“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, ఆగస్టు 2012, మంగళవారం

శనికుజుల యుతి - తగ్గుతున్న ప్రభావం

కుజుడు శనిని వదలి దూరంగా పోతున్నకొద్దీ ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వారు చూపిన దుష్ప్రభావాలు తగ్గిపోతున్నాయి. అలాగే అమావాస్య ప్రభావం కూడా తగ్గిపోయింది. కనుక ఇప్పుడు ఎక్కడా అన్నన్ని ఘటనలు జరగడంలేదు.చెదురుమదురుగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి.ఈ శీర్షికను ముగించబోయే ముందు  అవేమిటో ఒక్కసారి చూద్దాం.

సుడాన్ లో హెలికాప్టర్ కూలి అందులో ఉన్న 32 మంది మరణించారు. అందులో ఒక మంత్రి, ఒక రాజకీయ ప్రముఖుడూ, ఇద్దరు ఆర్మీ జేనేరల్స్, మీడియా వారూ ఉన్నారు.

జమ్మూ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యానికీ మనకూ మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అనకండి. ఈ సమయం లోనే ఇవి ఎందుకు తలెత్తాలి? ఎందుకు ఉధృతం అవ్వాలి?

హిమాచల్ ప్రదేశ్ లో భారీవర్షాలకు లాండ్ స్లైడ్ జరిగి కులూమనాలీ ప్రాంతంలో చాలా భాగాలు మూసుకుపోయాయి.

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లలో 5.0 స్థాయి భూకంపం వచ్చింది.

పైసంఘటనలు గమనిస్తే,గత మూడురోజులుగా కనిపిస్తున్న దుస్సంఘటనలు తీవ్రతలో క్రమంగా తగ్గిపోతున్నట్లు, దానిస్థానంలో చిన్న స్థాయి సంఘటనలు అక్కడక్కడా మాత్రమె జరుగుతున్నట్లు మనం గమనించవచ్చు. గ్రహప్రభావం భూమిమీద ఎలా ఉంటుందో గత నాలుగురోజులుగా జరుగుతున్న సంఘటనలు గమనిస్తే మనకు అర్ధమౌతుంది.