“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, నవంబర్ 2018, ఆదివారం

నాందేడ్ యాత్ర - 10 (గురుద్వారా లంగర్ సాహిబ్)

రాత్రంతా నిద్రలేదు గనుక, హోటలు కొచ్చాక ఫ్రెష్ అయ్యి, కొన్ని గంటలు నిద్రపోయాను. మధ్యాహానికి లేచి, కొంచం ఏదో తిని, మళ్ళీ ఊరిమీద పడ్డాను. దారి అర్ధమైంది గనుక తాపీగా నడుచుకుంటూ మళ్ళీ గురుద్వారా బందా ఘాట్ కు చేరుకున్నాను. నిన్నటి లాగే ఆ ప్రాంతమంతా కోలాహలంగా పండుగ వాతావరణంలా ఉంది. అంతమంది సిక్కులను, వాళ్ళ ఉత్సాహాన్ని, వాళ్ళ ఐకమత్యాన్ని, అన్ని పనులనూ అందరూ కలసి చేసుకునే వాళ్ళ సోదరభావాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. దారిపొడుగునా, రకరకాల కర్రలు, కత్తులు, తల్వార్లు మొదలైన ఆయుధాలు రోడ్డు పక్కనే చేసి అమ్మే డేరాలు వెలిశాయి. అవన్నీ 'గట్కా' అనే సిఖ్ మార్షల్ ఆర్ట్ లొ వాడే ఆయుధాలు. అవన్నీ చూస్తూ, మెల్లిగా గోదావరి ఒడ్డునే నడిచి ముందుకు వెళ్లాను. బందా ఘాట్ గురుద్వారా ప్రక్కనే గురుద్వారా నగీనా ఘాట్ ఉంది. దాన్ని దాటి కొంచం ముందుకు వెళితే వచ్చేదే గురుద్వారా లంగర్ సాహిబ్.

నాందేడ్ లో మనం చూడవలసిన ప్రదేశాలలో గురుద్వారా లంగర్ సాహిబ్ చాలా ముఖ్యమైనది. దీనిని గురు గోవింద్ సింగ్ స్వయానా తన చేతులతో ప్రారంభించాడు. 300 ఏళ్ళ తర్వాత ఈనాటికీ ఇది నిర్విఘ్నంగా సాగుతోంది.

పంజాబీ భాషలో లంగర్ అంటే, వంటశాల, భోజనశాల అని అర్ధం. ఈ గురుద్వారా పేరే లంగర్ సాహిబ్ అంటే ఇదేంటో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈరోజున ఇక్కడ ప్రసాదం తీసుకోవాలని అనుకున్నాను. ఆ ప్రాంగణంలొ అడుగుపెడుతున్నప్పుడే భావోద్రేకంతో నా ఒళ్ళు జలదరించడం మొదలైంది. చెప్పుల కౌంటర్లో నా షూస్ ఇస్తుంటే, సిక్కులలో ఒక పెద్దాయన ఆ షూస్ తీసుకుని ఎంతో గౌరవంగా వాటిని గుడ్డతో తుడిచి లోపల ర్యాక్ లొ ఉంచాడు.

నేను ఎన్నో ఆశ్రమాలు చూచాను. పెద్దపెద్ద మాటలు చెప్పే ఎందఱో గురువులను వ్యక్తిగతంగా కలిశాను. వాళ్ళ శిష్యులనూ కలిశాను. అందరూ మాటలేగాని చేతల్లో ఎక్కడా ఉన్నతంగా ఉండరు. కానీ ఇక్కడ సేవ చేస్తున్న సిక్కులు చూపిస్తున్న త్రికరణశుద్ధి, భక్తి, అంకితభావాలు నన్ను ముగ్దుడిని చేశాయి. గురువుకు వాళ్ళు ఇస్తున్న గౌరవానికీ, ఆయన చెప్పిన బోధనలను వాళ్ళు ఈనాటికీ ఆచరిస్తున్న తీరుకూ నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ కౌంటర్లోని పెద్దాయనకు రెండు చేతులెత్తి నమస్కారం చేశాను. అర్ధం చేసుకున్నట్లు ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూ నాకూ నమస్కారం చేశాడు.

లోపలకు వెళ్లి చూస్తే, అందరూ వరుసలు వరుసలుగా నేలమీద కూర్చుని భోజనం చేస్తూ కనిపించారు. దారిలోనే ఒకాయన నిలబడి కంచం గ్లాసూ మనకు ఇస్తున్నాడు. అవి తీసుకుని వరుసలో కూర్చోవాలి. వెంటనే కొంతమంది వచ్చేసి, ఒక బుట్టలో తెచ్చిన వేడివేడి చపాతీలూ, పొగలు కక్కుతున్న పప్పూ వడ్డించి వెళ్ళిపోతున్నారు. అవి అయిపోయేలోపు మళ్ళీ ఇంకో రౌండ్ వస్తున్నారు. మనం అడగనక్కర్లేదు. వాళ్ళే చూసుకుంటూ, మనం తింటున్న చపాతీ అయిపోయేలోపు మళ్ళీ తెచ్చి వేసేస్తున్నారు.  లేచి కొంచం ఇవతలకు వచ్చే సరికి, వేడివేడి టీ పెద్ద గ్లాసులో పోసి అందిస్తున్నారు.

ఇదంతా చూస్తూ, కంచం గ్లాసూ తీసుకుని ఎక్కడ కూచోవాలా అని చూస్తున్నాను. ఎందుకంటే ఆడామగా భేదం లేకుండా ఒకరి పక్కనే ఇంకొకరు కూచుని తినేస్తున్నారు. వాళ్లకు అసలా ఆలోచనే ఉన్నట్లు కనిపించలేదు. చూస్తేనేమో అప్పుడు ఆడవాళ్ళ వరుసలోనే ఖాళీలున్నాయి. వాళ్ళ పక్కన కూచోవడం తప్పౌతుందేమో అని సందేహించాను. నా సందేహం చూచి ఒక సిఖ్ ముందుకొచ్చి - 'అరె భయ్యా. బైఠో. యహా ఐసా భేదభావ్ నహీ హై. యే గురూజీ కా ఘర్ హై. బైట్కే ఖావో'- అనేసి తన పనిమీద వెళ్ళిపోయాడు.  ఆడవాళ్ళ వరుసలో వాళ్ళ ప్రక్కనే కూచుని రెండు చపాతీలూ, పప్పూ తినేసరికి నా కడుపు నిండిపోయింది. ఆ తర్వాత వాళ్ళిచ్చిన టీ త్రాగాను.

చేతులు కడుక్కుంటూ చుట్టూ చూచాను. గురుద్వారా లంగర్ చాలా పెద్దది. గోధుమపిండి బస్తాలూ, నెయ్యిడబ్బాలూ, బంగాళాదుంపల బస్తాలూ వరుసలుగా పేర్చి కనబడుతున్నాయి. ఎంతోమంది సిక్కులు వాటిని అలా డొనేట్ చేసేస్తున్నారు. చపాతీలు ఒత్తేవాళ్ళు ఒత్తుతున్నారు. వండేవాళ్ళు వండుతున్నారు. సేవ చేసేవాళ్ళు చేస్తున్నారు. బ్యాచ్ లు బ్యాచ్ లుగా వేలమంది భోజనాలు చేస్తున్నారు. 'నువ్వెవరు? ఎక్కడనుంచి వచ్చావు?' అని ఒక్కరూ నన్నడగలేదు. అసలా ఆలోచనే వాళ్లకు లేదు. చాలా ఆనందం కలిగింది. మనస్సులోనే గురువులను స్మరిస్తూ బయటకు వచ్చి ఒక అరుగుమీద కూచున్నాను.

ఆలోచనలు మొదలయ్యాయి. మనసు చరిత్రలోకి తొంగి చూచింది.

ఔరంగజేబ్ గాడు చనిపోయాక వాడి కొడుకుల మధ్య అంతర్యుద్దం మొదలైంది. ముఘల్ పాదుషాల చరిత్ర అంతా రక్తసిక్తమే. అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవడం, తల్లిదండ్రులను చంపడం, అధికారం కోసం ఎవరినైనా చంపడం, మళ్ళీ ఇస్లాం అంటూ నీతులు చెప్పడం - ఇదీ వాళ్ళ నీచమైన చరిత్ర. ఎన్ని వెధవపనులు చేసినా సరే, గడ్డం పెంచితే చాలు, అన్నీ దాని చాటున కొట్టుకుపోతాయి.

అన్నదమ్ముల మధ్యన జరిగిన అంతర్యుద్ధంలొ, తనకు సహాయం చెయ్యమని గురు గోవింద్ సింగ్ ను కోరాడు ఔరంగజేబ్ కొడుకులలో ఒకడైన బహదూర్ షా. ఈ బహదూర్ షా గాడు, తన తండ్రియైన ఔరంగజేబ్ గాడి చావుకోసం, తను సింహాసనం ఎక్కడం కోసం, దాదాపు 50 ఏళ్ళు వేచి చూచాడు. తన తండ్రి చావును కోరుతూ అసహనంగా వీడు దాదాపు 50 ఏళ్ళు బ్రతికాడు. చివరకు వీడికి 63 ఏళ్ళున్నపుడు ఔరంగజేబ్ చచ్చాడు. ఈలోపలే అతను ఎన్నోసార్లు తండ్రికి వ్యతిరేకంగా కుట్రలు చేశాడు. కానీ ప్రతిసారీ ఔరంగజేబ్ వాటిని కనిపెట్టి కొడుకును డిల్లీకి దూరదూరంగా అనేక ప్రాంతాలలో గవర్నర్ గా పంపిస్తూ ఉండేవాడు. అయినా బహదూర్ షా తన కుట్రలు ఆపేవాడు కాదు. చివరకు ఔరంగజేబ్ తన కొడుకును ఆరేళ్ళపాటు జైల్లో కూడా పెట్టాడు. ఈ కధ ఇలా ఉండగా బహదూర్ షా గాడికి 63 ఏళ్ళు వచ్చిన సమయానికి ఔరంగజేబ్ గాడు చచ్చాడు.

ముఘల్ పాదుషాలకు ఎంతమంది పెళ్ళాలు, ఎంతమంది ఉంపుడుగత్తెలు ఉండేవారో వాళ్ళకే తెలీదు. కొంతమంది జనానాలో అయితే 3000 దాటి ఆడవాళ్ళు ఉండేవారు. పదేళ్ళకు కూడా ఒకళ్ళ టర్న్ వచ్చేది కాదు. మరి వాళ్ళ కోరికలు వాళ్ళకూ ఉంటాయి కదా. అందులోనూ రోజూ మూడు పూటలా తినేది మాంసమేనాయె. మరి పదేళ్ళలొ ఒకసారి కూడా సుల్తాన్ వారివైపు చూడకపోతే ఎలా ఊరుకుంటారు? అందుకని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు బయటవాళ్ళతో సంబంధాలు పెట్టుకోకుండా కొజ్జాలను జనానాకు కాపలా పెట్టేవాళ్ళు. ఈ పనికోసం కొంతమంది మగవాళ్ళను కొజ్జాలుగా మార్చేవాళ్లు. ఆ జనానాస్త్రీలు కూడా తక్కువ వాళ్ళేమీ కాదు. వాళ్ళా కాపలా కొజ్జాలను మచ్చిక చేసుకుని, తమకు నచ్చిన ప్రియులను వాళ్ళతోనే రప్పించుకునేవాళ్ళు. ఈ సంగతి సుల్తాన్ కు చేరవేసే గూడచార్లు కూడా వారి పక్కనే ఉండేవాళ్ళు, ఇలా బయటపడి దొరికిపోయిన స్త్రీలను తలలు నరికి, వాళ్ళ బాడీలను నదిలో పారేస్తూ ఉండేవాళ్ళు. ఈ శిక్షలు అమలు చేసే బ్యాచ్ ఇంకోటి ఉండేది. ఇదంతా పెద్ద ఛండాలపు గోలగా సాగేది. ఈ జనానానూ, కొజ్జాలనూ, గూడచారులనూ, శిక్షలు అమలుచేసే కసాయివాళ్ళనూ మూడు పూటలా మేపడానికి హిందువులు కట్టిన 'జిజియా' లాంటి ట్యాక్స్ ల ద్వారా వచ్చిన డబ్బును వాడేవాళ్ళు. ఈ రకంగా హిందువుల కష్టార్జితమంతా సుల్తాన్ల విలాసాలకూ, వాళ్ళ ముండల్ని మేపడానికీ సరిపోతూ ఉండేది. 

ఈ జనానాలో ఉన్న ఆడాళ్ళలో ఎవరి సంతానానికి ఎవరు తండ్రో తెలుసుకోవడం ఆ దేవుడి తరం కూడా అయ్యేది కాదు. ఈ విధంగా ప్రతి సుల్తాన్ గాడికీ అఫీషియల్ గానే, కనీసం పాతికమంది నుండి ఏభై మంది సంతానం ఉండేవాళ్ళు. 

అందుకని ఒక సుల్తాన్ చనిపోతున్నాడు అనగానే, ఈ జనానాకు పుట్టిన కొడుకులందరూ 'తర్వాత సుల్తాన్ నేనంటే నేనని' కొట్టుకు చచ్చేవాళ్ళు. ఎవరి మనుషులను వాళ్ళు కూడగట్టుకుని యుద్ధాలు చేసేవాళ్ళు. ఔరంగజేబ్ చచ్చాక కూడా ఇదే గోల జరిగింది. ఈ అంతర్యుద్ధంలో తనకు సాయం చెయ్యమని గురు గోవింద్ సింగ్ ను కోరాడు ఔరంగజేబ్ కొడుకులలో ఒకడైన బహదూర్ షా. తను డిల్లీ సింహాసనం మీద కూచుంటే, సిక్కులను ఆదుకుంటాననీ, వాళ్ళను ఏమీ అనననీ, వాళ్ళ మీద ఉన్న ట్యాక్స్ లు తీసేస్తాననీ అబద్దాలు చెప్పి గురువును నమ్మించాడు. ఈ విధంగా గురు గోవింద్ సింగ్ సహాయంతో, సిఖ్ సైన్యం సహాయంతో. బహదూర్ షా డిల్లీ సింహాసనం ఎక్కాడు.

కానీ వాళ్ళ రక్తం ఎలాంటిది? వాళ్ళ మూలాలు ఎలాంటివి? అవి ఎడారి దోపిడీ జాతులలో ఉన్నాయి. వాళ్ళ పూర్వీకులందరూ అరేబియాలో ఎడారిదొంగలు. వాళ్లకు విశ్వాసం ఎలా ఉంటుంది? ఆడిన మాటను నిలబెట్టుకోవాలన్న సత్యసంధత ఎలా ఉంటుంది? దొరికింది దొరికినట్లు దోచుకోవాలనే వాళ్లకు అనిపిస్తుంది. అంతకంటే ఉన్నతమైన విలువలు వాళ్లకు ఎలా ఉంటాయసలు? అదే బహదూర్ షా కూడా చేశాడు. సింహాసనం ఎక్కాక, గురువు కిచ్చిన మాటను గాలికి ఒదిలేసి, తన ఇష్టానుసారం చెయ్యడం సాగించాడు. తన హామీల గురించి అడిగితే ఏమీ చెప్పకుండా మాట మార్చేసేవాడు. అంటే, గురువుకు నమ్మక ద్రోహం చేశాడు. గురువును చంపడానికి ఆఫ్గనిస్తాన్ నుంచి కిరాయి హంతకులను రప్పించింది కూడా బహదూర్ షానే.

ఈలోపల డెక్కన్ లో ( అంటే, సెంట్రల్ మహారాష్ట్రా, ఆంధ్రాప్రాంతంలో) తిరుగుబాటులు రేగాయి. డిల్లీలో పాలకులు బలహీనులు అయినప్పుడు దూరదూరంగా ఉన్న గవర్నర్లు స్వతంత్రం ప్రకటించుకునేవారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా ! అప్పుడూ అదే జరిగేది. అలాంటి తిరుగుబాటును అణచి వెయ్యడానికి బహదూర్ షా డెక్కన్ కు తన సైన్యంతో బయల్దేరాడు. అవసరమైతే తన సిఖ్ సైన్యంతో తనకు సాయం చెయ్యడానికి గురుగోవింద్ సింగ్ ను కూడా తన వెనుక రమ్మని అడిగాడు. సరేనన్నాడు గురువు. ఆ సందర్భంలోనే,  గురు గోవింద్ సింగ్ నాందేడ్ కు వచ్చాడు.

అలా తన సైన్యంతో వచ్చిన ఆయన విడిది చేసిన ప్రదేశమే ఈనాటి గురుద్వారా లంగర్ సాహిబ్. అది వాళ్లకు భోజనశాలగా ఉంది. అప్పట్లో అదంతా అడవిగా ఉండేది. ఇక్కడే తన సైన్యంతో కలసి గురుగోవింద్ సింగ్ భోజనం చేసేవాడు.

అసలీ లంగర్ అనే దాన్ని గురు నానక్ మొదలు పెట్టాడు. ఆయన బోధనలు వినడానికి దూరదూరాల నుంచి అనేక మంది వస్తూ ఉండేవారు. వాళ్లకు భోజనం పెట్టె క్రమంలో ఈ 'లంగర్' అనేది మొదలైంది. అప్పట్లో గురుపత్నులు స్వయంగా తమ చేతులతో వండి, దూరదూరాల నుండి వచ్చిన శిష్యులకు భోజనం పెట్టేవాళ్ళు.

రెండవ గురువైన గురు అంగద్ దేవ్ ఈ 'లంగర్' అనేదాన్ని బాగా అభివృద్ధి చేశాడు. తమ శిష్యులలో కులం, మతం, గొప్పా బీదా, ఆడా మగా అనే భేదాన్ని సిఖ్ గురువులు వద్దన్నారు. ఎవరైనా సరే, అందరూ ఒకే బంతిలో నేలమీద పక్కపక్కనే కూచుని తినాలని ఆయనే నియమం పెట్టాడు. ఇది శిక్కులు ఈనాటికీ పాటిస్తున్నారు.

అయితే, మూడవ గురువైన గురు అమర్ దాస్ ఈ లంగర్ అనే దానిని ఒక సంస్థాగతంగా వృద్ధి చేశాడు. ఆయన్ను దర్శించడానికి ఎవరు వచ్చినా సరే, ముందు 'లంగర్' (భోజనశాలలో) అందరితో బాటు నేలమీద కూచుని భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆయన దర్శనం ఇచ్చేవాడు. ముందు తిని తర్వాత తన దగ్గరకు రమ్మని ఆయన చెప్పేవాడు. ఇదే మాటను జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా చెప్పేవారు.

గురు అమర్ దాస్ దర్శనార్ధమై వచ్చిన అక్బర్ పాదుషా కూడా అందరితో పాటు కలసి, నేలమీద కూచుని భోజనం చేశాడు. ఆ తర్వాతనే ఆయనకు గురు అమర్ దాస్ దర్శనం ఇచ్చాడు. ఈ సహపంక్తిలో కులం, మతం. గొప్పా బీదా ఏవీ పాటించరు సిక్కులు. ఇది చాలా గొప్ప విషయం. గురు అమర్ దాస్ శాకాహారి. శిక్కులు యుద్దవీరులు కనుక వాళ్ళు మాంసం తింటారు. ఒక లంగర్ లొ మాంసాహారం పెట్టడం చూచి గురు అమర్ దాస్ నొచ్చుకున్నాడు. అందుకని ఆయనకు విడిగా చపాతీలు, పప్పు పెట్టమని ఆదేశించాడు గురు అంగద్. మిగతా అన్నిచోట్లా శాకాహారం వడ్డించినప్పటికీ, నేటికీ గురుద్వారా ఆనందపూర్ సాహిబ్ లొ మాత్రం మాంసాహారం వడ్డిస్తారు.

నాందేడ్ లోని ఇదే ప్రదేశంలో ఇదే లంగర్ ను ఎప్పటికీ కొనసాగించమని తన శిష్యులను ఆదేశించాడు గురు గోవింద్ సింగ్. కానీ కొంతకాలం తర్వాత ఆయన శిష్యులు దీనిని ఆపేశారు. దానికి కారణం, నిర్వహణకు డబ్బులేకపోవడం. లంగర్ గురించి పట్టించుకోకుండా, వాళ్ళు మిగతా గురుద్వారాలు కట్టడం వంటి ఇతర పనులు చెయ్యడం మొదలుపెట్టారు. అలా రెండు వందల ఏళ్ళు గడిచాయి.

1912 లొ నాందేడ్ గురుద్వారాను దర్శించదానికి వచ్చిన బాబా నిధాన్ సింగ్, తన తిరుగు ప్రయాణంలో నాందేడ్ రైల్వే స్టేషన్లో కూచుని ధ్యానంలో ఉండగా ఆయనకు గురు గోవింద్ సింగ్ దర్శనం కలిగింది. ఈ లంగర్ ను మళ్ళీ అభివృద్ధి చెయ్యమని గురు గోవింద్ సింగ్ ఆయనతో చెప్పాడు. 'దానికోసం బోలెడంత ధనం కావాలి? అది ఎలా వస్తుంది? అని బాబా నిధాన్ సింగ్ అడిగాడు. దానికి గురు గోవింద్ సింగ్ జవాబిస్తూ 'కిస్సా మేరా హాత్ తేరా' అని చెప్పాడు. అంటే - 'సంకల్పం నాది, చేతులు నీవి' అన్నాడు.

ఆ విధంగా నాందేడ్ రైల్వే స్టేషన్లో గురుదర్శనాన్ని పొందిన బాబా నిధాన్ సింగ్ తన తిరుగుప్రయాణం మానుకుని నాందేడ్ లోనే స్థిరపడ్డాడు. ఆయన చేసిన కృషి ఫలితంగానే, గురుద్వారా లంగర్ మళ్ళీ మొదలైంది. ఫండ్స్ వచ్చాయి, పని చేసేవాళ్ళు వచ్చారు. అన్నీ అభివృద్ధి అయ్యాయి. అప్పటినుంచీ నేటి వరకూ గురుద్వారా లంగర్ సాహిబ్ దినాదినాభివృద్ధిగా నిరాఘాటంగా నడుస్తూనే ఉంది. ఒక్క భోజన సమయంలోనే కాదు. రాత్రీ పగలూ ఏ సమయంలో ఎవరు వచ్చి అడిగినా ఇక్కడ భోజనం పెడతారు. 24 గంటలూ అందుకు కొందరు సిక్ఖులు సిద్ధంగా ఉంటారు. తన శిష్యులపైనే కాదు, మానవులందరి పైనా గురువులకున్న ప్రేమకూ, గురు అనుగ్రహానికీ సూచికగా అలాంటి మహత్తరమైన కార్యక్రమం అక్కడ జరుగుతోంది.

అందుకనే, నాందేడ్ లో ఈ గురుద్వారాకు వెళ్ళే మార్గంలోని చౌరస్తాకు 'సంత్ బాబా నిధాన్ సింగ్ జీ చౌక్' అనే పేరు మనకు కనిపిస్తుంది.

జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా 1950 ప్రాంతాలలో జిల్లెళ్ళమూడి కుగ్రామానికి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎవరు ఏ సమయంలో వచ్చినా తనే స్వయంగా అన్నం వండి వారికి భోజనం పెట్టేవారు. అదే ఈనాటికీ అక్కడ అన్నపూర్ణాలయంలో కొనసాగించబడుతోంది. నాందేడ్ లోని గురుద్వారా లంగర్ సాహిబ్ లో కూడా అదే జరుగుతున్నది.

శ్రీరామకృష్ణులు జీవించి ఉన్న సమయంలో నరేంద్ర, రాఖాల్, బాబూరాం, యోగిన్, శరత్, శశి మొదలైన అనేకమంది యువభక్తులు ఆయనకోసం వచ్చేవారు. శారదామాత వారందరికీ భోజనం వండి తన కన్నపిల్లలకు పెట్టినంత ప్రేమగా తినిపించేవారు. పైగా ఎవరెవరి జీర్ణశక్తికి తగినట్లుగా వారివారికి సరిపోయే ఆహారాన్ని తయారుచేసేవారు. నిజమైన మహనీయుల ప్రేమ అలా ఉంటుంది మరి !

ఆ అరుగుమీద చాలాసేపు కూచుని ఇదంతా ఆలోచించిన నేను మెల్లిగా లేచి హోటల్ వైపు నడక సాగించాను. దారిలో ఉన్న స్టాల్స్ నూ, మెడికల్ రిలీఫ్ క్యాంప్ నూ, హోటళ్ళనూ, పంజాబ్ నుంచి వరదలా బస్సులలో కార్లలో వస్తున్న సిక్కులనూ చూస్తూ నేను బస చేసిన హోటల్ వైపు నడక సాగించాను.




























































  
(ఇంకా ఉంది)