“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, మే 2020, శుక్రవారం

మే 2020 పౌర్ణమి ప్రభావం - మరికొన్ని సంఘటనలు


నిన్నరాత్రినుంచి ఇప్పటిలోపు ఇదే పౌర్ణమిప్రభావం మరికొన్ని  విషాదసంఘటనలను సృష్టించింది.

ఛత్తీస్ ఘడ్ ప్రమాదం :
నిన్న రాత్రి రాయఘడ్ జిల్లాలో ఒక పేపర్ మిల్ లో మీథేన్ వాయువు లీకై, టాంకును శుభ్రం చేస్తున్న ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

తమిళనాడులో NLC లో ప్రమాదం:
కడలూరులో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లో బాయిలర్ పేలి ఏడుగురు గాయపడ్డారు.

ఔరంగాబాద్ లో రైలుక్రింద 15 మంది కూలీల మరణం:
రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో గదేజల్గావ్  స్టేషన్ దగ్గర పట్టాలమీద నిద్రపోతున్న లేబర్ మీద నుంచి పెట్రోల్/డీజిల్ వాగన్లతో పోతున్న రైలు దూసుకుపోగా చనిపోయారు.

అమావాస్య, పౌర్ణమి ప్రభావాలు మనుషుల మీద ఉంటాయంటారా? ఉండవంటారా?