“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, ఆగస్టు 2023, గురువారం

WELL DONE ISRO

23 ఆగస్టు 2023

ఇండియా చరిత్రలో మరపురాని రోజు.

చంద్రుని దక్షిణధృవం పైన ఇండియా పంపిన లాండర్ దిగింది.

ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం మన దేశమే అయింది.

కేవలం 615 కోట్ల ఖర్చుతో ఈ పనిని ISRO సాధించింది. ఇది ఒక మల్టీ స్టారర్ బాలీవుడ్ సినిమా తియ్యడానికి అయ్యే ఖర్చుకంటే తక్కువే. ఇండియన్ రాకెట్ల కున్న శక్తి కూడా తక్కువే. కానీ భూమి, చంద్రుల గ్రావిటీని తెలివిగా వాడుకుని ISRO ఈ విజయాన్ని సాధించింది. అంటే, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిని చెయ్యగలిగింది. ఇదే అసలైన తెలివికి నిదర్శనం.

ఇది ప్రతి భారతీయుడు గర్వపడవలసిన క్షణం. పండుగ చేసుకోవలసిన క్షణం.

ఈ విజయం ఒక్కరోజుతో రాలేదు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అపజయాలకు భయపడకుండా, ముందటి తప్పులను దిద్దుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసిన పట్టుదలలు ఉన్నాయి. ఏ విజయానికైనా ఇవే దారులు.

నిద్రాహారాలు మానుకుని ఏళ్లకేళ్లు పనిచేసి ఈ కలను  నిజం చేసిన ISRO శాస్త్రవేత్తలను, వారి వెన్ను తట్టి ప్రోత్సహించిన మోడీగారిని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. చంద్రయాన్ -2 విఫలమైనప్పుడు, అప్పటి ISRO చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.  మోదీజీ ఆయన వెన్నుతట్టి ఓదార్చి 'పరవాలేదు మళ్ళీ చేద్దాం' అన్నారు. మోదీగారికి మనం ప్రణామాలు అర్పించాలి.

అయితే, యధావిధిగా అనేక దేశాల, మనుషుల స్పందన చాలా నీచంగా ఉంది.

ఇండియాలో అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, హేతువాద, నాస్తిక, క్రైస్తవ సంఘాలు, ముస్లిములలో ఎక్కువమంది నెగటివ్ కామెంట్స్ ఇచ్చారు. లేదా మౌనంగా ఉండిపోయారు. ఇది వాళ్ళ దేశభక్తి లేమికి పక్కా నిదర్శనం.

కొందరేమో ఈ విజయాన్ని నెహ్రూ కు అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు గాంధీ, నెహ్రూ అనే ఇద్దరు వ్యక్తులు లేకపోయి ఉన్నట్లయితే, మనకు స్వాతంత్రం ఇంకా ముందే వచ్చి ఉండేది. దేశం ఇంకా త్వరగా ఎదిగి ఉండేదని, నేడు ఉన్నన్ని సమస్యలు ఉండేవి కావని నా నమ్మకం. దీనికి చారిత్రిక ఆధారాలున్నాయి. గాంధీ నెహ్రూలను భారతీయులు ఎంత త్వరగా పక్కన పెడితే దేశానికి అంత మంచిది.

ఇకపోతే, అగ్రరాజ్యాలు అసూయతో రకరకాల కామెంట్స్ చేశాయి. బ్రిటన్ పౌరులు అయితే, 'చంద్రునిపైకి రాకెట్ పంపగలిగిన దేశానికి మనం ధనసాయం చెయ్యడం ఏంటి? ఇప్పటిదాకా ఇచ్చిన సాయాన్ని వెనక్కు కట్టమని ఒత్తిడి చెయ్యాలి' అని నీచంగా కామెంట్ చేశారు. గతంలో ఒకసారి, 'బ్రిటన్ మనకు చేసే ధనసాయం పీనట్స్ లాంటిది' అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పైగా, ఆ డబ్బులో ఎక్కువశాతం NGOs కు పోతుంది. అవేమో, మతమార్పిళ్లకు ఆ డబ్బును వాడుతున్నాయి. ఏదో పెద్ద ఇండియాను ఉద్ధరిస్తున్నట్టు పోజొకటి.

నెటిజన్స్ చాలా బాగా ఈ ఏడుపును తిప్పి కొట్టారు.

'రెండు వందల ఏళ్లు మా దేశాన్ని దోచుకుని 45 ట్రిలియన్ డాలర్లు బ్రిటన్ ఎత్తుకు పోయింది. అందులో మీ ఎయిడ్ 35 బిలియన్లు తగ్గించి మిగతా డబ్బు వెంటనే ఇండియాకు చెల్లించాలి. అంతకంటే ముందు మా కోహినూర్ వజ్రం మాకివ్వండి' అంటూ వాళ్ళు దీటుగా స్పందించారు 

'నీవలె నీ పొరుగువాడిని ప్రేమించు' అని జీసస్ చెప్పాడని మిషనరీలు ఊదరగొడతారు. మరి పొరుగుదేశం సాధించిన ఒక ఘనవిజయాన్ని మనస్ఫూర్తిగా ఎందుకు అభించనందించలేకపోతున్నాయి క్రైస్తవ దేశాలు? ఏమిటీ హిపోక్రసీ? 

భూమి బల్లపరుపుగా ఉందన్న బైబిల్ వాక్యాలను ఇప్పటికీ నమ్మే క్రైస్తవ దేశాలనుంచి ఒక మంచిమాటను ఆశించడం తప్పే కదూ?

చంద్రుడు రెండు ముక్కలు అయ్యాడని ముస్లిములు ఇప్పటికీ భావిస్తారు. ఖురాన్ లో ఇది సూరా 54. 1-2 లలో వ్రాయబడి ఉంది. అది నిజం కాదని, పక్కా అబద్దమని  ఇలా ఎప్పుడూ జరగలేదని సైన్స్ రుజువుచేసినా కూడా, వాళ్లదే మాటకు కట్టుబడి ఉన్నారు. అలాంటి మతాలను అనుసరించే దేశాలనుంచి ఒక మంచిమాటను ఎలా ఆశించగలం?

పాకిస్తాన్ అయితే కుళ్ళుతో చచ్చిపోయేలాగా ఉంది. అలాంటి బెగ్గర్ కంట్రీ అభిప్రాయాలను మనం అస్సలు  పట్టించుకోనవసరం లేదు.

అయితే కొంతమంది పాకిస్తానీలు మంచి జోకులేసారు.

'మేమున్నది చంద్రుడి పైనే. ఇండియా ఉత్త ల్యాండర్ ను మాత్రమే పంపింది. మేము  ఆల్రెడీ అక్కడే ఉన్నాం. చంద్రుడి పైన కరెంట్ ఉండదు. తాగటానికి నీళ్లుండవు. ఏమీ దొరకదు. పాకిస్తాన్లో కూడా అంతే. మేం చంద్రుడి పైన నివశిస్తున్నాం' అని ఒక పాకిస్తానీ ఏడవలేక నవ్వుతూ అన్నాడు.

గత 75 ఏళ్లుగా  ఇండియా ఎదుగుదలను అగ్రరాజ్యాలు అడుగడుగునా అడ్డుకున్నాయి.  ఒకానొక సమయంలో, మనకు క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ ఇవ్వడానికి అమెరికా ససేమిరా ఒప్పుకోలేదు. ఆ సమయంలో రష్యా ఒక్కటే మనకు సాయం చేసింది. సహజంగా రష్యా నుండి మనకు హృదయపూర్వకమైన అభినందనలు వెల్లువెత్తాయి. వాళ్ళ లూనా-25 కొద్దిరోజుల క్రితమే చంద్రునిపైన కూలిపోయింది. అయినా సరే, మనల్ని వాళ్ళు అభినందించారు. అదీ అసలైన స్పిరిట్ అంటే !

ఇతర దేశాలలో అయితే, మన మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్ లు, ఇంకా ఆస్ట్రేలియా మాత్రమే మనల్ని నిజంగా అభినందించాయి. మిగతా అన్ని దేశాలు ఏడుస్తూనే కంగ్రాట్స్ చెప్పాయి.

1970 లలో లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఇంజన్ కు, క్రయోజెనిక్ టెక్నాలజీకి ఇండియాలో ఆద్యుడైన ISRO సైంటిస్ట్ నంబి నారాయణన్ ను, అతని సహచరులైన, శశి కుమారన్, చంద్రశేఖరన్, SK శర్మలను దొంగకేసులో ఇరికించి, వారి జీవితాలను నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళను జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఈ కుట్ర వెనుక CIA హస్తం ఉంది. ఏమంటే, ఇండియా ఎదగడం అమెరికాకు ఇష్టం లేదు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడింది. సుదీర్ఘంగా సాగిన ఈకేసు చివరకు కొట్టివేయబడింది.  వీళ్ళు నిర్దోషులు అని రుజువైంది. కానీ వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. ఈలోపల మన స్పేస్ ప్రోగ్రాం 30 ఏళ్లు వెనుకబడి పోయింది. కాంగ్రెస్ సాయంతో అమెరికా ఇంత కుట్రను తెరవెనుక ఉండి నడిపించింది.

మోడీ గారి ప్రభుత్వం వచ్చాక మాత్రమే, 2019 లో, నంబి నారాయణన్ గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వబడింది. ఈయన వ్రాసిన పుస్తకం, 'Ready to fire: How India and I survived the ISRO spy case' అనే పుస్తకాన్ని చదవండి. నిజాలు తెలుస్తాయి.

ఎవరెలా ఏడ్చినా, ఇండియా ఎదుగుదలను ఏ శక్తీ ఆపలేదు. ఈ శతాబ్దం ఇండియాదే. ఇండియన్స్ లీడర్స్ గా లేకుండా ఏ రంగమూ నేడు ప్రపంచంలో లేదు.

సౌత్ ఆఫ్రికా నుంచి మాట్లాడుతూ మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు, 'ఈ విఙయం ఒక్క ఇండియాదే కాదు. యావత్తు మానవాళిది' అనే అద్భుతమైన మాటన్నారు. అదీ అసలైన మానవత్వంతో కూడిన విశాల మనస్తత్వం అంటే ! ఒక్క హిందువు నోటివెంట మాత్రమే అలాంటి విశ్వజనీనమైన మాట వస్తుంది.

సోమనాధ్ ఆలయం పతనంతో ఇండియా పతనం మొదలైంది. కాశీ విశ్వేశ్వరాలయ ధ్వంసంతో ఇండియా నాశనం కావడం మొదలైంది. అయోధ్యలో రామాలయం విధ్వంసంతో ఇండియా కూడా నాశనం కావడం మొదలైంది.

ఈ మూడూ తిరిగి నిర్మించబడుతున్నాయి. మోదీగారి నాయకత్వంలో ఇండియా మళ్ళీ సూపర్ పవర్ కాబోతోంది.

ISRO  చైర్మన్ పేరుకూడా సోమనాథ్ కావడం కాకతాళీయమా? నేనైతే కాదనే అంటాను.

బయటనుండి వచ్చిన జాతులు, మతాలు  వందలాది ఏళ్లుగా మన దేశాన్ని  అనేక విధాలుగా ఛిన్నాభిన్నం చేశాయి. వాటి కుట్రలు బయటపడి, దేశంలో హిందూమత పునరుజ్జీవనం అయితేనే దేశం మళ్ళీ సూపర్ పవర్ అవుతుంది. ఎవరెన్ని చెప్పినా ఇది సత్యం.

ఇంతకు ముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను.

ఇంకో నూరేళ్ళపాటు మోడీగారే మన ప్రధానమంత్రిగా ఉండాలి. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఇంకా ఇదే టీమ్ ఆయనతో పనిచేయాలి. దేశద్రోహుల ఆటలు అంతం చెయ్యాలి. ఇదే వేగంతో ఇండియా ఎదగాలి. సూపర్ పవర్ కావాలి. వివేకానందుడు, సుభాష్ చంద్రబోస్, అరవిందో మొదలైన ఎందరో మహనీయులు కన్న కలలు నిజం కావాలి.

ఇది కోట్లాదిమంది దేశభక్తుల స్వప్నం.

ఇది నిజం కావాలని మన దేశపు దేవతలైన శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని, ఈశ్వరుడిని, అమ్మవారిని  ఇతర దేవతలను, మహర్షులను, గురువులను, మహనీయులను ప్రార్ధిద్దాం.

జై హిందూస్థాన్ ! జై మోదీజీ !

జై భరతమాత !

read more " WELL DONE ISRO "

17, ఆగస్టు 2023, గురువారం

ఆ రొచ్చు నాకొద్దు

యధావిధిగా మా ఫ్రెండ్ ఉదయాన్నే ఫోన్ చేశాడు.

నేను రిటైరయ్యాను. తనింకా సర్వీస్ లో ఉన్నాడు. ఇంకో నాలుగు నెలలలో తనూ రిటైర్ అవుతాడు.

ఆమాటా ఈ మాటా మాట్లాడాక, 'ఫలానా వాడి గురించి తెలిసిందా?' అని అడిగాడు.

ఈ ఫలానా అనే అతను కూడా నాతోబాటే రిటైరయ్యాడు.

నేను రైల్వే వదిలేసి ఏడాది దాటింది. సర్వీసులో ఉన్నప్పుడే ఆ రొచ్చు రాజకీయాలకు నేను దూరంగా ఉండేవాడిని. ఇక ఇప్పుడెందుకు? రైల్వే పక్షులతో నాకేంటి పని? పట్టించుకోవడం మానేశాను.

'ఏం పోయాడా?' అన్నాను.

'ఛీ అదేం కాదు. రిటైరయ్యాక, ఒక తెలిసినాయని పట్టుకుని ప్రెవేట్ ఉద్యోగంలో చేరాడు. హైద్రాబాద్ లో ఫ్రీ క్వార్ట్రర్స్. ఫ్రీ కారు. నెలకు లక్ష జీతం' అన్నాడు.

'మంచిదే' అన్నాను.

'నువ్వూ ట్రై చెయ్యచ్చుగా' అన్నాడు.

'నాకంత  పరిగెత్తాలని లేదు. నన్నిలా బ్రతకనీ' అన్నాను.

'అలాకాదు. ఊరకే కూచునే బదులు కాసేపు ఆఫీసుకి పోయి వస్తే లక్ష వస్తుంది కదా? ఎందుకు పోగొట్టుకోవడం?' అన్నాడు.

తను చెప్పేది వాస్తవమే. అలా చేస్తున్న వాళ్ళు మా కొలీగ్స్ లో చాలామంది ఉన్నారు.

'జీవితంలో అతని గోల్స్ వేరు. నా గోల్ వేరు. నేనేమీ ఊరకే కూచుని లేను. చేయవలసిన  సాధన ఎంతో ఉంది. జీవితమనేది ఒక్క డబ్బు కోసమే కాదు. చచ్చేదాకా డబ్బుకోసం నేను బ్రతకలేను. ఆ వెట్టిచాకిరీ నాకొద్దు. నీకు ఆశ ఉంటే నాలుగు నెలల తర్వాత నువ్వు ట్రై చెయ్యి' అన్నాను.

'ఊరకే చెప్పాను. నాకూ అంత అవసరం ఏమీ లేదులే' అన్నాడు.

'మంచిది. ఎవరి జీవితం వారిది. ఎవరి గోల్స్ వారివి. అందరూ  ఒకేలాగా ఎలా ఉంటారు? డబ్బుకు మితం ఎక్కడుంది? ఎక్కడో ఒకచోట 'ఇకచాలు' అంటూ నువ్వు గీత  గీసుకోక తప్పదు. లేకపోతే, ఆ పరుగులో ఏదో ఒకరోజున ఆఫీస్ టేబుల్ ముందే హార్ట్ ఎటాక్ తో పోవలసి వస్తుంది. అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాం కదా మన సర్వీసులో. అలాంటి జీవితం నాకొద్దు. ఎందుకా బ్రతుకు?' అన్నాను.

'సర్లే నీ భావాలు అందరికీ నచ్చవు' అన్నాడు ఫ్రెండ్.

'నచ్చాలని నేనేమీ చెప్పడం లేదు. అలా ఆశించడమూ లేదు. కాస్త కళ్ళు తెరిచి జీవితాన్ని విశాలంగా చూడమని మాత్రమే అంటున్నాను. బావిలో కప్పలాగా చివరిక్షణం వరకూ డబ్బు, సుఖాలు అంటూ బ్రతకవద్దని మాత్రమే అంటున్నాను. అంతే' అన్నాను.

'ఉంటామరి' అని ఫోన్ పెట్టేశాడు ఫ్రెండ్.

నవ్వుకుంటూ నా పనిలో పడ్డాను.

read more " ఆ రొచ్చు నాకొద్దు "

4, ఆగస్టు 2023, శుక్రవారం

దేశంలో సివిల్ వార్ తప్పదా?

అది 1988 మే నెల. నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ చేసి AP ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ నుంచి వెనక్కు వస్తున్నాను. నాతోబాటు కొంతమంది యువకులు అదే కోచ్ లో వస్తున్నారు. మాటల్లో, వారంతా IAS ట్రైనింగ్ పూర్తి చేసుకుని, AP కేడర్ అలాట్ అయి, హైద్రాబాద్ లో రిపోర్ట్ చెయ్యడానికి వెళుతున్నారని తెలిసింది. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయి వెనక్కు వెళుతున్నానని చెప్పాను. హైద్రాబాద్ దాకా కలిసి ప్రయాణం చేశాం గనుక, ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి. దేశ రాజకీయాలు మాట్లాడుకుంటున్నపుడు, వాళ్ళ లీడర్ లాగా కనిపిస్తున్న ఒకాయన ఇలా అన్నాడు, 'మన దేశంలో ఎప్పటికైనా సివిల్ వార్ తప్పదు. జనం రోడ్లమీద కొట్టుకునే పరిస్థితి ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా వస్తుంది. మన రాజకీయ నాయకులు దేశాన్ని అటువైపు తీసుకుపోతున్నారు '.

నేనప్పటికే LLB పూర్తి చేసి ఉన్నాను. లా లో Indian Constitutional Law నా ఫెవరెట్ సబ్జెక్ట్. ఆయనతో నేనిలా అన్నాను. 

' నేటి రాజకీయ నాయకుల సంగతి అలా ఉంచండి. అసలు మన రాజ్యాంగ రూపకర్తలు ఏం చేశారో చెప్పండి. సివిల్ వార్ వైపు దారితీసే విధంగానే మన రాజ్యాంగాన్ని రచించారని నా ఉద్దేశ్యం. నేటి రాజకీయ నాయకులు దానికి ఆజ్యం పోస్తున్నారంతే. కనుక వీళ్ళను అనుకోవడం దండగ. అసలు మూలాలు రాజ్యాంగంలోనే ఉన్నాయి. ఆర్టికల్ 370 కంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదనుకుంటాను. మనం కట్టే టాక్స్ తో బడ్జెట్ సపోర్ట్ తీసుకుంటూ, పాకిస్తాన్ ను సపోర్ట్ చేస్తోంది జమ్ము కాశ్మీర్ రాష్ట్రం. అయినా మనం దానికి కోటానుకోట్లు ప్రతి ఏడాదీ సరఫరా చేస్తూనే ఉన్నాం. ఏంటిది? ఇలాంటివి రాజ్యాంగంలో ఎన్నో లొసుగులున్నాయి.  రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే దేశభక్తి ఉన్న నాయకులు వస్తే తప్ప సివిల్ వార్ దిశగా దేశం ప్రయాణించడం ఆగదు. అప్పటిదాకా ఆ లొసుగులను వాడుకునే దుష్టశక్తులు ఉంటూనే ఉంటాయి'

నేను చెబుతున్న వాస్తవం ఆయనకు అర్థమైనా, IAS కదా, వాదన కోసం ఏవేవో పాయింట్స్ లేవనెత్తి వాదన పెట్టుకున్నాడాయన. ఆర్గ్యుమెంట్ అనేది ఎటూ తేలదు గనుక ఇద్దరమూ ఎవరి లాజిక్ వారిదే అన్నట్లుగా మాట్లాడుకున్నాము. హైదరాబాద్ వచ్చింది. ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయాము. ఈ బ్యాచ్ అందరూ అప్పటి CM, NTR ను కలిసి దిగిన ఫోటోను మర్నాడు పేపర్లో చూచాను. ఆరోజు నాతో మాట్లాడిన వ్యక్తి 30 ఏళ్ల తర్వాత చీఫ్ సెక్రటరీ గా రిటైర్ అయ్యాడు. పేరు చెప్పను. ఈపాటికి మీకే అర్ధమై ఉంటుంది.

ఆరోజు నేను లేవనెత్తిన పాయింట్స్ తర్వాతి కాలంలో అక్షరాలా నిజాలయ్యాయి. కాలక్రమంలో ఆర్టికల్ 370 ప్రక్కకు తప్పుకుంది. కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగమైంది. కానీ మిగతా ఎన్నో చిచ్చులు ఎన్నో రాష్ట్రాలలో రగులుకుంటూనే ఉన్నాయి. మణిపూర్ లో నిన్నగాక మొన్నటిదాకా జరిగిన దౌర్జన్యకాండ, నాలుగు రోజులనాడు హర్యానాలోని నూహ్ లో హిందువుల జలాభిషేక యాత్రపైన ముస్లిములు చేసిన దాడి, మారణకాండలు నా మాటలకు నిదర్శనాలు. ఆరోజున ఆ IAS చెప్పినది కూడా నిజమే. దేశం సివిల్ వార్ వైపే ప్రయాణిస్తోంది. అది కూడా బీజేపీ లాంటి దేశభక్త ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇలా జరుగుతోంది. ఇక హిందూ వ్యతిరేక పార్టీలు అధికారంలో కొస్తే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత వేగంగా దేశం నాశనం వైపు దూసుకు పోతుందో  తేలికగా ఊహించవచ్చు.

మణిపూర్ లో హిందువులు 45 శాతం ఉంటే, క్రైస్తవులు 45 శాతం ఉన్నారు. నూహ్ లో ముస్లిములు 80 శాతం ఉంటే, హిందువులు 20 శాతమే ఉన్నారు.  మరి హిందువుల అణచివేత జరగక ఏం జరుగుతుంది? మణిపూర్లో అయితే ఇది హిందూ క్రిష్టియన్ సమస్య మాత్రమే కాదు. మైతీ, కుకీ తెగల మధ్యన జరుగుతున్న యుద్ధం అది. బర్మాతో మనకున్న ఓపెన్ బార్డర్ లోనుంచి జొరబడుతున్న విదేశీ శక్తుల అరాచకాలతో అక్కడ అలా ఉంది. నూహ్ లో అయితే, బాంగ్లాదేశ్ రోహింగ్యాల గుంపులు రాజ్యమేలుతున్నాయి. దానికి మినీ పాకిస్తాన్ అని పేరుంది. మొన్న జరిగిన దౌర్జన్యకాండలో బజరంగ్ దల్ కార్యకర్తలను, హోమ్ గార్డ్స్ ను దారుణంగా చంపేశారు. మేజిస్ట్రేట్ ను ఎటాక్ చేశారు. పోలీసులను ఎటాక్ చేసి గాయపరిచారు. పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేశారు. కార్లు, ద్విచక్రవాహనాలు ఎన్నో తగలబెట్టారు. శివాలయాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేయబోయారు. ఇదంతా ఇండియాలో  హర్యానా రాష్ట్రంలో నిన్నగాక మొన్న జరిగింది.  ముస్లిములు 80% కు చేరుకున్నప్పుడు, అందులోను రోహింగ్యాలు తండోపతండాలుగా సెటిల్ అయ్యి ఉన్నచోట, లా అండ్ ఆర్డర్ లేనిచోట హిందువులకు అలా జరగక ఇంకెలా జరుగుతుంది?  అసలు, పరిస్థితి ఇంతవరకూ వస్తుంటే, చూస్తూ ఊరుకున్న ప్రభుత్వాలది తప్పు. చేతులు కాలాక, చేతులు దాటిపోయాక, లబోదిబో అంటే ఉపయోగమేముంటుంది?

ఇండియాను విచ్ఛిన్నం చేయాలని పాకిస్తాన్, చైనాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2024 లో ఎలక్షన్లు వస్తున్నాయి. అందుకని నానా రకాలుగా కుట్రలు కుతంత్రాలతో దేశంలో అల్లకల్లోలం రేపాలని ప్రయత్నిస్తున్నాయి. సెక్యులర్ వాదులు మనదేశం తిండి తింటూ పరాయిదేశాలకు వంత పాడుతున్నారు. అందుకే ప్రతిచోటా ఈ ఘోరాలు.

కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ, ఈ నాలుగు పనులపైన దృష్టి పెట్టకపోతే, దేశంలో సివిల్ వార్ తప్పకుండా వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు. అంతే.

అవి, 

1. జనాభా పెరుగుదలను ఆపాలి.

2. మత మార్పిళ్లను ఆపాలి.

3. సరిహద్దుల నుంచి విదేశీ చొరబాట్లను ఆపాలి.

4. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు చెయ్యాలి.

ఇది జరగక పోతే మాత్రం ఏదో ఒకరోజున దేశంలో సివిల్ వార్ తప్పదు. మొన్నటి దాకా మణిపూర్లో, నిన్న హర్యానాలో జరిగింది అదే. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆర్మీని దించవలసిన పరిస్థితి వచ్చింది.  బెంగాల్, కేరళ, కర్ణాటక వంటి మిగతా చాలా రాష్ట్రాలు అదే దిశగా పోతున్నాయి.

ఇది నేను చెప్పడం లేదు. మేధావులందరూ ఇదే అనుకుంటున్నారు. వాస్తవం కూడా ఇదే.

read more " దేశంలో సివిల్ వార్ తప్పదా? "