“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, ఫిబ్రవరి 2009, సోమవారం

నాడీ జ్యోతిషం-భ్రుగు సంహితలు

నాడీ జ్య్తోతిషం - 2 -: భ్రుగు సంహితలు
---
సత్యాచార్యుని దాటి ఇంకా ప్రాచీన కాలం లోనికి పోదాం. క్రీస్తు పూర్వం ఎన్ని వేళ ఎండ్లో తెలియదు. మహర్షుల కాలం లోప్రవేశించాం. జ్యోతిష్యానికి ఆద్యులలో ఒకరైన భ్రుగు మహర్షి మహావిష్ణువును వక్ష స్థలంపైన తన్నాడు. దేహంతోవైకుంఠానికి ఎట్లా చేరాడు ? అని సందేహం కలుగుతుంది. మహర్షి గనుక తన తపశ్శక్తి తో వైకుంఠానికి చేరి వుండవచ్చు. లేదా భౌతిక దేహంతో గాక సూక్ష్మ దేహం తో పోయి ఉండవచ్చు. మహా విష్ణు వక్ష స్థలం లక్ష్మి దేవి నివాసం. కనుక దేవిఅలిగి మహర్షిని శపించింది. నేటి నుంచి నీవు నీ వంశం వారు దరిద్రంతో కాపురం చేస్తారు. సంపద మీ వంశంలోనిలబడదు.

మహర్షి ఖిన్నుడై నాడు. భూలోకానికి వచ్చిన పిదప, చేసిన తప్పుకు చింతించాడు. శాప నివారణ కావాలంటే ఏమిచెయ్యాలి? శాపం ఇచ్చిన మహా లక్ష్మి గురించే తపస్సు ప్రారంభం చేసాడు. ఏండ్లు గడిచాయి. దేవి ప్రసంనురాలైంది. ప్రత్యక్షం అయింది. తల్లీ నిన్ను కాలితో తన్ని తప్పు చేశాను. శాపాన్ని ఉపసంహరించు. దరిద్రం పోయే మార్గం చెప్పు. మహా లక్ష్మి చెప్పింది. వత్సా. నీకు త్రికాల జ్ఞానం అనుగ్రహిస్తున్నాను. దీనితో నీకు సమస్త జనుల భూత, భవిష్య, వర్తమాన వివరాలు తెలుస్తాయి. వాటితో జనులకు మేలు చెయ్యి. తద్వారా నీ వంశస్తులకు ధనార్జన కలుగుతుంది.

తల్లీ ఇంకొక్క వరం కావాలి. అన్నాడు మహర్షి. నీవు నాకు కూతురివై జన్మించాలి. నేను నిన్ను కాలితో తన్నాను. నీవుబిడ్డగా నా గుండెల మీద తన్నాలి. నీ ఆలనా పాలనా నేను చూడాలి. నిన్ను పెంచి పెద్ద చెయ్యాలి.
అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది. దేవి ప్రసంనురాలైంది. సరేనంటూ వరమిచ్చింది. భ్రుగు మహర్షి కి భార్గవి అనే పేరుతొ బిడ్డగాపుట్టింది. మహర్షి శాపం తీరింది. మహర్షి వ్రాసిన గ్రంథాలే భ్రుగు సంహితలు.

భ్రుగు సంహితలు ఉత్తర భారత దేశంలో ఉన్నాయి. హోషియార్పూర్ లో ఉన్న ఒక కుటుంబం అధీనంలో ఉన్నాయి. ఇవిఆశ్చర్య జనక మైన ఫలితాలు ఇస్తాయి. రెండు ఉదాహరణలు:

1 . ఒక రష్యన్ మహిళా తన భర్తతో కలిసి భ్రుగు సంహిత కోసం భారత్ వచ్చింది. దానిలో ఉన్నా విషయం విని ఆమె నిర్ఘాతపోవటమే గాక, అది నిజమే నని చెప్పింది. ఇంతకీ అందులో ఏముంది? ఇతర వివరాలతో బాటు, రష్యన్ మహిళ తనతల్లికి రెండవ భర్తతో పుట్టిన మూడవ సంతానం అని ఉంది. ఇది విని ఆమె అవాక్కైంది. ఇటువంటి వివరాలను సాధారణజోతిషం చెప్పలేదు. నాడీ గ్రంథములే చెప్పగలవు.

2 . స్వామి క్రియానంద, ఒక అమెరికన్. పరమహంస యోగానంద శిష్యుడు. SRF నుండి విడిపోయి సొంత సంస్థపెట్టుకున్న వాడు. ఈయన తన భ్రుగు సంహితా రీడింగ్ చదువుతుండగా జరిగిన సంఘటన ఆయనే వ్రాసాడు. "జాతకుడు ఇతర దేశస్థుడు, యోగ నేర్చుకోవటం కోసం ఒక ప్రసిద్ధ గురువును ఆశ్రయిస్తాడు. ఇతడు సంహితచదువుతుండగా ఆకాసంలో పెద్ద మెరుపు మెరుస్తుంది." అని ఉంది. క్రియానంద చదవటం ఆపి ఆకాశంలోకి చూస్తాడు. మంచి ఎండ తో ఉన్న ఆకాసంలో మెరుపు ఎలా వస్తుంది అని ఆలోచిస్తుండగా, తటిల్లని రెండు మబ్బుల మధ్యన విధ్యుత్ప్రవహించి మెరుపు మెరిసింది.

సంభ్రమ గొలిపే ఇటువంటి సంఘటనలు భ్రుగు సంహితలో చాలా ఉంటాయి. వ్రాస్తూ పొతే ఇదే ఒక గ్రంథం అవుతుంది. గ్రంథాలు దక్షిణ భారతంలో దొరకవు. ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి. ఇవి భ్రుగు వంశస్తుల వద్ద వంశ పారంపర్యంగా దాచ బడుతూ వస్తున్నాయి. వీరిది శ్రీ వత్స గోత్రం అంటారు.

భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఔర్వ, జమదగ్ని-- గోత్ర మూల ఋషులు. లక్ష్మిదేవి కటాక్షం పొందిన వారు గనుక శ్రీ వత్సగోత్రీకులు అయినారు.

వచ్చే వ్యాసంలో మంత్ర నాడి గురించి చూద్దాము