“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

4, ఏప్రిల్ 2011, సోమవారం

ఉగాది గ్రహస్తితులు-2011

పోయినేడాది వికృతి నామ సంవత్సరంలో ప్రకృతి వికృతిగా మారిఅల్లకల్లోలాలు సృష్టించింది. ఇప్పుడు ఖరనామ సంవత్సర ఉగాది వచ్చింది. ఏడాది ఖర నామ సంవత్సరంలో అందరివీ గాడిదబతుకులూ గాడిదచాకిరీ అవబోతున్నది. ప్రాచీనులు పేర్లను ఎంతపరిశీలనతో ఎంత రీసేర్చితో పెట్టారో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తం మీద పేర్లు సంవత్సరం లో జరుగబోయే సంఘటనలను సూచిస్తూ ఉంటాయి. ఇది చాలా సార్లు నిజం కావటం చూడవచ్చు.

సంవత్సరం
నిపిస్తున్న కొన్ని గ్రహయోగాలు ఏమంటే, మొదటగా, లగ్న దశమాధిపతి గా గురువు లగ్నంలో ఉన్నప్పటికీనవాంశలో నీచస్తితిలో ఉండటం వల్ల పాలకులు రుజుస్వభావంతో న్నట్లు కనిపించినప్పటికీ నిజానికి అలా ఉండరు. వారి అజెండావేరుగా ఉంటుంది.

రెండవది , కేంద్రాలన్నీ పాపాక్రాంతములు కావటం వల్ల సమాజంలోధర్మం అనేది అతి క్షీణ స్థాయిలో ఉంటుంది. ప్రతివారూ చెప్పేదొకటిచేసేదొకటిగా వ్యవహారం నడుస్తుంది. అవినీతి తారాస్తాయికి చేరుతుంది. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి ఏవో గుడిసెలు అన్నట్లు ప్రజల ప్రవర్తనఉంటుంది. దేవుడు మన చేతిలో కీలుబొమ్మ, నిత్య జీవితంలో మన ప్రవర్తనలు ఎలాఉన్నా పరవాలేదు, శనివారంనాడు దీపం పెట్టి కొబ్బరికాయ కొడితే చాలు అన్న అజ్ఞానధోరణి ప్రజల్లో ప్రబలుతుంది. కలిధర్మం విశ్వరూపం దాలుస్తుంది.

మూడవది, చతుర్ధ సప్తమాదిపతిగా బుధుని నీచ స్తితి వల్ల సుఖ సంతోషాలు లోపిస్తాయి. కాని శుక్రుని ద్వాదశస్తితివల్ల అక్రమార్జనలు, రహస్య ఆస్తులు, అక్రమ సంబంధాలు ఊపందుకుంటాయి.

నవమాధిపతి కుజుని లగ్నస్తితివల్లా, నవాంశలో బుధ క్షేత్రం లో ఉన్నందువల్లా, మతసంబంధ విషయాలలో వితండ వాదాలు, మోసపూరిత ప్రవర్తనలు ఉంటాయి. గుళ్ళూ, చర్చిలూ, మసీదులూ కిటకిట లాడుతుంటాయి. కాని ఎవ్వరిలోనూ నీతి అనేది ఉండదు. వ్యక్తిగతజీవితానికీ నిజమైనమతానికీ మధ్యన అగాధం ఏర్పడుతుంది.

మొత్తం మీద చెప్పుకోటానికి పెద్ద గొప్పగా ఏమీ లేదు. పాలకులూ ప్రజలూ దొందూ దొందే "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అన్నట్లుగా పరిస్తితి ఉంది.