“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, ఏప్రిల్ 2009, శుక్రవారం

స్ఫురణ శక్తి

జ్యోతిషం అనేది గణితం మీద ఆధార పడిఉన్నశాస్త్రం. దీనికి స్ఫురణ శక్తి తో సంబంధం లేదు. అని కొందరు అంటారు. కాని అది నిజం కాదు. గణితం సహాయం లేకుండా జ్యోతిషం లేదు నిజమే. కాని గణితమే సర్వస్వం కాదు. గ్రహ స్థితులు, బలా బలాలు తెలుసుకునే వరకే గణిత ప్రయోజనం.

ఒకే జాతక చక్రాన్ని పది మంది జ్యోతిష్కులు చూస్తె ఒక్కొక్కరు ఒక్కో విధం గా విశ్లేషణ చేస్తారు. దానికి కారణాలు రెండు. ఒకటి వారు నేర్చుకున్న విధానాలు వేరు వేరు కావచ్చు. రెండు వారి స్ఫురణ శక్తి లో తేడాలు ఉంటాయి. ఒకరికి తట్టిన విషయం ఇంకొకరికి తట్టదు. ఇదే ముఖ్య కారణం.

ఉపాసన వల్ల ఏమి జరుగుతుంది? దానివల్ల స్ఫురణ శక్తి పెరుగుతుంది. గ్రహాలకు, భావాలకు, రాశులకు అనేక కారకత్వాలు ఉంటాయి. ఆయా కారకత్వాలలో ఆ సందర్భానికి ఏది సరిగ్గా సరిపోతుంది అనేది టక్కున స్ఫురించటమే దైవ కృప. ఈ శక్తి ఉపాసనా బలం వల్ల పెరుగుతుంది.

చాలా సరియైన ఫలితాలు చెప్ప గలిగిన విద్వాంసుడు అది తన గొప్ప అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దైవ కృప వల్ల వచ్చిన స్ఫురణ శక్తి తో, మహర్షుల అనుగ్రహంతో ఇది సాధ్యం అయింది అని భావించే వాడే సరియగు దైవజ్ఞుడు.

కనుక స్ఫురణ శక్తికి జ్యోతిర్ విద్య లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అది పని చెయ్యని నాడు ఎంతటి శాస్త్ర జ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. యూరోప్ దేశాలను ఆశ్చర్య పరిచే విధంగా హస్త సాముద్రికం చెప్పిన కీరో తన చేతికి కాశీ పండితులు కట్టిన యంత్ర తాయెత్తు పోయిన తరువాత అదే విధం గా ఫలితాలు చెప్పలేక పోయాడు. ఈ విషయం కీరో భార్య స్వయం గా బీ వీ రామన్ గారికి వ్రాశిన ఉత్తరంలో ఉన్నది.

దైవ శక్తి తోడ్పాటు లేనినాడు మానవ శక్తి, తెలివి పనికి రావు అనేమాట నిజం. జ్యోతిర్ విజ్ఞానం వంటి వేద విద్యలలో ఇది మరిన్ని పాళ్ళు నిజం అనిపిస్తుంది.