“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, జూన్ 2009, సోమవారం

మా పావా గడ్ యాత్ర













మొన్న ఏప్రిల్ నెలలో గుజరాత్ లోని పావా గడ్ సందర్శనా భాగ్యం కలిగింది. ఇది నేనున్న బరోడాకు దాదాపు ఏభై కిలో మీటర్ల దూరం ఉంటుంది. అక్కడ కొండ మీద కాళీ మాత ఆలయం ఉన్నది. మొదటగా బరోడా నుంచి స్టాఫ్ కాలేజి బస్సులో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి మధ్యలో ఆగుతూ పదకొండుకు పావాగడ్ చేరాము. అక్కడ నుంచి కొంత దూరం కొండ ఎక్కిన తరువాత రోప్ వే లో కొండ మీదకు చేరాము. అక్కడ నుంచి మళ్ళీ దాదాపు 200 మెట్లెక్కి కాళీ మాత ఆలయం చేరుకున్నాము. పావా గడ్ మన తిరుపతి కొండ లాగే అనేక కొండల సముదాయం. ఒక కొండ కొంత ఎక్కిన తరువాత ఇంకొక కొండ కనిపిస్తుంది. రోప్ డాడ్ ప్రయాణం చాలా ఉత్సాహం గా సాగింది. కాని పైకి వెళ్ళిన తరువాత ఎవరో చెప్పారు. 2003 లో రోప్ వే తెగి కాబిన్స్ లోయ లో పడి యాత్రికులు చచ్చి పోయారుట. దాదాపు 50 మంది గాయాల పాలయ్యారని. తరువాత రోప్ వెను ఇంకొక మంచి కంపెనీ కి కాంట్రాక్టు ఇచ్చారని తెలిసింది.

కాళీ మాత ఆలయం చాలా ప్రాచీనమైనది అని చెపారు కాని మధ్యనే కట్టినట్లు ఉంది. తరువాత తేలిసింది. ఇది నిజానికి ఎన్నో వేళ ఏళ్ళ నాటి దేవాలయం. కాని ముస్లిముల దండ యాత్రలలో ధ్వంసం అయింది. తరువాత మళ్ళీ పునర్ నిర్మాణం జరిగింది. ముస్లిములు అనేవారు శిల్ప కళను ఇతర మతాలను నాశనం చెయ్యటానికే పుట్టారేమో అని అక్కడ కొంతమంది కామెంట్ చేసి తిట్టారు. నిజమే కావచ్చు.

మన దేశంలో ఎక్కడ చూచినా ముస్లిముల చేతిలో ధ్వంసం అయిన దేవాలయాలు ఏన్నో కనిపిస్తాయి. ముస్లిములు ప్రపంచ వ్యాప్తం గా చీదరించుకో బడటానికి కారణం వారు ఏ దేశంలో ఉంటే ఆ దేశ సంస్కృతి తో మమేకం కారు. అక్కడి సంస్కృతినీ శిల్ప సంపదనూ దేవాలయాలనూ ధ్వంసం చేసారు. అందుకనే వారంటే సాధారణం గా వ్యతిరేక భావం ఉంటుంది అనిపించింది. ముఖ్యం గా గుజరాత్ లో ముస్లిం లు అంటే వ్యతిరేక భావం జనం లో బాగా కనిపిస్తుంది. కారణం ముస్లిం దండ యాత్రలలో మొదటగా దెబ్బ తిన్న రాష్ట్రం గుజరాత్ కావటమే అని నా గుజరాతీ స్నేహితుడు ఒకడు చెప్పాడు.

అదలా ఉంచితే, ఉత్తరాదిన మన లాగా శిల్ప సౌందర్యం తక్కువ. ఒక త్రికోణాకారపు ముఖం నేల బారుగా గుహ గోడకు చెక్కి దానికి రెండు పెద్ద కళ్లు నాలుక ఉన్న విగ్రహమే కాళీ మాత. రోప్ వె లో ప్రయాణించి పైన దిగిన తరువాత మళ్ళీ దాదాపు రెండు వందల మెట్లు ఎక్కాలి. అప్పుడు కొండ కొమ్ముకు చేరగలము. అక్కడే కాళీ మాత ఆలయం ఉంది. రెండు వందల మెట్లు చాలా వరకు నిటారుగా ఉండి ఎక్కటం కష్టం అనిపిస్తుంది.అలవాటు లేనివారికి కష్టం అవుతుంది. గుండె ఊపిరి తిత్తుల జబ్బులు ఉన్నవారు ఇక్కడ హరీ మనటం ఖాయం. అంత ఆయాసం వచ్చేలా సూటిగా పైకి ఉన్నట్లు ఉంటాయి.

ప్రదేశంలో ప్రాచీన జైన మందిరాలు చాలా ఉన్నాయి. కాని అవి శిధిలం అవుతున్నాయి. కాళీ మాత ఆలయం పాత దాన్ని పునరుద్ధరించి కొత్తగా కట్టినట్లు ఉంది. ఇక్కడ స్థల పురాణం బట్టి శ్రీ రాముని కుమారులు లవ కుశులు ఇక్కడ తపస్సు చేసినట్లు చెబుతారు. నాతో వచ్చిన మిత్రుడు జగదీశ్వర రావు గారికి ఇది ఒక పురాతన తాంత్రిక ఆలయం గా తోచింది. ఇక్కడ తాంత్రిక స్పందనలు అధికంగా ఉన్నాయి. దేవీ మంత్ర సాధనకు చాలా అనుకూల ప్రదేశం గా తోచింది. ఒకప్పుడు ఇక్కడ బలులు ఉండేవట. ప్రస్తుతం లేవు అని పూజారి చెప్పాడు. అహింస కు ఆలవాలం అయిన జైన మందిరాలు ఒక వైపు, బలులు మొదలైనవి జరిగే కాళికా ఆలయం ఇంకో వైపు విచిత్రం గా అనిపించింది.

చివరిగా ఇది సంగీత విద్వాంసుడైన బైజు బావరా నివసించిన ప్రదేశం అని తెలిసింది. బైజు బావరా ఇక్కడ కొండ కింద ఉన్నటువంటి చంపానేర్ అనే ఊళ్ళోనే ఉండేవాడని స్థానిక మిత్రులు చెప్పారు. ఈయన తాన్సేన్ సమకాలికుడు, తాన్ సేన్ కంటే బాగా పాడ గలిగిన వాడు అని అంటారు.

మేము రోప్ వేలో దిగి కిందికి వస్తుంటే దారిలో హార్ట్ ఎన్లార్జిమేంట్ ఉన్న ఒక ముసలామె నడవలేక ఆయాసపడుతూ కొడుకు కోడలు సహాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ కొండ ఎక్కటం కనిపించింది. కష్టం అమ్మా పైన 200 మెట్లు మీరు ఎక్క లేరు అని మేము వారించినా వినకుండా ఎక్కుతున్న వారిని చూచి నోట మాట రాక అచేతనుల మైనాము. మన అయ్యప్ప దీక్షలవలె అక్కడి జనం కాళీ దీక్షలు ధరించి దారి పొడుగునా నడుచుకుంటూ సూరత్ నుంచి అహమదాబాదు నుంచి కూడా నడిచి వచ్చి కొండ నేక్కుతున్నారు.

ఇక్కడ చుట్టూ పక్కల భిల్లులు అనే కొండ జాతి వారు అధికం అని తెలిసింది. చివరి రెండువందల మెట్లు పరిగెత్తుకుంటూ ఎక్కి రొప్పుతూ రోజుతూ నాలిక బయట పెట్టి కాళీ మాత లాగే అరుస్తూ ఆమె ముందు మోకరిల్లి నమస్కారం చేస్తున్నారు. పూజారి ప్రశాంతం గా వీరి చేష్టలు చూస్తూ ఆశీర్వచనం చేస్తున్నాడు. అతని ముఖం మంచి కళగా ఉంది. కాళీ మంత్ర ఉపాసకుడని తెలిసింది.

కొండ మీద అక్కడక్కడా పాడు బడిన పడుతున్న జైన మందిరాలు ఇతర గుళ్ళు విశిరేసినట్లుగా ఉన్నాయి. చీకటి గుహలుగా కొన్ని ఉన్నాయి. గబ్బిలాలు పాములకు నిలయాలుగా కనిపించాయి. ఒక పురాతన జైన మందిరం పార్శ్వ నాథునిది కనిపించింది. అందులో జప ధ్యానాలు చేసుకొని తిరిగి రోప్ వె ద్వారా క్రిందికి దిగాము. దిగుతున్నపుడు ఇంతకు ముందు ఏక్సిడెంట్ లో రోప్ వె తెగి కింద పడి పోయిన వారి మానసిక స్థితి తలపుకు వచ్చింది. ఇటువంటి సామూహిక మరణాలకు కారణం సమిష్టి కర్మ. ఇవి ఎందుకు జరుగుతాయి అనేదానికి మహా భారతం లో భీష్మ పితామహుడు ధర్మ రాజుకు వివరించిన ఘట్టం గుర్తుకు వచ్చింది.

మేము సరిగ్గా మిట్ట మధ్యాన్నం 12 నుంచి 3 లోపల కొండనెక్కి దిగాము. భయంకరమైన ఎండా మన విజయ వాడ గుంటూరు ఎండలను తలపించింది. సాయంత్రానికి తిరిగి బరోడా చేరాము. మర్నాడు మా గ్రూపులో చాలా మంది వడ దెబ్బతో పడక లేశారు. బలహీనులు, ముసలి వారు యాత్ర జోలికి పోవాలంటే చలి కాలం శ్రేష్టం. కాని వేసవిలో పోతే మాత్రం వడ దెబ్బతో అడ్డం పడటం ఖాయం.