయంకరమైన సత్యం కనిపిస్తుంది.ఇస్లాం మతం అనేది ఎప్పుడూ కూడా శాంతియుత మతం కానేకాదు.నిరంతరం కొట్టుకు చస్తున్న ఎడారి తెగల మధ్య యుద్దాలలోనే అది పుట్టింది.ఎదుటి వాడి గొంతు మీద కత్తిపెట్టి, 'ఇస్లాం లోకి మారతావా లేదా చస్తావా' అని అడగడమే ఎప్పుడూ ఆ మతం చేస్తూ వచ్చింది గాని శాంతితో అదెప్పుడూ వ్యాప్తి చెందలేదు.హింసతోనే ఆ మతం ఎప్పుడూ వ్యాప్తి చెందుతూ వచ్చింది.లేదా నవాబుల కాలంలో డబ్బుకోసం ఆశపడి మతం మారినవాళ్ళు ఉన్నారు. 

కనుక - డబ్బు, భయం ఈ రెండే ఎవరైనా ఇస్లాంలోకి మారడానికి చోదకశక్తులుగా చరిత్ర చదివిన వారికి కనిపిస్తాయి గాని వేరే ఇంకేమీ కనిపించవు.

మరి సాటి మనుషులను అలా దయాదాక్షిణ్యాలు లేకుండా చంపే తీవ్రవాదులు ఎందుకు అలా చేస్తున్నారు? వారికి జాలీ కరుణా ఉండవా? అని ప్రశ్నిస్తే ఒక భయంకరమైన సత్యం కనిపిస్తుంది.

అది వాళ్ళ తప్పు కూడా కాదు.అది వాళ్ళ మతగ్రంధం తప్పు.

"ఇస్లాంనూ అల్లానూ నమ్మని కాఫిర్లను చంపండి.అలా చంపడం తప్పు కాదు. పైగా అలా చంపడం వల్ల మీరు అల్లాకు ప్రియులౌతారు.ఆయన మిమ్మల్ని డైరెక్ట్ గా స్వర్గానికి తీసుకుపోతాడు.ఒకవేళ కాఫిర్లతో యుద్ధంలో మీరు చనిపోతే మీరు ఘాజీలు గా మారి అప్పుడు కూడా స్వర్గానికే డైరెక్ట్ గా  వెళ్లి అల్లా పక్కన కూచుంటారు.కనుక విజృంభించండి.జిహాద్ చెయ్యండి.' - ఈ రకంగా తలాతోకా లేని హింసను నూరిపోసే పద్యాలు ఖురాన్ లో దాదాపు 300 వరకూ ఉన్నాయి.

చిన్నప్పటినుంచీ ఇలాంటి బోధలను నూరిపోస్తే, అవి చదివిన వాళ్ళు ఏమనుకుంటారు? అవి దైవం సరాసరి చెప్పినవి కనుక, దైవాదేశాలు కనుక ,వాటిని పాటించడం మంచిదే అనుకుంటారు.పాటించక తప్పదు అనుకుంటారు.పాటించడం తమ ధర్మం అనుకుంటారు.

జిహాదీ లందరూ అలా గుడ్డిగా ఆ పద్యాలను నమ్ముతున్న వాళ్ళే.

కనుక అసలు తప్పంతా సోకాల్డ్ తీవ్రవాదులది కాదు.తప్పంతా ఖురాన్ ది. ఆ విధంగా సాటిమనుషుల మధ్యన హింసను ప్రేరేపించడం అది చేస్తున్న పెద్ద తప్పు.కానీ దానిలోని పద్యాలను మార్చే ధైర్యం ఎవరికీ లేదు.

అస్పృశ్యులనబడేవారు వేదాలను వినరాదని మనుస్మృతి చెబుతోంది గనుక దానిని రోడ్డు మీద పెట్టి పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు మన దేశపు కొందరు పౌరులు.మరి సాటి మనుషులను నిర్దాక్షిణ్యంగా గొంతులు కోసి చంపితే డైరెక్ట్ గా స్వర్గం వస్తుందని చెబుతూ రెచ్చగొడుతున్న పుస్తకాలను ఏం చెయ్యాలి?దీని గురించి ఏ సోకాల్డ్ మేధావులూ మాట్లాడరెందుకో? కనీసం అలా మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదెందుకో? ఈ విషయం గురించి చర్చించమంటే ఏ టీవీ చానలూ ముందుకు రాదు. సడెన్ గా అందరూ మూగవాళ్లై పోతారు.వెన్నులోనుంచి వణుకు పుట్టుకొస్తుంది.కానీ హిందూమతాన్ని విమర్శించమంటే మాత్రం ప్రతివాడూ ముందుకొస్తాడు.ఇదే అసలైన వింతల్లో వింత.

ఈ 300 పద్యాలనూ ఖురాన్ నుంచి తొలగించే ఊహను ఒకప్పటి టర్కీ ప్రెసిడెంట్ అయిన ముస్తఫా కెమల్ పాషా చేశాడు.కానీ ఆయన గోడు ఎవరూ పట్టించుకోలేదు.అయినప్పటికీ, ఆయన చాలా సంస్కరణలను వారి సమాజంలో తెచ్చాడు.అందుకే ఇప్పుడు టర్కీలో ఉన్నది ఇస్లామే అయినప్పటికీ అది ఒక ఉదారవాద దేశంగా మంచి పేరును సంపాదించుకుంది. కానీ, ఇస్లాంలో పిడివాదానికే తప్ప ఉదారవాదానికి ఎప్పుడూ తావుండదు.దానిలో ఉన్న హింసాత్మక బోధలను కొద్దిగానైనా మారుద్దామని ఎవడైనా ప్రయత్నిస్తే చాలు, వాడికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లే.కానీ మాది చాలా శాంతియుత మతం అని వారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.ఇది చాలా హాస్యాస్పదమైన విషయం.

ఇతర మతాల వారిమీద హింసను రెచ్చగొట్టే పద్యాలను ఖురాన్ లో నుంచి తొలగించి ఆ పుస్తకాన్ని ఎడిట్ చెయ్యనంత వరకూ ఇస్లామిక్ తీవ్రవాదం ప్రపంచం నుంచి ఎన్నటికీ మాయం కాదు.ఈ విషయాన్ని మేధావులూ, దేశాధినేతలూ ముందుగా గుర్తించాలి.

కానీ ఇది జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు.

సరే ఈ గోల ఎలా ఉన్నప్పటికీ - ఈ అమావాస్య మాత్రం ఉగ్రవాద ధోరణులను రెచ్చగొట్టే స్పందనలు అధికంగా కలిగి ఉంది. అందుకే గత మూడు రోజులుగా ఎక్కడ చూచినా ఇవే కనిపిస్తున్నాయి.

ఇదంతా సామాజిక ప్రభావం. ఇక. వ్యక్తిగత జీవితాలలో చూస్తే - 
  • అనవసర ఉద్రేకాలు చాలా కుటుంబాలలో కనిపిస్తాయి.
  • చిన్న చిన్న వాటికే పెద్దగా అరుచుకోవడం, ఏడవడం, గొడవ పడటం మొదలైనవి జరుగుతాయి.
  • ఎక్కడ చూచినా చిన్న చిన్న దుర్ఘటనలు కనిపిస్తాయి.
  • ఒకరినొకరు అపార్ధం చేసుకోవడం,మానసికంగా ఉద్రేకపడటం,అలగడం వగైరాలు ఎక్కడ చూచినా కనిపిస్తాయి.
  • హిస్టీరియా,పిచ్చి,ఫిట్స్ మొదలైన రోగాలతో బాధ పడేవారికి ఈ సమయంలో అవి చాలా ఎక్కువగా ఉద్రేకిస్తాయి.
జ్యోతిష్య శాస్త్రం నిజమే అనడానికి ప్రతి అమావాస్యకూ పౌర్ణమికీ రుజువులు ఎన్నేళ్ళైనా ఈ విధంగా కనిపిస్తూనే ఉంటాయి.

మీ చుట్టూ జరుగుతున్న విషయాలను నిశితంగా గమనించండి.మీకే అర్ధమౌతుంది. ఎందుకంటే ఈ అమావాస్య ప్రభావం ఇంకా 5 రోజులుంటుంది.