“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, అక్టోబర్ 2010, శనివారం

ఇండోనేషియా సునామీ అగ్నిపర్వత పేలుళ్లు- జ్యోతిష పరిశీలన

26-10-10 సోమవారం నాడు ఇండోనేషియాలోని సుమత్రా దీవిని భూకంపం, సునామీ రెండూ దెబ్బతీశాయి. మర్నాడు అగ్నిప్రళయాలకు కారకుడైన కుజునిదైన మంగళవారంనాడు మేరాపీ అగ్నిపర్వతం బద్దలై విలయం సృష్టించింది. దీనికివెనుక కొన్ని జ్యోతిష కారణాలు కనిపిస్తున్నాయి. అవేమిటోచూద్దాం.

రోజున ఉన్న గ్రహస్థితి ఇక్కడ ఇస్తున్నాను. రోజు పూర్ణిమకు మూడురోజుల దూరంలో ఉంది. అప్పుడే బహుళ చవితి మొదలైంది.

చంద్రుడు, శనీ ఇద్దరూ ఖచ్చితంగా 16 డిగ్రీలమీదున్నారు. చంద్రుడు రోహిణిలో ఉంటే శని హస్తలో ఉన్నాడు. రెండూ చంద్ర నక్షత్రాలే. చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండి భూమిమీదతనయొక్క అసాధారణమైన ప్రభావాన్ని సూచిస్తున్నాడు. ఇద్దరూ భూతత్వరాశులలో ఉండి భూమిలోని తీవ్రచలనాన్ని సూచిస్తున్నారు. సముద్రంలో ఏర్పడిన భూకంపంవల్లనే సునామీ వచ్చిందని శాస్త్రవేత్తలంటున్నారు.

భూతత్వగ్రహమైన బుధుడు 14 డిగ్రీలలోనూ, జలతత్వ గ్రహమైన శుక్రుడు 13 డిగ్రీలలోనూ రాహువుయొక్క స్వాతీనక్షత్రంలో దగ్గరగా ఉన్నారు. పశ్చిమాన్ని సూచిస్తున్న తులారాశిలో ఉన్నారు. గురువు సున్నా డిగ్రీలలో అతి బలహీనుడుగా ఉన్నాడు. రాహువు కేతు నక్షత్రంలోనూ కేతువు రాహునక్షత్రంలోనూ ఉన్నారు. ఇండోనేషియాలోని పశ్చిమతీరంలోనే ఈ ప్రమాదం జరిగింది.

ఇండోనేషియాను సూచించే ధనూరాశిలోనే ప్రమాదాలకు కారకుడైన రాహువు ఉండటమూ, బుధుడూ శుక్రుడూ రాహునక్షత్రంలోనే ఉండటమూ గమనించవచ్చు.

అసాధారణ శక్తితో ఉన్న చంద్రుని దృష్టి అగ్నిపర్వత ప్రేలుళ్ళకు కారకుడైన కుజునిపైన ఉండటం చూడండి. మంగళవారం నాడే అగ్నిపర్వతం పేలింది.