శ్రీవిద్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీవిద్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జులై 2016, మంగళవారం

శ్రీవిద్యా రహస్యం E Book ఈరోజు రిలీజైంది

నాచే వ్రాయబడిన 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకం రిలీజై ఒకటిన్నర ఏళ్ళయింది. అప్పటినుంచీ చదివిన ప్రతివారినీ ఇది మంత్రముగ్ధులను చేసింది.ఇంకా చేస్తున్నది.ఇది చదివి ఎందఱో నాకు అభిమానులుగా మారారు.చాలామంది శిష్యులుగా మారి నిజమైన ఆధ్యాత్మిక పధంలో నడుస్తున్నారు.అయితే, ఈ పుస్తకాన్ని E Book రూపంలో కూడా విడుదల చెయ్యమని చాలామంది చాలారోజులనుంచీ నన్ను కోరుతున్నారు. ఆపని ఇప్పటికి అయింది.

తిధుల ప్రకారం ఈరోజు నా పుట్టినరోజు గనుక నేటి రోజున శ్రీవిద్యారహస్యం E Book రిలీజ్ చేస్తున్నాను. Google play books నుంచి "ఈ పుస్తకాన్ని" పొందవచ్చు. సైడ్ బార్ లో వస్తున్న పుస్తకం బొమ్మ మీద క్లిక్ చేసి కూడా ఈ పుస్తకాన్ని పొందవచ్చు.

పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించుకోలేని దూరదేశాలలో ఉన్న వారికి 'E - Book' చాలా ఉపయోగంగా ఉంటుంది.

త్వరలో 'తారాస్తోత్రం', 'లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక', 'దక్షిణేశ్వర మహాత్యం, 'శ్రీరామకృష్ణ సుధాలహరి', '300 Live Charts-Astro analysis in a most comprehensive way' మొదలైన నా మిగిలిన పుస్తకాలు కూడా 'ఈ బుక్స్' గా విడుదల చేస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
read more " శ్రీవిద్యా రహస్యం E Book ఈరోజు రిలీజైంది "

5, జూన్ 2015, శుక్రవారం

'తారాస్తోత్రమ్' - పుస్తకం ఆవిష్కరింపబడింది











'తారా స్తోత్రమ్' పుస్తకావిష్కరణ నిన్న విజయవాడ కనకదుర్గమ్మవారి సన్నిధిలో నిరాడంబరంగా జరిగింది.

కనకదుర్గమ్మ నిజానికి తారాదేవి రూపమే అని నా నమ్మకం.ఎందుకంటే చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ మన దేశాన్ని దర్శించినప్పుడు ఆయనకు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండమీద పెద్ద వెలుగు కనిపించిందని వ్రాశాడు.ఆ వెలుగు తారాదేవి యొక్క తేజస్సని  ఆయన అన్నాడు.

అందుకే తారాదేవి అనుగ్రహ ప్రవాహమైన ఈ పుస్తకాన్ని అమ్మ సన్నిధిలో అతి నిరాడంబరంగా ఆవిష్కరణ జరిపాను.పుస్తకాల కట్టను అమ్మ పాదాలవద్ద ఉంచి ఆ తర్వాత మా అబ్బాయి మాధవ్ చేతులమీదుగా పుస్తకావిష్కరణ జరిపాము.తను రెండువారాల సెలవులో ఇండియా వచ్చాడు.మళ్ళీ రెండురోజుల్లో డెట్రాయిట్ వెడుతున్నాడు.అందుకని తన ద్వారా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

పంచవటి ప్రచురణల నుంచి వెలువడిన రెండవ పుస్తకం ఇది.

మూడవ పుస్తకంగా- 'దక్షిణేశ్వర వైభవమ్-ఒంటిమిట్ట కోదండ రామస్తుతి'-త్వరలో రాబోతున్నది.

ఆ తర్వాత నాలుగో పుస్తకంగా--ప్రపంచ జ్యోతిష్య సాహిత్య చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోబోతున్న-Three Hundred Live charts-Exhaustive analysis of relevant Bhavas'- అనే అద్భుతమైన పుస్తకం - మూడువందల జాతకచక్రాల విశ్లేషణలతో ఇంగ్లీషులో రాబోతున్నది.

పుస్తకాలను అమ్మ పాదాల వద్ద ఉంచిన తర్వాత, కనకదుర్గమ్మ మెడలో ఉన్న దండను తీసి అర్చకులు నా మెడలో వెయ్యడం మరపురాని అనుభూతిని కలిగించింది.అమ్మ అనుగ్రహంగా దీనిని స్వీకరించాను.


ఈ సందర్భంగా పంచవటి సభ్యులకు,నా బ్లాగ్ చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను.

హుటాహుటిన రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి వచ్చి మాతో పాటు రోజంతా తిరిగి ద్వారకా తిరుమల,విజయవాడలలో కార్యక్రమం అంతా మాతో పాటు ఉన్న పంచవటి ట్రస్ట్ P.R.O రాజూ సైకం కు కృతజ్ఞతలు.

పుస్తకావిష్కరణ కోసం కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన మైధిలీరాం దంపతులకు,ముఖ్యంగా పబ్లిషర్ దగ్గర కూర్చుని మరీ సమయానికి పుస్తకాలను వచ్చేలా చేసి,ఆ తర్వాత మాకందరికీ ఉపాహారం అందించి,బిజీ షెడ్యూల్ తో కూడిన రోజు తర్వాత, రాత్రికి వంట చేసుకునే బాధను తప్పించిన మిసెస్ మైథిలీరాం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
read more " 'తారాస్తోత్రమ్' - పుస్తకం ఆవిష్కరింపబడింది "

27, మే 2015, బుధవారం

'తారా స్తోత్రమ్' పుస్తకావిష్కరణ


'పంచవటి ప్రచురణ'ల నుంచి వెలువడుతున్న రెండవపుస్తకం 'తారా స్తోత్రమ్' .ఈ పుస్తకావిష్కరణ జూన్ మొదటి వారంలో ఆన్ లైన్లో జరుగుతుంది.ఆ తర్వాత 'pustakam.org' లో ఆన్ లైన్లో లభ్యమౌతుంది.

దశమహావిద్యలలో ఒక దేవత ఐన తారాదేవిని ప్రార్ధిస్తూ ఆశువుగా చెప్పబడిన 108 పాదములతో కూడిన 27 సంస్కృత శ్లోకములూ,వాటి అర్ధమును వివరిస్తూ వచ్చిన 260 తెలుగు ఆశుపద్యములూ,వాటి వచన తాత్పర్యమూ ఈ పుస్తకంలో ఉన్నాయి.

నిగూఢములైన తంత్ర సాధనా రహస్యములను తనలో పొందుపరచుకున్న ఈ పుస్తకం కూడా 'శ్రీవిద్యా రహస్యం' వలెనే సాధకలోకాన్ని రంజింపజేస్తుందని, అంతరిక పధగాములైన సాధకులకు చక్కని మార్గదర్శనం గావిస్తుందని ఆశిస్తున్నాను.
read more " 'తారా స్తోత్రమ్' పుస్తకావిష్కరణ "

30, డిసెంబర్ 2014, మంగళవారం

పుస్తకావిష్కరణ సభ జయప్రదంగా ముగిసింది- ఒక నూతనాధ్యాయం మొదలైంది

28.12.2014 న తలపెట్టిన 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకావిష్కరణ సభ దిగ్విజయంగా ముగిసింది.

జగన్మాత అనుగ్రహంతో వెలుగుచూచిన ఈ పుస్తకం అమ్మ(దుర్గమ్మ) పాదాల చెంత,కృష్ణాతీరంలో విజయవాడలో ఆవిష్కరింప బడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఉదయం 10.30 ప్రాంతంలో మొదలైన సభ దాదాపు మధ్యాన్నం 1.30 ప్రాంతంలో వందన సమర్పణతో ముగిసింది.

దాదాపుగా 60 మంది ఈ సభకు వచ్చారు.వారిలో విజయవాడ వాస్తవ్యులే గాక,హైదరాబాద్,అనంతపూర్,బెంగుళూరు,ఒంగోలు,తిరుపతి,విజయనగరం,విశాఖపట్నం మొదలైన దూరప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.అమెరికా నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు.

ఆహూతులందరూ దాదాపు 3 గంటలపాటు కదలకుండా నిశ్శబ్దంగా ఉండి కార్యక్రమాన్ని ఆసాంతమూ ఆస్వాదించారు.

మహాలక్ష్మీ పబ్లికేషన్స్ విశ్వమోహన్ గారి మాటల్లో చెప్పాలంటే -' ఇంత క్రమశిక్షణతో జరిగిన పుస్తకావిష్కరణ సభను నేను ఇంతవరకూ చూడలేదు.ఎన్నో ఫంక్షన్స్ నేను చూచాను.పుస్తకావిష్కరణ అయిపోవటం తోనే అందరూ లేచి వెళ్ళిపోతారు.కానీ మీ ఫంక్షన్ లో మాత్రం పుస్తకావిష్కరణ తర్వాత కూడా ఇంకొక రెండుగంటల పాటు అంత శ్రద్ధగా కూచుని మీ ఉపన్యాసం విన్నారంటే  చాలా వింతగా ఉన్నది.మిగిలిన ఫంక్షన్స్ లో వాలంటీర్స్ ను పెట్టి చెప్పిస్తాము మొబైల్స్ ఆఫ్ చెయ్యండి.మౌనంగా ఉండండి.అని.కానీ ఈ కార్యక్రయంలో ఎవరికీ ఏమీ చెప్పవలసిన పని లేకపోయింది.ఎవరికి వారే ఎంతో సెల్ఫ్ డిసిప్లిండ్ గా ఉన్నారు." అని ఆయన అన్నారు.

'వీళ్ళు మామూలు ఆడియన్స్ కారు.ఈ సబ్జెక్ట్ మీద ఎంతో శ్రద్దతో,ఆధ్యాత్మికత అంటే తపనతో,అమ్మ మీద నమ్మకంతో వచ్చినవారు.అందుకే వారు అంత ఓపికగా అన్ని గంటలు కూర్చున్నారు.అంత డిసిప్లిన్ గా ఉన్నారు.' అని నేను చెప్పాను.

నేను దాదాపు ఒక గంటన్నర పైనే మాట్లాడాను.నా ఉపన్యాసంలో 'శ్రీవిద్యోపాసన' గురించీ ఈ పుస్తకం ఎలా ఉద్భవించింది అన్న విషయం గురించీ వివరంగా మాట్లాడాను.

శ్రోతలను నా ఉపన్యాసం రంజంపచేయగలిగింది అనే నేను అనుకుంటున్నాను.

ఫంక్షన్ అయిపోయిన తర్వాత,వచ్చిన వారందరూ నన్ను కలిసి మాట్లాడారు. వేదాంతం గురించి,తంత్రసాధన గురించి అడిగిన వారు కొందరైతే,జ్యోతిష్యం గురించి,ఈతిబాధల గురించి,రోగబాధల గురించి అడిగినవారు కొందరు.ఎవరికి కావలసిన పరిష్కారం వారికి చూపబడింది.అక్కడ మాట్లాడలేని వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అనుకున్న వారికి నా ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో పాల్గోన్నవారివి చాలామందివి అడ్రసులూ ఫోన్ నంబర్లూ సేకరించడం జరిగింది.కానీ ఇంకా కొందరి వివరాలు దొరకలేదు.కనుక వారందరికీ నా అభ్యర్ధన ఏమంటే,పుస్తకం మీద నా ఫోన్ నంబర్ ఉన్నది,ఇక్కడ కూడా ఇస్తున్నాను గనుక,ఈ పుస్తకం మీద మీమీ అభిప్రాయాలనూ సూచనలనూ,అలాగే ఈ ఫంక్షన్ ఎలా జరిగింది అన్నదానిమీద మీమీ అభిప్రాయాలనూ,ఇంకా మీమీ వ్యక్తిగత సమస్యలనూ,మీరు అడగాలనుకుని అడగలేక పోయిన విషయాలనూ,తరువాత మీకు గుర్తొచ్చిన విషయాలనూ, నాకు ఫోన్ ద్వారా తెలియజెయ్యండి.

నేనేదో బిజీగా ఉంటానని,మీరు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నామనీ అనుకోకండి.సిన్సియర్ గా మీరు అడిగితే మీమీ సందేహాలను తీర్చడానికి (అది అర్ధరాత్రి అయినా,అపరాత్రి అయినా సరే) నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానన్న విషయం గమనించండి.

ఇంకొక్క ముఖ్య విషయం:--

ఈ కార్యక్రమంలో పాల్గొని 'శ్రీవిద్య' మీద నా ఉపన్యాసాన్ని విన్న చాలామంది దీక్ష ఇవ్వమనీ వారికి మార్గనిర్దేశనం చెయ్యమనీ వారిని ఆధ్యాత్మిక పధంలో ప్రాక్టికల్ గా నడిపించమనీ అడిగారు.

ఈ అభ్యర్ధనకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.

నావద్ద దీక్ష తీసుకోవాలని అనుకునేవారు ఎటువంటి సంకోచాలూ పెట్టుకోకుండా నన్ను సంప్రదించండి.ఎవరెవరి కోరికలను బట్టి,సంస్కారాలను బట్టి,అంతరిక శక్తిని బట్టి,అర్హతను బట్టి వారివారికి దీక్ష ఇవ్వబడుతుంది.నా వద్ద దీక్షాస్వీకారం చేసిన,చెయ్యబోతున్న గ్రూపు సభ్యులతో కలసి అతిత్వరలో 'సాధనా సమ్మేళనాలు' జరుపబడతాయి.

ఆ సమ్మేళనాలలో -- శుద్దమైన నిజమైన ఆధ్యాత్మిక సాధనను వారిచేత దగ్గరుండి చేయించడం, వారి సందేహాలను తీర్చడం,వారిని సత్యమైన ఆధ్యాత్మికమార్గంలో ప్రాక్టికల్ గా ముందుకు నడిపించడం జరుగుతుంది.దీనికి కులంతోనూ మతంతోనూ వయస్సుతోనూ ప్రాంతంతోనూ సంబంధం లేదు.

హృదయపూర్వకమైన 'తపన' ఒక్కటే నిజమైన అర్హత.

ఇన్నాళ్ళూ విషయాలను స్థూలంగా వివరించడం మాత్రమే జరిగింది. ఇకనుంచి వాటిని ప్రాక్టికల్ గా ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి?అంతరిక యోగసాధన ఎలా చెయ్యాలి?జీవితాన్ని ఎలా సఫలం చేసుకోవాలి? అనే విషయాన్ని ప్రాక్టికల్ గా నేర్పించడం జరుగుతుంది.

అంతేగాక,జ్యోతిష్యవిద్యార్ధులకు ఆసక్తి ఉన్నవారికి Astrology workshops నిర్వహించి రెండు దశాబ్దాల సాధనా ఫలితంగా నేను తయారు చేసుకున్న నా ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణా విధానాన్ని నేర్పించడం కూడా ముందు ముందు జరుగుతుంది.

ఇది పుస్తకం మీద కూడా ఉన్నది.సాధనా మార్గంలో నా మార్గనిర్దేశనం కావలసినవారు,శ్రద్ధ ఉన్నవారు సంప్రదించవచ్చు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్నెన్నో పనులను మానుకొని దూరాభారాన్ని లెక్కచెయ్యకుండా వచ్చి దీనిని జయప్రదం చేసిన అందరికీ మళ్ళీ ఈ బ్లాగుముఖంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీరు చూపించిన గౌరవానికీ మీ అభిమానానికీ నా ప్రతిస్పందనను నేను మాటలలో చెప్పలేను.

నాతో వ్యక్తిగత పరిచయాన్ని పెంచుకోవాలనీ,నిజమైన ఆధ్యాత్మిక రహస్యాలను గ్రహించాలనీ,ఆ మార్గంలో ముందుకు నడవాలనీ అనుకునేవారిని "పంచవటి గ్రూపు" లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. 

కావలసినవారు నాకు 'ఈ మెయిల్' చేస్తే వారికి గ్రూప్ యాక్సెస్ ఇస్తాను.

మరొక్క విషయం:--

కార్యక్రమానికి వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చెయ్యాలన్న మా కోరిక పూర్తిగా తీరలేదు.దానికి కారణం ఆ ఫంక్షన్ హాలు వారు అక్కడ భోజనాలు చెయ్యడానికి అనుమతించకపోవడమే.కనుక దూరంగా ఉన్న శ్రీ మైథిలీ రాం గారి ఇంటిలో భోజన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది.దూరం గనుక అక్కడకు రాలేక పోయినవారిని, మమ్మల్ని మన్నించమని  ఈ సందర్భంగా కోరుతున్నాను.

ముందు ముందు రాబోయే మరిన్ని పుస్తకావిష్కరణ సభలలో ఈ లోపాన్ని దిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది.

ధన్యవాదాలతో,

మీ 

సత్యనారాయణ శర్మ
read more " పుస్తకావిష్కరణ సభ జయప్రదంగా ముగిసింది- ఒక నూతనాధ్యాయం మొదలైంది "

24, డిసెంబర్ 2014, బుధవారం

ఆహ్వానం


read more " ఆహ్వానం "

19, డిసెంబర్ 2014, శుక్రవారం

28-12-2014 ఆదివారం - 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకావిష్కరణ

ఆంధ్రదేశానికి,తెలుగు ప్రజలకు,ఒక అద్భుతమైన కానుక.

తెలుగుపద్య సాహిత్య చరిత్రలోనూ,ఆధ్యాత్మిక చరిత్రలోనూ,శుద్ధ శ్రీవిద్యాసాంప్రదాయం లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన.

చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంఘటన.
జగజ్జనని అనుగ్రహంతో ఎట్టకేలకు సాకారం కానున్నది.

రాబోయే ఎంతోకాలంపాటు అటు ఆధ్యాత్మికరంగంలోనూ ఇటు సాహిత్యరంగంలోనూ ధృవతారగా నిలిచి ఉండి,ఎంతమంది చేతనో చదవబడుతూ,ఎంతమంది జీవితాలనో దివ్యత్వంతో వెలిగించబోయే అద్భుతమైన ఆధ్యాత్మికగ్రంధం 'శ్రీవిద్యారహస్యమ్' వెలుగు చూడబోతున్నది.

1200 పైగా తెలుగు పద్యాల ద్వారా,వాటి వివరణద్వారా,శుద్ధ శ్రీవిద్యోపాసన ఎలా ఉంటుందో,ఈ ఉపాసనకు గల తాంత్రిక మూలములు ఏమిటో,దానికి గల వేదప్రామాణికత ఏమిటో,ఈ గ్రంధంలో అత్యంత సరళమైన వ్యావహారిక భాషలో వివరించబడింది.అంతేగాక,నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంటుంది?దానికి కావలసిన అర్హతలు ఏమిటి? దానిని చేసే విధానాలు ఎలా ఉంటాయి?దాని పరమ గమ్యం ఏమిటి?దానిని ఎలా సాధించాలి?మొదలైన అనేక విషయాలు కూడా సందర్భోచితములుగా వివరించబడ్డాయి.

28-12-2014 ఆదివారంనాడు విజయవాడలో 'శ్రీవిద్యారహస్యమ్' గ్రంధావిష్కరణ జరుగుతుంది.అందరికీ అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఆదివారంనాడు పెట్టుకోవడం జరిగింది.

ఆ తర్వాత, జనవరి 1 నుంచి 10 వరకు విజయవాడ P.W.D గ్రౌండ్స్ లో జరుగబోయే 'పుస్తక మహోత్సవం (Book Exhibition)' లోని 'శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పోరేషన్' వారి స్టాల్లో ఈ పుస్తకం లభ్యమౌతుంది.

దూరప్రాంతాలలో ఉన్నవారికోసం ఈ పుస్తకం ఆన్ లైన్ లో కూడా లభ్యమౌతుంది.'కినిగే' వారితోగానీ,ఇతర ఆన్ లైన్ బుక్ ప్రొవైడర్స్ తో గాని అనుసంధానం అవ్వడం ద్వారా ఈ సౌకర్యం కల్పించబడుతుంది.ఆ పని జరుగుతున్నది.

నా శిష్యులను,అభిమానులను,నా బ్లాగు పాఠకులను,నన్ను కలవాలని అనుకునే అందరినీ ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను.నాతో ముఖాముఖీ మాట్లాడాలనుకునే వారికి,సందేహాలు తీర్చుకోవాలనుకునేవారికి ఇదే నా స్వాగతం.

చాలామంది నన్ను ఎప్పటినుంచో అడుగుతున్నారు.మీ 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకం రిలీజ్ చేసేది ఎప్పుడో చెప్పండి? అని.

అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆలస్యం అవుతూ వస్తున్నది.అందుకే అడిగినవారికందరికీ 'ఒకవారం ముందుగా చెప్తాను' అని చెబుతూ వస్తున్నాను.చెప్పిన విధంగా ఒక వారం ముందుగా బ్లాగుముఖంగా ఈ సభను ఎనౌన్స్ చేస్తున్నాను.

ఆ రోజున-'శ్రీవిద్యోపాసన' గురించి,ఈ పుస్తకం గురించి,నా ఉపన్యాసం ఉంటుంది.అలాగే,ఆధ్యాత్మిక రంగంలో అనుభవజ్ఞులైన మిత్రులు మరికొందరు కూడా మాట్లాడతారు.ఈ సభకు రాలేని వారికోసమై,మరియు విదేశాలలో ఉన్న నా అభిమానుల కోసమై,సభాకార్యక్రమం వీడియో అంతా ఈ బ్లాగ్లో కాలక్రమేణా అప్ లోడ్ చెయ్యబడుతుంది.

తేదీ
28-12-2014 (ఆదివారం)

సమయం
ఉదయం 10.00 గంటలకు.

పుస్తకావిష్కరణ వేదిక
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అసోసియేషన్ హాల్
అంజనం బిల్డింగ్
సివిల్ కోర్టుల ఎదురుగా
గవర్నర్ పేట.
విజయవాడ.

అందరూ ఆహ్వానితులే.
read more " 28-12-2014 ఆదివారం - 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకావిష్కరణ "

12, ఆగస్టు 2014, మంగళవారం

తొలగింపబడిన 'శ్రీవిద్య' పోస్ట్ లు

ఇన్నాళ్ళూ 'శ్రీవిద్య' అనే భాగంలో 51 పోస్ట్ లు నా బ్లాగులో ఉన్నాయి.

వచ్చే నెలలో కొద్ది మార్పులు చేర్పులతో 'శ్రీవిద్య' పుస్తకంగా మార్కెట్లోకి రాబోతున్నది.

కనుక ఆ విభాగంలోని పోస్ట్ లు అన్నింటినీ బ్లాగునుంచి తొలగించడమైనది.

చదువరులు గమనించగలరు.
read more " తొలగింపబడిన 'శ్రీవిద్య' పోస్ట్ లు "