అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

30, సెప్టెంబర్ 2015, బుధవారం

27-9-2015 పౌర్ణమి ప్రభావం

ఈ పౌర్ణమికి తోడుగా సూపర్ బ్లడ్ మూన్ వచ్చింది.దీని ఫలితాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం.

>23-9-2015 న సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 750+ మంది చనిపోయారు.ఈ సంఖ్య వెయ్యి దాటిందని అంటున్నారు.ఇంకొక వెయ్యిమంది దాకా గాయపడ్డారు.ఇది జలప్రమాదం కాదు.కానీ, ఎక్కువమంది ఒకచోట గుమిగూడటం వల్ల జరిగింది.

>27-9-2015 న తిరుపతి లోని కపిలతీర్ధం జలపాతం పైనుంచి పడి 8 మంది యువకులు తలలు పగిలి చనిపోయారు.కపిల తీర్ధం నీరు వారి రక్తంతో కలుషితం అయింది.కొండపైన ఉన్న నీటి గుండాలలో స్నానం చెయ్యడానికి వెళ్ళిన వీరు వర్షం వల్ల ఒక్కసారి పెరిగిన నీటి ఉధృతికి కొట్టుకుపోయి జలపాతం నుంచి దాదాపు 50 అడుగుల క్రిందకు పడ్డారు.

ఈ అయిదు గుండాలలోని నీటితోనే కపిలేశ్వరునికి అభిషేకం చేస్తారు.అలాంటి పవిత్ర గుండాలలో మనుషులు దిగి వాటిలో సబ్బులతో స్నానాలు చేసి ఆ అభిషేక జలాలను అపవిత్రం చేస్తుంటే అధికారులు ఎలా ఊరుకుంటున్నారో వారికే తెలియాలి. తెలిసో తెలియకో చేసే తప్పులు వాటికి పడే శిక్షలు ఇలా ఉంటాయి.

26-9-2015 న వ్రాసిన పోస్ట్ లో జలప్రమాదాలు జరుగుతాయని వ్రాశాను. మరుసటి రోజే ఇది జరిగింది.

>సరిగ్గా 26-9-2015 న గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు దగ్గర మనుషులున్న ఒక కారు కాలువలోకి దూసుకుపోయి అందులోని 7 మంది జలసమాధి అయ్యారు.

>విచిత్రంగా, ఈ సమయంలోనే - భారీ విగ్రహాలను నీటిలో కరిగించే గణేశ నిమజ్జనం కూడా చోటు చేసుకుంది.

>విశాఖపట్నంలో ఒక స్కూలు కెళ్ళే పాప, కాలవలో పడి కొట్టుకుపోయి గల్లంతైంది.ఇది కూడా తీవ్రవర్షం వల్లనే జరిగిందని అంటున్నారు.ఆ అమ్మాయి శవం కోసం సముద్రంలో కూడా వెదికారు.

>28-9-2015 - అస్సాంలో కలహి నదిలో పడవ మునిగి 50 మంది పైగా చనిపోయారు.

> ఇంకొక విచిత్రమేమంటే - ఇదే సమయంలోనే - అంగారక గ్రహం మీద నీటి జాడలు ఉన్నట్లుగా ఖచ్చితంగా  గుర్తించామని నాసా ప్రకటించింది.

>ఈతలకోసం నదులలో దిగినవారు చాలామంది ఈ ఆరురోజుల పరిధిలో ప్రాణాలు కోల్పోయారు.వీరిలో ఇంజనీరింగ్ చదివే విద్యార్ధులు కూడా ఉన్నారు.

>29-9-2015 న గుంటూరులో మూడంతస్తుల ఒక పాత ఇల్లు అందరి కళ్ళముందే పేకమేడలా కూలిపోయి ఇద్దరు చనిపోయారు.దాదాపు ఆరుగురు గాయపడ్డారు.భారీవర్షమే దీనికి కారణం అంటున్నారు.ఎక్కువగా నానడం వల్ల ఈ పాత ఇల్లు కూలిపోయింది.ఇదీ ఒక రకమైన జలప్రమాదమే.

>>ఇదే సమయంలో - విచిత్రంగా - తెలంగాణా ప్రభుత్వంలో - నీటి పారుదల ప్రాజెక్టులు,డ్యాములు, రాష్ట్రానికి నీటి సరఫరా తదితర విషయాల గురించి ఎనిమిది గంటలపాటు సమీక్షా చర్చ జరిగింది.

ఈ విధంగా ప్రపంచంలో చాలాచోట్ల చిన్నవో పెద్దవో ఏదో ఒకరకమైన జలప్రమాదాలో, నీటి సంబంధమైన వార్తలో ఈ సమయంలో వచ్చాయి.
read more " 27-9-2015 పౌర్ణమి ప్రభావం "

26, సెప్టెంబర్ 2015, శనివారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -25 (ఆడియో ప్రసంగం చివరి భాగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఇరవై ఐదవ (చివరి) భాగం ఇక్కడ వినండి.


read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -25 (ఆడియో ప్రసంగం చివరి భాగం) "

రేపే చంద్రగ్రహణం + సూపర్ మూన్

27-9-2015 ఆదివారం నాడు చంద్రగ్రహణం + సూపర్ మూన్ కలిసి రాబోతున్నాయి.దీనినే 'బ్లడ్ మూన్' అని కూడా అంటున్నారు.నాసావారి లెక్కల ప్రకారం ఈ దృశ్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూరప్, ఆఫ్రికా, పశ్చిమ ఆశియా, తూర్పు ఫసిఫిక్ తీరాలలో కనిపిస్తుంది.అంటే దీని ఫలితాలు కూడా ఈ దేశాలలో ఎక్కువగా ఉండబోతున్నాయి.

భూమిచుట్టూ చంద్రుని కక్ష్య సరిగ్గా ఒక వృత్తం లాగా ఉండదు.అది దీర్ఘవృత్త కక్ష్యలాగా ఉంటుంది.కనుక చంద్రుడు ఎల్లప్పుడూ భూమికి సమానమైన దూరంలోనే ఉండడు.తన పయనంలో చంద్రుడు కొన్నిసార్లు భూమికి దూరంగా పోతాడు.కొన్నిసార్లు దగ్గరగా వస్తాడు.అలా దగ్గరగా రావడాన్నే ఖగోళ పరిభాషలో 'Perigee' అంటారు.అమావాస్య చంద్రుడు గానీ పౌర్ణమి చంద్రుడు గానీ అలా భూమికి దగ్గరగా రావడాన్నే "సూపర్ మూన్" అంటారు. సూపర్ మూన్ వచ్చినప్పుడు చంద్రుడు మామూలు కంటే చాలా పెద్దగా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇది గతంలో 1982 లో జరిగింది.33 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది.

ఖగోళ శాస్త్రవేత్తలు మానవ జీవితం పైన గ్రహాల ప్రభావాన్ని ఒప్పుకోరు.కానీ జ్యోతిష్య శాస్త్రవేత్తలు అది ఉన్నదని అంటారు.దానికి నిదర్శనాలు కూడా నిజంగా జరుగుతూనే ఉంటాయి.ఆ కోణంలో గమనిస్తే అవి అర్ధమౌతాయి.

అమావాస్యకూ పౌర్ణమికీ భూమిపైన విలయాలు జరగడం మామూలే.కానీ ఈ సూపర్ మూన్ సమయంలో ఇంకా ఎక్కువగా అంటే 'లార్జ్ స్కేల్' లో జరుగుతాయి.ఎందుకంటే ఈ సమయంలో చంద్రుని కిరణాలు ఎక్కువ శక్తితో భూమిని తాకుతాయి.మనుష్యులను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

ఈసారి సూపర్ మూన్ ను 'బ్లడ్ మూన్' అంటున్నారు.దానికి నిదర్శనంగా మూడురోజుల ముందే మక్కాలో రక్తపాతం జరిగిందా లేదా మరి?

నిన్నగాక మొన్న మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 750+ మంది చనిపోవడం ఖచ్చితంగా ఈ పౌర్ణమి+సూపర్ మూన్+బ్లడ్ మూన్ ఫలితమే. ఇస్లాం చంద్రగమనాన్ని అనుసరిస్తుంది కనుక చంద్రుని ప్రభావం వారిమీద చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ దుర్ఘటన పౌర్ణమికి నాలుగు రోజుల ముందే జరిగిందన్నది వాస్తవం.రోహిణీ శకట భేదన కాలంలో మనం ఉన్నామన్న విషయం గుర్తుంటే ఇంత పెద్ద ఎత్తున జననష్టం ఎందుకు జరుగుతున్నదో అర్ధం అవుతుంది.ఈ సమయంలో  ఇవన్నీ జరుగుతాయని గత ఏడాదే వ్రాశాను.

ఈ సూపర్ మూన్ వల్ల వచ్చే వారంరోజులలో ఇంకా ఎన్నో నష్టాలు మానవజీవితంలో జరుగుతాయి.ముఖ్యంగా వాహన ప్రమాదాలు, పిక్నిక్కులు విహారయాత్రలలో దుర్ఘటనలు జరుగుతాయి.జలప్రమాదాలు జరుగుతాయి.అంటే ఈతలకు వెళ్లి చనిపోవడం,పడవ ప్రమాదాలు మొదలైనవి ఉంటాయి.ముఖ్యంగా జనం ఎక్కువగా ఎక్కడైతే గుమిగూడతారో అక్కడ ఈ ప్రమాదాలు జరుగుతాయి.అందుకే ఈ వారం రోజులూ విహారయాత్రలు,సాహసకార్యాలు పనికిరావన్న సంగతి గమనించాలి.

మీనరాశి ఉత్తరానికీ,చంద్రుడు వాయవ్యానికీ, కేతువు ఈశాన్యానికీ సూచకులు గనుక భూమిపైన ఉత్తర వాయవ్యం మరియు ఉత్తర ఈశాన్యాది ప్రాంతాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

దీని ఫలితంగా ఈ క్రింది ప్రభావాలు మనుషులలో కనిపిస్తాయి.

>మనసు తిక్కతిక్కగా ఉండటం.
>చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా ఆవేశ పడటం
>అనవసరమైన మాటలు చేష్టలవల్ల తగాదాలు గొడవలు జరగడం
>కుటుంబ సభ్యుల మధ్యన మాటలు చిలికి చిలికి గాలివానగా మారి గొడవలు పెరగడం
>ఇంట్లో స్థిమితంగా ఉండలేక ఎటన్నా బయటకు పోయి తిరుగుదామని అనిపించడం
>ఏం చెయ్యాలో తెలియని అసహనంగా చికాకుగా ఉండటం
>హటాత్తుగా తలనొప్పి, బీపీ పెరగడం మొదలైన లక్షణాలు
>హిస్టీరియా, పిచ్చి,మానసిక రోగాలు ఉన్న వారిలో అవి ఉన్నట్టుండి ఎక్కువ కావడం
>ఆటిజం పిల్లలలో విపరీత ప్రవర్తన ఎక్కువ కావడం
>పాత నొప్పులు పాత రోగాలు తిరగబెట్టడం
>గుండె జబ్బులున్న వాళ్లకు రోగం ఎక్కువై,ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారు ఝాము లోపల సీరియస్ కావచ్చు.

ఈ లక్షణాలు చాలామందిలో గమనించుకోవచ్చు.

అయితే ఇందులో ఒక ఆధ్యాత్మిక కోణం కూడా ఉన్నది.చంద్ర కేతు యురేనస్ ల సంయోగం మీనరాశిలో జరుగబోతున్నది.వీరి కోణదృష్టి కర్కాటకంలో ఉన్న శుక్రుని మీద ఉన్నది.కనుక మంత్ర - తంత్ర - యోగసాధకులైనవారు సాత్వికాహారం తీసుకుంటూ శని,ఆదివారాలను పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలో గడిపితే వారికి చాలా మంచిమంచి అలౌకిక అనుభవాలు కలుగుతాయి.

ముఖ్యంగా నా దగ్గర దీక్ష తీసుకున్న 1 level, 2nd level సాధకులు రేపు ఆదివారం రోజున గట్టిగా సాధన చెయ్యండి.ఆశ్చర్యకర ఫలితాలు ఉంటాయో లేవో మీ స్వానుభవంలో మీరే చూడండి.
read more " రేపే చంద్రగ్రహణం + సూపర్ మూన్ "

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ - 24 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఇరవై నాలుగవ భాగం ఇక్కడ వినండి

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ - 24 (ఆడియో ప్రసంగం) "

24, సెప్టెంబర్ 2015, గురువారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ - 23 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఇరవై మూడవ భాగం ఇక్కడ వినండి

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ - 23 (ఆడియో ప్రసంగం) "

23, సెప్టెంబర్ 2015, బుధవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -22 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఇరవై రెండవ భాగం ఇక్కడ వినండి

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -22 (ఆడియో ప్రసంగం) "

19, సెప్టెంబర్ 2015, శనివారం

సుభాష్ చంద్ర బోస్ వివాదం - ప్రశ్నశాస్త్రం ఏమంటున్నది?

దివంగత సుభాస్ చంద్రబోస్ గురించి వార్తలు అనేకం మీడియాలో వస్తున్న నేపధ్యంలో ఇందులోని నిజానిజాల గురించి మన జ్యోతిష్యశాస్త్రం ఏమంటున్నదో చూద్దాం.

బోస్ జననతేదీ దొరుకుతున్నది.కానీ ఖచ్చితమైన జననసమయం లేదు. అనేకమంది జ్యోతిష్కులు వారికి తోచినట్లు బోస్ జాతకాన్ని విశ్లేషణ చేసి ఎవరికి తోచినట్లు వారు ఫలితాలను వ్రాశారు.వాటిని నమ్మలేం.కనుక ప్రశ్నశాస్త్ర సహాయం తీసుకుందాం.

అసలు అందరూ అనుకుంటున్నట్లు, లేదా ప్రభుత్వం ఇన్నాళ్ళూ ప్రచారం చేస్తున్నట్లు,బోస్ విమాన ప్రమాదంలో మరణించాడా?ఒకవేళ అలా మరణించకపోతే చనిపోయేదాకా ఎక్కడున్నాడు? ఏమయ్యాడు? ఎలా ఉన్నాడు? అనేవి ప్రశ్నలు.

గుంటూరులో ఈరోజున మధ్యాన్నం 12.26 నిముషాలకు వేసిన ప్రశ్నచక్రం ఇది.

సూర్యుడు- కన్య-1 డిగ్రీ
చంద్రుడు - వృశ్చికం-8 డిగ్రీలు
కుజుడు - సింహం - 2 డిగ్రీ
బుధుడు (వక్రి)- కన్య-21 డిగ్రీ
గురుడు - సింహం - 14 డిగ్రీ
శుక్రుడు - కర్కాటకం - 23 డిగ్రీ
శని - వృశ్చికం- 6 డిగ్రీలు
రాహువు - కన్య- 7 డిగ్రీ
కేతువు - మీనం - 7 డిగ్రీ

రూలింగ్ ప్లానెట్స్ సహాయం తీసుకుందాం.

లగ్నం - ధనుస్సు - 7 డిగ్రీలు
లగ్నాధిపతి- గురువు
లగ్న నక్షత్రం - మూల - అధిపతి కేతువు, గురువును సూచిస్తున్నాడు.
హోర - చంద్ర హోర - అధిపతి చంద్రుడు
నక్షత్రం - అనూరాధ - అధిపతి శని.
వారం-శనివారం- అధిపతి శని.
రాశి- వృశ్చిక రాశి - అధిపతి కుజుడు, గురువుతో కలసి ఉన్నాడు.
ఇవీ రూలింగ్ గ్రహాలు.శని, గురువు బలమైన రూలింగ్ గ్రహాలుగా అవతరించాయి.

ఈ డేటాతో ముందుకు వెళదాం.

వారాదిపతి, నక్షత్రాధిపతి శనీశ్వరుడు అయ్యి బలమైన రూలింగ్ ప్లానెట్ గా అవతరించాడు.అలాగే గురువు కూడా లగ్నాధిపతి మరియు కేతువు సిగ్నిఫై చేస్తున్న గ్రహంగా బలమైన రూలింగ్ ప్లానెట్ అయ్యాడు. హోరాదిపతి చంద్రుడు కూడా శనీశ్వరునితోనే ఉన్నాడు.కనుక శనిచంద్రుల కాంబినేషన్ కు ప్రాముఖ్యత వచ్చింది.అలాగే,గురుకుజుల కాంబినేషన్ కు ప్రాముఖ్యత కలిగింది.ఈ రెండు కాంబినేషన్స్ లోనే అసలు రహస్యం అంతా దాగుందని గ్రహాలు చెబుతున్నాయి.దీనిని నిర్ధారిస్తూ శని కుజుల మధ్యన పరస్పరదృష్టి (mutual aspect) ఉన్నది.ఇది ప్రతికూల కేంద్రదృష్టి.ఈ రెండు గ్రహాలు కూడా క్రూర గ్రహాలు.కనుక ఈ ప్రశ్న అంత మంచి ఫలితాన్ని ఏమీ ఇవ్వదని ఈ దృష్టి చెబుతున్నది.

లగ్నాధిపతీ మరియు బలమైన రూలింగ్ ప్లానెట్ కూడా అయిన గురువు 6,8,12 దుస్థానాలలో లేడు.నవమంలో మిత్రస్థానంలో క్షేమంగా ఉన్నాడు. కనుక అందరూ అనుకుంటున్నట్లు లేదా ప్రభుత్వం ఇన్నాళ్ళూ మనల్ని నమ్మిస్తున్నట్లు సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదు.ఒక మిత్రదేశంలో కాలం గడిపాడని తెలుస్తున్నది.అయితే తనకు మిత్రుడూ, 12 వ స్థానాదిపతీ అయిన కుజునితో కలసి ఉండటం వల్ల ఇదొక మిత్రనిర్బంధం అని తెలుస్తున్నది.

కనుక జపాన్ లోని రెంకోజీ ఆలయంలో భద్రపరచబడి ఉన్న అస్థికలు బోస్ వి కావు అన్న నిజాన్ని గురువు స్పష్టంగా చెబుతున్నాడు.

నాలుగింట ఉన్న కేతువు వల్ల -అసలు జరిగిన విషయం ఏమైనప్పటికీ - తన స్వదేశంలో మాత్రం తప్పుడు ప్రచారం జరిగిందన్న విషయం తెలుస్తున్నది. చతుర్ధం స్వదేశానికి సూచిక.దశమంలో ఉన్న రాహువు వల్ల - ఈ ప్రచారాన్ని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా చేయించిందని తెలుస్తున్నది.దశమం ప్రభుత్వానికి సూచిక అని మనకు తెలుసు.అక్కడనే ఉన్న దశమాధిపతి ఉచ్చ వక్రబుధుని వల్ల, ఈ ప్రచారం కావాలనే వక్రీకరింపబడిందని, దానికి కారకులు తెలివైన పాలకులే అని, ఈ అబద్దపు ప్రచారంతో ప్రజలను వెర్రి వెధవలను చేశారని అర్ధమౌతున్నది. బుధుడు కమ్యూనికేషన్ కు కారకుడు.ఆయన వక్రస్థితి ఏమి సూచిస్తున్నది? వక్రీకరింపబడిన సమాచారం ప్రజలచే ఇన్నాళ్ళూ నమ్మించబడింది అని సూచిస్తున్నది.ఆయన యొక్క ఉచ్చస్థితి వల్ల పాలకులు బలమైనవారని సూచన ఉన్నది.

హోరానాదుడైన చంద్రుడు శనీశ్వరునికి రెండే రెండు డిగ్రీల దూరంలో వృశ్చికరాశిలో ఉంటూ - ఒక రహస్యాన్ని వెల్లడి గావిస్తున్నాడు.బోస్ ఒక నేలమాళిగ వంటి జైలులో పెట్టబడి దయనీయమైన జీవితాన్ని గడిపాడని ఈ కాంబినేషన్ సూచిస్తున్నది.వృశ్చిక రాశి - నేలమాళిగలను, భూగృహాలను, రహస్య జైళ్ళను సూచిస్తుంది.శనిచంద్రుల కాంబినేషన్ ఆధ్యాత్మిక చింతనను, పేదరికాన్ని, ఒంటరితనాన్ని,దుర్భరమైన మానసిక వేదనను సూచిస్తుంది. కనుక బోస్ ఈ విధమైన పరిస్థితులలో తన జీవితాన్ని గడిపాడని తెలుస్తున్నది. ఈ యోగం లగ్నం నుంచి ద్వాదశంలో ఉంటూ అదొక విదేశీ రహస్య స్థావరం అని సూచిస్తున్నది. అయితే ఆ దేశం మన మిత్రదేశమే అన్న సూచన కుజునికి వచ్చిన పంచమాదిపత్యం వల్లా, గురుకుజుల మిత్రత్వం వల్లా సూచితం అవుతున్నది.

మరొక బలమైన రూలింగ్ ప్లానెట్ అయిన శనీశ్వరుడు ద్వాదశంలో ఉంటూ మిత్రవిదేశంలో ఒక రహస్యప్రదేశంలో ఆయన జీవితం ఒంటరిగా గడిచిందని సూచిస్తున్నాడు.అంటే - తను అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదన్న బాధా, తను ఊహించిన విధంగా తన దేశం లేదన్న బాధతో, అయినా సరే తానేమీ చెయ్యలేకపోతున్నానన్న నిస్పృహతో ఆయన శేషజీవితం గడిచిందన్న సూచన ఉన్నది.శనిచంద్రుల కలయిక వల్ల - నిరాశా నిస్పృహలతో కూడిన మానసిక సమస్యలు సూచితం అవుతున్నాయి. అంటే - చివరి దశలో ఆయన తీవ్రమైన డిప్రెషన్ కు గురయ్యాడని శనిచంద్రులు సూచిస్తున్నారు.

ద్వాదశాదిపతి కుజుడు నవమంనుంచి తన చతుర్ధదృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నాడు.అంటే - ఆ దూరదేశాదిపతి ఈ కుట్రలో భాగస్వామి అని తెలుస్తున్నది.

మీనంలో ఉన్న కేతువు గురువును సిగ్నిఫై చేస్తూ లోన్లీ ప్లానెట్ గా ఉన్నాడు. కనుక బోస్ ఒక ఒంటరి మరియు నిరాశాపూరిత దయనీయ జీవితాన్ని గడిపాడని తెలుస్తున్నది.

గురువుతో ఉన్న కుజుడు ఏమి సూచిస్తున్నాడు?ఆయన పంచమ ద్వాదశాదిపతి.అంటే - రహస్యమైన కుట్రను సూచిస్తున్నాడు.అంతేగాక ఒక నియంతను సూచిస్తున్నాడు.కుజునికి నియంత పోకడలు ఉంటాయి.కనుక ఒక నియంత పాలిస్తున్న దేశంలో, నవమం చేత సూచింపబడుతున్న దూరదేశంలో నిర్భందంలో ఉండిపోయాడని తెలుస్తున్నది.కుజుని రంగు ఎరుపు.నవమం మరియు సింహరాశి అధిపతి అయిన సూర్యుని రంగు కూడా ఎరుపే. కనుక ఎరుపు సూచిక అయిన దేశంలో ఆయన బందీగా ఉంచబడ్డాడని తెలుస్తున్నది. 

తొమ్మిది అంటే దూరదేశం. దాని అధిపతి సూర్యుడు పదిలో రాహువుతో కలసి ఉన్నాడు.పైగా దశమాదిపతి బలంగా ఉన్న బుదునితో కలసి ఉన్నాడు. కానీ బుధుడు వక్రించి కూడా ఉన్నాడు.అంటే దీని అర్ధం - బోస్ ఎక్కడైతే బందీగా ఉన్నాడో ఆ దేశపు అధిపతి మన దేశనేతలతో కుమ్మక్కు అయ్యాడని,లేదా వారు చెప్పినట్లు విన్నాడని,మన దేశనేతలకు బుద్ధి వక్రించిందనీ అర్ధం.

విషయాన్ని రూఢిగా,అంటే ఖచ్చితంగా స్పష్టంగా చెప్పేదే ఆరూఢం.కనుక లగ్నారూఢాన్ని చూద్దాం.

లగ్నారూఢం -- మేషం అయింది. అధిపతి కుజుడు పంచమంలో, నవమాదిపతి అయిన గురువుతో కలసి ఉన్నాడు.అంటే మనకు సహచర దేశం అయిన ఒక దేశంలో మిత్రపూర్వకంగా ఆయన ఉంచబడ్డాడనీ, అయితే. అష్టమంలో ఉన్న శని చంద్రులవల్లా, శనికుజుల మధ్య ఉన్న పరస్పర దృష్టి వల్లా,ఇలా ఉంచబడటం తెలివైన కుట్ర అనీ, నిజానికి అది నిర్బంధం అనీ రూడిగా తెలుస్తున్నది.

ఇంకా చూద్దాం.

చతుర్దంలో ఉన్న శుక్రుని దృష్టి షష్ఠంలో ఉన్న షష్టాధిపతి ఉచ్ఛబుధుని పైన దగ్గరగా ఉండటం వల్ల - ఈయనకు స్వదేశంలో తెలివైన బలమైన శత్రువులు ఉండేవారని సూచిస్తున్నది.ఆ శత్రువులు పాలకులే అని అక్కడే ఉన్న సూర్యుడు చెబుతున్నాడు.

ప్రశ్నసమయానికి నడుస్తున్న దశ ఇంకా క్లియర్ గా విషయాన్ని చెబుతుంది.అదేంటో చూద్దాం.

ప్రశ్న సమయానికి శని/శుక్ర/సూర్యదశ నడుస్తున్నది.శని ద్వాదశంలో ఉంటూ బందీగా పట్టుబడటాన్నీ జైలునూ సూచిస్తున్నాడు,శుక్రుడు అష్టమంలో ఉంటూ అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవడాన్నీ, దుర్భరమైన జీవితాన్నీ సూచిస్తున్నాడు.నవమాదిపతి అయిన సూర్యుడు దశమంలో రాహుగ్రస్తుడై ఇదంతా ఒక దూరదేశం మరియు మన దేశనాయకుల మధ్య నడిచిన కుట్ర అని సూచిస్తున్నాడు.

విషయం ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే బోస్ విమాన ప్రమాదంలో మరణించాడని ఎలా నమ్మగలం? కుదరదు గాక కుదరదు.

మొత్తానికి మహానాయకులందరూ కలసి ఒక మహానుభావుడికి అన్యాయం చేశారన్న మాట? ఆ శాపమేనా ప్రస్తుతం మన దేశాన్ని అన్ని రకాలుగా పట్టి పీడిస్తున్న దరిద్రం?

ఈ ప్రశ్నకు 'అవును' అనే సమాధానం రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.రాజు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలని అంటారు.

ప్రస్తుతం మన గతి అదేగా మరి.
read more " సుభాష్ చంద్ర బోస్ వివాదం - ప్రశ్నశాస్త్రం ఏమంటున్నది? "

16, సెప్టెంబర్ 2015, బుధవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -21 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఇరవై ఒకటవ భాగం ఇక్కడ వినండి

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -21 (ఆడియో ప్రసంగం) "

15, సెప్టెంబర్ 2015, మంగళవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ - 20 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఇరవయ్యవ భాగం ఇక్కడ వినండి

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ - 20 (ఆడియో ప్రసంగం) "

14, సెప్టెంబర్ 2015, సోమవారం

13-9-2015 అమావాస్య ప్రభావం

అమావాస్యకూ పౌర్ణమికీ భూమిపైనా మానవ జీవితాలలోనూ జరిగే ప్రమాదాలూ ఘోరసంఘటనల గురించి నేను అయిదేళ్ళ నుంచీ వ్రాస్తూ వస్తున్నాను.ఈ అయిదేళ్ళలో ఆయా సమయాలలో ఎన్నెన్ని ఘోరాలు జరిగాయో లెక్కే లేదు.

కనుక -- చంద్రుని స్థితికీ మనిషి జీవితానికీ ఖచ్చితమైన సంబంధం ఉన్నదన్నమాట ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రత్యక్ష సత్యం.

ఇప్పుడు క్రొత్తగా ఈ శీర్షిక ప్రారంభించడానికి కారణం - స్టాటిస్టికల్ స్టడీ కోసం.

ప్రతీ అమావాస్యకూ పౌర్ణమికీ జరుగుతున్న ప్రకృతి విలయాలను రికార్డ్ చేసి పెడితే ఒక అయిదేళ్ళ తర్వాత అది ఒక అద్భుతమైన డేటా బేస్ అవుతుంది.దానినుంచి ఒక 'తీరు' (pattern) ను మనం అర్ధం చేసుకోవచ్చు.

జ్యోతిశ్శాస్త్రంలో నేను ఇలాంటి రీసెర్చినే గత 20 ఏళ్ళుగా వ్యక్తిగత జీవితాలలో చేశాను.ఎన్నో జ్యోతిష్య సూత్రాలను కనుక్కున్నాను.ఆ రీసెర్చ్ ఫలితంగా, ఒక జాతకచక్రం నుంచి ఆ వ్యక్తి జీవితాన్ని - ఒక పుస్తకం చదివినంత తేలికగా నేనిప్పుడు చదవగలను.భవిష్యత్తును చూడగలను.నేనేకాదు.నన్ను అనుసరిస్తున్న నా శిష్యులు కూడా ఆ విద్యలో నిష్ణాతులు అవుతున్నారు. నా రీసెర్చి వారికి ఉపయోగపడుతున్నది.

ఇప్పుడు దేశజ్యోతిష్యం (mundane astrology) వైపు కొద్దిగా రీసెర్చి చేద్దాం. 

అదే ఈ శీర్షిక వెనుక ఉన్న ఉద్దేశ్యం.

Now let us start.

13-9-2015 అమావాస్య షాడో లో ఏం జరిగాయి?
హిమాచల్ ప్రదేశ్ లో టాయ్ ట్రెయిన్ పట్టాలు తప్పి ఇద్దరు విదేశీ టూరిస్టులు చనిపోయారు.8 మంది గాయపడ్డారు.

సికింద్రాబాద్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ గుల్బర్గా దగ్గర పట్టాలు తప్పి ఇక్కడ కూడా ఇద్దరు చనిపోయారు.8 మంది గాయపడ్డారు.

మక్కాలో క్రేన్ కూలిపోయి 100 మంది పైగా చనిపోయారు.

నైజీరియాలో ఒక ఇస్లామిక్ స్కూల్ బిల్డింగ్ కూలిపోయి 4 గురు విద్యార్ధులు చనిపోయారు.14 మంది గాయపడ్డారు.

మధ్యప్రదేశ్ లోని పెట్లావాడ్ లో పేలుడు వల్ల ఒక ఇల్లు కూలిపోయి 105 మంది చనిపోయారు.150 మంది గాయపడ్డారు.
read more " 13-9-2015 అమావాస్య ప్రభావం "

మోపిదేవి సందర్శనం

ఈ మధ్యన మోపిదేవి సుబ్రమణ్యస్వామి ఆలయం సందర్శించడం జరిగింది.

నాతో వచ్చిన రమణమూర్తికి నా వింత ప్రవర్తన ఈ మధ్యనే కొద్దికొద్దిగా అలవాటౌతున్నది.నాకున్న స్పిరిట్యువల్ ఇంటరెస్ట్ చూచి తన దగ్గరున్న రమణమహర్షి పుస్తకాలు తెచ్చి ప్రయాణంలో చదవమని ఇస్తూ ఉంటాడు.ఈరోజున గణపతి ముని వ్రాసిన 'రమణగీత' తెచ్చి ఇచ్చాడు.దానిని చూస్తూనే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి.1977 లో నేను పదో తరగతి చదివే రోజుల్లో ఈ పుస్తకాన్ని మొదటిసారిగా చదివాను.గణపతిముని గారి చాందసపు ధోరణి అప్పట్లోనే నాకు నచ్చలేదు.ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పకుండా అతిశయోక్తులు, అనవసరమైన సాగదీతలు,పాండిత్య ప్రకర్షలు ఆయన రచనలలో ఉంటాయి.ఈ ధోరణికి విరుద్ధంగా, రమణమహర్షి గారి మాటలు సూటిగా స్పష్టంగా సింపుల్ గా ఉంటాయి. పాండిత్యానికీ జ్ఞానానికీ ఉన్న తేడా వీరిద్దరి మాటలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.అందుకే, గణపతి మునిగారి వివరణ కంటే కూడా, మహర్షి ఇచ్చిన సమాధానమే నాకు నచ్చుతుంది.ఆ సమాధానానికి అనవసరమైన సాగదీతగా గణపతి మునిగారి వ్యాఖ్యానం అనిపిస్తుంది. పేజీలు తిప్పుతుంటే చిన్నప్పుడు చదివినది మొత్తం వరుసగా గుర్తు వస్తూ ఉన్నది.ఆ పుస్తకాన్ని అక్కడక్కడా పైపైన చూచి తిరిగి ఇచ్చేశాను.

రేపల్లె నుంచి 'పెనుమూడి-పులిగడ్డ' వారధి మీదుగా ప్రయాణం.కారైతే ఏదో జైలులో కూచున్నట్లుగా ఉంటుంది.అందుకని హాయిగా గాలి తగులుతూ పోవచ్చని మోటార్ సైకిల్ తీసుకున్నాము. దానిమీద ప్రయాణం మొదలైంది.

రేపల్లె చిన్న టౌన్.పాతకాలపు ఇళ్ళూ, పెద్దగా గొడవ లేని ప్రశాంత వాతావరణమూ నాకు బాగా నచ్చుతాయి.బాపట్ల కూడా కొంతవరకూ ఇలాగే ఉంటుంది.కాకినాడ కూడా ఇలాగే ఉంటుంది.ఇవన్నీ సముద్రానికి దగ్గరగా ఉన్న చిన్న ఊళ్లు గనుక ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇటువంటి చెట్లూ,పాతకాలపు ఇళ్ళూ ఉన్న చిన్నసైజు టౌను వాతావరణంతో నేను త్వరగా సింక్ అయిపోతాను.అలాంటి పరిసరాలలో నాకు తేలికగా ధ్యానస్థితి వచ్చేస్తూ ఉంటుంది.












వాతావరణం మబ్బులు పట్టి ఉండటంతో చల్లని గాలి వీస్తూ పెనుమూడి వంతెన మీదనుంచి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. 'ఎక్కడైతే పెద్ద జలాశయం ఉంటుందో అక్కడ ధ్యానం చెయ్యమని' శ్రీరామకృష్ణులు తన భక్తులకు ఉపదేశించారు. ఎందుకంటే పైన ఉన్న విశాలమైన నీలాకాశం -క్రింద ఉన్న నీటిలో ప్రతిఫలించినట్లు, ఊర్ధ్వంగా ఉన్న దివ్యచైతన్యమూ దాని వెలుగూ నిశ్చలమైన మన మనస్సులో వెంటనే ప్రతిఫలిస్తాయి.అందుకోసం వంతెన మీద ఆగి కాసేపు ఆ నీటినీ పడవలనూ చెట్లనీ చూస్తూ నిలుచున్నాము. ధ్యానానికి అనువైన వాతావరణం కావాలంటే ప్రకృతి ఒడిని మించినది ఇంకేదీ ఉండదు.

ప్రకృతిలో వచ్చిన ఇలాంటి ఫీల్ ఏ దేవాలయంలోనూ రాదు.

ఆ తర్వాత కొద్ది నిముషాలలోనే వారధి దాటి కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టాము.దారిలో మంచి మంచి జామకాయలను సైకిళ్ల వాళ్ళు అమ్ముతున్నారు.ఇలాంటివి గుంటూరులో దొరకవు.అందుకని అక్కడ ఆగి కొన్ని జామకాయలు తిని, కొన్ని సంచిలో వేసుకుని తిరిగి ప్రయాణం సాగించాము.అక్కడనుంచి అవనిగడ్డవైపు వెళ్ళే జంక్షన్ దాటి మోపిదేవి చేరాము.

ఆలయం బాగా రష్ గా చేపల మార్కెట్ లాగా అధ్వాన్నంగా ఉన్నది.అందరూ ఎవరి గోలలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు.ఎవరిని చూచినా ఆధ్యాత్మికత కోసం వచ్చినవాళ్ళు ఒక్కరూ కనిపించలేదు.అందరూ ఏవేవో మొక్కులు,కోరికలు - ఇదే తంతు. ఎవరి 'ఆరా' చూచినా పచ్చిస్వార్ధం తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళను చూస్తుంటే అసహ్యం అనిపించింది.

నేను ఏ దేవాలయానికి వెళ్ళినా, అక్కడి దైవంతో ధ్యానపూర్వకంగా సరాసరి కమ్యూన్ అవడానికి ప్రయత్నిస్తాను.అలా చెయ్యడం వల్ల అక్కడ కొలువై ఉన్న శక్తి ఏమిటో మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దానితో మనకు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది.అక్కడ మామూలుగా జరిగే తంతులూ అవీ నేను పాటించను.వాటివల్ల ఏమీ ఉపయోగం లేదని, అవి పూర్తిగా నేలబారు వ్యవహారమనీ నాకు బాగా తెలుసు.

ధర్మదర్శనం క్యూలో ఓపికగా నిలబడి దర్శనం కానిచ్చి ఇవతలకు వచ్చాము.బయటకు వచ్చి మోటార్ సైకిల్ తీసి వెనక్కు బయలు దేరాము.

వెనుక కూచున్న మూర్తికి కొన్ని సందేహాలు వచ్చాయి.

"ఒకవైపు నాగదేవత అంటున్నారు.మళ్ళీ సుబ్రమణ్యస్వామి అంటున్నారు. ఇంకోపక్కన రుద్రంతో శివునికి పూజ చేస్తున్నారు.ఇదేంటి సార్ ?" అని అడిగాడు.

నవ్వాను.

'అదంతే. మొదట్లో ఇది ఒక నాగదేవత పుట్ట.అడవి ప్రాంతంలో పాములు ఎక్కువగా ఉంటాయి కదా.ఇక్కడ కూడా అవి ఎక్కువే.కృష్ణాజిల్లా అంతా అడవే కదా.జనం వాటిని ఎడాపెడా చంపుతూ ఉంటారు.నేటికీ అంతే.ఆ గుడిలో జనమంతా పూజలు చేస్తున్నారు కదా.బయట ఒక పాము కనపడితే వెంటనే చంపి పారేస్తారు.అదీ ఈ మనుషుల తంతు.ఆ ఫలితంగా నాగదోషాలు తగిలి, పిల్లలు పుట్టకపోవడం,పుట్టినా చనిపోవడం,మగపిల్లలు లేకపోవడం,పెళ్ళిళ్ళు కాకపోవడం, అయినా ఫెయిల్ కావడం, ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు కావడం ఇలాంటి దోషాలు ఎదురౌతూ ఉంటాయి.కాలక్రమేణా ఎవరో తెలిసిన వాళ్ళు చెబితే ఈప్రాంతం వాళ్ళు నాగదేవతారాధన మొదలుపెట్టారు.ఆ పుట్టనే కాలక్రమేణా ఘనీభవించి ఒక మోస్తరుగా శివలింగం ఆకారంలోకి వచ్చింది. అందుకని శైవ సాంప్రదాయం మొదలైంది.అతి ప్రాచీనకాలపు నాగదేవతారాధనను తరువాత తరువాత శైవంలోకి మార్చుకున్నారు. అందుకని శైవ సాంప్రదాయంలో పూజలు మొదలయ్యాయి.

నిజానికి సుబ్రమణ్యస్వామికీ నాగదేవతకూ ఎలాంటి సంబంధమూ లేదు.కానీ జనం ఈ రెంటినీ కలిపేశారు.అలా కలపడానికి ఏదో ఒక కధను సృష్టించారు. అంతా గందరగోళం చేశారు.ఇలాంటి కధలు ప్రతిచోటా మనవాళ్ళు అల్లారు. అసలు విషయం అది కాదు.అక్కడున్నది నాగదేవత మాత్రమే. చూడగలిగితే తెలుస్తుంది.ఇలాంటి గందరగోళాలు ప్రతి ప్రసిద్ధ దేవాలయంలోనూ ఉన్నాయి. అక్కడ ఉండే దేవత వేరు.జరిగే పూజలు వేరు.కానీ ఆ దేవత వాటిని స్వీకరిస్తూ ఉంటుంది.అంతే.

నరసింహ ఆరాధన కూడా ఇలాంటిదే.నువ్వు గమనించు.నరసింహస్వామి దేవాలయాలన్నీ అటవీప్రాంతం లోనో కొండప్రాంతం లోనో ఉంటాయి.అతి ప్రాచీనకాలంలో ఆటవికజాతులుగా మనం ఉన్నపుడు సింహాలు గ్రామాలలోకి వచ్చి అందర్నీ చంపుతూ ఉండేవి.అందుకని భయంతో వాటిని పూజించేవారు.మనిషికి భయంనుంచే భక్తి పుడుతుంది.ఒకటి తననేదో చేస్తుంది అనుకుంటే, దానికి లంచాలిచ్చి గౌరవించడం మొదలుపెడతాడు. ఇది మనిషి యొక్క నేలబారు మనస్తత్వం. అప్పటి ప్రజలు పొలిమేరల్లోనే వాటికి మేకనో బర్రెనో ఏదో ఒక జంతువును ఆహారంగా సమర్పించి అవి గ్రామంలోకి జొరబడకుండా ఆపుకునేవారు.అదే కాలక్రమేణా "బలి" లేదా "నైవేద్యం" అనే కాన్సెప్ట్ గా మారింది.ఎప్పుడైతే శైవమూ వైష్ణవమూ ప్రాచుర్యంలోకి వచ్చాయో,అప్పుడు,నాగదేవతారాధనను శైవం తీసుకుంది. సింహాల ఆరాధనను నరసింహస్వామి ఆరాధనగా మార్చి వైష్ణవం స్వీకరించింది.ఇలా అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు.

ఈ విధంగా అనేక ప్రాచీన ఆచారాలు కాలానుగుణంగా నవీకరింపబడ్డాయి.ఇది మన దేశానికీ మన మతానికీ ప్రత్యేకమైన విషయం ఏమీకాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియలు అనేక దేశాలలో అనేక మతాలలో రకరకాలుగా జరిగాయి.పాతకాలపు ఆచారాలను తరువాత వచ్చిన కొత్తమతాలు స్వీకరించి అడాప్ట్ చేసుకుని వాటికి అనుగుణంగా మార్చుకున్నాయి.దేవాలయాలకు దేవాలయాలే కొత్త దేవాలయాలుగా మారిపోయాయి.అన్ని మతాలలోనూ ఈ ప్రక్రియ జరిగింది. జనాలు వారి అజ్ఞానంలో ఎవరికిష్టమైన పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు. భగవంతుడు ఒక్కడే గనుక ఆయన ఓపికా సహనమూ అనంతమైనవి గనుక ఎవరే రూపంలో పూజించినా,ఏ విధానంలో పూజించినా, ఆయన కిమ్మనకుండా స్వీకరిస్తూ ఉంటాడు.ఇది అసలైన సత్యం." - అని మోటార్ సైకిల్ నడుపుతూ వివరించాను.

తిరుగు ప్రయాణంలో రేపల్లె గుంటూరు మధ్యలో వాతావరణం అంతా మబ్బులు పట్టి వాన పడుతూ చాలా ఆహ్లాదంగా ఉన్నది.ఆ వాతావరణాన్ని చూస్తూనే మళ్ళీ ధ్యానస్థితి వచ్చేసింది.ఆకాశం నుంచి పడే వాన, ఊర్ధ్వం నుంచి నిమ్నానికి ప్రసరించే దైవకృపకు సంకేతం.ఈ విధమైన ధ్యానవిధానాలు వేదంలో 'విద్య' లనే పేరుతో ఉన్నాయి.

"ధ్యాయతీవ పృధివీ ధ్యాయతీ వాంతరిక్షం ధ్యాయతీవ ద్యౌర్ ధ్యాయన్తీవాపో ధ్యాయంతీవ పర్వతా" అంటుంది ఛాందోగ్యోపనిషత్తు.ధ్యానికి సమస్త ప్రకృతీ ధ్యానంలో ఉన్నట్లే కనిపిస్తుంది.ఉపనిషదృషికి భూమీ, ఆకాశమూ, అంతరిక్షమూ, జలమూ, పర్వతములూ అన్నీ ధ్యానంలో ఉండి మౌనంగా సర్వేశ్వరుడిని ధ్యానిస్తున్నట్లు దర్శనమిచ్చాయి.ఆ స్థితిలోకి మనం వెళ్ళగలిగితే,ఆ స్థితిలో మనం ఉండగలిగితే, మనకూ అలాంటి దర్శనం కలుగుతుంది.

నాకు వెంటనే శ్రీరామకృష్ణులు గుర్తొచ్చారు.శ్రీ రామకృష్ణులకు మొట్టమొదటి సారి సమాధిస్థితి ఇలాంటి ప్రకృతిదృశ్యం వల్లనే కలిగింది.అప్పుడాయనకు ఆరేళ్ళు.చుట్టూ పెరిగిన పచ్చని పొలాలలో నడిచి వెళుతూ ఉన్నపుడు ఆకాశంలో పట్టిన దట్టమైన మబ్బులను చూచి ఆయన బాహ్యస్మృతిని కోల్పోయి క్రిందపడిపోయాడు.సమాధిస్థితిలోకి వెళ్ళిపోయాడు.ఆ స్థితిలో ఆ పిల్లవాడు ఏకధాటిగా మూడురోజుల పాటు ఉండిపోయాడు.ఎంత పవిత్రమైన నిష్కల్మషమైన మనస్సో ఆయనది!!! అలాంటి స్థితిని పొందటానికి ఎంత భావుకత్వం ఆయనలో ఉండేదో?

ప్రకృతిని చూచి భావుకుడు స్పందిస్తాడు.యోగీ స్పందిస్తాడు.ఇద్దరికీ ప్రకృతిమాత అలౌకిక అనుభవాలను తనే అందిస్తుంది.ప్రకృతిమాతేగా మనిషికి ఆది గురువు?

అసలైన మతాన్ని ప్రజలు ఎప్పటికి అర్ధం చేసుకుంటారు? అసలైన ఆధ్యాత్మికతను వారెప్పటికి గ్రహిస్తారు? లేదా, అది కొందరికోసమేనేమో? సామాన్యజనం వారి భయాన్నీ స్వార్దాన్నీ భక్తిగా భ్రమిస్తూ అజ్ఞానంలో ఎప్పటికీ ఇలా కాలం గడపవలసిందేనేమో? ప్రకృతి ధర్మం ఇంతేనేమో?

ఈ విధమైన భావధారతో మోపిదేవి సందర్శనం జరిగింది.
read more " మోపిదేవి సందర్శనం "

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -19 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం పంతొమ్మిదవ భాగం ఇక్కడ వినండి.


read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -19 (ఆడియో ప్రసంగం) "

12, సెప్టెంబర్ 2015, శనివారం

దక్షిణామూర్తి స్తోత్రమ్-18 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం పద్దెనిమిదవ భాగం ఇక్కడ వినండి.


read more " దక్షిణామూర్తి స్తోత్రమ్-18 (ఆడియో ప్రసంగం) "

11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -17 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం పదిహేడవ భాగం ఇక్కడ వినండి.


read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -17 (ఆడియో ప్రసంగం) "

6, సెప్టెంబర్ 2015, ఆదివారం

దక్షిణామూర్తి స్తోత్రమ్-16 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం పదహారవ భాగం ఇక్కడ వినండి.

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్-16 (ఆడియో ప్రసంగం) "

5, సెప్టెంబర్ 2015, శనివారం

దక్షిణామూర్తి స్తోత్రమ్-15 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం పదిహేనవ భాగం ఇక్కడ వినండి.

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్-15 (ఆడియో ప్రసంగం) "

4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్-14 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం పద్నాలుగవ భాగం ఇక్కడ వినండి.

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్-14 (ఆడియో ప్రసంగం) "

3, సెప్టెంబర్ 2015, గురువారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -13(ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం పదమూడవ భాగం ఇక్కడ వినండి.















యూ ట్యూబ్ లో ఇక్కడ చూడండి
https://youtu.be/MbuvC0f9_Rk
read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -13(ఆడియో ప్రసంగం) "