అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

16, జనవరి 2026, శుక్రవారం

సోమనాథ్ ఆలయ కథ - ఇస్లామిక్ నాటో

గుజరాత్ రాష్ట్రంలో అరేబియాసముద్రతీరంలో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం - సోమనాధ్ ఆలయం. 'సౌరాష్ట్రే సోమనాథం చ..' అంటూ మొదలౌతుంది మన జ్యోతిర్లింగ స్తోత్రం. పాతకాలంలో గుజరాత్ ను 'సౌరాష్ట్ర' అనేవారు.

1026 CE లో మహమ్మద్ ఘజనీ చేసిన దండయాత్రలో ఈ ఆలయం తీవ్రంగా ధ్వంసమైపోయింది. దానిని దండయాత్ర అనడం కంటే, దోపిడీ అంటే సరిపోతుంది. ఇది జరిగి నేటికి సరిగ్గా వెయ్యేళ్ళు నిండాయి. యాభైవేలమంది తురకసైనికులతో ఈ ఆలయాన్ని ముట్టడించి దానిని మూడురోజులపాటు తీరికగా ధ్వంసం చేసి, దోచుకున్నాడు గజనీ.

వందలాదిమంది హిందూవీరులు దానిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి, ఆ యుద్ధంలో చనిపోయారు. నిరాయుధులైన వందలాదిమంది బ్రాహ్మణపండితులను ఆ ఆలయపరిసరాలలో నరికేసింది గజనీ సైన్యం. స్త్రీలపైన చేసిన అరాచకాలకు లెక్కే లేదు.

సోమనాధ్ జ్యోతిర్లింగాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి, తన దేశంలోని మసీదుల మెట్లలో తాపడం చేయడానికి తీసుకుపోయాడు ఘజనీ. రోజూ మసీదులకు వెళ్లే తురకలు వాటిని తొక్కుతూ మసీదులోపలకు పోవాలన్నది ఆ ప్లాను. ఇప్పటికీ ఆ మసీదులు అలాగే ఉన్నాయి. జ్యోతిర్లింగపు ముక్కలు ఆ మెట్లలోనే ఉన్నాయి. ఈనాటికీ వాటిని వేలాదిమంది తొక్కుతూనే ఉన్నారు.

అంతకుముందు 16 సార్లు చేసిన దోపిడీ దండయాత్రలలో ఒకసారి, కురుక్షేత్రం దగ్గరలోని థానేసర్ లో ఉన్న నిలువెత్తు విష్ణుభగవానుని విగ్రహాన్ని పెకలించి అదేవిధంగా ఆఫ్గనిస్తాన్ కు తీసుకుపోయాడు ఘజనీ. దానిని కూడా ముక్కలు చేసి, ఆ ముక్కలను రోడ్లనిర్మాణంలో, మసీదుమెట్ల నిర్మాణంలో వాడేశారు.

మరొక దండయాత్రలో మధురానగరాన్ని అందులోని వందలాది కృష్ణుని దేవాలయాలను ధ్వంసం చేశాడు గజనీ. మళ్ళీ ఆ సంపదను కూడా ఆఫ్గనిస్తాన్ కు తరలించాడు.

ఆఫ్గనిస్తాన్ కు దరిద్రం పట్టడానికి, నేటికీ కూడా నిత్యయుద్ధాలతో అగ్నిహోత్రంలాగా మండుతూ, ఏ విధమైన ఎదుగుదలా లేకుండా, అందరినీ అడుక్కుంటున్న దేశంగా ఉండిపోవడానికి ఇవే ముఖ్యమైన కారణాలు.

1026 CE లో చేసిన దండయాత్రలో, సోమనాథ్ ఆలయఖజానాలో ఉన్న బంగారాన్ని, కోటిపైగా బంగారునాణేలను, వజ్రాలను, లోహవిగ్రహాలను, యాభైఏనుగులు మరియు వందలాది గుఱ్ఱాలపైన తరలించుకుని ఆఫ్గనిస్తాన్ కు తీసుకుపోయాడు ఘజనీ.

అయితే, తిరుగుప్రయాణంలో, వచ్చినదారిలో వెళ్లకుండా, రాన్ ఆఫ్ కచ్, మరియు థార్ ఎడారుల ద్వారా దారిని ఎంచుకోవడం గజనీ చేసిన ఘోరమైన తప్పై కూచుంది. తిరుగుప్రయాణం వారికి నరకాన్ని చూపించింది.

తీవ్రమైన ఎడారిఎండలో వారాలతరబడి ప్రయాణాన్ని తట్టుకోలేక, త్రాగడానికి నీళ్లు లేక, దాదాపు 30 వేలమంది సైనికులు దారిలోనే చనిపోయారు. సగంకంటే తక్కువమంది సైనికులతో తన రాజ్యానికి చేరుకున్నాడు ఘజనీ. అప్పటినుంచీ ఏదో అంతుబట్టని రోగం అతన్ని వెంటాడింది. కొంతమంది చరిత్రకారులు అది మలేరియా అన్నారు, ఇంకొంతమంది టీబీగా తేల్చారు. కొందరు ఎడారిజ్వరం అన్నారు. కొందరు మాత్రం 'రుద్రుని కోపం' అన్నారు. ఏదేమైనప్పటికీ, నాలుగేళ్లు తిరక్కుండానే, 1030 CE లో అతను చనిపోయాడు. అతని వంశం అధికారకుమ్ములాటలతో అంతమైపోయింది.

వెయ్యేళ్ళు గడిచాయి.

మనకు స్వతంత్రం వచ్చిన తరువాత సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ నిర్మించుకున్నాం. అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ పనికి అండగా నిలబడి ఆలయాన్ని పూర్తి చేయించారు. వారి ప్రయత్నాలను హిందూధర్మవ్యతిరేకి  అయిన ప్రధానినెహ్రూ  వ్యతిరేకించాడు. కానీ వీళ్ళు వినలేదు. ఆలయం మళ్ళీ నిర్మించబడింది.

నేడు మోడీగారి ప్రభుత్వపు చొరవతో, సోమనాథ్ ఆలయం మళ్ళీ అప్పటి కళాకాంతులతో వెలుగుతూ భవ్యమైన మందిరంగా నిలబడింది. శివలింగానికి నమకచమకాలతో రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. వేదఘోష ఆలయంలో ప్రతిధ్వనిస్తోంది.

ఘజనీలాంటి పిచ్చికుక్కలు మాత్రం చరిత్రపుటలలో కలసిపోయారు. అమాయకులను చంపి, అద్భుతమైన ఒక సంస్కృతిని నాశనం చేశాననుకుంటూ, దోచుకున్న డబ్బుతో ఒక వెలుగు వెలిగిన ఆఫ్గనిస్తాన్ నేడు అడుక్కుతినే దేశమైపోయింది. భారతదేశమేమో అగ్రరాజ్యంగా అవతరించడానికి శరవేగంతో ముందుకు దూసుకుపోతోంది.

కానీ, వెయ్యేళ్ళు గడిచినా రాక్షసులు అంతం కాలేదు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఇరాన్, టర్కీ, ఖతార్ మొదలైన  రూపాలలో ఇంకా ఉన్నారు. మనదేశానికి ఎసరు పెట్టాలని చూస్తూనే ఉన్నారు.  నిన్నగాక మొన్న జరిగిన సౌదీ, పాకిస్తాన్, టర్కీల డిఫెన్స్ ఒప్పందమే దీనికి తార్కాణం.  'ఇస్లామిక్ నాటో' గా రూపొంది భారతదేశాన్ని ఓడించి, ఆసియాను శాసించాలనేది వీరి వ్యూహం. దీనికి రూపకర్త, విశ్వాసం లేని కుక్క పాకిస్తాన్. దానికి అండ చైనా వంటి ఇతరదేశాలు.

గజనీ వీళ్ళరూపంలో మాత్రమే లేడు. ఇండియాలోనే ఉంటూ శత్రుదేశాలకు వంతపాడే కొంతమంది నాయకుల, ప్రజల రూపాలలో కూడా ఉన్నాడు. వీరందరి బారినుండి, భారతదేశాన్ని రక్షించడానికి బీజేపీ, ఆరెస్సెస్ లున్నాయి గనుక ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. మనం సురక్షితంగా ఉన్నాం. అదే, దేశపుపగ్గాలు వేరేపార్టీల చేతులలో ఉంటే మన దేశపరిస్థితి ఇంకెలా ఉండేదో ఊహిస్తే భయమేస్తుంది.

ఈనాటికీ మన దేవాలయాలలో దూరి నమాజ్ చెయ్యాలని ప్రయత్నించేవారు, అక్కడే మూత్రవిసర్జన చేసేవారు, విగ్రహాలను అవమానించేవారు చాలామంది ప్రతిరోజూ న్యూసులో కనిపిస్తున్నారు. వీళ్ళంతా  'మానసిక స్థిమితం లేనివాళ్లు' అనే మెడికల్ సర్టిఫికెట్ వెనుక దాక్కుని తప్పుకుంటున్నారు. బుద్ధిలేని కొన్నిరాష్ట్రాలు దీనిని చూసీచూడనట్లు పోతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు దీనిని బాహాటంగా సపోర్ట్ చేస్తున్నాయి. ఇది లాంగ్ రన్ లో మొత్తం దేశానికే చేటౌతుందన్న విషయం చాలామందికి అర్థం కావడం లేదు.

'మెత్తగా ఉంటే మొత్తబుద్ది' అని సామెతుంది. అతిమంచితనం అసలుకే మోసం అవుతుంది.

హిందూమతాన్ని, హిందూదేవతలను, హిందూదేశాన్ని, ఎవరు అవమానించినా వాళ్లకు 'షరియా' ప్రకారం తక్షణశిక్షలు పడాలి. మతిస్థిమితం లేనివాళ్లయితే, మతి వచ్చేవరకూ, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వం ఆ పనిని చేయకపోతే ప్రజలే చేయాలి. అటువంటి చైతన్యం ప్రజలలో వచ్చిననాడే మనదేశానికి రక్ష.

'హిందువులు ఒకళ్ళ జోలికి అనవసరంగా పోరు' అనేది అందరికీ తెలుసు. అదే మనకు శాపమైంది. 'వాళ్ల జోలికి పోతే ఊరుకోరు' అనే విషయం కూడా అందరికీ అర్ధం కావాలి.

సోమనాథ్ ఆలయాన్ని మనం తిరిగి నిర్మించుకున్నాం. అదేవిధంగా, గజనీకూడా మళ్ళీ బ్రతికి లేస్తున్నాడు. ఈ యుద్ధం అంత తేలికగా ముగిసేటట్లు కనిపించడం లేదు. అలా ముగియాలంటే, భారతీయులలో హిందూచైతన్యం రావాలి. 

లేకపోతే మాత్రం, ఇస్లామిక్ నాటో రూపంలో మళ్ళీ  ప్రాణం పోసుకుంటున్న ఘజనీ దాడులకు మనదేశం గురికాక తప్పేటట్లు లేదు.

ఈసారి యుద్ధంలో గజనీ గెలుస్తాడా? మనం గెలుస్తామా? చూడాలి.

read more " సోమనాథ్ ఆలయ కథ - ఇస్లామిక్ నాటో "

PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా?

మొన్న 12 వ తేదీన ప్రయోగించిన PSLV - C 62 రాకెట్ విఫలమైంది. 

టెక్నికల్ కారణాలు ఏవైనా ఉండవచ్చు గాక ! జ్యోతిష్య కారణాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. 

ఆ రోజున ఉదయం 10. 12 కి గ్రహస్థితిని నేను పరిశీలించాను. ఇంతకంటే పనికిరాని ముహూర్తం ఇంకెక్కడా ఉండదు. ఇది విఫలం కావడానికి పెట్టిన ముహూర్తంలాగా ఉంది గాని, సక్సెస్ కు పెట్టిన ముహూర్తంలాగా లేదు.

జ్యోతిష్యశాస్త్రాన్ని వారు లెక్కిస్తారో లేదో నాకు తెలియదు. కానీ, జరిగిన నష్టంతో పోల్చుకుంటే, నమ్మకం అంత ముఖ్యం కాదన్న చిన్నవిషయం వాళ్ళ లాజిక్ కు తట్టి ఉండాలి.

లేదా, సోకాల్డ్ సెలబ్రిటీ జ్యోతిష్కుల మాయలోనన్నా వాళ్ళు పడి ఉండాలి. అది అసాధ్యమేమీ కాదు.

లేదా, వివేకానందుని పుట్టినరోజు కాబట్టి మంచిరోజని భావించారా? 1863 లో వివేకానందస్వామి పుట్టినపుడు జనవరి 12 న ఉన్న గ్రహస్థితులు వేరు. 2026 లో అలా ఉండవు. ఉత్త తేదీలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఇబ్బందులు ఇవే మరి !

పైగా, లౌకికంగా చూస్తే, వివేకానందస్వామిది అంత అదృష్టజాతకమేమీ కాదు. ఆ విధంగా చూచినా, ఆ తేదీని రాకెట్ ప్రయోగానికి ఎంచుకోకూడదు.   

అయినా, PSLV రాకెట్ల ప్రయోగంలో అంత అనుభవం ఉన్న ఇస్రో, మూడవదశ ఇగ్నిషన్ లో ఎలా విఫలమౌతుంది? అన్నది అసలైన ప్రశ్న. ఇది ప్రయోగాత్మకదశ కాదుగా ! రాకెట్ టెక్నాలజీని ఇప్పుడు క్రొత్తగా ఇస్రో నేర్చుకోవడం లేదుగా ! PSLV ప్రయోగం ఇస్రోకు క్రొత్త కాదు కూడా !

తప్పులనుంచి నేర్చుకోవడం మంచిదే. కానీ నిర్లక్ష్యంవల్ల ఆ తప్పులు మాటిమాటికీ జరుగకూడదు. ప్రజాధనం విలువలేనిది కాదుగా !

నమ్మకమా? నష్టమా? అనిన ప్రశ్న వచ్చినపుడు, ఒక చిన్న నమ్మకాన్ని పాటించి నష్టాన్ని తప్పుకోవడం తెలివైనవారి లక్షణం కాదా?

read more " PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా? "

2, జనవరి 2026, శుక్రవారం

36 వ 'విజయవాడ పుస్తక మహోత్సవం' మొదలైంది

 


Stall Number : 186  

Dates : 2-1-2026 to 12-1-2026

Timings : 2 Pm - 9 Pm

Venue : Indira Gandhi Municipal Corporation Stadium, Vijayawada.

read more " 36 వ 'విజయవాడ పుస్తక మహోత్సవం' మొదలైంది "