28, మార్చి 2026, శనివారం

ఎడారిమతాలున్నచోట శాంతి ఉండదు

నిన్న శ్రీరామనవమి నాడు తన నియోజకవర్గంలోని  ఆకివీడులో, ఒక రామాలయాన్ని సందర్శిద్దామని వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిమీద, ఆయనవెంట ఉన్న వారిమీద కత్తులతో, మేకులతో భౌతికదాడి జరిగింది. పోలీస్ ఎస్కార్ట్ తో ఆయన ఆ గుంపునుండి బయటకు రావలసి వచ్చింది. ఆయన వెంట ఉన్నవారిలో కొంతమందికి గాయాలయ్యాయి.

దాడిచేసినది దళితక్రైస్తవుల ముసుగులో ఉన్నవారని ఆయన ఆరోపించారు.

శాంతిని అనుసరించవలసిన క్రైస్తవులు దాడిచేయడమేంటి? అదీగాక మేకులతో దాడిచేయడమేంటి? నాకైతే నవ్వొచ్చింది. అంటే, వారు నమ్మే జీసస్ ను రోమన్లు మేకులు కొట్టి చంపేశారు గనుక, వాళ్లకు నచ్చని అందరినీ మేకులతో దాడిచేద్దామని ప్రయత్నమా? ఇదెక్కడి వింతో నాకైతే అర్ధం కాలేదు.

పశ్చిమగోదావరి జిల్లాలలో గత అరవై డెబ్బయి ఏళ్లుగా క్రైస్తవప్రచారం ముమ్మరంగా జరిగింది. అనేక సంస్థలు పుట్టుకొచ్చి, లక్షలమంది నిమ్నవర్గపు హిందువులను క్రైస్తవులుగా మార్చేశాయి. చాలాచోట్ల ఊళ్లకు ఊళ్లే ఈ విధంగా మార్చబడ్డాయి. అలా మారినవారిలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ప్రముఖంగా ఉన్నారు. వారిలో తక్కువశాతం మంది మాత్రం ఇప్పటికీ మారకుండా నీతిగా ఉన్నారు.

నీతిగా అని ఎందుకన్నానంటే, చెప్పుకునే మతమేమో క్రైస్తవం, పేపరుమీద మతమేమో హిందూమతం. లేకపోతే రిజర్వేషన్ రాదుగా? మరి, అది నీతెలా అవుతుంది? అందుకని అలా అనవలసి వచ్చింది !

అంతకుముందు ఆయా ఏరియాలలో అన్నింటిలోనూ రామాలయాలుండేవి. క్రమేణా అవి పాడుబడిపోయాయి. సందుసందుకీ చర్చిలు వెలిశాయి. దశమభాగాలు దండుకొని పాస్టర్లు కోటీశ్వరులయ్యారు. మతవ్యాపారాలు విస్తరించాయి. ఓట్లకోసం నాయకులు వారికి తందానతాన పాడారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయి. చీలికలు ఏర్పడ్డాయి.

దేశంలో నార్త్ ఈస్ట్ లోని సెవెన్ సిస్టర్ రాష్ట్రాలు ఏకమొత్తంగా క్రైస్తవంలోకి మార్చబడ్డాయి. ఈ పని గత యాభై ఏళ్లుగా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత స్దానం ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లాదే అని నా అనుమానం. అంత ఎక్కువగా కన్వర్షన్స్ అక్కడ జరిగాయి.

ఈ లోపల, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని, రికార్డులో హిందువులుగా ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా మారి అనేకమంది డబల్ బెనిఫిట్ పొందారు. అక్కడేమో రిజర్వేషను, ఇక్కడెమో మతప్రచారం, విదేశీఫండ్స్, వాటిలో ముప్పావలా నొక్కేసి, పావలా పంచి మళ్ళీ మతమార్పిడులు, ఈ విధంగా ఈ అవినీతికుట్రలు దశాబ్దాలుగా సాగుతూ వచ్చాయి.

నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో, ఇప్పటివరకూ హిందూరిజర్వేషన్ వరాలను అనుభవిస్తూ, సమాజంలో క్రైస్తవులుగా చెలామణీ అవుతున్న దొంగలందరూ బయటకు రావల్సి ఉంటుంది. పెద్దపెద్ద ఉద్యోగాలలో ఇప్పటికే తరతరాలుగా స్థిరపడి ఉన్న వీరంతా,  ఆ విధంగా బయటపడి తమ తప్పులను ఒప్పుకుంటారా? సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సరే. పిల్లికి గంటకట్టేదెవరు? చూడాలి.

పోతే, ఇన్ని దశాబ్దాలుగా, ఈ న్యాయవిరుద్ధమైన రిజర్వేషన్ ను ఉపయోగించుకొని ఇప్పటివరకూ ఎన్ని కోట్లమంది ఉద్యోగాలు సంపాదించారో లెక్క తీయవలసిన అవసరం ఉన్నది. మరి, అన్ని కోట్లమంది అసలైన అర్హులు తమ అవకాశాలను పోగొట్టుకున్నట్లే కదా? వారికి జరిగిన నష్టాన్నెవరు పూడుస్తారు? పూడ్చిపెట్టబడిన  ప్రభువు లేచొచ్చి పూడుస్తాడా?

అదలా ఉంచితే, శాంతిమతాలైన క్రైస్తవం, ఇస్లాంలు ఎక్కడ అడుగుపెడితే అక్కడ చీలికలు, విభేదాలు, గొడవలు, హింస, యుద్ధాలు, నాశనం తప్పకుండా జరుగుతుందనేది నిజం. నేడు ప్రపంచంలోని ఏ దేశంలో చూచినా ఇది రుజువౌతుంది. కారణమేంటంటే, వారి మూలసిద్ధాంతమే - 'నా మతం కరెక్టు, నీది తప్పు. మా దేవుడు రైటు, మీవాడు రాంగు, మతం మారతావా చస్తావా?' అనేది తప్ప ఇంకొకటి ఉండదు. ఉన్నతమైన తత్త్వశాస్త్రం గాని, తమకంటే ప్రాచీనమైన మతాలనుండి కాపీకొట్టకుండా సొంతంగా పుట్టిన భావాలు గాని, వాటిలో ఎక్కడా లేకపోవడం ఇంకొక కారణం.

క్రైస్తవానికీ, ఇస్లాముకూ యూదుమతమే మూలం. వాటిపైన తిరుగుబాటుగా పుట్టిన ఇస్లాం ఆ రెండింటితో ఇప్పుడు యుద్ధం చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాల మధ్యన ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? ఈ మూడూ అబ్రహామిక్ మతాలే. వీటితో ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి వస్తున్నది. మళ్ళీ ఈ మూడూ చెప్పేవి శాంతి కబుర్లే. వింతగా లేదూ?

మొదటి ప్రపంచయుద్ధంలో 2 కోట్ల 20 లక్షలమంది చనిపోయారు. రెండవ ప్రపంచయుద్ధంలో 8 కోట్ల 50 లక్షలమంది చనిపోయారు. 1095 CE నుండి 1291 CE వరకూ జరిగిన క్రూసేడ్స్ లో 90 లక్షలమందిని, కేవలం క్రైస్తవులు కాని కారణం చేత, అమానుషంగా హింసించి చంపేశారు పోపు అనుచరులు. అంటే దాదాపుగా 12 కోట్లమంది అమాయకులను ఇప్పటిదాకా ఈ రెండు శాంతిమతాలూ పొట్టనపెట్టుకున్నాయి. ఇదేనా శాంతి అంటే?

1560-1812 CE  మధ్యలో జరిగిన గోవా ఇంక్విజిషన్స్ లో వందలాదిమంది హిందువులను దారుణంగా హింసించి సజీవదహనాలు చేశారు. లేదా మతాలు మార్చారు. ఇది మన గోవారాష్ట్రంలోనే జరిగింది. ఏ విధంగా అమాయకులైన హిందువులను హింసించారో చదివితే రక్తం ఉడికిపోతుంది. ఇదా క్రైస్తవం? వీళ్లదా శాంతిమతం? శాంతివచనాలు చెప్పే అర్హత క్రైస్తవానికి అసలుందా?

నేడు సెవన్ సిస్టర్స్ మొత్తాన్నీ ఒక క్రైస్తవదేశంగా మార్చేసి ఇండియానుండి విడదీయాలని పెద్ద కుట్ర జరుగుతోంది. ఇది నిజమా కాదా? సాక్షాత్తు బంగ్లాదేశ్ గతప్రధాని షేక్ హసీనానే  ఈ మాట చెప్పింది. నిన్నగాక మొన్న టూరిస్ట్ వీసాలపైన ఇండియాకు వచ్చి మణిపూర్, మిజోరాం ప్రాంతాలలో క్రైస్తవమతప్రచారం చేస్తూ, ఆయుధాలు సప్లై చేస్తూ ఉక్రెయిన్ దేశస్థులు, అమెరికన్లు దొరికిపోలేదా? దీనిని శాంతి అంటారా? క్రీస్తు ఇలాంటి కుట్రలను చెయ్యమని చెప్పాడా?

1947 దేశవిభజన సమయంలో దాదాపు 20 లక్షలమంది భారతీయులు చంపబడ్డారు. వేలాదిమంది హిందూమహిళలు రేపులకు గురయ్యారు. 1989 లో జరిగిన కాశ్మీర్ మారణకాండలో దాదాపుగా 1000 మంది కాశ్మీర్ పండిట్లు దారుణంగా చంపబడ్డారు. కారణం? వాళ్ళు హిందువులు కావడమే. వేలాదిమంది హిందూమహిళలు రేపులకు గురయ్యారు. ఎప్పటివో ఎందుకు? ప్రస్తుతం బాంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మారణకాండ ఏమిటి? ఎంతమందిని చంపారు? ఎన్ని రేపులు జరిగాయి? ఎన్ని ఇళ్ళు ధ్వంసం చేశారు? ఇదంతా ఇస్లాం చేసింది కాదా? ఇది ఇంకొక శాంతి మతమా? మనం నమ్మాలా?

1980 - 88 మధ్యలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని 20 లక్షలమంది చచ్చారు.

అందరూ ముస్లిములే ఉన్నచోట షియాలు, సున్నీలు అని కొట్టుకుంటారు. అందరూ క్రైస్తవులే ఉన్నచోట కాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు అని కొట్టుకుంటారు. వీళ్ళలో ఇంకా చాలా గ్రూపులు, డినామినేషన్లు ఉన్నాయి. బయటకు ఆ గొడవలన్నీ కనిపించవు. లోతుగా చూచినవారికి మాత్రమే అర్ధమౌతాయి. తెలియనివారికి మాత్రం అవి చాలా శాంతిమతాలని మాయమాటలు చెబుతారు.

జనాభాను పెంచుకొని దేశదేశాలు ఆక్రమించి, విద్వేషాలు రెచ్చగొట్టి, ఆ దేశస్థులను లేకుండా రూపుమాపడమే వీళ్ళ అజెండా. శాంతి అనేది దీనికి ఒక ముసుగు మాత్రమే.

చరిత్ర చదువుకుంటే ఇవన్నీ అర్ధమౌతాయి. ఏమీ తెలియకుండా డబ్బులకు అమ్ముడుపోయి, పాస్టర్లు, ముల్లాలు చెబుతున్నది నిజమనుకుంటే ఇలాగే ఉంటుంది మరి ! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీస్పీకర్ పరిస్థితే  ఇలా ఉంటే, ఇక ఆ ఏరియాలలో ఇతరపౌరులు శాంతిగా బ్రతికేదెలా సాధ్యపడుతుంది? ఆలోచించండి. హైద్రాబాద్ పాతబస్తీ లాగా, పశ్చిమగోదావరి జిల్లా కూడా తయారైనట్లు కనపడుతోంది. దానికీ దీనికీ మూలం ఆ రెండుమతాలే. అవి అడుగుపెట్టిన చోట శాంతి అనేది ఉండదనేది వాస్తవం.

ఇంకా సందేహాలేమైనా మిగిలున్నాయా?

read more " ఎడారిమతాలున్నచోట శాంతి ఉండదు "

24, మార్చి 2026, మంగళవారం

International Taijiquan Day



మార్చి 21 వ తేదీని 
International Taijiquan Day (అంతర్జాతీయ తైచి దినం) గా  UNESCO ప్రకటించింది.

మార్చి 21 అనేది చాలా పాతకాలం నుంచీ 'వసంత విషువత్ దినం' గా అనేకదేశాలలో పాటించబడుతూ వస్తున్నది. ఆయా దేశాలలో దీనిని రకరకాల పేర్లతో పిలుస్తారు.

జూన్ 21 ఇప్పటికే యోగా డే అయింది. ఇప్పుడు మార్చి 21 తైచి డే అయింది. మంచిదే. బాయ్ ప్రెండ్ డే, గర్ల్ ప్రెండ్ డే, ఎఫైర్స్ డే లాంటి దరిద్రాల బదులు తైచి డే, యోగా డే వంటివి మంచివి కదూ !

తాయ్ చి అనే చైనావారి వీరవిద్య ఇప్పుడు కోట్లాదిమందిచేత ప్రపంచవ్యాప్తంగా అభ్యాసం చేయబడుతూ వస్తున్నది.

అయితే, ఇది ఆత్మరక్షణ కోసం ప్రాక్టికల్ గా ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక వివాదాస్పదమైన విషయం అయినప్పటికీ, ఆరోగ్యపరంగా చూచినపుడు, రిలాక్సేషన్ వ్యాయామంగా, సీనియర్ సిటిజెన్స్ మరియు నడివయసుకు చేరిన ఆడవారు హాయిగా చేసుకునే శరీరవ్యాయామంగా గుర్తించబడింది.

దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి.

కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. ఇతర దీర్ఘవ్యాధులలో ఒక మంచివ్యాయామంగా ఉపయోగపడుతుంది. కదలికను మెరుగుపరుస్తుంది. flexibility ని బేలెన్స్ ను ఇస్తుంది. మంచి నిపుణుని దగ్గర నేర్చుకుని సరిగ్గా అభ్యాసం చేస్తే ప్రాణాన్ని బలోపేతం చేస్తుంది. ఆయుస్సును పెంచుతుంది.

ప్రస్తుతం నాకు 63 నడుస్తోంది. ఇప్పటికీ నేను యోగాభ్యాసాన్ని, మార్షల్ ఆర్ట్స్ ను చేస్తూనే ఉన్నాను. చాలామంది రెగ్యులర్ గా వేసుకునే మందులేవీ  ఇంతవరకూ నాకవసరం పడలేదు.  బీపీ, షుగర్, హార్ట్ సమస్య, ఊబకాయం, కీళ్ళనొప్పులు, అజీర్ణం, థైరాయిడ్ సమస్య, నిద్రసమస్యలు, ఆదుర్దా మొదలైనవాటిని ఇతరులు చెబుతుంటే నాకు నవ్వొస్తూ ఉంటుంది. వారిపైన జాలి కలుగుతుంది. జీవనవిధానం సరిగా లేనపుడు, ఇలాంటి రోగాలు రాక ఇంకేం వస్తాయి?

సరైన ఆహారం, సరైన వ్యాయామం, సరైన జీవనవిధానం ఈ మూడూ లోపించడమే నేటి రోగాలకు కారణం.

మొన్న 21 వ తేదీన మా ఆశ్రమంలో నేను చేసిన 'యాంగ్ స్టయిల్ తైచి' మొదటి భాగాన్ని పైనున్న వీడియో క్లిప్ లో చూడండి.

జూలైలో జరగబోయే ఆధ్యాత్మిక రిట్రీట్ నుండి, తైచి అభ్యాసాన్ని కూడా నా శిష్యులందరికీ నేర్పబోతున్నాను. ఇకనుంచీ, యోగాభ్యాసంతో బాటుగా దీనిని కూడా మా ఆశ్రమంలో క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే, రెండూ ప్రాణశక్తికి బలాన్నిచ్చి, దానిని సక్రమంగా ఉంచే అభ్యాసాలే.

కుంగ్ ఫు సూపర్ స్టార్ జెట్ లీ కూడా ఇప్పుడు తైచిని బాగా ప్రోమోట్ చేస్తున్నాడు. అతనికి థైరాయిడ్ సమస్య వచ్చి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రంగా  మొదలైనప్పటి నుండీ తైచి పైన గట్టిగా దృష్టిపెట్టినట్లు కనపడుతున్నది. బౌద్ధుడైన ఇతను ప్రస్తుతం, అమెరికాను వదలిపెట్టి,  సింగపూర్ కు మకాం మార్చాడు. తైచి ని ప్రోమోట్ చేస్తున్నాడు. ఇది మంచిపని.

వయసు 50 దాటిన తర్వాత, కండలను పెంచే హార్డ్ స్టయిల్ కుంగ్ ఫూ మంచిది కాదు. ప్రాణశక్తిని పెంచే ఇంటర్నల్ కుంగ్ ఫూ మంచిది.  దానిలో తైచి, బాగ్వా, జింగ్ యి అని మూడు విద్యలున్నాయి. మూడూ మంచివే. 50 దాటాక తైచి మంచిది.

'యోగాభ్యాసం చేయండి. తైచి అభ్యాసం చేయండి. ఆరోగ్యంగా జీవించండి', అని నా శిష్యులను, అభిమానులను కోరుతూ, ఈ సందర్భంగా జెట్ లీ కి, తైచి అభిమానులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
read more " International Taijiquan Day "

R. I. P Chuck Norris


హాలీవుడ్ యాక్షన్ హీరో 'చక్ నారిస్' మొన్న 19 వ తేదీన అమెరికాలోని హవాయ్ లో చనిపోయాడు. అతనికి 85 ఏళ్ళు. చివరివరకూ ఆరోగ్యంగానే ఉన్న ఇతను, ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి పోయాడంటున్నారు. కారణాలు తెలియవు.

'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' లో బ్రూస్లీ తో ఇతను చేసిన క్లైమాక్స్ ఫైట్ చాలా హిట్టయింది. ఆ విధంగా ఇతనికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చినప్పటికీ, అప్పటికే ఇతను వరల్డ్ కరాటే ఛాంపియన్ అయి ఉన్నాడు. వరుసగా ఆరేళ్లపాటు ఈ టైటిల్ ను ఇతను గెలుచుకున్నాడు.

1958 లో US ఎయిర్ ఫోర్స్ లో చేరి,  డిప్యూటేషన్ పైన దక్షిణకొరియాలో పనిచేస్తున్నప్పుడు, తన 18 ఏట 'టాంగ్ సు డో' (కొరియన్ కరాటే) అభ్యాసాన్ని మొదలుపెట్టిన ఇతను ఆ తరువాత జూడో, టాయ్ క్వాన్ డో, బ్రెజిలియన్ జుజుట్సు మొదలైన ఇతరవిద్యలలో కూడా బ్లాక్ బెల్టులను పొందాడు. 

1967 లో ఇతను అమెరికన్ కరాటే ఛాంపియన్ అయ్యాడు. 1968 లో, 1969 లో కూడా మళ్ళీ ఛాంపియన్ షిప్ గెలుచుకుని రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ప్రాక్టీస్ ఆపలేదు. తన 85 వ ఏట చనిపోయేవరకూ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు.

యోగా, మార్షల్ ఆర్ట్స్ అనేవి వైరస్ ల వంటివి. ఒకసారి పట్టుకుంటే జీవితాంతం వదలవు. కానీ ఈ వైరస్సులు చాలా మంచివి. మనకు మంచినే చేస్తాయి. అందుకే, మార్షల్ ఆర్టిస్టులు ఎంత వయసొచ్చినా అభ్యాసం చేస్తూనే ఉంటారు.

ఇతను వివాదాలు లేని వ్యక్తి. మంచివాడు. కలుపుగోలు మనిషి. సౌమ్యుడు. ప్రపంచ ఛాంపియన్ అయినప్పటికీ గర్వం లేనివాడు. ఈ గుణాలవల్ల ఇతనిని నేనుకూడా అభిమానిస్తాను.

ఇతని ఆత్మకు శాంతి కలుగుగాక !
read more " R. I. P Chuck Norris "

23, మార్చి 2026, సోమవారం

మన హిందూమతం చాలా గొప్పది

'ఫలానా హిందూసంస్థ నుండి మాట్లాడుతున్నాము' అంటూ ఈమధ్య ఒక ఫోన్ కాలొచ్చింది.

పరిచయాలయ్యాక. 'ఎందుకు ఫోన్ చేస్తున్నారు?' అడిగాను.

'మీ కృషి చాలా బాగుంది. మీ వ్రాతలన్నీ మేము చదువుతాము. ముఖ్యంగా, క్రైస్తవాన్ని, ఇస్లాంను మీరు విమర్శించే తీరు బాగుంటుంది' అన్నారు.

'మన హిందూమతాన్ని కూడా విమర్శిస్తూనే ఉంటాను. అది చదవలేదా?' అడిగాను.

'చదువుతున్నాము. అందుకే ఈ ఫోన్. మనల్ని మనమే విమర్శించుకుంటే ఎలా?' అన్నాడాయన.

'ఆత్మవిమర్శ మంచిదేగా?' అడిగాను.

'అది తగ్గించి, ఇతర మతాలను ఎండగట్టడంపైన దృష్టి పెట్టండి. ఇది మా రిక్వెస్ట్' అన్నాడు.

'అది సరే. కానీ మన  హిందువుల పిచ్చిపోకడలను వదిలేస్తానని మాత్రం చెప్పలేను' అన్నాను.

'అది చెయ్యడానికి మతాచార్యులున్నారుగా?' అన్నాడు.

'ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు మన మతాచార్యులు?' అడిగాను.

'అంటే వాళ్ళ పరిమితులు వాళ్ళకుంటాయి కదండీ' అన్నాడు.

'పరిమితులుంటాయి సరే. హిందువులు తప్పులు చేస్తున్నపుడు, 'ఇది తప్పు. వద్దు చెయ్యకండి' అని ఎందుకు చెప్పడం లేదు? హిందూమత మూలాల గురించి, అసలైన హిందూమతం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు?' అడిగాను.

దానికి జవాబు చెప్పకుండా, 'మనమందరం ఐకమత్యంగా ఉండాల్సిన సమయం వచ్చింది' అన్నాడు.

'ఇప్పుడు క్రొత్తగా వచ్చేదేముంది? చరిత్రలో ఇటువంటి కాలాలు చాలాసార్లు వచ్చాయి. చాలాసార్లు మనం ఫెయిలయ్యాం' అన్నాను.

'కనుకనే ఇప్పుడు మనం కలిసుండాలి' అన్నాడు.

'కలిసుండక విడిపోయిందెప్పుడు?' అన్నాను.

'అంటే, అందరూ ఒక్క త్రాటిపైకి రావాలి' అన్నాడు.

ఆయన మాటలు రాజకీయ పడికట్టు పదాలలాగా ధ్వనించాయి.

'ఎక్కడుంది ఆ త్రాడు?' అడిగాను.

 జవాబు లేదు.

'మీరు చెప్పలేకపోయినా, నేను చెబుతున్నాను వినండి. నేనా త్రాటిపైననే ఉన్నాను. లేనివాళ్ళని దానిపైకి రమ్మనే నేనూ చెబుతున్నాను. ఈ క్రమంలోనే మన హిందూమతంలోకి రోజురోజుకూ వచ్చి చేరుతున్న పిచ్చిపోకడలను ఖండిస్తున్నాను' అన్నాను.

'కొంచెం వివరిస్తారా?' అడిగాడు.

'చూడండి. శివుడు, విష్ణువు. అమ్మవారు, ఇతర ప్రామాణిక హిందూదేవతలందరినీ మేము  ఒప్పుకుంటాము. క్రొత్తగా తయారౌతున్నవారిని, చేర్చబడుతున్నవారిని మాత్రం ఒప్పుకోము. పోతే, వైష్ణవులు శైవాన్ని ఒప్పుకుంటారా?' అడిగాను.

'ఒప్పుకోరనుకోండి. దానిని కూడా మేము ప్రయత్నిస్తున్నాము' అన్నాడు.

' మరి శైవులు వైష్ణవాన్ని ఒప్పుకుంటారా?' అడిగాను.

' ఒప్పుకోరు' అన్నాడు.

' అలాగే,  ఏ శాఖైనా మిగతావారిని ఒప్పుకోవు. ఇదంతా తప్పని, దేవతాస్వరూపాలన్నీ ఒకే పరబ్రహ్మము యొక్క  అనేకరూపాలని ఏ ఆచార్యుడు, ఏ గురువు చెబుతున్నారు?' అడిగాను.

' మేమూ ప్రయత్నిస్తున్నాము. ఈ సత్యాన్ని జనంలోకి తీసికెళ్ళడానికి' అన్నాను.

'దానిని అర్ధం అయ్యేటట్లుగా చేయాలంటే, పురాణకధలను వదలిపెట్టి, ఉపనిషత్తులను బోధనాగ్రంధాలుగా తీసుకోవాలి. పురాణాలు తెలివిలేని పామరజనంకోసం వ్రాయబడినవి. ఉపనిషత్తులు జ్ఞానభాండాగారాలు. సామాన్యజనానికి కూడా వాటిలోని జ్ఞానాన్ని వివరించి చెప్పాలి. అంతేగాని పురాణకధలను పట్టుకొని కూచోకూడదు' అన్నాను.

' సామాన్యజనం వాటిని అర్ధం చేసుకోవడం కష్టమే. మేమూ ప్రయత్నిస్తున్నాము' అన్నాడు.

'నేనూ అదే చేస్తున్నాను. ఈ క్రమంలో మన వెర్రిపోకడలను ఖండించడం కూడా చాలా అవసరం. ఆత్మవిమర్శ లేకపోతే, మనకున్న అతిఉదారత్వానికి, అసలు సత్యమే కొన్నాళ్ళకు మరుగునపడే ప్రమాదముంది. అప్పుడు అసలైన హిందూమతం ఉండదు. చిల్లరదేవుళ్లు, దొంగస్వాములు మాత్రమే మిగులుతారు' అన్నాను.

'మాకు మీరిచ్చే సలహా?' అడిగాడు చివరకు.

'ఇతరమతాల డొల్లతనాన్ని ఎండగట్టవలసిందే. అదే సమయంలో, మన హిందూమతంలో ఇప్పటికే ఉన్నవీ, క్రొత్తగా చేరుతున్నవీ వెర్రిపోకడలను కూడా ఎండగట్టాలి. తొలగించాలి. ఈ రెండుపనులూ సమాంతరంగా సాగాలి. అప్పుడే అసలైన హిందూమతమెంత గొప్పదో, దానిని అర్ధం చేసుకోలేక, హిందువులమనుకుంటున్నవారు కూడా ఎలా  తప్పుదారిన పోతున్నారో, జనాలకు అర్ధమౌతుంది. దానినే నా పుస్తకాల ద్వారా, మా సంస్థద్వారా నేను చేస్తున్నాను. చాలామందిని ఇప్పటికే జాగృతపరచాను. ఇంకా కొనసాగిస్తున్నాను. నేనేకాదు. దేశభక్తి, దైవభక్తి ఉన్న ఏ హిందువైనా ప్రస్తుతం చేయవలసింది ఇదే' అన్నాను.

'ప్రణామాలు' అని ఫోన్ పెట్టేశాడాయన.

read more " మన హిందూమతం చాలా గొప్పది "

12, మార్చి 2026, గురువారం

గ్యాసుదేవుని మహిమలు

ఇవాళ తెల్లవారుఝామున బ్రహ్మముహూర్తంలో మంచినిద్రలో ఉండగా నారదమహర్షి కలలో కొచ్చాడు.

'నాయనా ! నీవు ఆశ్రమమునకే పూర్తిగా పరిమితమై పోయితివి. బయటి ప్రపంచమును ఈషణ్మాత్రమూ పట్టించుకొనుటలేదు. మరీ దద్దమ్మవగుచున్నావు. అప్పుడప్పుడు కాస్త బయటకు కూడా వెళ్లి లోకసంచారము చేయుచుండుము. అప్పుడు మాత్రమే నీకు లోకపుతీరు అవగతం కాగలదు' అని సెలవిచ్చి, నేనేదో చెబుదామనుకునేలోపు డామ్మని మాయమైపోయాడు.

'దేవతలకీ ఋషులకీ కూడా ప్రస్తుతం తీరిక ఉండటం లేదు. అందరూ డెలివరీ బాయ్స్ అయిపోతున్నారు. చెప్పాలనుకున్నది చెప్పేయడం మాయమైపోవడం. ఎదుటివాడి రియాక్షన్ కోసం ఆగడం లేదు. స్పీడు బ్రతుకులైపోయాయి. ఏం చేస్తాం?' అనుకుంటూ బద్దకంగా నిద్రలేచాను.

ఫ్రెష్షయ్యి, ప్రధానశిష్యురాలిని తీసుకుని లోకసంచారానికి బయల్దేరాను.

అదేంటో మరి, టిఫిన్ చేద్దామంటే అన్ని హోటళ్ళూ మూసేసి ఉన్నాయి. కనీసం టీ షాపులు కూడా లేవు.

'ఏంటిది? ఇంతఘోరకలిగా యున్నది?' అని శిష్యురాలిని అడిగాను.

'యుద్ధం ప్రభావంతో గ్యాసు ఆగిపోయింది. హోటళ్లు బంద్' అని  చెప్పింది

ఒక గేటెడ్ కమ్యూనిటీ ముందు అందరూ కర్రలతో కొట్టుకుంటున్నారు.

'ఇదేంటి? ఈ విధముగా యుద్ధము చేయుచున్నారు?' అడిగాను.

'అది యుద్ధం  కాదు. ఒక్కటే గ్యాస్ సిలెండర్ ఉందిట. దానికోసం అందరూ అలా కొట్టుకుంటున్నారు' చెప్పింది.

'గతంలో నా చిన్నప్పుడు, నీళ్ళపంపులవద్ద ఈ దృశ్యములను చూచితిని. ఇప్పుడు ఈ విధముగా చూడవలసి వచ్చినది. ఇదియేకదా మాయాప్రభావము' అన్నాను.

'నోరుముయ్యి' అన్నట్టు చూసింది శిష్యురాలు.

'ఇరాన్ యుద్ధం వల్ల ఇలా ఉంది' అన్నది. 

'యుద్దమా? అదెక్కడ?' అన్నాను అయోమయంగా.

'అందుకే అప్పుడప్పుడూ లోకసంచారం చెయ్యమని మహర్షి చెప్పింది' అన్నది కోపంగా.

'ఓహో నా అగ్నానం నీక్కూడా తెలిసిపోయిందా?' అనుకుని మాట్లాడకుండా ఊరుకున్నాను. 

కొద్దిగా ముందుకెళ్లాం.

'గ్యాసు నామమె పావనము, ప్రభు గ్యాసే రక్షణ కారణము' అంటూ ఒక ప్రార్ధనామందిరంలో నుంచి మైకు మోగుతోంది.

'రామరామ ! బంగారంలాంటి పాటని ఇదేంటి ఇలా మార్చేశారు? అన్నాను విస్తుపోతూ.

'నిన్ననే గ్యాసుదేవుని వైపు కన్వర్ట్  అయ్యారు.యుద్ధం ప్రభావం' కామ్ గా అంది శిష్యురాలు.

మతిపోయింది.

ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి 'గ్యాసో హో సిలెండర్' అంటూ ఇంకో చోటనుంచి పెద్దగా శోకాలు వినిపించాయి.

భయమేసింది.

'ఇదేంటి? వీళ్ళుకూడానా?' అన్నాను.

'అవును. గ్యాసు దొరకడం లేదుగా. కన్వర్ట్ కాక వాళ్ళకీ తప్పలేదు' అంది శిష్యురాలు.

ఇంకో వందగజాలు వెళ్లేసరికి ఇంకొక గుడిలో నుండి శ్లోకాలు వినిపించాయి.

'గ్యాసుదేవాయ నమః, గ్యాసుప్రభువే నమః, గ్యాసురాజాయ నమః, సిలెండరు మాతాయ నమః' అంటూ మైకు పెద్దగా మ్రోగుతోంది.

'వీళ్ళకేం పోయేకాలం?' అడిగాను. 

'కన్వర్ట్ కావడానికి వీళ్ళు ముందుంటారు  కదా. నిన్ననే ఎవరో గ్యాస్ సిలెండర్ ఇచ్చారట. వెంటనే మతం మారిపోయారు. గ్యాసుమీద అష్టోత్తరాలు రాసుకున్నారు. పాడుతున్నారు' అన్నది శిష్యురాలు.

విరక్తిగా నవ్వుకున్నాను.

ఇంతలో ఒక పెద్దగుంపు ఎదురొస్తే ప్రక్కకు తప్పుకుని 'ఏంటా?' అని చూచాం.

అందరి తలలపైనా గ్యాస్ సిలెండర్ ఆకారంలో టోపీలున్నాయి.

'వీళ్లెవరు?' అడిగాను.

'సిలెండర్ ఫౌండేషన్' అని క్రొత్తసంస్థ. సిలెండరు బొమ్మని అలా నెత్తిమీద పెట్టుకుని రోడ్లమీద తిరుగుతుంటే, స్థూలదేహంలో నుండి సూక్ష్మదేహం బయటకొచ్చి, ఎక్కడెక్కడో తిరుగుతుందట' అంది శిష్యురాలు.

'అంటే, స్థూలదేహం రోడ్లమీద తిరుగుతుంటే, సూక్ష్మదేహం లోకలోకాలు తిరుగుతుందా? ఎందుకలా? రెండూ ఒకేచోట చావచ్చుగా?' అడిగాను.

'ఏమో? నీ దేహానికి ఒకచోట ఉండటం ఇష్టమైనట్టే, వాళ్ళ దేహాలకు బయటతిరుగుళ్లు ఇష్టం. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, కాదనడానికి మనమెవరం?' అంది శిష్యురాలు.

ఖాళీగా ఉంటే ఎవడైనా వచ్చి సిలెండర్ టోపీ పెడతాడేమో అని భయమేసి వెంటనే జేబులోంచి కర్చీఫు తీసి తలచుట్టూతా కట్టుకున్నాను.

మరికొన్ని అడుగులేసేసరికి, ఒక బోర్డు కనిపించింది.

'గ్యాసు రావడం లేదని విసిగిపోతున్నారా? మీకు గ్యాసు ఎప్పుడు వస్తుందో గ్యారంటీగా చెప్పబడును' ఇట్లు ప్రసిద్ధ కోయజ్యోతిష్కులు, అని దానిమీద  రాసుంది.

'గ్యాసు రావడం ఏంటి?' అన్నాను అర్ధం కాక.

'అంటే, గ్యాస్ సిలెండర్ డెలివరీ అని అర్ధం' అంది శిష్యురాలు చిరాగ్గా.

'ఓహో అదా ! చివరకు వీళ్ళుకూడా తయారయ్యారా?' అన్నాను నిరాశగా.

'అప్పుడే ఏమైంది? అటుచూడండి' అంది శిష్యురాలు.

'మీ మోకాలు చూసి, గ్యాసు ఎప్పుడొస్తుందో చెప్పబడును. జాతకంతో పనిలేదు' అని ఇంకో బోర్డు కనిపించింది.

'ఇదేంటి ఇలా పెట్టాడు?' అన్నాను.

'అందరూ చేతులు, ముఖాలు చూసి జ్యోతిష్యం చెబుతున్నారు కదా. వెరైటీగా ఉంటుందని ఇలా పెట్టాడు. బ్రెయిన్ అక్కడే ఉంటుందని వాళ్ళ పెద్దదొర చెప్పాట్ట. అందుకే వాళ్ళు మోకాళ్ళు మాత్రమే చూస్తారు' అంది.

'ఇక నా వల్లకాదు. పీచే ముడ్' అని గట్టిగా అరిచాను. 

కట్ చేస్తే, ఇద్దరం ఆశ్రమంలో తేలాం.

'హమ్మయ్య' అని గాలి పీల్చుకునేలోపు, ఫోన్ మ్రోగింది.

ఫోనెత్తి 'హలో' అనేలోపే, 'గురూగారు. నాకిప్పుడే అబ్బాయి పుట్టాడు. బెడ్ పక్కనించే ఫోన్ చేస్తున్నా. ఏం పేరు పెట్టమంటారు?' అడిగాడు ఒక పరమాణువు.

'నీకు పుట్టటం ఏంటి?' అరిచాను విసుగ్గా.

'అంటే, వాళ్ళావిడకని అర్ధం. నువ్వూ నీ చచ్చు సందేహాలు' అని పక్కనించి గిచ్చింది శిష్యురాలు.

'గ్యాసు నాధ్' అని పెట్టుకో ఫో' అని మళ్ళీ ఫోన్లోకి అరిచాను.

'టాంక్యూ గురూజీ. మా ఆవిడక్కూడా కలలో గ్యాసునాధుడు కనపడి, పుట్టబోయే పిల్లాడికి తన పేరే పెట్టాలని. లేకపోతే మా సంగతి తేలుస్తానని బెదిరించాట్ట. మేముకూడా ఇదే అనుకున్నాము. కానీ సెకండ్ ఒపీనియన్ కోసం మీకు ఫోన్ చేశాము. మీరు కూడా అదే చెప్పారు. టాంక్యూ సోమచ్' అని పొంగిపోతున్నాడు.

'ఎక్కువ పొంగిపోకు, పొయ్యిలో పడగలవు' అన్నాను.

'ఇంకొక్క విషయం గురూజీ. మా చెల్లెలిక్కూడా ఇప్పుడే అమ్మాయి పుట్టింది. దానికేమని పేరు పెట్టాలి?' అడిగాడు.

'అస్సలు టైం వేస్ట్ చెయ్యడం లేదురా మీరు?' అనుకుంటూ, 'సిలెండర్ రాణి' అని పెట్టండి. ఎలాగూ పెద్దయ్యాక అయ్యేది అదేగా' అన్నాను.

'టాంక్యూ గురూజీ' అని ఫోన్ పెట్టేశాడు శిష్యుడు.

'హమ్మయ్య' అని చుట్టూ చూడగానే శిష్యులెవరూ కనిపించలేదు.

'వీళ్లంతా ఎక్కడికి పోయారు?' అరిచాను కోపంగా.

'కట్టెపుల్లలేరుకు రావడానికి పక్కపొలాల్లో తిరుగుతున్నారు. మనకీ గ్యాసు లేదు మరి' అంది శిష్యురాలు.

ప్రశ్నార్ధకంగా చూశాను.

'ప్రపంచం ఎన్ని కష్టాలలో ఉందో చూశారు కదా గురూజీ. ఏదైనా రెమెడీ చెప్పి పుణ్యం సంపాదించుకోండి' ప్రాధేయపడింది శిష్యురాలు.

తీవ్రంగా ఆలోచించాను. 

'ఓకే ! దీనికొకటే మార్గముంది. వెంటనే అందరూ టవల్స్ కట్టుకుని దీక్ష మొదలుపెట్టండి. నలభైరోజులపాటు అదే టవల్లో ఉండాలి. అదే మన దీక్షాడ్రస్సు. 'జై గ్యాసుదేవాయ నమః' అనే మహామంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. అన్నిపనులూ మానేసి దీన్ని రోజుకు ఇరవైకోట్లసార్లు జపించాలి. నలభైరోజులపాటు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అయితే, 'స్ట్రా'తో బిందెలోనుంచి  పీల్చుకుంటూ తాగచ్చు. కానీ గాలిమాత్రం ఈ నలభైరోజులపాటు అస్సలు పీల్చరాదు. అప్పుడన్ని సమస్యలూ గాలిలో కలసిపోతాయి. వెంటనే అన్నిదేశాలలో ఉన్న మన శిష్యులందరికీ మెయిల్స్ పంపండి. అందరూ ఈ దీక్షను మొదలుపెట్టండి' ఆజ్ఞాపించాను.

'ఓకే గురూజీ !' అని శిష్యురాలు ఆ పనిలోకి దిగింది.

'జై గ్యాసునాధాయ నమః' అనుకుంటూ నేను పక్కమీద వాలాను.

read more " గ్యాసుదేవుని మహిమలు "

28, ఫిబ్రవరి 2026, శనివారం

ఎలైట్ మేరేజ్

నిన్న మా ఆశ్రమంలో ఒక పెళ్లి జరిగింది.

ఇది ప్రేమవివాహం. ఆ తరువాత, పెద్దలు అంగీకరించిన వివాహం.

ఆశ్రమంలో నిరాడంబరంగా జరిగిన వివాహం.

కేవలం నలభైఅయిదు నిముషాలలో పెళ్లి అయిపోయింది.

మంత్రాలు లేవు. హంగులు లేవు. ఆర్భాటాలు లేవు. మేకప్పులు, వీడియోలు, ఫోటోషూట్ల అనైతికపోకడలు  లేవు. ఎరువుతెచ్చుకున్న సంగీత్ లు, బారాత్ లు, ఆడాళ్ళ డాన్సులు లేవు. మైకులగోల లేదు. 

పిల్లలగోల, సంతమార్కెట్ లాంటి వాతావరణం, అహంకారధోరణులు, అలుగుళ్ళు, అరుచుకోవడాలు, కోపతాపాలు, వస్తువులు పోవడాలు, ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, ఒళ్లలిసిపోయేలా, కళ్ళు తిరిగిపోయేలా కష్టపడిపోవడాలు, కట్నకానుకలు, పెట్టుపోతల గొడవలు, తొంభయి రకాల ఐటమ్స్ తో భోజనాలు, అందులో సగంపైన వృధాకావడం  -- ఇవేవీ భూతద్దంతో వెతికినా ఎక్కడా లేవు.

మౌనంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆహ్వానితులు.

మంద్రమైన సన్నాయి మేళం.

హడావుడీ, తొక్కిసలాటా లేని ఆహ్లాదమైన ఆశ్రమవాతావరణం.

చేస్తున్న తంతుకు అర్ధాన్ని తెలుసుకుంటూ అరగంటలో అయిపోయిన పెళ్లి.

అది - పంచవటి నేర్పిన సంస్కారం.

అసలైన సనాతన హిందూధర్మ జీవనవిధానం.

మంత్రాలు లేకపోవచ్చు. కానీ, వాటి అర్ధాలను వివరించడం జరిగింది.

విసుగుపుట్టే తంతులు లేకపోవచ్చు. కానీ, హిందూధార్మిక వివాహంలోని ముఖ్యఘట్టాలన్నీ ఉన్నాయి.

ఉదయం 11.30 కి కార్యక్రమం మొదలైతే, మధ్యాన్నం 1.30 గంటకి ఉపనయనం, పెళ్లి, భోజనాలు అన్నీ అయిపోయి, అతిధులు తిరిగి బయలుదేరడం కూడా జరిగిపోయింది.

ఇదే అసలైన 'ఎలైట్ మేరేజి' అని మావాళ్లతో అన్నాను.

ఎలైట్ అంటే, కులీన, ఉన్నతవర్గానికి చెందిన అని అర్ధాలున్నాయి. 'క్లాస్' అని అర్ధం చెప్పుకోవచ్చు.

పంచవటి శిష్యులందరూ ఈ చీకటిప్రపంచంలో వెలుగుతున్న దీపాలవంటివారు. అంటే లైట్లన్నమాట.

మనలో 'లైట్' ఉన్నపుడు, మనచుట్టూ 'ఎలైట్' లేకుండా ఎలా ఉంటుంది?

ఈ లైటూ, ఎలైటూ, కులంతో, డబ్బుతో, అధికారంతో, హోదాతో, దర్పంతో వచ్చేవి కావు.

ఉన్నతమైన సంస్కారపు విలువలతో, ధర్మబద్ధమైన  ఆధ్యాత్మిక జీవనంతో వస్తాయి.

ఇది కులాంతర వివాహం. 

'మేము గుణానికి మాత్రమే విలువనిస్తాము. కులానికి కాదు' అని నేను ఎన్నోఏళ్లుగా చెబుతున్నదానికి ఋజువే ఈ వివాహం.

'మేము ఊరకే మాటలను చెప్పము. చెప్పినది చేసి చూపిస్తాము' అనడానికి కూడా ఇదే నిదర్శనం.

పంచవటిలో అన్నికులాలూ ఉన్నాయి. పేదలనుంచి, కోటీశ్వరులవరకూ అన్ని తరగతులవారూ, వర్గాలవారూ ఉన్నారు. కానీ మేమంతా ఒకే కుటుంబం.

దానిపేరు 'పంచవటి' కుటుంబం.

ఇక్కడ అసలైన ఆధ్యాత్మికత ఆచరణాత్మకంగా దర్శనమిస్తుంది.

ఎంతోమంది సంస్కర్తల, మహనీయుల భావాలు ఇక్కడ కార్యరూపం దాలుస్తాయి.

ప్రపంచపు వెకిలితనానికి భిన్నమైన ఉదాత్తమైన, ఉన్నతమైన, సంస్కారపూరితమైన జీవనవిధానం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది.

అందుకే అంటున్నాను ఇది 'ఎలైట్ మేరేజ్' అని.

'వర్గం లేనిదే స్వర్గం' అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు.

'భక్తేర్ జోతి నోయ్' (భక్తులలో కులం ఉండదు) అని శ్రీరామకృష్ణులన్నారు.

దానిని నిజం చేసి చూపిస్తున్నాం.

స్వర్గాన్ని భూమిపైన ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తున్నాం.

ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో జరగాలని, ఎంతోమంది జీవితాలలో అవి 'లైట్' ను నింపాలని ఈ సందర్భంగా ఆశిస్తూ, ఈ 'ఎలైట్ మేరేజి' లో పాలుపంచుకున్న అందరికీ, ముఖ్యంగా లండన్, దుబాయ్, అమెరికాల నుండి వచ్చి మరీ ఈ వివాహంలో పాలుపంచుకున్నవారికి, రాగలిగినవారికి, రాలేకపోయినవారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు పంచవటిశిష్యులకు ఈ సందర్భంగా నా ఆశీస్సులందిస్తున్నాను.

అర్ధంలేని ప్రహసనాలుగా నడుస్తున్న నేటి పెళ్లిళ్లన్నీ ఈ 'ఎలైట్ మేరేజి' ని చూచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

read more " ఎలైట్ మేరేజ్ "

26, ఫిబ్రవరి 2026, గురువారం

సోదియోగి

ఆశ్రమంలో ఒక పెళ్లి పెట్టుకున్నాం. దానికని శిష్యులు ఒక్కొక్కరే వస్తున్నారు.

ఇవాళ టిఫిన్లయ్యాక మాట్లాడుకుంటూ ఉండగా శిష్యులు ఒక ప్రతిపాదన తెచ్చారు.

'గురూజీ. మీరేమనుకోకపోయితే ఒక చిన్న మాట' అన్నారు.

'చెప్పండి' అన్నాను.

'ఏమీలేదు. మీరిప్పటిదాకా మొదలుపెట్టిన భజనలు, డాన్సులు అన్నీ పాతబడిపోయాయి. ఇప్పుడవేవీ అమ్ముడుపోవడం లేదు. ఆశ్రమానికి ఆదాయం తగ్గిపోయింది. అందుకని మాదొక కొత్త ఐడియా' అన్నారు.

ఆదాయమనేసరికి నాకు నూతనోత్సాహం పెల్లుబికింది.

'త్వరగా చెప్పండి' అన్నాను పక్కమీదనుంచి బద్దకంగా లేస్తూ.

'ఏమీలేదు. మీ రెండుపాదాలకు ఫోటో తీసి AI టూల్స్ తో సరిదిద్ది, ఆ ఫోటోలను మార్కెటింగ్ చేద్దామని అనుకుంటున్నాం. ముందు మీ శిష్యులందరూ కొనుక్కుంటారు. ఆ తర్వాత అందరూ కొనుక్కుంటారు' అన్నారు.

నాకనుమానం వచ్చింది.

'అందరూ ఎందుకు కొనుక్కుంటారు?' అడిగాను.

'పిచ్చిజనం ఏదైనా కొనుక్కుంటారు. అంతా మనం మార్కెటింగ్ చేయడంలో ఉంటుంది. ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన బాబాలు, గురువులు అందరూ ఎలా అయ్యారు మరి? ఈ ఫోటో  దగ్గరుంటే మీకు అదృష్టం  తన్నుకుంటూ వస్తుంది అని ప్రచారం చేద్దాం. చచ్చినట్టు కొనుక్కుంటారు' అడిగారు శిష్యులు.

అదీ నిజమేగా అనిపించింది.

'ఫొటోను కొనుక్కున్నవాళ్ళు దానిని పూజామందిరంలో అందరు దేవుళ్లతో బాటుగా పెట్టుకుంటారు. లేదంటే ఆ దేవుళ్లను మీ పాదాల క్రింద పెడతారు. లేదా, భక్తి ముదిరితే చిన్న చిన్నకార్డులుగా మార్చి జేబులలో పెట్టుకుంటారు. ఇంకా ముదిరిపోతే లాకెట్లుగా మార్చి మెళ్ళో దండలుగా వేసుకుంటారు. మీ పాదాలకు ప్రచారమూ అవుతుంది. మనకు ఆదాయమూ వస్తుంది. ఎలా ఉంది ఐడియా?' అడిగారు శిష్యులు.

ఇన్నాళ్లూ ఈ ఐడియా రానందుకు నామీద నాకే చెడ్డ చిరాకేసింది.

'వెరీ గుడ్ ఐడియా. ఎంత పెడుతున్నారు రేటు?' అడిగాను.

'ఒక కాలుకు రెండువేలు చొప్పున రెండుకాళ్ళకూ నాలుగువేలు పెడదాం' ముక్తకంఠంతో డిసైడ్ చేశారు శిష్యులు.

'మన కాళ్లకు అంత విలువుందా?' అని నాకు అనుమానమేసినప్పటికీ, వాళ్ళు చెబుతున్నారు గనుక, ఉందేమోలే అనిపించి 'ఓకే. ప్రొసీడ్. అయితే ఈ స్కీముకు ఏ పేరు పెడుతున్నారు?' అని అడిగాను.

'బురిడీబాబా లేదా సోదియోగి' అని రెండు టైటిల్స్ అనుకుంటున్నాం, మీరు ఏదో ఒకటి డిసైడ్ చెయ్యండి' అన్నారు శిష్యులు.

'బాబా పాతబడిపోయింది. యోగి బెటర్' అన్నాను.

'సరే గురూజీ, 'సోదియోగి' టైటిల్ ని ఫైనల్ చేద్దాం' అన్నారు శిష్యులు.

'ఎక్సలెంట్. గో ఎహెడ్. విజృంభించండి. ఈ ఫోటోలు లక్షలాది అమ్ముడుపోవాలి. మనకు కోట్లు వచ్చిపడాలి. మరి, ఆ డబ్బుతో ఏం చేద్దాం?' అడిగాను.

'ఏముంది? నల్లమల అడవులలో ఒక నూరెకరాలు కొనేద్దాం' అన్నారు శిష్యులు.

'అడవులు అలా అమ్మరు' అన్నాను కోపంగా

'మరీ మంచిది. అమ్మకపోతే ఆక్రమిద్దాం. ఆక్రమించేసి మన ఆశ్రమం బ్రాంచిని అక్కడ కడదాం' అన్నారు.

'భలే బాగుంది. ఇక పనిమీదుండండి' అని  ఆజ్ఞాపించాను.

'సరే గురూజీ, మీరు విశ్రాంతి తీసుకోండి. మిగతా పని మేము చూసుకుంటాం' అంటూ వాళ్ళు పనిలోకి దిగారు.

నేను పక్కమీద వెనక్కు వాలి, మళ్ళీ యూట్యూబులో మునిగిపోయాను.

read more " సోదియోగి "

24, ఫిబ్రవరి 2026, మంగళవారం

నీవే నేను

పసిపాపలా నిద్రిస్తున్న

నీ ముద్దుమోమును చూస్తూ


కనురెప్ప వాల్చలేక

నిద్రకు దూరమయ్యాను


ప్రేమ తప్ప ఏమీ తెలియని

మమత తప్ప ఏమీ ఎరుగని


నీ అమాయకపు మనసును గమనిస్తూ

గుండె కరిగి నీరయ్యాను


కరిగిపోతున్న కాలాన్ని 

కళ్ళెదురుగా చూస్తూ


గమ్యంలేని పయనాన్నీ

గతిలేని మన బ్రదుకులనూ


నిస్సహాయంగా పరికిస్తూ

నిశ్చేష్టుడనై నిలుచుండిపోయాను


గతజన్మల మన కథలన్నీ

వరుసగా చదువుకొని


విధి ఆడే వింతాటను తలచి 

కన్నీరుమున్నీరయ్యాను


తమ స్వార్థం కోసం 

ఇతరులను బలిచేసిన వాళ్లనూ

 

ఇతరుల స్వార్థం కోసం 

తాము బలైపోయిన వాళ్ళనూ


ఎందరినో చూచి

మనసు స్థంభించి  శిలనయ్యాను


అదుపులేని ఆవేశాలనూ 

వెర్రివైన వ్యామోహాలనూ


బాధ్యత లేని మనుషులనూ

భయంతో సాగే బ్రతుకులనూ


అన్నింటినీ చూస్తూ 

బ్రదుకుతీరు అర్ధంకాని వెర్రినయ్యాను


ఎన్నో రూపాలలో ఎన్నో సందర్భాలలో

ఎప్పటినుంచో ఎదురొస్తూ


అన్నింటినీ నేర్పిస్తూ

అనుక్షణమూ ఆదుకున్న

 

నిన్ను చివరకు గుర్తించి

మాటరాక మూగనయ్యాను


చేయవలసిన పనులు

చెందవలసిన గనులు


చేరవలసిన చోటు

పోరవలసిన పోరు


అసలంటూ ఏవీలేవన్న 

అంతిమసత్యం తెలిసిరాగా


నాలో నేనై 

అన్ని నేనులూ నేనై

నీవే నేనయ్యాను

read more " నీవే నేను "

23, ఫిబ్రవరి 2026, సోమవారం

బందీలు

భార్యకు భర్తా, భర్తకు భార్యా 

ఒకరికొకరు బందీలు

ఇద్దరూ కలసి 

కుహనా కుటుంబవ్యవస్థకు బందీలు


అర్ధం లేని చదువులకు పిల్లలు

ఊపిరి సలపని బ్రతుకులకు ఉద్యోగులు

తెంపులేని చాకిరీకి గృహిణులు

బందీలు


పెరిగిపోతున్న ఆస్తులకు

తరిగిపోతున్న కాలానికి

వీడని దురాశలకు

తీరని కోరికలకు

మనుషులు బందీలు


గుళ్లకు దేవుళ్ళు

లంచాలకు ఉద్యోగులు

అధికారదాహానికి నాయకులు

అత్యాశకు సామాన్యులు

బందీలు


ఆలోచనలకు మేధావులు

అహంకారాలకు మతాధిపతులు

అన్యాయాలకు నేరస్తులు

అబద్దపు బ్రతుకులకు అందరూ

బందీలు


విశాలత్వంలోకి ఎదగనివ్వకుండా

పట్టి ఆపుతున్న

తమ ఆత్మలకు తామే

ప్రతి ఒక్కరూ బందీలు

read more " బందీలు "

16, ఫిబ్రవరి 2026, సోమవారం

సమాధి

'విశాఖపట్నం నుండి ఒకాయన ఫోన్ చేశాడు. అర్జెంట్ గా మిమ్మల్ని కలుస్తాడట' అన్నాడు మా సెక్రటరీ మూర్తి.

'ఎందుకు?' అడిగాను.

'సమాధిస్థితి కావాలట' అన్నాడు.

'ఎంత వయసు?' అడిగాను.

'చిన్నవాడే. ముప్పైకి అటూ ఇటూ ఉండచ్చు' అన్నాడు మూర్తి.

ఆశ్చర్యమేసింది.

'సరే రమ్మను. చూద్దాం' అనబోతున్నాను.

అంతలో ఒక బాంబు పేలింది.

'కానీ కొన్ని కండిషన్స్ పెట్టాడు' అన్నాడు మూర్తి.

'ఏంటవి?' అడిగాను.

'శుక్రవారం సాయంత్రం వస్తాట్ట. శనివారం, ఆదివారం మాత్రం ఆశ్రమంలో ఉండగలడట. మళ్ళీ సోమవారం పొద్దున్నే వెళ్ళిపోవాలట. అంతకు మించి కుదరదట. ఈలోపలే, గురువుగారిచ్చే సమాధో ఇంకోటో లేటు చెయ్యకుండా ఇచ్చెయ్యాలన్నాడు. లేటయితే తనకు నచ్చదట' అన్నాడు మూర్తి.

'ఏం లేటయితే పరలోకానికి ఫ్లయిటు మిస్సవుతుందా?' అడిగాను.

'ఏమో మరి?' అన్నాడు.

'సరే. ఒకపని చేద్దాం. 'సాధనా నివాస్' కోసం తెప్పించిన ఇటుకలు, సిమెంటు, ఐరను అన్నీ ఆశ్రమంలోనే ఉన్నాయి. వాటితో ఒక 4x4 సమాధి కట్టిద్దాం. వచ్చి శుక్రవారం సాయంత్రం అందులో కూచోమను. బయటనుంచి డోరు సీలు చేసేద్దాం. బయటకొచ్చే ఓపికుంటే,  సోమవారం పొద్దున్నే తలుపు తీసుకుని బయటకురావచ్చు,  లేదంటే, ఎప్పటికీ అందులోనే ఉండిపోవచ్చు'  అన్నాను. 

మూర్తి నవ్వి, 'ఇదే చెప్పమంటారా?' అన్నాడు.

'నిరభ్యంతరంగా చెప్పు . మరి సమాధి త్వరగా కావాలంటే అదే మార్గం' అన్నాను.

సోషల్ మీడియా  ప్రభావంతో అన్నీ వెర్రితలలేసినట్లే ఆధ్యాత్మికం కూడా వేస్తోంది.

చక్రాలు, కుండలిని, సమాధి, ఆత్మసాక్షాత్కారం, జీవన్ముక్తి మొదలైనవన్నీ ఏవో నవ్వులాటల్లాగా తయారయ్యాయి. వారంరోజుల కోర్సుతో ఇవన్నీ వచ్చేస్తాయని భ్రమపడుతున్నారు పిచ్చిజనం !

ఇలాంటివాళ్ళకి నేను చెప్పిన సమాధే కరెక్టు.

అదేంటి? అప్పుడే పనివాళ్ళొచ్చేశారు. సమాధి కట్టేస్తున్నారు. బాబోయ్ ! మావాళ్లు చాలా ఫాస్ట్ గా ఉన్నారు.

మరి ఆ కుర్రాడెప్పుడొస్తాడో ఏంటో?

read more " సమాధి "

శివుడు చూస్తున్నాడు

శివరాత్రి.

పక్కఊరి శివాలయంలో ఏకాహభజన ఏర్పాట్లు జరిగాయి.

శివుడు మౌనంగా చూస్తున్నాడు.

నిన్న పొద్దుటినుంచీ 24 గంటల భజన మొదలైంది.

ఆరుగంటలకొక బ్యాచ్ చొప్పున ఆడాళ్ళు చేరి భజన చేస్తున్నారు.

రాత్రంతా మాక్కూడా మైకు వినిపిస్తూనే ఉంది.

శివుడు చూస్తూనే ఉన్నాడు.

తెల్లవారింది. 

భజనచేస్తున్న భక్తులు అలసిపోయి ఇంటికిపోయి నిద్రపోతున్నారు.

శివుడికి మాత్రం అలుపూ లేదు, నిద్రా లేదు. 

ఎప్పటిలా చూస్తూనే ఉన్నాడు.

read more " శివుడు చూస్తున్నాడు "

15, ఫిబ్రవరి 2026, ఆదివారం

అంతటా వెలుగు

తెల్లవారుఝాము. 

చీకటి బాగా ఉంది. 

మైలుదూరంలోని పల్లెమసీదు పొద్దున్నే నిద్రలేపింది.

ఇవాళ శివరాత్రి కదా? దాని సౌండు చాలా పెరిగింది.

'అల్లా తప్ప వేరే దేవుడు ఎవడూ లేడు' అని రోషంగా మైకు అరుస్తోంది.

'610 CE  కి ముందు ఎవడున్నాడా?' అని నాకు డౌటొచ్చింది.


తెలతెలవారుతోంది.

ఫోన్లో ఏదో మెసేజి వచ్చింది.

'ఏంటా?' అని చూచాను.

'హ్యాపీ శివరాత్రి' అని ఒక స్నేహితుని నుంచి.

'శివుడికి రాత్రయితే నీకు హ్యాపీ ఎందుకు?' అని రిప్లై ఇచ్చాను.


తెల్లవారింది

ఆదివారం కదా ! ఇంకొక ఊరినుంచి చర్చిమైకు చెవుల్లో మ్రోగుతోంది.

దాని సౌండు కూడా ఇవాళ బాగా ఎక్కువైంది.

స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం - అంటూ అరిగిపోయిన రికార్డులాగా ఎవరో అరుస్తున్నారు.

ఏ స్తోత్రమో, ఎవరికి స్తోత్రమో అదిమాత్రం చెప్పడం లేదు. 

బహుశా వాళ్ళక్కూడా సరిగ్గా తెలిసినట్టు లేదు.


కొంచెం పొద్దెక్కింది.

గుడిమైకులు నిద్రలేచాయి. 

శివుడి సినిమాపాటలు మార్మోగుతున్నాయి.

మళ్ళీ ఏడాదిదాకా వాటికి పనీ ఉండదు. శివుణ్ణి అనుకునేవారూ ఉండరు.

'పోన్లే ఇవాళన్నా మ్రోగనీ' అనుకున్నాను.


బారెడు పొద్దెక్కింది. 

2008 లో నేను వ్రాసిన మొట్టమొదటి పోస్టును ఒక శిష్యుడు నాకే ఫార్వార్డ్ చేశాడు.

అందులో, ఆనాటి శివరాత్రినాడు కాళహస్తిలో నాకు కలిగిన ధ్యానానుభవాన్ని వర్ణించాను.

నా పోస్టును నాకే పంపడంలో అతని ఉద్దేశం నాకర్ధం కాలేదు.

బహుశా, 'అప్పుడలా  ఉన్నారు.ఇప్పుడేంటి?'  అని అతని ఉద్దేశం కావచ్చు.

'ఆనాడు ధ్యానం చేశాను. ఈనాడు స్నానం కూడా చెయ్యను' అని అతనికి రిప్లై ఇచ్చాను.


సూర్యుడు బాగా పైకొచ్చాడు. అంతటా వెలుగు పరచుకుంది.

నాకు బాగా మెలకువొచ్చింది.

read more " అంతటా వెలుగు "

6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

పాలల్లో విషం

ప్రస్తుతం తిరుపతిలో మకాం.

పుస్తకప్రదర్శనలో మన స్టాల్ ను సందర్శిస్తున్నాం. ఒకరోజున ఇతరస్టాళ్లను చూచుకుంటూ నడుస్తుండగా ఒకాయన ఆపి, ' నేను కొన్ని సూక్తులను వ్రాసాను. చూడండి ' అంటూ ఒక కాగితాన్ని చూపించాడు. 

సరే ఏంటో చూద్దామని దృష్టి సారించాను.

దానిపైన మొదట్లోనే 'ఓం శ్రీ సాయినాధాయ నమః' అని వ్రాసుంది. దానిక్రింద ఏవేవో నీతులు రాసున్నాయి. ఇలాంటి మెంటల్ కేసులను చాలామందిని చూచి ఉన్నానేమో,  వెంటనే ఆ కాగితాన్ని అతనికిచ్చేసి ' మీ సూక్తులు మొదట్లోనే పెడదారి పట్టాయి. ముందు దీన్ని మార్చండి. ఆ తరువాత ఇతరులకు  నీతులు చెప్పచ్చు ' అంటూ ఆ లైన్ చూపించాను.

సాయిబాబా గురించి నేనంటున్నానని అతనికి అర్థమైంది. 

'మీకు బాబా నచ్చకపోతే వదిలేసి, మిగతాదాంట్లో మంచిని తీసుకోండి' అన్నాడు తెలివిగా.

వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్లకు అర్ధంకాదు. కానీ ఈ అతితెలివికి మాత్రం తక్కువేమీ ఉండదు.

'పాలల్లో విషం కలిసింది. విషం వదిలేసి పాలు మాత్రమే త్రాగమంటే ఎలా వీలవుతుంది? మీరు త్రాగగలరా?' అన్నాను.

అతనికి నోటమాట రాలేదు.

' సాయిబాబాకీ నాథసాంప్రదాయానికీ సంబంధం ఏంటసలు? సాయినాథ, ఏసునాధ, ఏంటి ఇదంతా? ఇలాంటి సంకరపదాలు, సంకరమంత్రాలు తయారుచేసినవాడికి అసలు మతుందా పోయిందా?' అడిగాను.

అతనలాగే చూస్తున్నాడు.

'తురకబాబాకి బీజాక్షరాలు జోడించినంత మాత్రాన ఆయన హిందువు కాలేడు. మీరు మాత్రం చివరకు ఎటూకాకుండా అయిపోతారు. నా ఈ సూక్తిని మీ సూక్తులకు చేర్చుకోండి' అని చెప్పి నా దారిన ముందుకొచ్చేశాను. 

మత్స్యేంద్రనాధుడు, గోరఖ్ నాధుడు మొదలైన నవనాథులు మహాసిద్ధులు. వారందరూ ఈశ్వరభక్తులు. ఆ పేరుని కూడా కల్తీ చేస్తున్నారు నేటి కుహనాహిందువులు.

'ఎంత అజ్ఞానంలో ఉన్నార్రా హిందువులారా? మీకు చెప్పేవాడు లేడు. ఉన్నా మీరు వినరు. మీ ఖర్మ ఇంతే' అనిపించింది.

read more " పాలల్లో విషం "

1, ఫిబ్రవరి 2026, ఆదివారం

మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 77 వ గ్రంధంగా, 'జ్ఞానసంకలినీ తంత్రము' అనబడే ప్రాచీనగ్రంధమునకు నా వ్యాఖ్యానమును నేడు విడుదల చేస్తున్నాము. 


తంత్రములన్నీ శివశక్తుల సంవాదరూపములై యుంటాయి. ఈ గ్రంధము కూడా అటువంటిదే. దీనియొక్క పేరునుబట్టి, అనేక ఇతరతంత్రముల నుండి సేకరించబడిన జ్ఞానము ఈ గ్రంధములో ఒకచోట కూర్చబడినదని తెలుస్తున్నది.


పెద్దదైన ఏ ఇతర గ్రంధమునకూ ఇది అనుబంధము కాకుండా, స్వతంత్రరచనగా కనిపిస్తున్నది. దీనిలోని భావములు కూడా, వివిధ యోగోపనిషత్తులనుండి, జ్ఞానోపనిషత్తులనుండి సేకరించబడినట్లుగా ఉన్నాయి. దీని ప్రతిధ్వనులు భగవద్గీతలో కూడా మనకు దర్శనమిస్తాయి.


దీనిలో సృష్టిక్రమము, పంచభూతములు, చక్రములు, నాడులు, వాయువులు, వాటియొక్క పనులు, ఓంకారము, దానియొక్క మూడుభాగములు, ఆయాభాగముల తత్త్వములు, కుండలినీసాధన మొదలైన విషయములు వివరింపబడినాయి. ఆచారములు, తంతులకు భిన్నమైన జ్ఞానమార్గము, యోగశాస్త్రముతో మేళవింపబడి దీనిలో దర్శనమిస్తున్నది.


మధ్యయుగములనాటి అనేకగ్రంథములలో వలె, దీనిలో కూడా, వేదాంతమును, యోగశాస్త్రమును, తంత్రశాస్త్రమును సమన్వయపరచాలనిన ప్రయత్నం కనిపిస్తుంది. వేదాంత, యోగ, తంత్రశాస్త్రాభిమానులకు, జిజ్ఞాసువులకు మరియు సాధకులకు ఈ గ్రంధం ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసము.


ఈ గ్రంధము కూడా తిరుపతి బుక్ ఫెస్టివల్ లోని 35 వ నంబరు స్టాల్లో లభిస్తుంది. లేదా మా తక్కిన గ్రంధాలలాగే ఆన్లైన్ లో ఇక్కడ లభిస్తుంది. జిజ్ఞాసువులు, పాఠకులు మరియు మా అభిమానులు దీనిని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల "

నిస్వార్థ కర్మయోగులు


తిరుపతి బుక్ ఫెస్టివల్ లో మన స్టాల్ ను నడుపుతున్న నిస్వార్థకర్మయోగులను ఇక్కడ మీరు చూడవచ్చు. వీరందరూ, సాఫ్ట్ వేర్ రంగంలో సీనియర్ పొజిషన్స్ లో ఉన్న ఇంజనీర్లు. అదేసమయంలో మన పంచవటి సాధనామార్గంలో సీనియర్ సాధకులు కూడా.

అసలైన హిందూమతం గురించి, యోగమార్గం గురించి, పంచవటి భావజాలం గురించి, మీకున్న సందేహాలను, ఈ పదిరోజులలో ప్రత్యక్షంగా వీరిని కలిసి మీరు తీర్చుకోవచ్చు.

తిరుపతివాసులు దీనిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

read more " నిస్వార్థ కర్మయోగులు "

30, జనవరి 2026, శుక్రవారం

18 వ తిరుపతి బుక్ ఫెస్టివల్ లో పంచవటి స్టాల్




జనవరి 31 నుండి ఫిబ్రవరి 8 వరకూ, తిరుపతిలో బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనిలో మన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు 35 వ నంబరు స్టాలు కేటాయించబడింది. దీనిలో మా పుస్తకాలన్నీ లభిస్తాయి.

ఈ మధ్యనే విడుదలైన ఈ క్రింది పుస్తకాలను కూడా ఈ స్టాల్లో అందుబాటులో ఉంచుతున్నాము. 

1. స్వరచింతామణి 
2. యోగ యాజ్ఞవల్క్యము 
3. జ్ఞానసంకలినీ తంత్రము

మా భావజాలాన్ని వివరించడానికి మా సంస్థ సీనియర్ సభ్యులు స్టాల్లో అందుబాటులో ఉంటారు.

తిరుపతివాసులు, అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాము. 

ఫిబ్రవరి 5 మరియు 8 తేదీలలో నేను కూడా తిరుపతిలోనే ఉంటాను. అప్పుడు ఈ స్టాల్ ను సందర్శించబోతున్నాను.

తిరుపతిలో కలుసుకుందాం.
read more " 18 వ తిరుపతి బుక్ ఫెస్టివల్ లో పంచవటి స్టాల్ "

16, జనవరి 2026, శుక్రవారం

సోమనాథ్ ఆలయ కథ - ఇస్లామిక్ నాటో

గుజరాత్ రాష్ట్రంలో అరేబియాసముద్రతీరంలో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం - సోమనాధ్ ఆలయం. 'సౌరాష్ట్రే సోమనాథం చ..' అంటూ మొదలౌతుంది మన జ్యోతిర్లింగ స్తోత్రం. పాతకాలంలో గుజరాత్ ను 'సౌరాష్ట్ర' అనేవారు.

1026 CE లో మహమ్మద్ ఘజనీ చేసిన దండయాత్రలో ఈ ఆలయం తీవ్రంగా ధ్వంసమైపోయింది. దానిని దండయాత్ర అనడం కంటే, దోపిడీ అంటే సరిపోతుంది. ఇది జరిగి నేటికి సరిగ్గా వెయ్యేళ్ళు నిండాయి. యాభైవేలమంది తురకసైనికులతో ఈ ఆలయాన్ని ముట్టడించి దానిని మూడురోజులపాటు తీరికగా ధ్వంసం చేసి, దోచుకున్నాడు గజనీ.

వందలాదిమంది హిందూవీరులు దానిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి, ఆ యుద్ధంలో చనిపోయారు. నిరాయుధులైన వందలాదిమంది బ్రాహ్మణపండితులను ఆ ఆలయపరిసరాలలో నరికేసింది గజనీ సైన్యం. స్త్రీలపైన చేసిన అరాచకాలకు లెక్కే లేదు.

సోమనాధ్ జ్యోతిర్లింగాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి, తన దేశంలోని మసీదుల మెట్లలో తాపడం చేయడానికి తీసుకుపోయాడు ఘజనీ. రోజూ మసీదులకు వెళ్లే తురకలు వాటిని తొక్కుతూ మసీదులోపలకు పోవాలన్నది ఆ ప్లాను. ఇప్పటికీ ఆ మసీదులు అలాగే ఉన్నాయి. జ్యోతిర్లింగపు ముక్కలు ఆ మెట్లలోనే ఉన్నాయి. ఈనాటికీ వాటిని వేలాదిమంది తొక్కుతూనే ఉన్నారు.

అంతకుముందు 16 సార్లు చేసిన దోపిడీ దండయాత్రలలో ఒకసారి, కురుక్షేత్రం దగ్గరలోని థానేసర్ లో ఉన్న నిలువెత్తు విష్ణుభగవానుని విగ్రహాన్ని పెకలించి అదేవిధంగా ఆఫ్గనిస్తాన్ కు తీసుకుపోయాడు ఘజనీ. దానిని కూడా ముక్కలు చేసి, ఆ ముక్కలను రోడ్లనిర్మాణంలో, మసీదుమెట్ల నిర్మాణంలో వాడేశారు.

మరొక దండయాత్రలో మధురానగరాన్ని అందులోని వందలాది కృష్ణుని దేవాలయాలను ధ్వంసం చేశాడు గజనీ. మళ్ళీ ఆ సంపదను కూడా ఆఫ్గనిస్తాన్ కు తరలించాడు.

ఆఫ్గనిస్తాన్ కు దరిద్రం పట్టడానికి, నేటికీ కూడా నిత్యయుద్ధాలతో అగ్నిహోత్రంలాగా మండుతూ, ఏ విధమైన ఎదుగుదలా లేకుండా, అందరినీ అడుక్కుంటున్న దేశంగా ఉండిపోవడానికి ఇవే ముఖ్యమైన కారణాలు.

1026 CE లో చేసిన దండయాత్రలో, సోమనాథ్ ఆలయఖజానాలో ఉన్న బంగారాన్ని, కోటిపైగా బంగారునాణేలను, వజ్రాలను, లోహవిగ్రహాలను, యాభైఏనుగులు మరియు వందలాది గుఱ్ఱాలపైన తరలించుకుని ఆఫ్గనిస్తాన్ కు తీసుకుపోయాడు ఘజనీ.

అయితే, తిరుగుప్రయాణంలో, వచ్చినదారిలో వెళ్లకుండా, రాన్ ఆఫ్ కచ్, మరియు థార్ ఎడారుల ద్వారా దారిని ఎంచుకోవడం గజనీ చేసిన ఘోరమైన తప్పై కూచుంది. తిరుగుప్రయాణం వారికి నరకాన్ని చూపించింది.

తీవ్రమైన ఎడారిఎండలో వారాలతరబడి ప్రయాణాన్ని తట్టుకోలేక, త్రాగడానికి నీళ్లు లేక, దాదాపు 30 వేలమంది సైనికులు దారిలోనే చనిపోయారు. సగంకంటే తక్కువమంది సైనికులతో తన రాజ్యానికి చేరుకున్నాడు ఘజనీ. అప్పటినుంచీ ఏదో అంతుబట్టని రోగం అతన్ని వెంటాడింది. కొంతమంది చరిత్రకారులు అది మలేరియా అన్నారు, ఇంకొంతమంది టీబీగా తేల్చారు. కొందరు ఎడారిజ్వరం అన్నారు. కొందరు మాత్రం 'రుద్రుని కోపం' అన్నారు. ఏదేమైనప్పటికీ, నాలుగేళ్లు తిరక్కుండానే, 1030 CE లో అతను చనిపోయాడు. అతని వంశం అధికారకుమ్ములాటలతో అంతమైపోయింది.

వెయ్యేళ్ళు గడిచాయి.

మనకు స్వతంత్రం వచ్చిన తరువాత సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ నిర్మించుకున్నాం. అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ పనికి అండగా నిలబడి ఆలయాన్ని పూర్తి చేయించారు. వారి ప్రయత్నాలను హిందూధర్మవ్యతిరేకి  అయిన ప్రధానినెహ్రూ  వ్యతిరేకించాడు. కానీ వీళ్ళు వినలేదు. ఆలయం మళ్ళీ నిర్మించబడింది.

నేడు మోడీగారి ప్రభుత్వపు చొరవతో, సోమనాథ్ ఆలయం మళ్ళీ అప్పటి కళాకాంతులతో వెలుగుతూ భవ్యమైన మందిరంగా నిలబడింది. శివలింగానికి నమకచమకాలతో రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. వేదఘోష ఆలయంలో ప్రతిధ్వనిస్తోంది.

ఘజనీలాంటి పిచ్చికుక్కలు మాత్రం చరిత్రపుటలలో కలసిపోయారు. అమాయకులను చంపి, అద్భుతమైన ఒక సంస్కృతిని నాశనం చేశాననుకుంటూ, దోచుకున్న డబ్బుతో ఒక వెలుగు వెలిగిన ఆఫ్గనిస్తాన్ నేడు అడుక్కుతినే దేశమైపోయింది. భారతదేశమేమో అగ్రరాజ్యంగా అవతరించడానికి శరవేగంతో ముందుకు దూసుకుపోతోంది.

కానీ, వెయ్యేళ్ళు గడిచినా రాక్షసులు అంతం కాలేదు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఇరాన్, టర్కీ, ఖతార్ మొదలైన  రూపాలలో ఇంకా ఉన్నారు. మనదేశానికి ఎసరు పెట్టాలని చూస్తూనే ఉన్నారు.  నిన్నగాక మొన్న జరిగిన సౌదీ, పాకిస్తాన్, టర్కీల డిఫెన్స్ ఒప్పందమే దీనికి తార్కాణం.  'ఇస్లామిక్ నాటో' గా రూపొంది భారతదేశాన్ని ఓడించి, ఆసియాను శాసించాలనేది వీరి వ్యూహం. దీనికి రూపకర్త, విశ్వాసం లేని కుక్క పాకిస్తాన్. దానికి అండ చైనా వంటి ఇతరదేశాలు.

గజనీ వీళ్ళరూపంలో మాత్రమే లేడు. ఇండియాలోనే ఉంటూ శత్రుదేశాలకు వంతపాడే కొంతమంది నాయకుల, ప్రజల రూపాలలో కూడా ఉన్నాడు. వీరందరి బారినుండి, భారతదేశాన్ని రక్షించడానికి బీజేపీ, ఆరెస్సెస్ లున్నాయి గనుక ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. మనం సురక్షితంగా ఉన్నాం. అదే, దేశపుపగ్గాలు వేరేపార్టీల చేతులలో ఉంటే మన దేశపరిస్థితి ఇంకెలా ఉండేదో ఊహిస్తే భయమేస్తుంది.

ఈనాటికీ మన దేవాలయాలలో దూరి నమాజ్ చెయ్యాలని ప్రయత్నించేవారు, అక్కడే మూత్రవిసర్జన చేసేవారు, విగ్రహాలను అవమానించేవారు చాలామంది ప్రతిరోజూ న్యూసులో కనిపిస్తున్నారు. వీళ్ళంతా  'మానసిక స్థిమితం లేనివాళ్లు' అనే మెడికల్ సర్టిఫికెట్ వెనుక దాక్కుని తప్పుకుంటున్నారు. బుద్ధిలేని కొన్నిరాష్ట్రాలు దీనిని చూసీచూడనట్లు పోతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు దీనిని బాహాటంగా సపోర్ట్ చేస్తున్నాయి. ఇది లాంగ్ రన్ లో మొత్తం దేశానికే చేటౌతుందన్న విషయం చాలామందికి అర్థం కావడం లేదు.

'మెత్తగా ఉంటే మొత్తబుద్ది' అని సామెతుంది. అతిమంచితనం అసలుకే మోసం అవుతుంది.

హిందూమతాన్ని, హిందూదేవతలను, హిందూదేశాన్ని, ఎవరు అవమానించినా వాళ్లకు 'షరియా' ప్రకారం తక్షణశిక్షలు పడాలి. మతిస్థిమితం లేనివాళ్లయితే, మతి వచ్చేవరకూ, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వం ఆ పనిని చేయకపోతే ప్రజలే చేయాలి. అటువంటి చైతన్యం ప్రజలలో వచ్చిననాడే మనదేశానికి రక్ష.

'హిందువులు ఒకళ్ళ జోలికి అనవసరంగా పోరు' అనేది అందరికీ తెలుసు. అదే మనకు శాపమైంది. 'వాళ్ల జోలికి పోతే ఊరుకోరు' అనే విషయం కూడా అందరికీ అర్ధం కావాలి.

సోమనాథ్ ఆలయాన్ని మనం తిరిగి నిర్మించుకున్నాం. అదేవిధంగా, గజనీకూడా మళ్ళీ బ్రతికి లేస్తున్నాడు. ఈ యుద్ధం అంత తేలికగా ముగిసేటట్లు కనిపించడం లేదు. అలా ముగియాలంటే, భారతీయులలో హిందూచైతన్యం రావాలి. 

లేకపోతే మాత్రం, ఇస్లామిక్ నాటో రూపంలో మళ్ళీ  ప్రాణం పోసుకుంటున్న ఘజనీ దాడులకు మనదేశం గురికాక తప్పేటట్లు లేదు.

ఈసారి యుద్ధంలో గజనీ గెలుస్తాడా? మనం గెలుస్తామా? చూడాలి.

read more " సోమనాథ్ ఆలయ కథ - ఇస్లామిక్ నాటో "

PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా?

మొన్న 12 వ తేదీన ప్రయోగించిన PSLV - C 62 రాకెట్ విఫలమైంది. 

టెక్నికల్ కారణాలు ఏవైనా ఉండవచ్చు గాక ! జ్యోతిష్య కారణాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. 

ఆ రోజున ఉదయం 10. 12 కి గ్రహస్థితిని నేను పరిశీలించాను. ఇంతకంటే పనికిరాని ముహూర్తం ఇంకెక్కడా ఉండదు. ఇది విఫలం కావడానికి పెట్టిన ముహూర్తంలాగా ఉంది గాని, సక్సెస్ కు పెట్టిన ముహూర్తంలాగా లేదు.

జ్యోతిష్యశాస్త్రాన్ని వారు లెక్కిస్తారో లేదో నాకు తెలియదు. కానీ, జరిగిన నష్టంతో పోల్చుకుంటే, నమ్మకం అంత ముఖ్యం కాదన్న చిన్నవిషయం వాళ్ళ లాజిక్ కు తట్టి ఉండాలి.

లేదా, సోకాల్డ్ సెలబ్రిటీ జ్యోతిష్కుల మాయలోనన్నా వాళ్ళు పడి ఉండాలి. అది అసాధ్యమేమీ కాదు.

లేదా, వివేకానందుని పుట్టినరోజు కాబట్టి మంచిరోజని భావించారా? 1863 లో వివేకానందస్వామి పుట్టినపుడు జనవరి 12 న ఉన్న గ్రహస్థితులు వేరు. 2026 లో అలా ఉండవు. ఉత్త తేదీలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఇబ్బందులు ఇవే మరి !

పైగా, లౌకికంగా చూస్తే, వివేకానందస్వామిది అంత అదృష్టజాతకమేమీ కాదు. ఆ విధంగా చూచినా, ఆ తేదీని రాకెట్ ప్రయోగానికి ఎంచుకోకూడదు.   

అయినా, PSLV రాకెట్ల ప్రయోగంలో అంత అనుభవం ఉన్న ఇస్రో, మూడవదశ ఇగ్నిషన్ లో ఎలా విఫలమౌతుంది? అన్నది అసలైన ప్రశ్న. ఇది ప్రయోగాత్మకదశ కాదుగా ! రాకెట్ టెక్నాలజీని ఇప్పుడు క్రొత్తగా ఇస్రో నేర్చుకోవడం లేదుగా ! PSLV ప్రయోగం ఇస్రోకు క్రొత్త కాదు కూడా !

తప్పులనుంచి నేర్చుకోవడం మంచిదే. కానీ నిర్లక్ష్యంవల్ల ఆ తప్పులు మాటిమాటికీ జరుగకూడదు. ప్రజాధనం విలువలేనిది కాదుగా !

నమ్మకమా? నష్టమా? అనిన ప్రశ్న వచ్చినపుడు, ఒక చిన్న నమ్మకాన్ని పాటించి నష్టాన్ని తప్పుకోవడం తెలివైనవారి లక్షణం కాదా?

read more " PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా? "

2, జనవరి 2026, శుక్రవారం

36 వ 'విజయవాడ పుస్తక మహోత్సవం' మొదలైంది

 


Stall Number : 186  

Dates : 2-1-2026 to 12-1-2026

Timings : 2 Pm - 9 Pm

Venue : Indira Gandhi Municipal Corporation Stadium, Vijayawada.

read more " 36 వ 'విజయవాడ పుస్తక మహోత్సవం' మొదలైంది "