అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

1, ఏప్రిల్ 2024, సోమవారం

విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం




గత మూడురోజులపాటు మా చండ్రపాడు ఆశ్రమంలో జరిగిన మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ నిన్న విజయవంతంగా ముగిసింది. 

పాత క్రొత్త శిష్యులందరూ మూడు రోజులపాటు ఆశ్రమంలో ఉండి, వారి  జీవితానికి మరింత నిండుదనాన్ని అద్దుకుని, ఆనందంతో నిండిన మనసులతో వారివారి ఇండ్లకు తిరిగి వెళ్లారు.

క్రొత్తవారికి పంచవటి సాధనామార్గంలో ప్రాధమిక దీక్షనివ్వడం జరిగింది. పాత శిష్యులకు ఉన్నతస్థాయికి చెందిన యోగసాధనా మార్గాలను ఉపదేశించడం జరిగింది.  పంచవటి సాధనా మార్గంలో పాటించవలసిన నియమాలను, విధివిధానాలను, జీవితంలో తెచ్చుకోవాల్సిన మార్పులను వారికి స్పష్టంగా వివరించడం జరిగింది.

దేహాన్ని నిర్లక్ష్యం చెయ్యడం ఎంతమాత్రమూ మా విధానం కాదు. కనుక, మా యోగసాధనా మార్గాన్ని అనుసరిస్తూ, గత రెండు నెలలలో 15 కేజీలనుండి 5 కేజీల వరకూ ఆరోగ్యవంతంగా బరువును తగ్గినవారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా, బరువు పెరగవలసిన కేటగిరీలో, 4 నుండి 9 కేజీల వరకూ బరువు పెరిగిన వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది.

జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులను అందరికీ పరిచయం చేస్తూ, 1887 BCE కి చెందిన గౌతమబుద్ధుని అసలైన జాతకచక్రాన్ని వారికి వివరించడం జరిగింది. నా విశ్లేషణా విధానాన్ని బుద్ధుని జాతకచక్రం యొక్క విశ్లేషణతో వారికి అర్ధమయ్యేలా వివరించడం జరిగింది. బుద్ధుని యొక్క ఈ అసలైన జననతేదీని వెలుగులోకి తెచ్చినవారు ప్రఖ్యాత భారతీయ చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం గారు.

త్వరలో వెలువడబోతున్న 'మహనీయుల జాతకాలు - జీవిత విశ్లేషణలు' అనే 500 పేజీల మా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనా గ్రంధంలో ఈ జాతక విశ్లేషణను మీరు చూడవచ్చు.

ఇకపోతే, పదేళ్ళనుండీ నేను చెబుతూ వస్తున్న రీతిలోనే మా ఆశ్రమం నేడు ఎదుగుతున్నది. అసలైన హిందూమతాన్ని కులానికతీతంగా ఆచరణాత్మకంగా అందరికీ బోధిస్తూ, అజ్ఞానపు మురికిని వదిలిస్తూ, శిష్యుల దేహ-ప్రాణ-మానసిక స్థాయిలను సరిచేస్తూ, ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా నిజమైన హిందువులను, నిజమైన మనుషులను తయారు చేస్తూ,  అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది.

తిరిగి, మూడు నెలల తర్వాత, జూలైలో వచ్చే నా పుట్టినరోజు సందర్భంగా గురుపూర్ణిమా రిట్రీట్ జరుగుతుంది. ఇప్పటివరకూ ఉపదేశించిన సాధనలలో మంచి పరిపక్వతను అందుకుని, అసలైన హిందువులుగా అసలైన యోగులుగా తయారై ఆ రిట్రీట్ కు రావలసిందిగా శిష్యులనందరినీ కోరుతున్నాను.

క్రొత్తగా మా వద్ద దీక్షాస్వీకారం చేసి మా సాధనామార్గంలో నడవాలనుకునేవారు ఈ క్రింది 5 పుస్తకాలను తప్పకుండా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించగలరు. లేనిచో మా మార్గంలో ప్రవేశం లభించదు. గమనించండి.

1. శ్రీవిద్యా రహస్యం

2. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక

3. తారా స్తోత్రం

4. ధర్మపథం

5. వెలుగు దారులు లేదా MUSINGS

read more " విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం "

7, మార్చి 2024, గురువారం

మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో)

ఎన్ని ప్రవచనాలు వినినా, ఎన్ని పుస్తకాలను చదివినా, ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూచినా, ఎన్ని కబుర్లు చెప్పినా, అసలైన ఆధ్యాత్మికమార్గంలో ప్రాక్టికల్ గా నడవనిదే దమ్మిడీ ఉపయోగం కూడా ఉండదు. మిగతావన్నీ టైం వేస్ట్ పనులు మాత్రమే.

ఇది సత్యం.

అందుకే 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ఉద్భవించింది. తపన ఉన్న జిజ్ఞాసువులకు, సాధకులకు అసలైన ఆధ్యాత్మికలోకపు దారులు చూపిస్తుంది. నడిపిస్తుంది.

అందుకే ఈ ఆహ్వానం.

ఈ నెల 29, 30, 31 తేదీలలో మా ఆశ్రమంలో మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (పంచవటి సాధనా సమ్మేళనం) జరుగుతుంది.

ఈ మూడు రోజులు, ఉదయం 4 నుండి రాత్రి 7 గంటల వరకు. మధ్యాహ్నం భోజనవిరామం తప్ప, మిగిలిన సమయమంతా వివిధరకాల సాధనలలో మీరు సమయాన్ని గడపవలసి ఉంటుంది. ఆ వివరాలన్నీ, ఇక్కడకు వచ్చిన తర్వాత చెప్పబడతాయి. నేర్పబడతాయి.

ఎదురుచూస్తున్నవారికి ఇదే ఆహ్వానం.

ఈ రిట్రీట్ లో రెండు విభాగాలు ఉంటాయి.

ఇప్పటివరకూ ఆశ్రమానికి రాని క్రొత్తవారికి, మొదటిరోజున అంటే మార్చి 29 తేదీన, అవగాహనా సమ్మేళనం ఉంటుంది.  ఈ ఒక్క రోజు మాత్రమే వారికి ఆశ్రమంలో మాతోబాటు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పంచవటి సాధనామార్గం గురించి వారికి వివరించబడుతుంది. మీ మీ సందేహాలను తీర్చుకునే అవకాశం కలుగుతుంది.

పాతవారికి మరియు గతంలో అటెండ్ అయినప్పటికీ, దీక్షాస్వీకారం చెయ్యని క్రొత్తవారికి ఈ సారి ఆశ్రమంలో  మూడు రోజులు ఉండే అవకాశం ఇవ్వబడుతుంది. వారు సీనియర్ సభ్యులతో కలసి మూడు రోజులు ఆశ్రమంలో ఉండవచ్చు, కలసి సాధనలు చెయ్యవచ్చు. మా మార్గం యొక్క లోతుపాతులను మీ శక్తిమేరకు గ్రహించవచ్చు.

ఆశ్రమంలో మినిమమ్ సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. కంఫర్ట్స్ ఉండవు. వేసవి ఎండలు బాగా ఉంటాయి. వాటికి తట్టుకునే సంసిద్ధత ఉన్నవారు మాత్రమే రాగలరు. ఆశ్రమంలో ఉన్నపుడు ఆశ్రమ నియమాలను పాటించవలసి ఉంటుంది. మీరు ఏవైనా మందులను వాడుతూ ఉంటే, వాటిని తెచ్చుకోవడం మరచిపోకూడదు. 

రాదలచుకున్నవారు 98493 - 89249 అనే నంబర్ లో పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తి గారిని సంప్రదించగలరు.

read more " మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో) "

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ ప్రారంభం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ (నం. 67) ప్రారంభం అయింది.

సందర్శించండి



read more " హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ ప్రారంభం "

8, ఫిబ్రవరి 2024, గురువారం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ ను సందర్శించండి



హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ - 2024, ఈ నెల 9 నుంచి 19 వరకూ జరుగుతున్నది. దానిలో పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ కు స్టాల్ నంబర్ 67 కేటాయించబడింది. ఈ రోజు స్టాల్ ను సెటప్  చేయడం జరిగింది. పుస్తకాలు రేపటినుండి పెట్టబడతాయి. మా పుస్తకాలు కావలసినవారు ఈ స్టాల్ ను సందర్శించండి.

అక్కడ పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీరామమూర్తిని, ఇతర సభ్యులను మీరు కలుసుకోవచ్చు. సనాతన ధర్మం పైన, ఆధ్యాత్మిక ప్రయాణం పైన, మా సాధనా మార్గం పైన, మీమీ సందేహాలను వారితో మాట్లాడి తీర్చుకోవచ్చు. పంచవటిలో సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. మాతో కలసి ప్రయాణం చేయవచ్చు.

హైదరాబాద్ లో ఉన్నవారు, మమ్మల్ని కలవాలని ఎంతోకాలంగా అనుకుంటున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
read more " హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ ను సందర్శించండి "

29, జనవరి 2024, సోమవారం

రెండవ స్పిరిట్యువల్ రిట్రీట్ విజయవంతం అయింది








ముందుగా ప్లాన్ చేసినట్లు, ఈ నెల 26, 27, 28 తేదీలలో మా ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మిక సాధనా సమ్మేళనం విజయవంతం అయింది.

పాతవారితో బాటుగా, చాలామంది క్రొత్తవాళ్ళు కూడా ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. మా సాధనామార్గాన్ని వారికి వివరించడం జరిగింది. మళ్ళీ ఏప్రియల్ లో జరుగబోయే రిట్రీట్ లో వారు డైరెక్ట్ గా పాల్గొనవచ్చు. ఈ లోపల వారు ఈ క్రింది పుస్తకాలు చదివి, అర్ధం చేసుకుని, ఆ తరువాత ఏప్రియల్ రిట్రీట్ కు రావలసి ఉంటుంది.

అదే విధంగా, మమ్మల్ని సంప్రదిస్తున్న క్రొత్తవారందరికీ కూడా ఇదే సూచన చేస్తున్నాము.  ఇప్పటివరకూ నేను వ్రాసినవి 63 పుస్తకాలున్నాయి. వాటినుంచి కనీసం ఈ నాలుగు పుస్తకాలను చదవండి. మా మార్గం స్పష్టంగా అర్ధమౌతుంది. ఆ తరువాత మీరు రిట్రీట్స్ కు రావచ్చు. దీక్షాస్వీకారం చెయ్యవచ్చు. మా సాధనామార్గంలో నడవవచ్చు. ధన్యత్వాన్ని మీకు మీరే రుచి చూడవచ్చు.

1. Musings లేదా వెలుగు దారులు

2. శ్రీవిద్యా రహస్యం

3. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక

4. తారాస్తోత్రం

మా జ్యోతిష్యవిధానాన్ని క్రొత్తవారికి పరిచయం చేయడం జరిగింది. కానీ, 'డబ్బు సంపాదనకు దీనిని వాడకూడదు' అని స్పష్టంగా వారికి చెప్పడం కూడా జరిగింది.

గమనించండి.

read more " రెండవ స్పిరిట్యువల్ రిట్రీట్ విజయవంతం అయింది "

18, జనవరి 2024, గురువారం

జనవరి 22 న నూతన శకం ప్రారంభం - అందరూ పాలు పంచుకోండి

మానవచరిత్రలో మహత్తరమైన సంఘటనలు  అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. అటువంటి వాటిలో ఒకటి శ్రీరామజననం. సృష్టి-స్థితి-లయకారకుడు, సాక్షాత్తు పరబ్రహ్మము అయిన మహావిష్ణువే శ్రీరామునిగా జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కోట్లాది హిందువుల నమ్మకం కూడా అదే.

ఆయన రఘువంశంలో దశరధ మహారాజు కుమారునిగా జన్మించడము, తండ్రికిచ్చిన మాటప్రకారం వనవాసం చేయడము, సీతాదేవిని అపహరించిన రావణుని వానరసైన్యం సాయంతో వధించి, తిరిగి అయోధ్యా నగరానికి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యం చేయడము, అవతార పరిసమాప్తి చేసి తిరిగి తన ధామానికి చేరుకోవడము ఇదంతా రామాయణంలో ఉన్నది, మనకందరికీ ఇది తెలుసు.

రామాయణంలో వాల్మీకిమహర్షి వర్ణించిన కొన్ని విషయాలను బట్టి కనీసం లక్ష సంవత్సరాల క్రితం రామాయణం జరిగి ఉండాలి. వాటిలో ఒకటి, రావణుని భవనానికి నాలుగు దంతాల ఏనుగులు కాపలా కాస్తున్నాయని ఆయన వ్రాయడం. అటువంటి ఏనుగులు లక్ష సంవత్సరాల క్రితం ఉండేవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇదే విధంగా రామాయణం నిండా ఇటువంటి ఎన్నో రుజువులు లభిస్తున్నాయి. వాటిపైన ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని త్వరలో విడుదల చేయబోతున్నాను.

నేటికి 6000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ ను పాలించిన ఫారో రాజులలో 'రామా' అనే పేరు సర్వసామాన్యంగా ఉండేది. థాయ్ ల్యాండ్, ఇండోనేషియా, మొదలైన దేశాలలో శ్రీరాముని నేటికీ పూజిస్తారు. ఇండోనేషియా రాజవంశానికి పూర్వీకులు రఘువంశపు రాజులే. వారి చరిత్ర ఈ విషయాన్ని చెబుతున్నది. లాటిన్ అమెరికా లోని హొండురాస్ దేశాన్ని (పాతాళ లోకాన్ని) ఆంజనేయుడు చేరుకొని అక్కడ భీభత్సం సృష్టించినట్లు ఈనాటికీ అక్కడ గాధలున్నాయి. మహిరావణ చరిత్రలో దీనికి ఆధారాలున్నాయి.

శ్రీరాముడు జన్మించిన భవ్యమందిరం, మహారాజ ప్రాసాదంగా 1660 CE వరకూ అయోధ్యలో ఉండేది. ఆ సంవత్సరంలో, ఆ ప్రాంతానికి గవర్నరు, ఔరంగజేబు అనుచరుడైన ఫిదాయ్  ఖాన్ అనే నీచుడు ఆ రాజభవనాన్ని అందులోని మందిరాన్ని కూలగొట్టి, 1528 CE లో బాబర్ సైన్యాధిపతి అయిన మీర్ బాకీ అనే ఇంకొక నీచుడిచే కట్టబడిన మసీదును పెద్దదిగా నిర్మించి, దానికి బాబరీ మసీద్ అని పేరు పెట్టాడు.

గాంధీ నెహ్రూల కుట్రలు + సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ పాలనల పుణ్యమా అని హిందువులు తమ దేశంలో సెకండ్ గ్రేడ్ పౌరులయ్యారు. వారి ఆలయాలు, చారిత్రక స్థలాలు దిక్కులేని వయ్యాయి. దేశచరిత్ర మొత్తం వక్రీకరించబడింది. హిందూమతాన్ని ఒక ప్లాన్ ప్రకారం చాప క్రింద నీరులాగా నిర్మూలించే కుట్ర అమలుచేయడం మొదలైంది. కులాలను రెచ్చగొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టి, ఓట్లు దండుకుని అధికారం చేజిక్కించుకుని తమ తమ ఎజెండాలు అమలు చెయ్యడం మొదలైంది. 

ఈ క్రమంలో అనర్హులు అందలాలు ఎక్కారు. నీతి అనేది సమాజం నుంచి మాయమైంది. అడుగడుగునా అవినీతి మయమైంది. దేశం పరాయి దేశాల తొత్తుగా మారింది. దేశసంపద ఇతర దేశాలకు తరలిపోయింది. ఎడారి మతాల ప్రాబల్యం పెరిగింది. టెర్రరిజం పెరిగింది. స్వతంత్రం వచ్చాక భరతమాత మళ్ళీ బందీ అయింది. అంతర్జాతీయ వేదికల పైన నవ్వుల పాలైంది. అన్నిరకాలుగా పతనమై పోయింది.

6 డిసెంబర్ 1992 న, దౌర్జన్యానికి, బానిసత్వానికి ప్రతీక అయిన బాబరీ మసీదు రామభక్తుల చేత కూలగొట్టబడింది. ఆ చైతన్యాన్ని వారిలో రగిల్చింది, లాల్ కృష్ణ అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఇంకా అనేకులు ఏళ్ల తరబడి చేసిన నిరంతర కృషి. ఆ క్రమంలో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పులలో అనేకమంది కరసేవకులు, రామభక్తులు చనిపోయారు.  అయినా సరే వెనుకకు తిరుగకుండా, ఆ అక్రమ కట్టడాన్ని కూలగొట్టి తమ దేశభక్తిని, దైవభక్తిని చాటుకున్నారు. చరిత్రలో నిలిచిపోయారు. భగవంతుని పాదాల చెంతకు చేరుకున్నారు. మనం వారిని మర్చిపోయినా, దైవదృష్టిలో వారు ఉత్తములే అని నా నమ్మకం.

ఆ రోజు నుంచి హిందువులలో చైతన్యం రావడం మొదలైంది.

అప్పటినుంచీ బీజేపీ పార్టీ, విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ లు చేసిన సమిష్టి న్యాయపోరాట ఫలితంగా  విజయాన్ని సాధించి, అయోధ్యలో శ్రీరాముని భవ్య మందిరాన్ని నిర్మించి, ఈ నెల 22 న బాలరాముని విగ్రహాన్ని ఆ ఆలయంలో ప్రతిష్ట చేయబోతున్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చాక భారతదేశ పునరుజ్జీవనం మొదలైంది. కోల్పోయిన గత వైభవాన్ని మన దేశం తిరిగి పొందటం మొదలైంది. ప్రపంచదేశాలు మనల్ని ఒక కలోనియల్ బానిసలా చూడటం మానేసి, తిరిగి గౌరవించడం మొదలు పెట్టాయి.

మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నేత అయి ఉండికూడా, ఊపిరి సలపనంత బిజీ పనులలో ఉంటూ కూడా, 22 న రామ్ లాలా విగ్రహ ప్రాణప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక సామాన్యుడిలాగా పది రోజుల ఉపవాసదీక్షను చేస్తున్నారు. నేలపైన నిద్రపోతూ నిరంతరం రామనామాన్ని జపిస్తున్నారు. ఆయనకిప్పుడు 73 ఏళ్లు.  దేశంకోసం ధర్మంకోసం కుటుంబాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. వివేకానందస్వామి అనుచరుడు. ఇటువంటి దైవత్వం ఉన్న మనీషి మన ప్రధానమంత్రి కావడం మన అందరి అదృష్టం. అటువంటి ఉత్తముడు అసలు రాజకీయాలలో ఉండటమే ఒక అద్భుతం !

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్ ఇంకొక కారణజన్ముడు. కళంకం లేని దేశభక్తుడు. మహాయోగి గోరఖ్ నాథ్  స్థాపించిన యోగసంప్రదాయానికి చెందిన నేటి జగద్గురువు ఈయన. అటువంటి నిస్వార్థపరుడు,  బ్రహ్మచారి, నిజమైన సన్యాసి, సాధువు, ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, టెర్రరిజాన్ని అణచి పారేసి, రామరాజ్యాన్ని అక్కడ నడిపిస్తున్నాడు. 'సన్యాసి రాజ్యం ఏలుతాడు' అని వీరబ్రహ్మేంద్ర స్వామి  తన కాలజ్ఞానంలో వ్రాసినది యోగి అదిత్యనాథ్ గురించే గాని, కొందరు పిచ్చివాళ్ళు అనుకున్నట్లు ఎన్టీఆర్ గురించి కానే కాదు. రంగుగుడ్డలు వేసుకున్నంత మాత్రాన, రంగులు పూసుకుని నటించినంత మాత్రాన, నలభై రోజుల పార్ట్ టైమ్ దీక్షలు చేసినంత మాత్రాన, ఎవరూ గురుస్వాములు, సన్యాసులు, స్వామీజీలు అయిపోరు. వారి జీవితచరిత్రలు, దినచర్యలు అందుకు అనుగుణంగా, మచ్చ లేనివిగా ఉండాలి.

యోగి అదిత్యనాథ్ వంటి మరొక్క మహనీయుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న సమయంలో పుట్టడం మనందరి అదృష్టం.

రామ్ లాలా విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్, తన కుటుంబానికి దూరంగా ఉంటూ, ఆరు నెలలు మౌనదీక్షలో ఉండి, ఆ విగ్రహాన్ని కర్ణాటకలో దొరికే నల్లరాతి ఏకశిల నుండి చెక్కాడు. అతని జన్మ ధన్యమైంది !  అతని తపస్సు ఫలించింది. ఆ విగ్రహాన్ని కోట్లాదిమంది యుగయుగాలపాటు పూజించబోతున్నారు. దానిలో శ్రీరామచంద్రుని దివ్యమూర్తిని దర్శించ బోతున్నారు. ఎంతటి ధన్యాత్ముడో ఈ శిల్పి! ఈ పుణ్యబలం వల్ల, అరుణ్ యోగిరాజ్ పూర్వీకులందరూ ఉత్తమలోకాలను పొందారని నా నమ్మకం !

అయోధ్య కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో గొప్ప ఐకమత్యం., సోదరభావం, దేశభక్తులు వెల్లివిరుస్తున్నాయి. కులాలకు అతీతంగా వారిలో ఐక్యతాభావం పెల్లుబుకుతోంది. శ్రీరాముని పాదపద్మాల చెంత అందరూ ఒక్కటౌతున్నారు.

ఈ సమయం భారతదేశ చరిత్రలో ఒక మహోన్నత ఘట్టం. ఇటువంటి సమయంలో మనం పుట్టి, ఈ ఉత్సవాన్ని చూస్తూ ఉండటం గొప్ప అదృష్టం.

ఇది సాంస్కృతిక ధార్మిక పునరుజ్జీవన యుగం.  జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఇటువంటి మరపురాని ఘట్టాన్ని ఆసాంతం ఆస్వాదించండి. ఉప్పొంగిన హృదయాలతో శ్రీరామ నామగానం చేయండి. హిందువులుగా పుట్టినందుకు, ప్రపంచంలో ఎక్కడా లేని మహోన్నతమైన ఆధ్యాత్మిక సంస్కృతికి వారసులైనందుకు గర్వించండి.

పంచవటి తరఫు నుండి మేము కూడా రేపటినుంచి మూడు రోజుల దీక్ష చేస్తున్నాం. దీనిలో ఉపవాసము, మౌనం, నిరంతర రామనామ జపం భాగాలుగా ఉంటాయి. 22 వ తేదీన, 'రామ తాపినీ ఉపనిషత్' కు నా వ్యాఖ్యానమును ఉచిత 'ఈ-బుక్' గా విడుదల చేస్తున్నాము. ఇది శ్రీరాముని పాదపద్మముల చెంత మేము ఉడతాభక్తిగా చేస్తున్న సేవ.

హిందువులందరూ మీకు చేతనైన రీతిలో కనీసం ఈ మూడు రోజులైనా దీక్షలు చెయ్యండి. 22 వ తేదీన జరిగే బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవాన్ని మీ మీ కుటుంబాలలో ఒక పండుగగా జరుపుకొండి. 

మీ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇటువంటి అవకాశం వస్తుంది.

మరువకండి !

రామభక్తులుగా జీవించండి. రావణ సైన్యంలో చేరకండి

జై శ్రీ రామ్ ! జై శ్రీ రామ్ ! జై శ్రీ రామ్ !

read more " జనవరి 22 న నూతన శకం ప్రారంభం - అందరూ పాలు పంచుకోండి "

2, జనవరి 2024, మంగళవారం

రెండవ స్పిరిట్యువల్ రిట్రీట్ + క్రొత్తవారికి అవగాహనా సమ్మేళనం

జనవరి 26, 27, 28 తేదీలలో మా ఆశ్రమంలో రెండవ ఆధ్యాత్మిక సమ్మేళనం (స్పిరిట్యువల్ రిట్రీట్) జరుగుతుంది. అదే సమయంలో, మా మార్గంలోకి అడుగుపెట్టాలనుకునే క్రొత్తవారికోసం జనవరి 26 న ఫౌండేషన్ రిట్రీట్ (అవగాహనా సమ్మేళనం) ఉంటుంది.

దీనిలో, పంచవటి సాధనామార్గం, దాని విధానాలు, లోతుపాతులు మొదలైన విషయాలపైన మీకున్న అపోహలను, అనుమానాలను తొలగిస్తూ, ఒక అవగాహనా సమ్మేళనం ఉంటుంది. దీనిని మా మార్గంలోకి ఆహ్వానించే 'ఫౌండేషన్ మీటింగ్' గా అనుకోవచ్చు.

ఈ రిట్రీట్ కు హాజరైనవారు, ఇతర సీనియర్ మెంబర్స్ తో, మాతో, ఒకరోజు పాటు ఆశ్రమ వాతావరణంలో ఉండి, డైరెక్ట్ గా మాతో మాట్లాడి, మీ మీ సందేహాలను తీర్చుకోగలుగుతారు. సీనియర్ మెంబర్స్ తో కలసి ఇకనుంచి రెగ్యులర్ గా జరిగే రిట్రీట్లకు కూడా హాజరయ్యే అవకాశాన్ని పొందుతారు.

ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు, మిగతా వివరాలకోసం 98493-89249 అనే మొబైల్ లో పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీరామమూర్తిని సంప్రదించండి.

ఆహ్వాన వీడియోను ఇక్కడ చూడండి.

https://youtu.be/AdBLdPwq9Jc?si=Bg1tBqqfbYFSBId0

read more " రెండవ స్పిరిట్యువల్ రిట్రీట్ + క్రొత్తవారికి అవగాహనా సమ్మేళనం "

29, డిసెంబర్ 2023, శుక్రవారం

జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు?

'జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు? మేము కూడా అటెండ్ అవుదామని అనుకుంటున్నాము' అని అడుగుతూ అనేకమంది మెయిల్స్ ద్వారా, ఇతరత్రా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వారందరికోసం ఈ పోస్ట్.

మిగతా అనేకమంది లాగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక డబ్బు సంపాదించే మార్గంగా చూడటం మా విధానం కాదు. కనుక, కోర్సులంటూ పెట్టి, కమర్షియల్ అస్ట్రాలజీని మేము నేర్పించము. సమాజంలో ఇప్పుడున్న దొంగలు చాలు. క్రొత్తవాళ్ళని తయారు చేయవలసిన పని మాకు లేదు.

'మరి మీ జ్యోతిష్య విధానాన్ని ఎవరికి నేర్పిస్తారు?' అనే సందేహం చాలామందికి కలుగుతుంది.

పంచవటి సాధనామార్గాన్ని అనువరించేవారికి మాత్రమే మా జ్యోతిష్యవిధానాన్ని నేర్పించడం జరుగుతుంది. మా స్పిరిట్యువల్ రిట్రీట్లలో భాగంగా యోగశాస్త్రం, తంత్రశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, ఇంకా కొన్ని మార్మికవిద్యలను నేర్పడం జరుగుతుంది.  పంచవటి సాధనామార్గంలో ఇవన్నీ అంతర్భాగాలు. ఆధ్యాత్మికమార్గంలో నన్ను అనుసరించాలనుకునే నా శిష్యులకు మాత్రమే ఇవి నేర్పబడతాయి గాని, సరదాకో, డబ్బు సంపాదించడానికో జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలని ఆశించేవారికి నేర్పబడవు. ఈ విద్యలను మేము చూచే కోణం వేరు. ఇది లోకపు తీరుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

మా జ్యోతిష్యవిధానం మీకు, మీ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా పూర్తిగా ఆధ్యాత్మికకోణంలో మాత్రమే ఉపయోగిస్తుంది. మూడో మనిషికి మీరు చెప్పకూడదు. చెప్పలేరు. డబ్బుల కోసం అసలే చెప్పకూడదు. డబ్బు కోసం ఈ విద్యను వాడకూడదు.

ఒక్కమాటలో చెప్పాలంటే మాది స్పిరిట్యువల్ అస్ట్రాలజీ. స్పిరిట్యువల్ మార్గంలో నడిచే సాధకులకు మాత్రమే ఇది ఉద్దేశించబడింది. 24 గంటలూ డబ్బు తప్ప ఇంకో ధ్యాసలేని స్వార్ధపరులు, ఆశపోతులైన లౌకికులకోసం ఉద్దేశించినది కాదు.

బయటవాళ్ళకు మా రిట్రీట్స్ లోకి అనుమతి ఉండదు. రిట్రీట్స్ లో కాకుండా మాదైన జ్యోతిష్యవిధానాన్ని నేర్చుకోవడం వేరేవిధంగా వీలుకాదు. కనుక, దానిని నిజంగా నేర్చుకోవాలనుకుంటే, నా శిష్యులుగా  మారి, మా సాధనావిధానంలో నడవడం ఒక్కటే దారి.

దానిలో నడుస్తామంటే సరే. కాదంటే మాత్రం, మా జ్యోతిష్య విధానం మీకోసం కాదని గ్రహించండి.

ఆధ్యాత్మిక సాధనామార్గంలో జ్యోతిష్య శాస్త్రం విడదీయరాని భాగం. లౌకిక బాధలను పోగొట్టడానికి దానిని తప్పకుండా వాడవచ్చు. కానీ పునాది మాత్రం ఆధ్యాత్మికమై ఉండాలి. ఇది మా విధానం.

మా సాధనామార్గంలో నడుస్తామంటే రండి. జ్యోతిష్యశాస్త్రాన్ని నాదైన వేగవిధానంలో నేర్చుకోండి. సాధన వద్దంటే, మా జ్యోతిష్యం మీకు పనికి రాదు.

మమ్మల్ని సంప్రదిస్తున్న అనేకమందికి సరియైన స్పష్టతను ఇవ్వడం కోసమే ఈ పోస్ట్ ను వ్రాస్తున్నాను.

గ్రహించండి.

read more " జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు? "

26, డిసెంబర్ 2023, మంగళవారం

First spiritual retreat in our Ashram

డిసెంబర్ 23, 24, 25 తేదీలలో మొదటి ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం మా ఆశ్రమంలో జరిగింది.  ఆంధ్రా. తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుండి సభ్యులు హాజరయ్యారు. దుబాయ్ నుండి ఒక సభ్యుడు రాగలిగాడు.

మూడురోజుల పాటు జరిగిన ఈ సమ్మేళనంలో పంచవటి సాధనామార్గంలో వీరిని ప్రవేశపెట్టి  మా సాధనావిధానాన్ని పరిచయం చేయడం, ప్రాధమిక  దీక్షలను ఇవ్వడం జరిగింది.  ఇది గత 40 ఏళ్లుగా నేను నడచి, సర్వసమగ్రంగా రూపొందించిన ధన్యజీవన మార్గం. నన్ను అనుసరించాలని నిర్ణయించుకున్నవారికి ఈ రహస్యాలను ప్రాక్టికల్ గా నేర్పించడం జరుగుతుంది. ఈ రిట్రీట్ తో ఆ ప్రాసెస్ మొదలైపోయింది. యోగ వేదాంత తంత్రమార్గంలో నడిచే సాధకుల మొదటి బ్యాచ్ మొదలైపోయింది.

జ్యోతిష్యశాస్త్రంలో నాదైన విశ్లేషణా విధానాన్ని వీరికి నేర్పడం కూడా మొదలైంది. ఇది గత 30 ఏళ్లుగా నేను పరిశోధించి, ఫలితాలు రాబట్టి, తయారుచేసిన సులభమైన మార్గం. వందలాది గ్రంధాలను చదివి, వేలాది జాతకాలు చూచి, నేను స్థిరపరచిన సులభమైన విధానాన్ని డైరెక్ట్ గా పళ్లెంలో పెట్టి వీరికి అందిస్తున్నాను.

కులాలకు, వర్గాలకు, ఆస్తులకు, అంతస్తులకు, కుళ్ళుకుత్సితాలకు అతీతంగా, హృదయసంబంధంతో, ప్రేమతో ఒకే కుటుంబంలా 'పంచవటి' ఉండాలన్నది నా చిరకాల సంకల్పం. అది నేటితో సాకారం కావడం మొదలైపోయింది.

'భక్తేర్ జోతి నోయ్' (భక్తులలో కులం లేదు) అనిన శ్రీరామకృష్ణుల వారి మహోన్నత భావనను ఆచరణలో పెడుతూ, అన్ని కులాలవారిని సమానంగా ఒకేచోట కూచోపెట్టి, ఎటువంటి భేదభావమూ లేకుండా, ఒకే విధమైన సాధనావిధానాలను అందరికీ నేర్పడం, చేయించడం మొదలైంది. బ్రాహ్మణులు, దళితులు, ఇంకా ఇతర కులాల వారు పక్కపక్కనే కూర్చుని యోగ - వేదాంత - తంత్ర సాధనలను చెయ్యడం మీరు మా ఆశ్రమంలో చూడవచ్చు. కానీ వారిలో ఎవరికీ 'మాది ఈ కులం' అన్న విషయం గుర్తే ఉండదు. అదసలు ఒక విషయమే కాదు. అలాంటి స్థితిని వారు ఇక్కడ అందుకుంటున్నారు.

ఇక్కడ కోటీశ్వరుడు, కూలిపని చేసుకునేవాడు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి ఇక్కడ లెట్రిన్స్ కడుగుతాడు. అదే సమయంలో, సామాన్య మానవుడు ఇక్కడ ముఖ్యమైన పనిలో ఉండవచ్చు. అహంకారానికి ఇక్కడ మొట్టికాయలు పడతాయి. నిజాయితీకి, వినయానికి పెద్దపీట ఇవ్వబడుతుంది. వెరసి, గ్రంథాలలో మీరు చదివిన సమానత్వం ఇక్కడ కార్యరూపం దాల్చి కళ్ళెదురుగా కనిపిస్తుంది.

కుటుంబాలలో, రక్తసంబంధాలలో కూడాలేని ప్రేమాభిమానాలను పంచవటి సభ్యుల మధ్యన మీరు చూడవచ్చు. ఇలాంటి విశాలమైన స్వచ్ఛమైన మనస్సులున్నవారిని అందరినీ ఒక పందిరి క్రిందకు చేర్చాలని, ఒకే కుటుంబంగా వారిని చూడాలన్న నా చిరకాల స్వప్నం నేడు సాకారమౌతున్నది.

ఇది ఎందరో ప్రాచీన యోగుల, సిద్ధుల, మహనీయుల స్వప్నం. దీనిని మేము సాకారం చేస్తున్నాం.

నీచమైన మానవ మనస్తత్వాలకు అతీతులైన నిజమైన మానవులను తయారుచేసే ప్రాసెస్ ఇక్కడ మొదలైంది. మూడు రోజుల ఇంటెన్సివ్ స్పిరిట్యువల్ రిట్రీట్ లో పాల్గొని, కలసి మెలసి ఉండి, సాధనామార్గాలు నేర్చుకుని, తృప్తి నిండిన నిండు మనసులతో, నిన్న రాత్రి అందరూ తిరుగుప్రయాణానికి బయలుదేరి, ఈరోజు తెల్లవారేసరికి వారి వారి ఊర్లకు చేరుకున్నారు.

ఆశ్రమాన్ని మమ్మల్ని వదలలేక కన్నీళ్లు కార్చిన ఎంతోమంది కన్నులే, 'మా ఈ ప్రయత్నం మహోన్నతమైనది' అనడానికి నిదర్శనాలు. ఆస్తులను, అంతస్తులను, లౌకిక జీవితాల రొచ్చును, స్వార్ధపూరిత కుళ్ళు బ్రతుకులను, కపటాన్ని, కల్లోలాలను అన్నింటినీ  మరచిపోయి, కనీసం మూడురోజులైనా స్వచ్ఛమైన స్వర్గంలాంటి ఒక లోకంలో నివసించామన్న ఆత్మతృప్తి అందరిలోనూ వ్యక్తమైంది.

ఇది నా చిన్ననాటి కల ! నేటికి సాకారమౌతున్నది !

ఆ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడండి. మరిన్ని ఫోటోల, వీడియోల కోసం  మా పేస్ బుక్ పేజీని, యూట్యూబ్ ఛానల్ ను సందర్శించండి.



ఆరుబయట Warmup  వ్యాయామాలతో దినచర్యకు సిద్ధమౌతూ



యోగవ్యాయామ సాధనలో శరీరాన్ని తీర్చిదిద్దుతూ













ప్రాణాయామ సాధనలో




ధ్యాన సాధన చేస్తూ






కలసి మెలసి తోటపనిని చేస్తూ











జ్యోతిష్య రహస్యాలను నేర్చుకుంటూ






భోజన దృశ్యాలు





read more " First spiritual retreat in our Ashram "