“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, జులై 2022, మంగళవారం

శభాష్ చైనా

శభాష్ చైనా !

ఏమాటకామాటే చెప్పుకోవాలి. చైనాను చూచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నిజానికి అనేక రంగాలలో చైనా మనకంటే 50 ఏళ్ళు ముందుకెళ్ళిపోయింది. అంగారకగ్రహం పైన చైనా తన రోవర్ ను దించి ఏడాది అవుతోంది. మనమేమో కనీసం చంద్రుడిని కూడా చేరుకోలేకుండా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి చైనా సాధించిన విజయాలు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందుకు కాదు.

నిన్న జిన్ జియాంగ్ ప్రావిన్స్ ను దర్శించిన ప్రెసిడెంట్ జిన్ పింగ్ ఒక గట్టి హెచ్చరికలాంటి ప్రకటనను చేశాడు. 'ఇస్లామనేది చైనాలో ఉండాలంటే చైనీయ పద్ధతిలో మాత్రమే ఉండాలి' అనేదే ఆ ప్రకటన. 'లేదంటే?' అనే మాటకు అక్కడ ఆస్కారం లేదు. 'లేదంటే, నువ్వుండవు' అని చైనా ప్రభుత్వం అంటుంది. అంతే ! అలా అయితేగాని అక్కడ పరిస్థితి అదుపులో ఉండదనేది చరిత్రనుంచి చైనా నేర్చుకున్న గుణపాఠం !

చైనాలోని వాయవ్యదిక్కులో ఉన్న ఈ  ప్రావిన్స్ లో ఊగిర్ ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్నారు. ఎక్కడైనా ముస్లిమ్స్ మెజారిటీగా ఉంటే ఏమౌతుందో చైనాలో కూడా అదే జరిగింది. ఇస్లామిక్ టెర్రరిజం మొదలు కాబోయింది. అది చైనాగాని ఇండియా కాదు కదా? ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. గట్టిచర్యలు తీసుకుంది. లక్షలాదిమంది ఊగిర్ ముస్లిమ్స్ ని  జైళ్లలాంటి క్యాంప్స్ లో పెట్టి, మంచి మసాలా ట్రీట్మెంట్ ఇచ్చి, వాళ్లకు ఎక్కిన ఇస్లామిక్ తీవ్రవాద పిచ్చిని వదిలించింది. లక్షలాది ఆడాళ్లకు ఫెమిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించింది. ప్రక్క ప్రావిన్స్ లో ఉన్న హాన్ తెగ ప్రజలను లక్షలాదిగా ఈ ప్రావిన్స్ కు తరలించింది. ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఈ విధంగా నీరుగార్చేసింది.

అమెరికా, బ్రిటన్, కెనడాలు 'చైనాలో మానవహక్కుల ఉల్లంఘన' అంటూ దుమ్మెత్తి పోశాయి. ఏ ఆసియా దేశమైనా ఎదుగుతుంటే అవి సహించలేవన్నది చరిత్ర చెబుతున్న నిజం. అందుకని వాళ్ళ కంట్రోల్లో ఉన్న UN వంటి సంస్థలను ఉసిగొలిపి చైనాను ఇబ్బంది పెట్టాలని చూశాయి.  కానీ చైనా ఎవరిమాటా వినలేదు. 'మా దేశపు సమస్యలను దిద్దుకోవడం మా ఇష్టం' అంది. 'బయటవాళ్ళు నోళ్లు మూసుకోండి' అంది. అనడమే కాదు, బయటవాళ్ళవీ, లోపలవాళ్ళనీ నోళ్లు మూయించింది.

నిన్న ప్రెసిడెంట్ జిన్ పింగ్ ఈ చక్కటి వార్ణింగ్ ఇచ్చాడు. 'ఇస్లాం లేదు ఏమీ లేదు. మీరు చైనాలో ఉండాలంటే, చైనీయులుగా ఉండాల్సిందే. వేరే దారి లేదు' అని నర్మగర్భంగా చెప్పాడు.

అందుకే అంటున్నాను, 'శబాష్ చైనా' అని.

ఈ విధంగా ఇండియా చెప్పగలదా? చెప్పలేదు. కారణం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థలు మాత్రమే. ఈ సంగతి చైనాకు కూడా తెలుసు. గతంలో ప్రెసిడెంట్ జిన్ పింగ్ అన్నాడు కూడా, 'ఇండియాలోని రాజకీయ వ్యవస్థ (పార్లమెంటరీ డెమోక్రసీ ) అనేదే దాని శాపం' అని.

చైనాలో ఒకటే పార్టీ. మనది బహుపార్టీ వ్యవస్థ. చైనాది నియంతృత్వం. మనది ప్రజాస్వామ్యం. చైనా రాజ్యాంగం మనలాగా కలగూరగంప కాదు. వాళ్లకు కావలసినది వాళ్ళు రాసుకున్నారు.  మనమేమో మనకు అక్కర్లేనివన్నీ కాపీ కొట్టి రాసుకున్నాం. అదే మన అభివృద్ధికి ప్రతిబంధకం కావడమేగాక, మన నాశనానికి వెసులుబాట్లను ఇస్తున్నది. రాజ్యాంగంలోని లొసుగులను వాడుకుని దేశద్రోహశక్తులు మనదేశంలో బలపడుతున్నాయి. చైనా చేసినట్లు వీటిని కట్టడి చేయడం ఇండియాకు చాలా కష్టంతో కూడుకున్న పని. కారణం? ఇక్కడి వ్యవస్థలో అన్నీ లొసుగులే.

అసలు మన రాజ్యాంగాన్ని అలా వ్రాయించడంలో బ్రిటిష్ వాళ్ళ లాంగ్ టర్మ్ కుట్ర ఉందన్నది నాకున్న సందేహం. కాశ్మీర్ ని ఎలా తయారుచేసి మనకంటించి పోయారో, ఇండియా పాకిస్తాన్ అంటూ రెండు దేశాలను తయారుచేసి కూడా, మళ్ళీ ముస్లీమ్స్ ని ఇక్కడ ఉంచి పోయారో. కుల, మత విభేదాలను నాయకులమధ్యలో రెచ్చగొట్టి పోయారో,  మన రాజ్యాంగాన్ని కూడా ఆ విధంగా వ్రాయించడంలో వాళ్ళ పాత్ర ఉన్నదని నా నమ్మకం. వాళ్ళే డైరెక్ట్ గా వ్రాయకపోయినా, వ్రాసిన వాళ్ళను ప్రభావితం చేయడానికి చాలా అవకాశాలున్నాయి.

ఆ రాజ్యాంగం ప్రకారం దిద్దబడిన మన వ్యవస్థ ఎలా తయారైందంటే, ఒక సమస్యకు చైనాలో అయితే ఒక ఏడాదిలో పరిష్కారం అయ్యేది ఇక్కడ ఏళ్లకేళ్లు పట్టినా అది పరిష్కారం కాదు. మౌలికమైన వ్యవస్థాగత లోపాలే దీనికి కారణం. చైనాలో లోపలిశత్రువులు లేరు. ఇండియాలో అడుగడుక్కీ వ్యతిరేకవాదులే. ప్రతి మంచిపనికీ అడ్డుపడేవాళ్ళే. 'అన్నిటికంటే దేశం గొప్పది' అనే భావన ఒక్క హిందువులలో మాత్రమే ఉండటం ఈ దేశపు దురదృష్టం.

జనాభాలో ప్రపంచ నెంబర్ 1 గా అతిత్వరలో మనమే మారబోతున్నాం. ప్రస్తుతం కాశ్మీర్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బెంగాల్, యూపీ, బీహార్, తెలంగాణ ఇలా చాలా రాష్ట్రాలలో ఇస్లామిక్ తీవ్రవాద ధోరణులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి వ్యవస్థతో, ఇలాంటి జనాభాతో, ఇండియా భవిష్యత్తు ఎలా ఉంటుంది? అన్నది ప్రశ్నార్ధకమే అయినప్పటికీ, ప్రస్తుతానికి ఈ సమస్యను వాళ్ళదైన శైలిలో డీల్ చేస్తున్నందుకు మాత్రం చైనాను  శభాష్ అనకుండా ఉండలేం.

మన శత్రువులో అయినా సరే, మంచిగుణం ఒకటి ఉన్నపుడు దానిని మెచ్చుకోవడం, అనుసరించడం ఉత్తమలక్షణం కదా మరి ! కానీ మెచ్చుకోవడం వరకూ సరే. అనుసరించాలంటే మన వ్యవస్థే మనకు అడ్డుగా ఉంది. అంతా మన రాజ్యాంగ కర్తల దూ ....... ర దృష్టి ఫలితం మరి !!!

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో??