“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, జులై 2023, సోమవారం

కాశీలో ఆరు నెలలు - చేదు సత్యాలు

నిన్న ఒక పాత ఫ్రెండ్ నుంచి ఫోనొచ్చింది.

కుశల ప్రశ్నలయ్యాక, 'మీ బ్లాగ్ చూస్తున్నాను' అన్నాడు, అదేదో నన్నుద్ధరిస్తున్నట్టు.

'అది నీ అదృష్టం' అన్నాను తడుముకోకుండా.

హర్టయ్యాడు. బిస్కెట్  పని చెయ్యలేదుగా మరి?

'ఆరు నెలలు కాశీలో ఉండి ఈ మధ్యనే తిరిగొచ్చాము నేనూ నా భార్యా' అన్నాడు, అలాగైనా మెచ్చుకుంటానేమో అని !

'ఎందుకెళ్ళావు? ఎందుకు తిరిగొచ్చావు?' అన్నాను.

'అక్కడే చనిపోతే మోక్షం కదా? అందుకెళ్లాను. ఉండలేక తిరిగొచ్చాను' అన్నాడు.

'ఏం మోక్షం అంటే ముఖం మొత్తిందా? తిరిగొచ్చావ్' అడిగాను నవ్వుతూ.

కంగారు పడ్డాడు. 

'ఆబ్బే అదికాదు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముందు అర్ధం కాదు. వెళ్లిన తర్వాత అర్ధమౌతుంది. ఏదో రెండ్రోజులు వెళ్ళొస్తే బానే ఉంటుంది. ఆరు నెలలో ఏడాదో ఉండాలని వెళితే మాత్రం అప్పుడు తెలుస్తుంది. అక్కడ నీళ్లు తిండి పడక సిక్కై  పోయాము ఇద్దరమూ' అన్నాడు.

'అవును. ఇంకోటి కూడా ఉంది' అన్నాను.

'ఏమిటది?' అన్నాడు.

'ఎవరైనా ముందుగా చెబితే అర్ధం కాదు. అనుభవిస్తేనే తెలుస్తుంది ఏదైనా' అన్నాను.

'అంతేలే' అన్నాడు ఇంకేమీ అనలేక.

గత పదేళ్లుగా నేను ఏదైతే చెబుతున్నానో అది తిరిగి నాకే వల్లిస్తున్నాడు అనుభవంతో.

ఇంకొక బిస్కెట్ వేద్దామని అనుకున్నాడో ఏమో, 'మీ ఆశ్రమం వివరాలు చూస్తున్నాను. అక్కడకొకసారి వచ్చి చూద్దామని ఉంది. కానీ రాలేక పోతున్నాను. మా ఆవిడకు హెల్త్ బాగోదు. ఆవిడను డాక్టర్ల చుట్టూ తిప్పడం, మందులు తెచ్చివ్వడమే సరిపోతోంది. రిటైర్ అయ్యాక  ఏదో చేద్దామని అనుకున్నాను. కానీ ఏదీ సాగడం లేదు' అన్నాడు.

అలలు ఆగాక స్నానం చేద్దామంటే సముద్రంలో అలలెప్పుడు ఆగుతాయి?

ముసుగులో గుద్దులాట ఎందుకని, 'నువ్వు మా ఆశ్రమం చూట్టానికి రావద్దు' అన్నాను డైరెక్ట్ గా.

మళ్ళీ హర్టయ్యాడు, 'అదేంటి అలా అంటున్నావ్?' అడిగాడు కొంచం కోపంగా.

'అవును మరి. ఇక్కడ మినిమమ్ సౌకర్యాలు కూడా ఉండవు. నువ్వు నిరాశపడతావు. పొద్దున్నే చెంబు తీసుకుని పొలాలలోకి వెళ్ళాలి. అలా ఉంటుంది. పైగా, కాశీలో ఆర్నెల్లు ఉండి వచ్చావు. ఏం ఒరిగింది? మా ఆశ్రమానికి వచ్చినా అంతే. వస్తావు. నీ బురదను నాకు అంటిస్తావు. ఉన్నంతసేపు రాజకీయాలు, సోది గాసిప్ మాట్లాడతావు. ఒక్కరోజుకే నీకు విసుగు పుడుతుంది. నిన్ను భరించలేక, పది నిముషాలకే నాకు విసుగు పుడుతుంది. వస్తావు పోతావు. ఏమీ అందుకోలేవు. ఇంకెందుకు రావడం?' అన్నాను.

తను పిచ్చోడేమీ కాదు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ లో మంచి పొజిషన్ లోనే రిటైరయ్యాడు. ఇలా కాదని ఇంకో రూట్లో కొచ్చాడు.

'మరి నీ ఆశ్రమం ఎందుకు పెట్టావో అసలు? అన్నాడు.

మనమేమీ తక్కువ తినలేదుగా !

'అది నీలాంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం పెట్టలేదు. బ్లాక్ మనీ బాగా మూలుగుతున్న బ్లాక్ క్యాట్స్ కోసం  పెట్టాను. ఎవడైనా రాజకీయ నాయకుడు దొరుకుతాడేమో అతనికి బినామీగా అండర్ గ్రౌండ్ లో బంగారం స్టాక్ చేద్దామని పెట్టాను' అన్నాను.

మా ఫ్రెండ్ గతంలో సత్యసాయికి వీరభక్తుడు !

అప్పుడు తగ్గాడు.

'మరి నా గతేంటి? ఈ జీవితం ఇంతేనా?' అన్నాడు.

'ఇంతగాక, మళ్ళీ యవ్వనం తిరిగొస్తుందని అనుకుంటున్నావా? అలాంటివేవీ జరగవు. కావాలంటే ఊరకాకి లేహ్యం వాడుకో' అన్నాను నవ్వుతూ,

'ఛ అదికాదు, ఆధ్యాత్మికంగా ఇంతేనా అని అడుగుతున్నాను' అన్నాడు.

'ఇంతగాక ఇంకేముంటుంది? నీ జీవితమంతా డబ్బు, ఆస్తులు, ప్రమోషన్లు అంటూ బ్రతికి, ఇప్పుడు అరవై దాటాక 'నా ఆధ్యాత్మిక జీవితం ఇంతేనా? నా గతేంటి?' అంటూ నంగినంగి మాటలు మాట్లాడితే ఉపయోగమేముంటుంది? నీ జీవితమంతా ఏం చేశావో అదే నీకిప్పుడు  మిగులుతుంది. కొత్తగా ఏమీ రాదు. కాశీలు రామేశ్వరాలు తిరుగు, వద్దనను. కానీ అవి వేరు. ఆధ్యాత్మికం వేరు. ఆధ్యాత్మికం చిన్నతనంలోనే ఉండాలి. ముదిరాక రమ్మంటే రాదు. ఇప్పుడు నువ్వేమీ చెయ్యలేవు. ప్రస్తుతం మీ ఆవిడకు సేవ చెయ్యి. ఆ  తరువాత నువ్వూ మూలపడతావు. అప్పుడు నీకు నువ్వే సేవలు చేసుకో. లేదా వృద్ధాశ్రమంలో చేరు. అన్నీ సక్రమంగా ఉంటే,  వచ్చే జన్మలో చూద్దాం. ఇంతకంటే ఎక్కువ  ఆశించకు. ఈ జన్మకింతే' అన్నాను.

'అదేంటి అంత ఘోరంగా మాట్లాడుతున్నావ్?' అన్నాడు.

'ఉన్నమాట చెబితే అలాగే ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు లైఫంతా బ్రతికి చివర్లో కాశీలో సెటిలై మోక్షం కొట్టేద్దామనుకుంటే, ఈశ్వరుడేమీ తెలివిలేనివాడు కాదు. ఆశకైనా అంతుండాలి' అన్నాను.

'మరిప్పుడు నన్నేం చెయ్యమంటావో చెప్పు. నువ్వు చెప్పినట్టే చేస్తాను' అన్నాడు చివరికి.

'నేను చెప్పనూ అక్కర్లేదు. నువ్వు చెయ్యనూ అక్కర్లేదు. అరవై దాటాక నువ్వు చేసేదేముంది చెక్కభజన? నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. ఆశ్రమానికి మాత్రం రావద్దు.  నన్ను డిస్టర్బ్ చెయ్యద్దు' అనేశాను.   

మా ఇద్దరి పరిచయం ఇప్పటిది కాదు. నలభై ఏళ్ల నాటిది. నా కాలేజీ రోజుల నుంచీ మాకు పరిచయం ఉంది. నా ధోరణి అప్పటినుంచీ అతనికి తెలుసు. కానీ పట్టించుకునేవాడు కాదు. నా వ్రాతలు మాత్రం గత పదేళ్లనుంచీ చదువుతున్నాడు. ఇప్పుడేమో ఇలా అడుగుతున్నాడు. ఇలాంటివాళ్లకు ఇంతకంటే   ఏం చెప్పాలి?

'చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే. ప్రస్తుతం నువ్వేమీ చెయ్యలేవు. మీ ఆవిడకు సేవ చేసుకో.  నీ ఆరోగ్యం చూసుకో. మిగతా టైం ఎలాగూ యూ ట్యూబ్ లోనే ఉంటావు, అది నాకూ తెలుసు నీకూ తెలుసు. ఈ జన్మ ఇలాగే గడవనీ. నీ అదృష్టం బాగుంటే వచ్చే జన్మలో నన్ను ఎర్లీగా కలుస్తావు. ఇంకా బాగుంటే, నేనేం చెబుతున్నానో అర్ధం చేసుకుంటావు. అనుసరించే ప్రయత్నం చేస్తావు. ప్రస్తుతానికి నీకా ఛాన్స్ లేదు. అంతే' అని చెప్పి ఫోన్ కట్ చేశాను.

జీవితం చాలా విచిత్రమైనది. ఇదుగో అదుగో అని చూసేలోపు అంతా అయిపోయి అరవై వచ్చేస్తాయి. ఇంకో పదేళ్లలో చరిత్ర ముగుస్తుంది. అప్పుడు లబోదిబో అంటే ఉపయోగమేముంటుంది? బాధ్యతలు  తీరిపోతే,  ఓపికున్నన్నాళ్లు తీర్ధయాత్రలు  తిరగడం, తీరకపోతే తీరలేదని బాధపడటం, తర్వాత పిల్లలు పట్టించుకోవడం లేదని ఏడవడం, రోగాలతో మూలగడం, ఆ తర్వాత వృద్ధాశ్రమంలో  చేరి చావడం ఇది తప్ప ఏ చరిత్ర చూసినా ఇంకేముంటుంది?

ఆధ్యాత్మికం కావాలట ! ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చేదా అది?

ఆధ్యాత్మికం అంటే తీర్థయాత్రలు, పిక్నిక్కులు కాదు. హృదయంలో దైవానుభూతిని పొందటం. జీవితంలో దాన్ని నింపుకోవడం. అప్పుడు యాత్రలు చేసినా, అక్కడ దేవతాశక్తులను అనుభూతి చెందవచ్చు. అలా కాకుండా, ఊరకే పిక్నిక్ లాగా యాత్రలకు పోతే ఏమీ ఒరగదు.

'ఇక్కడుంటే అక్కడుంది. ఇక్కడ లేకపోతే అక్కడా లేదు' అని శ్రీ రామకృష్ణులు చెప్పినది ఇదే.

సత్యాలన్నీ ఇలాగే చేదుగానే ఉంటాయి మరి !  
read more " కాశీలో ఆరు నెలలు - చేదు సత్యాలు "

17, జులై 2023, సోమవారం

జీసస్ పేరుతో రోగాలు నయం చేసే John of God కు 370 ఏళ్ళు జైలు శిక్ష

ఈ మధ్యనే బ్రెజిల్ లో ఒక సంఘటన జరిగింది. ఇది బ్రెజిల్ చరిత్రలోనే అతి పెద్ద మతపరమైన నేరం.

అదేంటంటే, జో టెక్సీరా డిఫారియా అనే బ్రెజిలియన్, జీసస్ పేరుతో రోగాలు నయం చేస్తానని ప్రచారం చేసుకుంటూ అందుకోసం తనదగ్గరకు వచ్చిన దాదాపు 600 అమ్మాయిలను రేప్ చేశాడు. కంగారు పడకండి. ఒక్కరోజులో కాదు. ఇదంతా 1986 నుండి 2017 లోపు జరిగింది. అంటే 30 ఏళ్ల ప్రణాళికన్నమాట. వాళ్ళు పెట్టిన కేసుల విచారణ ఇప్పటికి తేలింది. జూలై 10 న తీర్పు వచ్చింది. ఇతనికి ప్రస్తుతం 81 ఏళ్ళు. అంటే వీడు చనిపోయేదాకా జైల్లోనే ఉండాలి. అంతేకాదు, ఇంకొక అయిదు జన్మలపాటు పుట్టగానే పాక్కుంటూ జైలుకొచ్చి చచ్చేదాకా అందులోనే ఉండి చావాలి.

ఈయనగారు జీసస్ క్రీస్ట్ కు ఘనత వహించిన అంతర్జాతీయ సేవకుడు.

ఇతని దందా 1970 లలోనే మొదలైంది.  అప్పట్లో బ్రెజిల్లోని ఒక చిన్న టౌన్ లో ఫెయిత్ క్లినిక్ మొదలుపెట్టాడు. మెడికల్ లైసెన్స్ లేకపోయినా చిన్న చిన్న ఆపరేషన్లు, కంటిశుక్లాలు తొలగించడం, మొదలైనవి చేసేవాడు. అంటే మన RMP టైపు వైద్యమన్నమాట. అది లాభసాటిగా లేదని 'జీసస్ వ్యాపారం' మొదలుపెట్టాడు. పోర్చుగల్ లోని మధ్యయుగాల నాటి సెయింట్ జాన్ అనేవాడి పేరును పెట్టుకుని షాపు తెరిచాడు.

అప్పటినుంచి పరిశుద్ధజలం అని, మూలికా మందులని ఏవేవో పిచ్చి ప్రాడక్ట్స్ ని జనానికి అమ్మేవాడు. ప్రార్థనలతో రోగాలు తగ్గిస్తానని ప్రచారం చేసుకున్నాడు.

బ్రెజిల్ కూడా మన ఇండియా లాంటిదే. అక్కడ కూడా మనలాగే పిచ్చిగొర్రె జనం ఎక్కువ. ఏది చేసినా చెల్లుబాటై పోతుంది. ఇంకేముంది? గొర్రెలు మూకుమ్మడిగా ఎగబడ్డాయి. అతివేగంగా అనూహ్యంగా ఎదిగాడు. కుప్పలు తెప్పలుగా  డబ్బులొచ్చి పడ్డాయి. ఊరూరా తిరుగుతూ RMP వైద్యం చేసుకుంటూ, తిండికి గతిలేక బ్రతికే ఇతను ఏకంగా వెయ్యి ఎకరాల ఎస్టేట్ కు యజమాని అయ్యాడు.

శారీరక మానసిక బాధలు తగ్గించుకోవడానికి తన దగ్గరకు వచ్చే అమ్మాయిలను తన వికృత సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి వాడుకునేవాడు. ఆ విధంగా తమను వాడుకున్నాడని ఇప్పటికి  దాదాపు 600 మంది అఫిషియల్ గా బయటపడి కంప్లెయింట్ చేశారు. బయటకు రాని కేసులెన్ని ఉన్నాయో ఆ జీసస్ కే తెలిసి ఉండాలి. అసలు, ఇలాంటి నీచులను ఈ విధంగా దాచిపెట్టి పోషించే జీసస్ ఓపికకు మెచ్చుకోవాలి.

ఈ విధమైన  సెక్స్ నేరాలే గాక, చిన్నపిల్లల స్మగ్లింగ్ కూడా ఇతను చేసేవాడు. పిల్లల్ని కని ఇవ్వడానికి  ఒక అమ్మాయిల గ్రూపును మెయింటైన్ చేసేవాడు. ఆ పిల్లల్ని, పిల్లలను కనలేని దంపతులకు వేలంపాటలో అమ్మేసేవాడు. ఇక పిల్లలను కనలేరు అనుకున్న అమ్మాయిలను చంపేసేవాడు. అంటే కోళ్లఫారం లాగా పిల్లల ఫారం నడిపేవాడన్నమాట. దీనిపైన చాలా సంపాదించాడు.

చివరకు తనను కూడా రేప్ చేశాడని సొంత కూతురే ఇతనిమీద కంప్లెయింట్ చేసింది.  తన తండ్రి ఒక రాక్షసుడని, 14 ఏళ్ల వయసులో తనను బంధించి కొట్టి రేప్ చేస్తుంటే, భరించలేక ఇంటినుంచి పారిపోయానని ఆ అమ్మాయి కోర్టులో చెప్పింది.

ఈ నేరాలన్నీ 'జీసస్ సేవ', 'పరిశుద్ధాత్మ స్వస్థత' అనే ముసుగుల వెనుక దాక్కుని ఇతను చేశాడు. ఇంతమందికి ఇన్ని రోగాలను తగ్గించానని ప్రచారం  చేసుకున్న ఇతను 2018 లో అరెస్ట్ అయిన  మరుసటి రోజునుంచి, తనకు అనేక రోగాలున్నాయని, కాబట్టి జైల్లో కాకుండా ఆస్పత్రిలో ఉంచి చికిత్స ఇప్పించాలని బ్రెజిల్ ప్రభుత్వాన్ని అనేకసార్లు అభ్యర్దించాడు.

అసలు 2015 లోనే ఇతనికి పొట్ట కేన్సర్ వచ్చింది. రహస్యంగా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. న్యూస్ బయటకు పొక్కకుండా చూసుకుంటూ, తన ప్రార్ధనా వ్యాపారాన్ని యధావిధిగా కొనసాగించాడు.

ఓప్రా వింఫ్రె షోతో ఇతను చాలా పాపులర్ అయ్యాడు. అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు కూడా ఇతను ప్రార్ధనా ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఒబామా ఎలాంటివాడో మొన్న ఇండియా మీద అతను చేసిన వ్యాఖ్యలతోనే బయటపడింది. ఒబామా కూడా ఇతన్ని ప్రోమోట్ చేశాడు. అయితే జేమ్స్ రాండి మొదలైన వాళ్ళు ఇతని మోసాలను బయటపెట్టారు. బాధితులు వందల సంఖ్యలో కంప్లెయింట్లు చేశారు. సబ్రినా బీటెన్ కోర్ట్ అనే బ్రెజిల్ వనిత  ప్రాణాలకు తెగించి మరీ పరిశోధన చేసి ఇతని నేరాలన్నీ బయట పెట్టింది. వాటిమీద విచారణ జరిగింది. ఇన్నేళ్ల తర్వాత నేరాలు రుజువయ్యాయి, బ్రెజిల్ కాబట్టి (ఇండియా కాదు గాబట్టి) శిక్షలు పడ్డాయి.

ఇదంతా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే, ఇండియాలో కూడా ఇలాంటి క్రైస్తవ మోసగాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. చర్చిల పేరుతో అనేక నేరాలు ఘోరాలు చేస్తున్నారు.  ప్రార్ధనల పేరుతో, కూటముల పేరుతో, కొబ్బరినూనె మొదలైన జిమ్మిక్కులతో రోగాలు నయం చేస్తామని చెబుతూ కోట్లాది మంది అమాయకులను మోసం చేస్తున్నారు. మతం మారుస్తున్నారు. హిందూమతం అంటే ద్వేషం నూరి పోస్తున్నారు. దేశ మౌలిక స్వరూపాన్ని మారుస్తున్నారు. సంక్షోభం దిశగా తీసుకుపోతున్నారు. కానీ వాళ్ళపైన కేసులు పెట్టే ప్రయత్నాలు, కోర్టుకు ఈడ్చే ప్రయత్నాలు ఇండియాలో ఎక్కడా జరగడం లేదు. బ్రెజిల్ కంటే ఇండియా ఇంకా వెనుకబడిన దేశమన్న మాట ఈ విషయంలో !

ప్రార్థనలకు రోగాలు తగ్గడం అనేది ఒక పెద్ద బూటకం. అది ఎప్పటికీ జరిగే పని కాదు. కానీ ప్రతి చర్చిలోనూ ఇదే ఊదర కొడుతూ అమాయకులను మోసం చేస్తున్నారు క్రైస్తవ పాస్టర్లు. నమ్మే గొర్రెలు నమ్ముతున్నారు.

తనను తానే రక్షించుకోలేక సైనికుల చేతిలో చంపబడ్డాడు జీసస్. అలాంటివాడు ప్రార్థనలతో ఇతరులకు రోగాలు తగ్గిస్తాడా? అబద్ధాలు చెప్పటానికైనా ఒక అర్ధం పర్ధం ఉండాలి. నాలుగు డబ్బుల కోసం మతాలు మారేవారికి పరిశుద్ధత ఎలా వస్తుందసలు? 

తనపేరుతో ఇంత జరుగుతుంటే, 50 ఏళ్లుగా జీసస్ ఎందుకు ఆపకుండా చూస్తూ ఊరుకున్నాడో, ఎక్కడ నిద్రపోతున్నాడో, అసలున్నాడో లేడో, దేవుడికే తెలియాలి.

బయటకు రాని ఇలాంటి సెక్స్ నేరాలు, మోసాలు  ఇండియా చర్చిలలో కూడా లక్షలాదిగా జరుగుతున్నాయి. కానీ ఎటువంటి చర్యలు  ఎక్కడా ఉండటం లేదు. చర్చి మైకుల సౌండ్ పొల్యూషన్ తో పల్లెలు దద్దరిల్లుతున్నాయి.  ఆంధ్రాలాంటి రాష్ట్రాలలో అయితే  మతమార్పిడులు మహాజోరుగా జరుగుతున్నాయి. అయినా  ఎవడూ పట్టించుకోడం లేదు. యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వాస్ శర్మ వంటి కొద్దిమంది ముఖ్యమంత్రులు మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళకు దేశం కంటే స్వార్థమే ముఖ్యమై కూచుంది. 

ఈ విషయంలో బ్రెజిల్ మనకంటే ముందున్నదనడం స్పష్టం. కనీసం వాళ్ళలో కొంత కామన్ సెన్స్ ఉంది. మనకదే లేదు. భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవ మోసాలకు నేరాలకు చరమగీతం పాడే రోజు ఎప్పుడొస్తుందో? భారతీయులలో దేశభక్తి ఎప్పుడు మొలకెత్తుతుందో?

ఇలాంటి న్యూసులను మెయిన్ స్ట్రీమ్ మీడియా చక్కగా కప్పి పెడుతోంది.  ఈ వార్తలు పేపర్లలో, చానల్స్ లో ఎక్కడా కనిపించవు. మన మీడియా చాలావరకు అమ్ముడు పోయిందనే మాట, పోలరైజ్  అయిందనే మాట నిజం. అది డబ్బుకు కావచ్చు, కులానికి కావచ్చు. భావజాలానికి కావచ్చు. కానీ, వాస్తవాలు, అసలైన వార్తలు ప్రజలకు చేరడం లేదు. టైలర్డ్ న్యూస్ మాత్రమే బయట లభిస్తోంది.

మతమార్పిడి ముఠాలు చేస్తున్న ఇలాంటి నేరాలను, మోసాలను గట్టిగా శిక్షించవలసిన అవసరం ఉంది. కూచున్న కొమ్మనే నరుక్కునే మన గొర్రెప్రజలలో, నాయకులలో చైతన్యం ఎప్పటికీ వస్తుందో మరి?
read more " జీసస్ పేరుతో రోగాలు నయం చేసే John of God కు 370 ఏళ్ళు జైలు శిక్ష "

15, జులై 2023, శనివారం

చేపలు తినేవాళ్లు దైవాత్ములెలా అవుతారు? ఇస్కాన్ స్వామీజీల అజ్ఞానం

వివేకానందస్వామి చేపలు తిన్నారు గనుక ఆయన దివ్యాత్ముడు కాదని ఇస్కాన్ కు చెందిన అమోఘ్ లీలాదాస్ అనే సాధువు అన్నాడు. అంతేగాక, వివేకానందుల గురువైన శ్రీ రామకృష్ణులను కూడా విమర్శించాడు. శ్రీ రామకృష్ణులు 'యతో మత్ తతో పథ్' అని బెంగాలీలో అనేవారు. అంటే, 'ఎన్ని మతములో అన్ని మార్గాలు (మతాలన్నీ ఒకే దైవాన్ని చేరే వేర్వేరు దారులు)' అని అర్ధం. ఇది సరికాదని, అన్ని మతాలు ఒకే చోటకు చేర్చవని అమోఘ్ లీలాదాస్ అన్నాడు. ఈ వ్యాఖ్యను ఆయన బెంగాల్లోని పానీహాటి అనే ఊర్లో ఒక మీటింగులో మాట్లాడుతూ చేశాడు. దానితో పెద్ద గొడవ చెలరేగింది.

బెంగాల్లో రామకృష్ణులను ప్రతి ఇంటిలోనూ పూజిస్తారు. పూజామందిరంలో ఆయన ఫోటో లేని ఇల్లు ఆ రాష్ట్రంలో ఉండదు. ఇక వివేకానందస్వామి అంటే చెప్పనే అక్కర్లేదు. కలియుగంలో ఆయన లేని హిందూమతాన్ని ఊహించలేం. ఈ వ్యాఖ్యలతో బెంగాలీలు మండిపడ్డారు. దుమారం రేగింది. ఇస్కాన్ దిగి వచ్చింది. లీలాదాస్ ను నెలపాటు సస్పెండ్ చేసింది. ఎవరికీ ముఖం చూపకుండా ఏకాంతవాసం చెయ్యమని ఆదేశించింది. ఆయన సరేనంటూ బృందావనం వెళ్ళిపోయాడు.

బేలూర్ మఠాన్ని దర్శించి  రామకృష్ణా మిషన్ కు క్షమార్పణ చెబుతామని ఇస్కాన్ ప్రకటన చేసింది. ఇది మంచి నిర్ణయం. అసలైన విజ్ఞతకు ఇది నిదర్శనం.

ఈ అమోఘ్ లీలాదాస్ అనే సాధువుకు దాదాపు 41 ఏళ్ళుంటాయి. ఈయన ఒక సాఫ్ట్ వేర్ నిపుణుడు. ముప్పై ఏళ్ల వయసులో ఇస్కాన్ లో చేరాడు. ప్రస్తుతం ద్వారకా నగరం లోని ఇస్కాన్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. యూట్యూబ్ లో మంచి పేరున్న వక్త. కానీ, నోరు జారిన పాపానికి ఈ శిక్ష పడింది. మంచిదే.

చేతిలో మైకుంది కదా అని, యూ ట్యూబ్ సెలెబ్రిటీని కదా అని, నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు.  రామకృష్ణ వివేకానందుల స్థాయిని లీలాదాస్ లాంటి కుర్రసన్నాసులు అర్ధం చేసుకోలేరు. అంత నోటి దూలగా ఉంటే, చాపక్రింద నీరులాగా పాకుతున్న క్రైస్తవం పైనా,  జిహాద్ పేరుతో నానా ఘోరాలు దౌర్ణన్యాలు నేరాలు చేస్తున్న ఇస్లాం పైనా మాట్లాడి ఉండవలసింది.  అంతేగాని, తనకు అర్ధం కాని స్థాయి మనుషుల గురించి ఈ విధంగా మాట్లాడటం లీలా దాస్ చేసిన ఘోరమైన తప్పు.

ప్రస్తుతం జరగవలసిన యుద్ధం క్రైస్తవం పైనా, ఇస్లాం పైనా మాత్రమే. ప్రతి ఒక్కరికీ ఈ రెండు మతాలు భారతదేశానికి చేస్తున్న ద్రోహం ఏమిటో తెలియాలి. ఇవి ఎలాంటి విషపు మతాలో, ఎలాంటి విష ప్రచారాలు చేస్తున్నాయో తెలియాలి. ఆ కోణంలో అందరికీ సమాచారం అందాలి., చర్చలు జరగాలి. జ్ఞానం పెరగాలి. అంతేగాని ఇలాంటి అపరిపక్వ వ్యాఖ్యలు చెయ్యకూడదు.

లీలాదాస్ లాంటి మనుషులకు కొన్ని విషయాలు గుర్తు చెయ్యదలుచుకున్నాను.

1. మనం అవతార పురుషులుగా పూజించే శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు ఇద్దరూ మాంసాహారులే. ఇస్కాన్ వాళ్ళు జపించే 'హరేరామ హరేకృష్ణ' మహామంత్రంలో వీళ్ళిద్దరే ఉంటారు.

2.  అహింసామూర్తి అని లోకంలోని అజ్ఞానులు చాలామంది భావించే బుద్ధుడు మాంసాహారి. పందిమాంసం  తినడం వల్ల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ తో బుద్ధుడు చనిపోయాడు.

3. మన ప్రాచీన ఋషులందరూ మాంసాహారులే.

మాంసం తింటేనే దైవత్వం వస్తుంది అనేది నా ఉద్దేశ్యం కాదు. తిండికీ దైవత్వానికి సంబంధం లేదని చెప్పడమే నా ఉద్దేశ్యం.

ఇంకా సాధకదశలో ఉండి, తపస్సు చేస్తున్న వాళ్ళు ఆహారనియమం తప్పక పాటించాలి. సిద్ధస్థితిని పొందినవారికి ఈ నియమం వర్తించదు. ఈ విషయం లీలాదాస్ కు తెలియదు లాగుంది.

రామకృష్ణ, వివేకానందుల జీవితాలను లీలాదాస్ లాంటి వాళ్ళు ముందు శ్రద్దగా చదవాలి. ఆ తరువాత మాట్లాడాలి.

'నరేంద్రుడు (వివేకానందస్వామి) స్నేహితులతో కలసి ఒక హోటల్లో చికెన్ తిన్నాడు' అని శ్రీ రామకృష్ణులతో ఇంకొక శిష్యుడు ఫిర్యాదు చేస్తాడు.

'నరేంద్రుడు అగ్ని వంటివాడు. అగ్నిని ఏదీ అపవిత్రం చేయలేదు. అందులో పడిన ప్రతిదీ భస్మం అయిపోతుంది' అని శ్రీ రామకృష్ణులు జవాబిచ్చారు.

అంతేకాదు. ఆయన ఆ వ్యక్తితో ఇలా అన్నారు, 'ఇదే పనిని నువ్వు చేసి ఉంటే, జన్మలో మళ్ళీ నీ ముఖం చూసి ఉండేవాడిని కాను'.

సద్గురువులు అందరికీ ఒకే నియమం పెట్టరు. ఎవరి స్థాయి ఏమిటో చూచి దానికనుగుణంగా వారికి నియమాలను నిర్దేశిస్తారు. నరేంద్రుడు సప్తఋషులలో ఒకడని, ధర్మోద్ధరణ కోసం తనతో ఈ భూమికి దిగి వచ్చాడని శ్రీ రామకృష్ణులు అనేకసార్లు అనేవారు. సప్తఋషులంటే సామాన్యులు కారు. భగవంతునికి ఉన్న శక్తులు వీరికి కూడా ఉంటాయి. వారు శాపానుగ్రహ సమర్థులు. సంకల్పమాత్రంతో ఎదుటి మనిషి తలవ్రాతను మార్చగల శక్తి వారికి ఉంటుంది. వివేకానంద స్వామిది ఆ స్థాయి.

వివేకానందుడు చేపలు తిన్నాడని, బుద్ధుడు పందిమాంసం తిన్నాడని మనం కూడా ట్రై చెయ్యకూడదు. శంకరులు, బ్రహ్మంగారు మద్యం త్రాగారని మనం త్రాగకూడదు. మనం వాళ్ళతో సమానం కాము, కాలేము. లీలాదాస్ అసలే చెయ్యకూడదు. ఆయన మరమరాలు తిని, నీళ్లు త్రాగి  మాత్రమే జీవించాలి. అప్పుడే ఆ నోటి దూల తగ్గుతుంది.

వివేకానంద స్వామి చేపలు, చికెన్ తిన్నది నిజమే. అయితే, ఉత్త మంచినీళ్ళు మాత్రమే త్రాగుతూ వారం రోజులపాటు నిరాహారిగా కూడా ఆయన ఉన్నాడు. శ్రీ రామకృష్ణుల నిర్యాణం తరువాత, పరివ్రాజకదశలో దేశమంతా తిరుగుతున్న దశలో ఇది జరిగింది. హిమాలయాలలో ఉన్నపుడు ఎన్నో రోజులపాటు ఆహారం దొరకని స్థితిలో ఆయనున్నాడు. ఈ విషయాలు లీలాదాస్ తెలుసుకోవాలి.

ఇస్కాన్ సాధువులకు, భక్తులకు మరొక్క విషయం గుర్తు చేస్తాను.

వారు పరమపవిత్రంగా, సాత్వికాహారంగా భావించే ఆవుపాలు కూడా సైన్స్ ప్రకారం మాంసంతో సమానమే.  పాలు వెజిటేరియన్ డైట్ కాదు. అది జంతువు నుండి వచ్చిన ఆహారం, పాలను సైన్స్ 'లిక్విడ్ మీట్' అంటుంది. పాలు త్రాగుతూ, అదేదో గొప్ప ఆహారనియమమని, సాత్వికాహారం తింటున్నామని అనుకునే వారు పిచ్చి భ్రమలో ఉన్నట్లే. మాంసం తినేవారికి, పాలు త్రాగేవారికీ పెద్ద తేడా ఏమీ లేదు. అందుకే వీగన్స్, పాలతో సహా అన్ని రకాలైన జంతు ఉత్పత్తులకూ దూరంగా ఉంటారు.

టెక్నికల్ గా చూస్తే,  పాలతో చేసిన స్వీట్లు,  పాలకోవా మొదలైనవి కూడా మాంసాహారంతో సమానమే.

పైగా, దూడలకు అవి తాగినన్ని పాలు ఉంచనిస్తే, మనం త్రాగడానికి పాలెలా వస్తాయి? కాబట్టి మనం త్రాగుతున్న పాలన్నీ దూడల నోటి దగ్గర కూడే. అవి త్రాగవలసిన పాలను, మనం లాక్కొని త్రాగుతున్నాం. సత్యంగా చెప్పాలంటే ఇది మహాపాపాల్లో ఒకటి. మరి పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించే ఇస్కాన్ సాధువులు, భక్తులు అందరూ మహాపాపం చేస్తున్నట్లే. 

చేపలు తిన్నంత మాత్రాన దైవత్వం దూరమైతే, పాలు త్రాగేవారికి, స్వీట్లు తినేవారికి మాత్రం అదెలా వస్తుంది?

మరోమాట !

బెంగాల్ శక్తి ఉపాసనకు నిలయం. కాళికాదేవికి మాంసాన్ని నైవేద్యంగా పెడతారు. భైరవునికి మద్యాన్ని నైవేద్యం పెడతారు. అదీగాక, బెంగాల్లో చేపలను శాకాహారంగా భావిస్తారు. అక్కడ బ్రాహ్మణులు కూడా చేపలను తింటారు. చేప కూర లేనిదే బెంగాలీలకు, వారు ఏ కులం వారైనా, పూట గడవదు.

ప్రాచీనకాలంలో బ్రాహ్మణులందరూ మాంసాహారులే. మధ్యయుగాల లోనే వారు శాకాహారులయ్యారు.

అసలు ఏ ప్రాణినీ హింసించకూడదంటే, ఉత్తగాలిని మాత్రమే పీల్చి బ్రతకాలి. ఇంకా చెప్పాలంటే, ఆ గాలిలో కూడా కొన్ని సూక్ష్మజీవులుంటాయి. అవీ చనిపోతాయి. నీళ్లలో బోలెడన్ని సూక్ష్మజీవులుంటాయి. నీటిని త్రాగితే అవికూడా చనిపోతాయి. కనుక, అహింసను నిక్కచ్చిగా పాటించాలంటే, మనం చనిపోవడం ఒక్కటే దారి. అంతకంటే వేరే మార్గం లేదు.

అహింసయే పరమధర్మం అనుకునే పనైతే లీలాదాస్ అర్జంటుగా కృష్ణభక్తిని విడిచిపెట్టి జైన సాధువుగా మారాలి. ఏమంటే,  ఒక్క జైనసాధువులు మాత్రమే, బ్రతికుంటే ఏదో ఒక జీవిని చంపవలసి వస్తుంది కాబట్టి,  ప్రాయోపవేశం అనే దీక్షను పట్టి ఉపవాసం ఉంటూ తమంతట తాముగా చనిపోతారు. కానీ ఇది కూడా అత్యున్నతమైన జ్ఞానానికి సూచిక కాదు. దీనిని బుద్దుడు నిరసించాడు. ఆత్మహత్య మహాపాపమని సనాతన ధర్మం కూడా అంటుంది. 

కాబట్టి తత్త్వం సరిగ్గా అర్ధం కావడం అనేది యూ ట్యూబ్ లో వీడియోలు పెట్టినంత చీప్ విషయం ఏమీ కాదు.

'కాషాయం కట్టినంత మాత్రాన తత్త్వం అర్ధం కాదు' అనడానికి అమోఘ్ లీలాదాస్ లాంటి కుర్రసాధువులే ఉదాహరణ. యూ ట్యూబ్ మాయలో పడి, కామెంట్లు లైకులు చూసుకుంటూ అదే ఏదో గొప్ప విజయంగా భావిస్తున్నంతవరకూ నిజమైన సన్యాసం ఎలా వంటపడుతుంది మరి?

బృందావనంలో ఉంటూ నెలరోజులు మౌనవ్రతం పాటించినంత మాత్రాన ఎవరికీ జ్ఞానోదయం కాదు. అలా అయ్యే పనైతే, ఈపాటికి వేలాది లక్షలాది జ్ఞానులు ఎప్పుడో తయారై ఉండేవారు. జీవితాంతం అక్కడ ఉంటున్నవాళ్లకే దిక్కూ దివాణం లేదు. ఒక్క నెలకే ఏమొస్తుంది లీలా దాస్?

అసలు వాక్కు మీద అదుపు రాకుండానే ఈయనకు సన్యాసం ఇచ్చిన ఇస్కాన్ గురువులది తప్పు. ఇప్పుడు ఆన్లైన్ దీక్షలు, ఆన్లైన్ సన్యాసం కూడా వచ్చాయట ఆన్లైన్ మోక్షం ఒక్కటే తక్కువ. కలిమాయలలో ఇదీ ఒకటి !! 

బృందావనంలో మౌనదీక్షకు బదులుగా, మా ఆశ్రమంలో నెలపాటు మా అతిథిగా ఉంటే చాలు. అసలైన ఆధ్యాత్మికత ఏమిటో రుచి చూపిస్తాను. ప్రయత్నించమని లీలాదాస్ కు ఆఫర్ ఇస్తున్నాను.

ఆయనకు నిజంగా జ్ఞానోదయమే కావాలి అనుకుంటే ఇది సువర్ణావకాశం. ఉత్త యూ ట్యూబ్ సెలబ్రిటీ స్టేటస్ చాలు అనుకుంటే ఆయనిష్టం.

శాకాహారం జ్ఞానసిద్ధికి సూచిక కాదు. అలాగని మాంసాహారాన్ని మానలేని వారికి జ్ఞానం ఎన్ని జన్మలకూ కలగదు.

ఇంత చిన్న విషయం అర్థం కావడానికి పెద్ద జ్ఞానం ఏమీ అవసరం లేదు.
read more " చేపలు తినేవాళ్లు దైవాత్ములెలా అవుతారు? ఇస్కాన్ స్వామీజీల అజ్ఞానం "

1, జులై 2023, శనివారం

మా ఆశ్రమంలో మొదటి గురుపూర్ణిమ ఉత్సవం

ఈ ఊళ్ళో సాయిబాబా గుడులు ఒకటో రెండో ఉన్నాయి. వాటినుండి ఎవరో ఒక పాంప్లెట్ ను నాకు తెచ్చిచ్చారు. ఎల్లుండి గురుపూర్ణిమ గనుక ఆ సందర్భంగా గుళ్ళో జరిగే కార్యక్రమం వివరాలు అందులో ఉన్నాయి.

గత వారం నుండి సాయిబాబా గుడిలో సప్తాహం  జోరుగా జరుగుతోంది. మైకులు రాత్రి పగలూ మోగుతున్నాయి. దాని ముగింపుగా గురుపూర్ణిమనాడు తెల్లవారుజామునుండి రాత్రివరకూ అనేక కార్యక్రమాలు, పూజలు, భజనలు, వ్రతాలు, సన్మానాలు గట్రా అందులో రాయబడి ఉన్నాయి.

అప్పుడు గుర్తొచ్చింది. 

మొన్నొకరోజున ఆశ్రమానికి పోతుంటే ఒకామె ఎదురైంది. పట్టుచీరలో హడావుడిగా వెళుతోంది.

'ఎక్కడికండి అంత హడావుడిగా వెళుతున్నారు?' అడిగాను

'సాయిబాబా భజన ఉందండి. సప్తాహం జరుగుతోంది కదా. మా బ్యాచ్ భజనకు టైమైంది. అందుకే పరిగెత్తుతున్నాను' అందామె.

'మీరు రామనామ భజనలు చిన్నప్పటి నుండి చేస్తానని చెప్పినట్లు గుర్తు. సాయిబాబా భజన కూడా చేస్తారా?' అడిగాను నవ్వుతూ.

'ఏముందండి? అంతా ఒకటే కదా? ఏ దేవుడైతే  ఏమైంది?' అందామె కొంచం ఇబ్బందిగా.

నాకు 'ఎవడైతే నాకేంటి?' అనే సినిమా గుర్తొచ్చింది.

'అలాగా? అయితే వచ్చే వారం ఏసు భజన కూడా  ఉంటుందా?' అన్నాను మళ్ళీ నవ్వుతూ.

'ఇంకా అంత ఎదగలేదు లెండి' అందామె వెళ్ళిపోతూ

'ఏ ఎదుగుదలనూ మధ్యలో ఆపకూడదండి. ఆ కాస్తా కానివ్వండి, అద్భుతంగా ఉంటుంది' అన్నాను 

ఆమె  వినిపించుకోకుండా గబగబా వెళ్ళిపోయింది.
    
భజనకదా, లేటవ్వకూడదు. 

జాలేసింది.

మళ్ళీ ఈ పాంప్లెట్ కూ జాలేసింది. ఈ మనుషులంతా ఇంతేనేమో? ఎప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి?

అతనితో ఇలా చెప్పాను.

'రావడం కుదరదండి. మా ఆశ్రమంలో కూడా ఆ రోజున అనేక కార్యక్రమాలుంటాయి కదా ' అన్నాను

'ఏమేముంటాయి?' అన్నాడాయన.

'మీ అంత గొప్పగా ఉండవనుకోండి. కానీ మీకూ మాకూ ఒక కామన్ విషయం ఉంది. మన వ్యాసమహర్షిని, నారదమహర్షిని, శుకమహర్షిని, వాల్మీకిమహర్షిని, సప్తఋషులను, త్రిమూర్తులను, శంకర, రామానుజ, మధ్వ, నింబార్క, చైతన్య, రామకృష్ణ, వివేకానందులను, మన దీక్షాగురువులను, విద్యలు నేర్పించిన గురువులను  అందరినీ కట్టగట్టి మర్చిపోవడంలో మీరూ మేమూ ఒకటే. ఎంతైనా మనమంతా హిందువులం కదా !  మన ధర్మాన్ని సంప్రదాయాలను గాలికొదిలెయ్యడంలో మనం మనం ఒకటే.

కాకపోతే  ఏదో మాకు చేతనైనంతలో కాస్త డిఫరెంట్ గా గురుపూర్ణిమను చేసుకుంటున్నాము' అన్నాను.

'అదే ఏంటో చెప్పచ్చు కదా?' అన్నాడాయన.

'అబ్బే చెప్పకూడనంత ఏమీ లేదు. చాలా సింపుల్. తెల్లవారుజామునే సులేమాన్ సుప్రభాతంతో కార్యక్రమం మొదలౌతుంది. దాని తర్వాత ఔరంగజేబు అష్టోత్తరం, షాజహాన్ సహస్రనామాలతో పూజలుంటాయి. ఆ తర్వాత అక్బరుకు ఆకుపూజ, బాబరుకు భజన ఉంటుంది. మధ్యాన్నం పిచ్చితుగ్లక్ వ్రతం,  దాని తర్వాత మాలిక్కాఫర్ మంత్రపుష్పం.  'అల్లాహో అక్బర్' అనే మహామంత్రం కోటిసార్లు పారాయణతో పూర్ణాహుతి ఉంటాయి. ఆ పైన మైకులో పెద్దగా అరుస్తూ అజాన్ చదువుతూ గోడకు హారతి ఇవ్వడంతో ఉదయపు కార్యక్రమం ముగుస్తుంది.

ఆ తర్వాత మహమ్మద్ గజనీ, గోరీలను భక్తితో స్మరించుకుంటూ మూడు నిముషాలు మౌనం పాటిస్తాం. తదుపరి హలాల్ చెయ్యబడిన మటన్ బిర్యానీ ప్రసాదవితరణ అందరికీ చెయ్యబడుతుంది. వెజిటేరియన్ ఆప్షన్ లేదు. సారీ ఏమనుకోకండి.

సాయంత్రం అజ్మీర్ బృందం వారిచే హుషారైన భక్తిగీతాలతో ఖవ్వాలీ కార్యక్రమం. తదుపరి పాకిస్తాన్ టెర్రరిస్ట్ బృందానికి శాలువాలు కప్పి ఘనసన్మానంతో ఆనాటి గురుపూర్ణిమ మహోత్సవం దిగ్విజయంగా ముగుస్తుంది.

ఇదీ మా కార్యక్రమం. చూశారుగా ఎంత బిజీ షెడ్యూలో? అందుకని మీ గుళ్లో పూజలకు మేము రాలేము. సారీ. ఏమనుకోకండి' అని చెప్పాను.

'వాళ్ళందరూ ఎందుకు?' అడిగాడు

'కోరికలు త్వరగా తీరతాయి. వాళ్ళందరూ కూడా సెయింట్సే. అందరిలోకి ఔరంగజేబు చాలా పెద్ద సెయింట్. నవ్వులాట కాదు. మదాని మొన్న అదే అన్నాడు. కోట్లాది ముస్లింల నమ్మకం కూడా ఇదే. సాయిబాబా గతజన్మలో ఔరంగజేబు సైన్యంలో సైనికుడే. ఈ సంగతి స్వయానా మెహర్ బాబానే చెప్పాడు. చదవండి అర్థమవుతుంది. కాబట్టి ఈ సెయింట్స్ అందర్నీ ప్రార్థిస్తే మీ కోరికలు ఇంకా ఫాస్ట్ గా తీరతాయి. ఎలా అయితేనేం?  ఎవరైతేనేం? మనక్కావలసింది మన కోరికలు తీరడం. అంతేకదా? మనధర్మం ఎటుపోతే మనకెందుకు? అన్నాను.

అతనికి అర్ధమైనట్టు నాకనిపించలేదు. కనీసం మీకైనా అర్థమైందా?

ఇంతకంటే గొప్పగా గురుపూర్ణిమను మనం మాత్రం ఎలా జరుపుకోగలం చెప్పండి?

కాదంటారా?
read more " మా ఆశ్రమంలో మొదటి గురుపూర్ణిమ ఉత్సవం "