అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

16, ఫిబ్రవరి 2026, సోమవారం

సమాధి

'విశాఖపట్నం నుండి ఒకాయన ఫోన్ చేశాడు. అర్జెంట్ గా మిమ్మల్ని కలుస్తాడట' అన్నాడు మా సెక్రటరీ మూర్తి.

'ఎందుకు?' అడిగాను.

'సమాధిస్థితి కావాలట' అన్నాడు.

'ఎంత వయసు?' అడిగాను.

'చిన్నవాడే. ముప్పైకి అటూ ఇటూ ఉండచ్చు' అన్నాడు మూర్తి.

ఆశ్చర్యమేసింది.

'సరే రమ్మను. చూద్దాం' అనబోతున్నాను.

అంతలో ఒక బాంబు పేలింది.

'కానీ కొన్ని కండిషన్స్ పెట్టాడు' అన్నాడు మూర్తి.

'ఏంటవి?' అడిగాను.

'శుక్రవారం సాయంత్రం వస్తాట్ట. శనివారం, ఆదివారం మాత్రం ఆశ్రమంలో ఉండగలడట. మళ్ళీ సోమవారం పొద్దున్నే వెళ్ళిపోవాలట. అంతకు మించి కుదరదట. ఈలోపలే, గురువుగారిచ్చే సమాధో ఇంకోటో లేటు చెయ్యకుండా ఇచ్చెయ్యాలన్నాడు. లేటయితే తనకు నచ్చదట' అన్నాడు మూర్తి.

'ఏం లేటయితే పరలోకానికి ఫ్లయిటు మిస్సవుతుందా?' అడిగాను.

'ఏమో మరి?' అన్నాడు.

'సరే. ఒకపని చేద్దాం. 'సాధనా నివాస్' కోసం తెప్పించిన ఇటుకలు, సిమెంటు, ఐరను అన్నీ ఆశ్రమంలోనే ఉన్నాయి. వాటితో ఒక 4x4 సమాధి కట్టిద్దాం. వచ్చి శుక్రవారం సాయంత్రం అందులో కూచోమను. బయటనుంచి డోరు సీలు చెయ్యమంటే చేసేద్దాం. బయటకొచ్చే ఓపికుంటే,  సోమవారం పొద్దున్నే తలుపు తీసుకుని బయటకురావచ్చు,  లేదంటే, ఎప్పటికీ అందులోనే ఉండిపోవచ్చు'  అన్నాను. 

మూర్తి నవ్వి, 'ఇదే చెప్పమంటారా?' అన్నాడు.

'నిరభ్యంతరంగా చెప్పు . మరి సమాధి త్వరగా కావాలంటే అదే మార్గం' అన్నాను.

సోషల్ మీడియా  ప్రభావంతో అన్నీ వెర్రితలలేసినట్లే ఆధ్యాత్మికం కూడా వేస్తోంది.

చక్రాలు, కుండలిని, సమాధి, ఆత్మసాక్షాత్కారం, జీవన్ముక్తి మొదలైనవన్నీ ఏవో నవ్వులాటల్లాగా తయారయ్యాయి. వారంరోజుల కోర్సుతో ఇవన్నీ వచ్చేస్తాయని భ్రమపడుతున్నారు పిచ్చిజనం !

ఇలాంటివాళ్ళకి నేను చెప్పిన సమాధే కరెక్టు.

అదేంటి? అప్పుడే పనివాళ్ళొచ్చేశారు. సమాధి కట్టేస్తున్నారు. బాబోయ్ ! మావాళ్లు చాలా ఫాస్ట్ గా ఉన్నారు.

మరి ఆ కుర్రాడెప్పుడొస్తాడో ఏంటో?

read more " సమాధి "

శివుడు చూస్తున్నాడు

శివరాత్రి.

పక్కఊరి శివాలయంలో ఏకాహభజన ఏర్పాట్లు జరిగాయి.

శివుడు మౌనంగా చూస్తున్నాడు.

నిన్న పొద్దుటినుంచీ 24 గంటల భజన మొదలైంది.

ఆరుగంటలకొక బ్యాచ్ చొప్పున ఆడాళ్ళు చేరి భజన చేస్తున్నారు.

రాత్రంతా మాక్కూడా మైకు వినిపిస్తూనే ఉంది.

శివుడు చూస్తూనే ఉన్నాడు.

తెల్లవారింది. 

భజనచేస్తున్న భక్తులు అలసిపోయి ఇంటికిపోయి నిద్రపోతున్నారు.

శివుడికి మాత్రం అలుపూ లేదు, నిద్రా లేదు. 

ఎప్పటిలా చూస్తూనే ఉన్నాడు.

read more " శివుడు చూస్తున్నాడు "

15, ఫిబ్రవరి 2026, ఆదివారం

అంతటా వెలుగు

తెల్లవారుఝాము. 

చీకటి బాగా ఉంది. 

మైలుదూరంలోని పల్లెమసీదు పొద్దున్నే నిద్రలేపింది.

ఇవాళ శివరాత్రి కదా? దాని సౌండు చాలా పెరిగింది.

'అల్లా తప్ప వేరే దేవుడు ఎవడూ లేడు' అని రోషంగా మైకు అరుస్తోంది.

'610 CE  కి ముందు ఎవడున్నాడా?' అని నాకు డౌటొచ్చింది.


తెలతెలవారుతోంది.

ఫోన్లో ఏదో మెసేజి వచ్చింది.

'ఏంటా?' అని చూచాను.

'హ్యాపీ శివరాత్రి' అని ఒక స్నేహితుని నుంచి.

'శివుడికి రాత్రయితే నీకు హ్యాపీ ఎందుకు?' అని రిప్లై ఇచ్చాను.


తెల్లవారింది

ఆదివారం కదా ! ఇంకొక ఊరినుంచి చర్చిమైకు చెవుల్లో మ్రోగుతోంది.

దాని సౌండు కూడా ఇవాళ బాగా ఎక్కువైంది.

స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం - అంటూ అరిగిపోయిన రికార్డులాగా ఎవరో అరుస్తున్నారు.

ఏ స్తోత్రమో, ఎవరికి స్తోత్రమో అదిమాత్రం చెప్పడం లేదు. 

బహుశా వాళ్ళక్కూడా సరిగ్గా తెలిసినట్టు లేదు.


కొంచెం పొద్దెక్కింది.

గుడిమైకులు నిద్రలేచాయి. 

శివుడి సినిమాపాటలు మార్మోగుతున్నాయి.

మళ్ళీ ఏడాదిదాకా వాటికి పనీ ఉండదు. శివుణ్ణి అనుకునేవారూ ఉండరు.

'పోన్లే ఇవాళన్నా మ్రోగనీ' అనుకున్నాను.


బారెడు పొద్దెక్కింది. 

2008 లో నేను వ్రాసిన మొట్టమొదటి పోస్టును ఒక శిష్యుడు నాకే ఫార్వార్డ్ చేశాడు.

అందులో, ఆనాటి శివరాత్రినాడు కాళహస్తిలో నాకు కలిగిన ధ్యానానుభవాన్ని వర్ణించాను.

నా పోస్టును నాకే పంపడంలో అతని ఉద్దేశం నాకర్ధం కాలేదు.

బహుశా, 'అప్పుడలా  ఉన్నారు.ఇప్పుడేంటి?'  అని అతని ఉద్దేశం కావచ్చు.

'ఇవాళ కనీసం స్నానం కూడా చెయ్యను' అని అతనికి రిప్లై ఇచ్చాను.


సూర్యుడు బాగా పైకొచ్చాడు. అంతటా వెలుగు పరచుకుంది.

నాకు బాగా మెలకువొచ్చింది.

read more " అంతటా వెలుగు "

6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

పాలల్లో విషం

ప్రస్తుతం తిరుపతిలో మకాం.

పుస్తకప్రదర్శనలో మన స్టాల్ ను సందర్శిస్తున్నాం. ఒకరోజున ఇతరస్టాళ్లను చూచుకుంటూ నడుస్తుండగా ఒకాయన ఆపి, ' నేను కొన్ని సూక్తులను వ్రాసాను. చూడండి ' అంటూ ఒక కాగితాన్ని చూపించాడు. 

సరే ఏంటో చూద్దామని దృష్టి సారించాను.

దానిపైన మొదట్లోనే 'ఓం శ్రీ సాయినాధాయ నమః' అని వ్రాసుంది. దానిక్రింద ఏవేవో నీతులు రాసున్నాయి. ఇలాంటి మెంటల్ కేసులను చాలామందిని చూచి ఉన్నానేమో,  వెంటనే ఆ కాగితాన్ని అతనికిచ్చేసి ' మీ సూక్తులు మొదట్లోనే పెడదారి పట్టాయి. ముందు దీన్ని మార్చండి. ఆ తరువాత ఇతరులకు  నీతులు చెప్పచ్చు ' అంటూ ఆ లైన్ చూపించాను.

సాయిబాబా గురించి నేనంటున్నానని అతనికి అర్థమైంది. 

'మీకు బాబా నచ్చకపోతే వదిలేసి, మిగతాదాంట్లో మంచిని తీసుకోండి' అన్నాడు తెలివిగా.

వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్లకు అర్ధంకాదు. కానీ ఈ అతితెలివికి మాత్రం తక్కువేమీ ఉండదు.

'పాలల్లో విషం కలిసింది. విషం వదిలేసి పాలు మాత్రమే త్రాగమంటే ఎలా వీలవుతుంది? మీరు త్రాగగలరా?' అన్నాను.

అతనికి నోటమాట రాలేదు.

' సాయిబాబాకీ నాథసాంప్రదాయానికీ సంబంధం ఏంటసలు? సాయినాథ, ఏసునాధ, ఏంటి ఇదంతా? ఇలాంటి సంకరపదాలు, సంకరమంత్రాలు తయారుచేసినవాడికి అసలు మతుందా పోయిందా?' అడిగాను.

అతనలాగే చూస్తున్నాడు.

'తురకబాబాకి బీజాక్షరాలు జోడించినంత మాత్రాన ఆయన హిందువు కాలేడు. మీరు మాత్రం చివరకు ఎటూకాకుండా అయిపోతారు. నా ఈ సూక్తిని మీ సూక్తులకు చేర్చుకోండి' అని చెప్పి నా దారిన ముందుకొచ్చేశాను. 

మత్స్యేంద్రనాధుడు, గోరఖ్ నాధుడు మొదలైన నవనాథులు మహాసిద్ధులు. వారందరూ ఈశ్వరభక్తులు. ఆ పేరుని కూడా కల్తీ చేస్తున్నారు నేటి కుహనాహిందువులు.

'ఎంత అజ్ఞానంలో ఉన్నార్రా హిందువులారా? మీకు చెప్పేవాడు లేడు. ఉన్నా మీరు వినరు. మీ ఖర్మ ఇంతే' అనిపించింది.

read more " పాలల్లో విషం "

1, ఫిబ్రవరి 2026, ఆదివారం

మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 77 వ గ్రంధంగా, 'జ్ఞానసంకలినీ తంత్రము' అనబడే ప్రాచీనగ్రంధమునకు నా వ్యాఖ్యానమును నేడు విడుదల చేస్తున్నాము. 


తంత్రములన్నీ శివశక్తుల సంవాదరూపములై యుంటాయి. ఈ గ్రంధము కూడా అటువంటిదే. దీనియొక్క పేరునుబట్టి, అనేక ఇతరతంత్రముల నుండి సేకరించబడిన జ్ఞానము ఈ గ్రంధములో ఒకచోట కూర్చబడినదని తెలుస్తున్నది.


పెద్దదైన ఏ ఇతర గ్రంధమునకూ ఇది అనుబంధము కాకుండా, స్వతంత్రరచనగా కనిపిస్తున్నది. దీనిలోని భావములు కూడా, వివిధ యోగోపనిషత్తులనుండి, జ్ఞానోపనిషత్తులనుండి సేకరించబడినట్లుగా ఉన్నాయి. దీని ప్రతిధ్వనులు భగవద్గీతలో కూడా మనకు దర్శనమిస్తాయి.


దీనిలో సృష్టిక్రమము, పంచభూతములు, చక్రములు, నాడులు, వాయువులు, వాటియొక్క పనులు, ఓంకారము, దానియొక్క మూడుభాగములు, ఆయాభాగముల తత్త్వములు, కుండలినీసాధన మొదలైన విషయములు వివరింపబడినాయి. ఆచారములు, తంతులకు భిన్నమైన జ్ఞానమార్గము, యోగశాస్త్రముతో మేళవింపబడి దీనిలో దర్శనమిస్తున్నది.


మధ్యయుగములనాటి అనేకగ్రంథములలో వలె, దీనిలో కూడా, వేదాంతమును, యోగశాస్త్రమును, తంత్రశాస్త్రమును సమన్వయపరచాలనిన ప్రయత్నం కనిపిస్తుంది. వేదాంత, యోగ, తంత్రశాస్త్రాభిమానులకు, జిజ్ఞాసువులకు మరియు సాధకులకు ఈ గ్రంధం ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసము.


ఈ గ్రంధము కూడా తిరుపతి బుక్ ఫెస్టివల్ లోని 35 వ నంబరు స్టాల్లో లభిస్తుంది. లేదా మా తక్కిన గ్రంధాలలాగే ఆన్లైన్ లో ఇక్కడ లభిస్తుంది. జిజ్ఞాసువులు, పాఠకులు మరియు మా అభిమానులు దీనిని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల "

నిస్వార్థ కర్మయోగులు


తిరుపతి బుక్ ఫెస్టివల్ లో మన స్టాల్ ను నడుపుతున్న నిస్వార్థకర్మయోగులను ఇక్కడ మీరు చూడవచ్చు. వీరందరూ, సాఫ్ట్ వేర్ రంగంలో సీనియర్ పొజిషన్స్ లో ఉన్న ఇంజనీర్లు. అదేసమయంలో మన పంచవటి సాధనామార్గంలో సీనియర్ సాధకులు కూడా.

అసలైన హిందూమతం గురించి, యోగమార్గం గురించి, పంచవటి భావజాలం గురించి, మీకున్న సందేహాలను, ఈ పదిరోజులలో ప్రత్యక్షంగా వీరిని కలిసి మీరు తీర్చుకోవచ్చు.

తిరుపతివాసులు దీనిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

read more " నిస్వార్థ కర్మయోగులు "

30, జనవరి 2026, శుక్రవారం

18 వ తిరుపతి బుక్ ఫెస్టివల్ లో పంచవటి స్టాల్




జనవరి 31 నుండి ఫిబ్రవరి 8 వరకూ, తిరుపతిలో బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనిలో మన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు 35 వ నంబరు స్టాలు కేటాయించబడింది. దీనిలో మా పుస్తకాలన్నీ లభిస్తాయి.

ఈ మధ్యనే విడుదలైన ఈ క్రింది పుస్తకాలను కూడా ఈ స్టాల్లో అందుబాటులో ఉంచుతున్నాము. 

1. స్వరచింతామణి 
2. యోగ యాజ్ఞవల్క్యము 
3. జ్ఞానసంకలినీ తంత్రము

మా భావజాలాన్ని వివరించడానికి మా సంస్థ సీనియర్ సభ్యులు స్టాల్లో అందుబాటులో ఉంటారు.

తిరుపతివాసులు, అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాము. 

ఫిబ్రవరి 5 మరియు 8 తేదీలలో నేను కూడా తిరుపతిలోనే ఉంటాను. అప్పుడు ఈ స్టాల్ ను సందర్శించబోతున్నాను.

తిరుపతిలో కలుసుకుందాం.
read more " 18 వ తిరుపతి బుక్ ఫెస్టివల్ లో పంచవటి స్టాల్ "

16, జనవరి 2026, శుక్రవారం

సోమనాథ్ ఆలయ కథ - ఇస్లామిక్ నాటో

గుజరాత్ రాష్ట్రంలో అరేబియాసముద్రతీరంలో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం - సోమనాధ్ ఆలయం. 'సౌరాష్ట్రే సోమనాథం చ..' అంటూ మొదలౌతుంది మన జ్యోతిర్లింగ స్తోత్రం. పాతకాలంలో గుజరాత్ ను 'సౌరాష్ట్ర' అనేవారు.

1026 CE లో మహమ్మద్ ఘజనీ చేసిన దండయాత్రలో ఈ ఆలయం తీవ్రంగా ధ్వంసమైపోయింది. దానిని దండయాత్ర అనడం కంటే, దోపిడీ అంటే సరిపోతుంది. ఇది జరిగి నేటికి సరిగ్గా వెయ్యేళ్ళు నిండాయి. యాభైవేలమంది తురకసైనికులతో ఈ ఆలయాన్ని ముట్టడించి దానిని మూడురోజులపాటు తీరికగా ధ్వంసం చేసి, దోచుకున్నాడు గజనీ.

వందలాదిమంది హిందూవీరులు దానిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి, ఆ యుద్ధంలో చనిపోయారు. నిరాయుధులైన వందలాదిమంది బ్రాహ్మణపండితులను ఆ ఆలయపరిసరాలలో నరికేసింది గజనీ సైన్యం. స్త్రీలపైన చేసిన అరాచకాలకు లెక్కే లేదు.

సోమనాధ్ జ్యోతిర్లింగాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి, తన దేశంలోని మసీదుల మెట్లలో తాపడం చేయడానికి తీసుకుపోయాడు ఘజనీ. రోజూ మసీదులకు వెళ్లే తురకలు వాటిని తొక్కుతూ మసీదులోపలకు పోవాలన్నది ఆ ప్లాను. ఇప్పటికీ ఆ మసీదులు అలాగే ఉన్నాయి. జ్యోతిర్లింగపు ముక్కలు ఆ మెట్లలోనే ఉన్నాయి. ఈనాటికీ వాటిని వేలాదిమంది తొక్కుతూనే ఉన్నారు.

అంతకుముందు 16 సార్లు చేసిన దోపిడీ దండయాత్రలలో ఒకసారి, కురుక్షేత్రం దగ్గరలోని థానేసర్ లో ఉన్న నిలువెత్తు విష్ణుభగవానుని విగ్రహాన్ని పెకలించి అదేవిధంగా ఆఫ్గనిస్తాన్ కు తీసుకుపోయాడు ఘజనీ. దానిని కూడా ముక్కలు చేసి, ఆ ముక్కలను రోడ్లనిర్మాణంలో, మసీదుమెట్ల నిర్మాణంలో వాడేశారు.

మరొక దండయాత్రలో మధురానగరాన్ని అందులోని వందలాది కృష్ణుని దేవాలయాలను ధ్వంసం చేశాడు గజనీ. మళ్ళీ ఆ సంపదను కూడా ఆఫ్గనిస్తాన్ కు తరలించాడు.

ఆఫ్గనిస్తాన్ కు దరిద్రం పట్టడానికి, నేటికీ కూడా నిత్యయుద్ధాలతో అగ్నిహోత్రంలాగా మండుతూ, ఏ విధమైన ఎదుగుదలా లేకుండా, అందరినీ అడుక్కుంటున్న దేశంగా ఉండిపోవడానికి ఇవే ముఖ్యమైన కారణాలు.

1026 CE లో చేసిన దండయాత్రలో, సోమనాథ్ ఆలయఖజానాలో ఉన్న బంగారాన్ని, కోటిపైగా బంగారునాణేలను, వజ్రాలను, లోహవిగ్రహాలను, యాభైఏనుగులు మరియు వందలాది గుఱ్ఱాలపైన తరలించుకుని ఆఫ్గనిస్తాన్ కు తీసుకుపోయాడు ఘజనీ.

అయితే, తిరుగుప్రయాణంలో, వచ్చినదారిలో వెళ్లకుండా, రాన్ ఆఫ్ కచ్, మరియు థార్ ఎడారుల ద్వారా దారిని ఎంచుకోవడం గజనీ చేసిన ఘోరమైన తప్పై కూచుంది. తిరుగుప్రయాణం వారికి నరకాన్ని చూపించింది.

తీవ్రమైన ఎడారిఎండలో వారాలతరబడి ప్రయాణాన్ని తట్టుకోలేక, త్రాగడానికి నీళ్లు లేక, దాదాపు 30 వేలమంది సైనికులు దారిలోనే చనిపోయారు. సగంకంటే తక్కువమంది సైనికులతో తన రాజ్యానికి చేరుకున్నాడు ఘజనీ. అప్పటినుంచీ ఏదో అంతుబట్టని రోగం అతన్ని వెంటాడింది. కొంతమంది చరిత్రకారులు అది మలేరియా అన్నారు, ఇంకొంతమంది టీబీగా తేల్చారు. కొందరు ఎడారిజ్వరం అన్నారు. కొందరు మాత్రం 'రుద్రుని కోపం' అన్నారు. ఏదేమైనప్పటికీ, నాలుగేళ్లు తిరక్కుండానే, 1030 CE లో అతను చనిపోయాడు. అతని వంశం అధికారకుమ్ములాటలతో అంతమైపోయింది.

వెయ్యేళ్ళు గడిచాయి.

మనకు స్వతంత్రం వచ్చిన తరువాత సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ నిర్మించుకున్నాం. అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ పనికి అండగా నిలబడి ఆలయాన్ని పూర్తి చేయించారు. వారి ప్రయత్నాలను హిందూధర్మవ్యతిరేకి  అయిన ప్రధానినెహ్రూ  వ్యతిరేకించాడు. కానీ వీళ్ళు వినలేదు. ఆలయం మళ్ళీ నిర్మించబడింది.

నేడు మోడీగారి ప్రభుత్వపు చొరవతో, సోమనాథ్ ఆలయం మళ్ళీ అప్పటి కళాకాంతులతో వెలుగుతూ భవ్యమైన మందిరంగా నిలబడింది. శివలింగానికి నమకచమకాలతో రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. వేదఘోష ఆలయంలో ప్రతిధ్వనిస్తోంది.

ఘజనీలాంటి పిచ్చికుక్కలు మాత్రం చరిత్రపుటలలో కలసిపోయారు. అమాయకులను చంపి, అద్భుతమైన ఒక సంస్కృతిని నాశనం చేశాననుకుంటూ, దోచుకున్న డబ్బుతో ఒక వెలుగు వెలిగిన ఆఫ్గనిస్తాన్ నేడు అడుక్కుతినే దేశమైపోయింది. భారతదేశమేమో అగ్రరాజ్యంగా అవతరించడానికి శరవేగంతో ముందుకు దూసుకుపోతోంది.

కానీ, వెయ్యేళ్ళు గడిచినా రాక్షసులు అంతం కాలేదు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఇరాన్, టర్కీ, ఖతార్ మొదలైన  రూపాలలో ఇంకా ఉన్నారు. మనదేశానికి ఎసరు పెట్టాలని చూస్తూనే ఉన్నారు.  నిన్నగాక మొన్న జరిగిన సౌదీ, పాకిస్తాన్, టర్కీల డిఫెన్స్ ఒప్పందమే దీనికి తార్కాణం.  'ఇస్లామిక్ నాటో' గా రూపొంది భారతదేశాన్ని ఓడించి, ఆసియాను శాసించాలనేది వీరి వ్యూహం. దీనికి రూపకర్త, విశ్వాసం లేని కుక్క పాకిస్తాన్. దానికి అండ చైనా వంటి ఇతరదేశాలు.

గజనీ వీళ్ళరూపంలో మాత్రమే లేడు. ఇండియాలోనే ఉంటూ శత్రుదేశాలకు వంతపాడే కొంతమంది నాయకుల, ప్రజల రూపాలలో కూడా ఉన్నాడు. వీరందరి బారినుండి, భారతదేశాన్ని రక్షించడానికి బీజేపీ, ఆరెస్సెస్ లున్నాయి గనుక ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. మనం సురక్షితంగా ఉన్నాం. అదే, దేశపుపగ్గాలు వేరేపార్టీల చేతులలో ఉంటే మన దేశపరిస్థితి ఇంకెలా ఉండేదో ఊహిస్తే భయమేస్తుంది.

ఈనాటికీ మన దేవాలయాలలో దూరి నమాజ్ చెయ్యాలని ప్రయత్నించేవారు, అక్కడే మూత్రవిసర్జన చేసేవారు, విగ్రహాలను అవమానించేవారు చాలామంది ప్రతిరోజూ న్యూసులో కనిపిస్తున్నారు. వీళ్ళంతా  'మానసిక స్థిమితం లేనివాళ్లు' అనే మెడికల్ సర్టిఫికెట్ వెనుక దాక్కుని తప్పుకుంటున్నారు. బుద్ధిలేని కొన్నిరాష్ట్రాలు దీనిని చూసీచూడనట్లు పోతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు దీనిని బాహాటంగా సపోర్ట్ చేస్తున్నాయి. ఇది లాంగ్ రన్ లో మొత్తం దేశానికే చేటౌతుందన్న విషయం చాలామందికి అర్థం కావడం లేదు.

'మెత్తగా ఉంటే మొత్తబుద్ది' అని సామెతుంది. అతిమంచితనం అసలుకే మోసం అవుతుంది.

హిందూమతాన్ని, హిందూదేవతలను, హిందూదేశాన్ని, ఎవరు అవమానించినా వాళ్లకు 'షరియా' ప్రకారం తక్షణశిక్షలు పడాలి. మతిస్థిమితం లేనివాళ్లయితే, మతి వచ్చేవరకూ, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వం ఆ పనిని చేయకపోతే ప్రజలే చేయాలి. అటువంటి చైతన్యం ప్రజలలో వచ్చిననాడే మనదేశానికి రక్ష.

'హిందువులు ఒకళ్ళ జోలికి అనవసరంగా పోరు' అనేది అందరికీ తెలుసు. అదే మనకు శాపమైంది. 'వాళ్ల జోలికి పోతే ఊరుకోరు' అనే విషయం కూడా అందరికీ అర్ధం కావాలి.

సోమనాథ్ ఆలయాన్ని మనం తిరిగి నిర్మించుకున్నాం. అదేవిధంగా, గజనీకూడా మళ్ళీ బ్రతికి లేస్తున్నాడు. ఈ యుద్ధం అంత తేలికగా ముగిసేటట్లు కనిపించడం లేదు. అలా ముగియాలంటే, భారతీయులలో హిందూచైతన్యం రావాలి. 

లేకపోతే మాత్రం, ఇస్లామిక్ నాటో రూపంలో మళ్ళీ  ప్రాణం పోసుకుంటున్న ఘజనీ దాడులకు మనదేశం గురికాక తప్పేటట్లు లేదు.

ఈసారి యుద్ధంలో గజనీ గెలుస్తాడా? మనం గెలుస్తామా? చూడాలి.

read more " సోమనాథ్ ఆలయ కథ - ఇస్లామిక్ నాటో "

PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా?

మొన్న 12 వ తేదీన ప్రయోగించిన PSLV - C 62 రాకెట్ విఫలమైంది. 

టెక్నికల్ కారణాలు ఏవైనా ఉండవచ్చు గాక ! జ్యోతిష్య కారణాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. 

ఆ రోజున ఉదయం 10. 12 కి గ్రహస్థితిని నేను పరిశీలించాను. ఇంతకంటే పనికిరాని ముహూర్తం ఇంకెక్కడా ఉండదు. ఇది విఫలం కావడానికి పెట్టిన ముహూర్తంలాగా ఉంది గాని, సక్సెస్ కు పెట్టిన ముహూర్తంలాగా లేదు.

జ్యోతిష్యశాస్త్రాన్ని వారు లెక్కిస్తారో లేదో నాకు తెలియదు. కానీ, జరిగిన నష్టంతో పోల్చుకుంటే, నమ్మకం అంత ముఖ్యం కాదన్న చిన్నవిషయం వాళ్ళ లాజిక్ కు తట్టి ఉండాలి.

లేదా, సోకాల్డ్ సెలబ్రిటీ జ్యోతిష్కుల మాయలోనన్నా వాళ్ళు పడి ఉండాలి. అది అసాధ్యమేమీ కాదు.

లేదా, వివేకానందుని పుట్టినరోజు కాబట్టి మంచిరోజని భావించారా? 1863 లో వివేకానందస్వామి పుట్టినపుడు జనవరి 12 న ఉన్న గ్రహస్థితులు వేరు. 2026 లో అలా ఉండవు. ఉత్త తేదీలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఇబ్బందులు ఇవే మరి !

పైగా, లౌకికంగా చూస్తే, వివేకానందస్వామిది అంత అదృష్టజాతకమేమీ కాదు. ఆ విధంగా చూచినా, ఆ తేదీని రాకెట్ ప్రయోగానికి ఎంచుకోకూడదు.   

అయినా, PSLV రాకెట్ల ప్రయోగంలో అంత అనుభవం ఉన్న ఇస్రో, మూడవదశ ఇగ్నిషన్ లో ఎలా విఫలమౌతుంది? అన్నది అసలైన ప్రశ్న. ఇది ప్రయోగాత్మకదశ కాదుగా ! రాకెట్ టెక్నాలజీని ఇప్పుడు క్రొత్తగా ఇస్రో నేర్చుకోవడం లేదుగా ! PSLV ప్రయోగం ఇస్రోకు క్రొత్త కాదు కూడా !

తప్పులనుంచి నేర్చుకోవడం మంచిదే. కానీ నిర్లక్ష్యంవల్ల ఆ తప్పులు మాటిమాటికీ జరుగకూడదు. ప్రజాధనం విలువలేనిది కాదుగా !

నమ్మకమా? నష్టమా? అనిన ప్రశ్న వచ్చినపుడు, ఒక చిన్న నమ్మకాన్ని పాటించి నష్టాన్ని తప్పుకోవడం తెలివైనవారి లక్షణం కాదా?

read more " PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా? "

2, జనవరి 2026, శుక్రవారం

36 వ 'విజయవాడ పుస్తక మహోత్సవం' మొదలైంది

 


Stall Number : 186  

Dates : 2-1-2026 to 12-1-2026

Timings : 2 Pm - 9 Pm

Venue : Indira Gandhi Municipal Corporation Stadium, Vijayawada.

read more " 36 వ 'విజయవాడ పుస్తక మహోత్సవం' మొదలైంది "