చురకలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చురకలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

కృష్ణ కృష్ణా !

ఇవాళ కృష్ణాష్టమి.

మరి తెలుగురాష్ట్రాలలో చడీచప్పుడూ లేదేంటి?

హిందువుల ఇళ్లూ, గుళ్ళూ అన్నీ మౌనంగా ఉన్నాయేంటి?

ఓ సారీ ! మర్చేపోయాను.

మనకు పొరుగింటి పుల్లకూరే రుచి కదా !


అయినా  నా పిచ్చిగానీ,

సాయిబాబాలకూ, బోయబాబాలకూ, పీర్లకూ, ఫకీర్లకూ అభిషేకాలూ, పూజలూ చేసేవాళ్లకు పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? అసంభవం ! 

మహా అయితే ఆయననొక ద్వారపాలకుడిగా పెట్టేద్దాం !

అప్పయ్యస్వామి ఆధార్ కార్డునే.  తెలుగునాడుకు మార్చేసి, ఆ నీడన చక్కని వ్యాపారాలు చేసుకుంటున్నవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే సుమీ ! 

కేరళం కంటే గుజరాత్ ఇంకా దూరం కదా ! మరి గురువాయూర్ని మర్చిపోయారేంటో?

ఛిన్నమస్త చిన్నబోయినచోట, ప్రత్యంగిర పట్టించుకోని వేళ, రాధాదేవి మాత్రమే రక్షిస్తుంది. ఆ క్షణానికి ఆమె కావలసి వస్తుంది. మరుక్షణమే ఆమె పనికిరాకుండా పోతుంది. మళ్ళీ భయంకర హోమదేవతలే మనకు కావాలి. అవున్లే రాధాదేవి మన వ్యాపారానికి పనికిరాదు కదా !

మన బ్రతుకులింతే !

వ్రేలాడే శవమంటే వేలంవెర్రిగా పరిగెత్తేవాళ్లకు, జగన్మోహనుడైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే. 

ఆయనేమీ బిర్యానీ పెట్టి, ఖర్చులకు డబ్బులివ్వడు కదా ! రాత్రిపూట కూడికలూ, తీసివేతలూ నేర్పించడు కదా !  

గుండు సాధువులనూ, బండస్వాములనూ, 'ళ' కీ, 'ల' కీ తేడా తెలియని మహాయోగులనూ పూజించేవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? సహజమే కదా ! 

ఆయనేమీ వీళ్ళలాగా నైటీ వేసుకోడుగా !

అర్ధరాత్రిళ్ళు క్షుద్రదేవతలకు బొగ్గులూ ఎండుమిర్చిలతో హోమాలు చేసే క్షుద్రులకు చిన్నికృష్ణుని చిరునవ్వులెలా నచ్చుతాయి? అర్ధం చేసుకోగలం ! 

90 వచ్చినా, మాకింకా వయసుడిగి పోలేదుగా? కోరికలు చావలేదుగా? చిన్నికృష్ణుడిని పూజించడానికి?

మళ్ళీ నోరుతెరిస్తే అందరూ చెప్పేది భగవద్గీతా శ్లోకాలే ! కానీ శ్రీకృష్ణుడెవరికీ అక్కర్లేదు.

ఆయన ఎనిమిదేళ్ల వయసులోనే రాసలీలలు చేశాడంట ! గోపికలు స్నానాలు చేస్తుంటే బట్టలు కాజేసి చెట్టుపైన కూర్చున్నాడంట ! ఇదొక్కటే మనకు కనిపిస్తుంది. మనకు కావలసింది కూడా అదే కదా !

మనం చెయ్యాలనుకుంటూ, చేయలేకపోతున్న పనులన్నీ ఆయనెప్పుడో అయిదువేల ఏళ్ళక్రితమే చేసేశాడు. లక్కీ ఫెలో ! దీన్నే 'అసూయ' అంటారేమో? సర్లే ఏదో ఒకటి !

కానీ, అంతకు ముందే, గోవర్ధన పర్వతాన్ని చిటికెనవ్రేలితో ఎత్తి తనవారిని కాపాడాడు. నెలలపిల్లవాడుగా ఉన్నపుడే ఎంతోమంది రాక్షసులను సంహరించి, లోకపీడను వదిలించాడు. బోసినోటిలో విశ్వాన్ని చూపించాడు. అవెలా చేశాడు? మనకనవసరం ! అవన్నీ యశోదాదేవి భ్రమలు !

ఆ తర్వాత ఎన్నో మానవాతీతపు పనులను కూడా చేశాడు. రాజ్యాలేలాడు. రాజకీయాలు చేశాడు. మహాభారతయుద్ధాన్ని కూడా నడిపించాడు. 

ఆగండాగండి ! ఈ పాయింట్ మాకు బాగా నచ్చింది.

మేము కూడా మా ఆశ్రమం పై ఫ్లోరులో, అమ్మాయిలతో అర్ధరాత్రి, శివరాత్రి, డాన్సులెయ్యచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. వాళ్లేమో గోపికల అంశలతో పుట్టారు.

మేముకూడా రాజకీయులతో పొత్తులు పెట్టుకుని వాళ్ళ బ్లాక్ మనీని మా భూగృహాలలో దాచిపెట్టి, రాజకీయం చెయ్యవచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. కాకపోతే మా తర్వాత లారీలలో ఆ బంగారమంతా ఎక్కడికో తరలిపోతుంది. పోతేపోనీ. బ్రతికున్నన్నాళ్లు మా పబ్బం గడిచిందిగా !

మేముకూడా విద్యార్థులను స్థంభాలకు కట్టేసి కాల్చిపారెయ్యొచ్చు. మేమూ  కృష్ణుని అంశలమే. కేసులేమీ ఉండవు. ఏం? భారతయుద్ధాన్ని దగ్గరుండి నడిపించిన కృష్ణుడిపైన ఉన్నాయా?

కృష్ణుడు శివుడిని ఆరాధించాడట. మేముకూడా చేస్తాం. మాటమాటకూ 'షివా షివా' అంటాం. లేదా 'చెంబో చెంబో' అంటాం. కానీ ఆ చెంబెక్కడుందో మాకైతే తెలీదు. కైలాసయాత్రకని పోయి, దారితప్పి సరాసరి కైలాసానికే పోతాం. లేదా 'కైలాస' అని ఒక ద్వీపాన్నే కొనేస్తాం. దానికి మా ప్రధానగోపికని, సారీ శిష్యురాలిని, ప్రధానమంత్రిగా చేసేస్తాం. కృష్ణుడెప్పుడైనా ఇలాంటి పనులు చేశాడా? చేయగలిగాడా? కనుక ఆయనకంటే మేమే గొప్పవాళ్ళం.

'కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే' అని మా శాస్త్రాలంటున్నాయి. కానీ మేమాయనను పూజించము. మాకు భగవంతుడెందుకు? ఈరోజు మందుకెవడు డబ్బులిస్తే వాడే మా దేవుడు.

ఆయన మాకర్ధం కాడు. 

గౌడీయమఠానికీ, ఇస్కానుకే ఆయన అర్ధం కాలేదు. ఇక మాకెలా అవుతాడు?

అయినా మా పూజామందిరాలూ, పందిళ్ళూ ఖాళీగా లేవు. వాటిల్లో ఎక్కడ చూసినా పీర్లూ, ఫకీర్లూ, వ్రేలాడుతున్న శవాలూ, క్షుద్రదేవతలూ, గుండుగురువులూ, బండబాబాలూ, గడ్డం స్వాములూ, అజ్ఞాతసిద్ధులూ, విదేశీదేవుళ్ళూ, గురువులూ ఉంటారు. 

మా టేబిల్ మీదా, హాల్లోనూ, ప్రతిరాత్రీ యముడితో డిన్నర్ చేసి, మార్కింగ్ బ్రేక్ ఫాస్ట్ హిమాలయ బాబాజీతో చేసి, సాయంత్రానికి సిద్ధాశ్రమం దొడ్లో రెస్టు తీసుకునే పిరమిడ్లూ,  క్రియాయోగ గృహిణులూ, కళ్ళు మూసుకుంటే లోకలోకాలు తిరిగే NRI మహిళలూ, కాళికాదేవితో కబుర్లు చెప్పేవాళ్ళూ, లలితాదేవితో లంచ్ చేసేవాళ్ళూ, సహజయోగంతో మిమ్మల్ని అసహజంగా మార్చేసేవాళ్లూ, ఆ మిషనూ, ఈ మిషనూ అంటూ మిషన్లతో మిమ్మల్ని కుట్టేసేవాళ్ళూ, ఆత్మలతో మాట్లాడేవాళ్లూ, యక్షిణీలను ఎదుటకు రప్పించేవాళ్లూ, వీళ్ళ ఫొటోలే ఉంటాయి.

వీరి మధ్య కృష్ణుడికి చోటేది?

ఆయన పరిపూర్ణ అవతారమైతే మాకేంటి? కాకపోతే మాకేంటి? వితంతువులకూ, అనాదులకూ డబ్బులిస్తాడా లేదా? నిద్రపోతున్న మా కుండలినిని అయిదే అయిదునిమిషాలలో లేపుతాడా లేదా? మా మతవ్యాపారానికి పనికొస్తాడా లేదా? అది చెప్పండి !

మనల్ని ఆ శ్రీకృష్ణుడే రక్షించాలి. మనల్నే  కాదు. భూమి మొత్తాన్నీ ఆయనే రక్షించాలి.

రక్షిస్తాడా? మనలాంటి వాళ్ళని? ఒకవేళ ఏదైనా బలహీనక్షణంలో ఆయన ముందుకొస్తే మాత్రం, మనం రక్షించనిస్తామా?

ఏమో నాకైతే సందేహమే !

read more " కృష్ణ కృష్ణా ! "

31, ఆగస్టు 2026, సోమవారం

నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు

నేపాల్ దుర్ఘటన జరిగింది.

850+ మంది చనిపోయారు. 2500+ మంది ఆచూకీ లేరు. 

నిత్య, నైమిత్తిక ప్రళయాలకు ఇదొక ఉదాహరణ. 

కాకపోతే, ఇంటర్నెట్ గురువులెవ్వరికీ ఈ విషయం చూచాయగా కూడా ముందస్తుగా తెలియలేదు.

----------------------

వీరిలో ప్రతిరాత్రీ శంభలాకు చెంబుతీసుకొని పోయి వచ్చేవాళ్ళున్నారు. 

సిద్ధాశ్రమంలోనే పుట్టిపెరిగామని చెప్పుకునే హిమాలయయోగులున్నారు. 

కైలాసపర్వతంలో వారంవారం జరిగే సీక్రెట్ మీటింగులకు హాజరయ్యేవాళ్లున్నారు.

సాక్షాత్తూ శివుడితోనే సరాసరి హాట్ లైన్లో మాట్లాడేవాళ్లున్నారు. 

శివుడి భుజాలపైనే ఎప్పుడూ కూర్చుని ఉండే సద్గురువులున్నారు. 

మాటమాటకీ 'షివా షివా' అని 'షో' చేసేవాళ్లున్నారు. 

అతీతలోకాలన్నీ అలా అలా సరదాగా ధ్యానంలో తిరిగొచ్చే యో/రోగులున్నారు. 

గడ్డాలు పెంచినవాళ్ళూ, పెంచనివాళ్ళూ, గుండు చేయించుకున్నవాళ్లూ, జుట్టు పెంచినవాళ్ళూ, కొప్పు కట్టుకున్న వాళ్ళూ, విప్పుకున్నవాళ్ళూ, ఇలా రకరకాల వేషాలతో ఎంతో వినోదాన్ని పంచుతున్నవారున్నారు.

అతితెలివితేటల ఉపన్యాసాలతో, చర్చలతో, గొఱ్ఱెప్రజలకు "గ్నానాన్ని" పంచుతూ  అదరగొట్టేవాళ్లున్నారు.

సినీనటుల అక్రమసంబంధాల దగ్గరనుంచీ, వాళ్ళ కాపురాలు నిలుస్తాయా లేదా అన్నదానివరకూ ప్రతిదానినీ చెప్పే కమెడియన్ జ్యోతిష్కులున్నారు.

ఇంకా ఎంతోమంది ఆన్లైన్ విదూషకులున్నారు.

ఎవరికీ ఈ ప్రమాదం గురించిన ముందస్తు సూచన కొంచెం కూడా లేదు.

ఎన్నో లోకాలలో ఏమి జరుగుతోందో చూడగలిగే జ్ఞానులకు, ఈ లోకంలో ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో తెలీదు !

ఈషా భక్తబృందమైతే అదేదో ఎపాయింట్ మెంట్ తీసుకున్నట్టు సరిగ్గా పదినిముషాల  ముందు ఠంచన్ గా అక్కడకు చేరుకొని 'రామ్మా ! వరదా ! వచ్చి  మమ్మల్ని ముంచెయ్యి' అన్నట్టు సామాన్లు సర్దుకొని మరీ రెడీగా ఉంది.

కాబట్టి వాళ్ళకొక్కరికే, కైలాసం నుండి కరెక్ట్ గా ముందస్తు సమాచారం ఉందని నేననుమానిస్తున్నాను. లేకపోతే సరిగ్గా పదినిమిషాల ముందుగా అక్కడికెలా చేరుకుంటారు వాళ్ళు?

ఇప్పుడంతా అయిపోయాక,  మళ్ళీ వేరే రకం 'షో' లు, "షివా షివా" అంటూ షంతాప షభలు, విశ్లేషణలు, సమర్ధింపులు, నాటకాలు.

-------------------

వైకుంఠద్వారం టికెట్ల త్రొక్కిసలాటలో పడి సరాసరి వైకుంఠానికే పోయారు గతంలో కొందరు.

ఇప్పుడు కైలాసయాత్ర చేసొస్తూ, కైలాసానికే డైరెక్ట్ గా చేరుకున్నారు మరికొందరు.

బ్రహ్మలోకానికి మాత్రం ఎవరూ పోవడం లేదు ! పాపం ఆయనని పూజించేవారు లేరుకదా !

పిచ్చిభక్తులు నిజంగా వైకుంఠానికీ, కైలాసానికీ పోతున్నారో లేదో తెలియదు గానీ, వీళ్ళ డబ్బులు మాత్రం చేరవలసినవారికి చేరుతున్నాయి.

రెలిజియస్ వ్యాపారాలూ, రెలిజియస్ టూరిజం వ్యాపారాలూ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి.

---------------------

అసలూ, హిమాలయాలతో మనకెందుకు?

ఎవరుండవలసిన చోట వాళ్ళుండాలి.

మనకు దూరంగా ఎక్కడో ఉన్న మంచుకొండలలోకి మనం పోయి, అక్కడ మన చెత్తా చెదారమూ, సారాసీసాలూ, ప్లాస్టిక్కులతో నింపడం అవసరమా?

అక్కడెవరో పాపం ముక్కులు మూసుకుని, గోచీలు పెట్టుకుని కూర్చుని ఉంటే, మనం పోయి, వాళ్ళనింకా లోతట్టు కొండల్లోకి తరిమికొట్టడం అవసరమా?

స్వచ్ఛమైన హిమాలయాలను టూరిస్టు సెంటర్లుగా మార్చేసి, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు కట్టి, మబ్బుచాటు వ్యాపారాలు చెయ్యడం అవసరమా?

అక్కడకూడా డ్యాములు, బ్రిడ్జీలు కట్టి, కొండలను తొలిచి సొరంగాలు త్రవ్వడం అవసరమా?

ప్రకృతిని ఈ విధంగా పాడు చెయ్యడం అసలంటూ అవసరమా?

చేస్తే, అది చూస్తూ ఊరుకుంటుందా?

---------------------

గత మూణ్నెళ్లుగా వర్షాలెందుకు లేవు?

ఎక్కడచూచినా ఈ వేడీ, ఉడకా, కొనసాగుతున్న ఈ వేసవీ ఏమిటి?

యూరప్ లో ఎండవేడికి వేలాదిమంది చావడమేమిటి?

ఉత్తర అమెరికాలో కూడా పెరుగుతున్న ఉష్టోగ్రతలేమిటి?

ఇవన్నీ ఎందుకో, గ్లేషియర్లు కరగడమూ అందుకే.

కానీ, మనుషులేమీ నేర్చుకోరు. నేర్చుకోకండి. ఇలాగే ఉండండి.

---------------------------- 

సర్లే, ఈ న్యూసు ఇప్పటికే పాతబడిపోయింది.

బోరుకొడుతోంది. ఇంకో క్రొత్త న్యూసు రాదేంటి?

ఎవరైనా ఒక రేపో, ఒక మర్డరో, ఇంకొకటో, ఇంకొకటో కాస్త వెరైటీగా చెయ్యండ్రా బాబూ !

ఇంకెన్ని రోజులీ నేపాల్ గోల?

ఇవన్నీ చూస్తుంటే గతంలో వ్రాసుకున్న ఒక కవిత గుర్తుకొస్తోంది.

------------------------

కొందరు బాధాపీడితులు
కొందరు మాయామోహితులు.

కొందరు మాయగాళ్లు.
కొందరాశ్చర్య చకితులు.

కొందరు ఆపకుండా వాగేవాళ్ళు
కొందరు లేవకుండా వినేవాళ్ళు

కొందరు  నాటకాలేసేవాళ్ళు
కొందరు నవ్వుకుంటూ చూసేవాళ్ళు

కొందరు తీర్పులు తీర్చేవాళ్ళు
కొందరు తిరిగిరాకుండా పోయేవాళ్లు.

చివరికందరూ,
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడేవాళ్లు !

ఓ జీవితమా ! అర్థంకాని నీ ఆట జరుగుతూనే ఉంటుంది !
ఓ విశ్వమా ! అంతులేని నీ పయనం సాగుతూనే ఉంటుంది !!
read more " నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు "

2, ఆగస్టు 2026, ఆదివారం

దేవుడిని తిడతారా జంతువుల్లారా?

75 ఏళ్ల వయసున్న తననూ, చనిపోయిన తన తల్లిగారినీ బూతులు తిట్టిన పదిహేనూ ఇరవైఏళ్ల జాంబీలను క్షమిస్తూ మోదీగారు ప్రకటన చేశారు. వారు దారితప్పిన పిల్లలని, వారిని సరిదిద్దటమే చేయాలిగాని, శిక్షించడం సరికాదని అన్నారు. అది ఆయనలోని మానవత్వాన్ని, దైవత్వాన్ని చూపిస్తున్నది. 

అంతేకాదు, వాళ్ళు మాట్లాడిన మాటల్నిబట్టి, ఆ పిల్లలు అసలెలా పెరుగుతున్నారో, ఆ తల్లిదండ్రులు వారినెలా పెంచుతున్నారో  కూడా కనిపిస్తున్నది. అసలంటూ వాళ్లకు తల్లిదండ్రులున్నారా అని నాకు సందేహం తలెత్తుతున్నది. బహుశా గాలికి పుట్టి, గాలికి పెరిగిన రకాలై ఉంటారు. లేదా, డ్రగ్స్ మత్తులో ఉన్నారని ఈజీగా అర్థమవుతున్నది.

Gen Z అంటే ఏమిటా? అని ఇన్నాళ్ళూ అనుకునేవాడిని. ఇప్పుడు సందేహం తీరిపోయింది. జనరేషన్ జాంబీ అని అర్థమైపోయింది.

'వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకు తెలియదు. వాళ్ళను క్షమించు' అని జీసస్ ప్రార్ధించాడని, కనుక ఆయనలో దైవత్వం ఉన్నదని అందరూ అంటుంటారు. అదేనిజమైతే, మోదీగారిలో కూడా అదే దైవత్వం ఉన్నది. ఒక ప్రధానమంత్రి తలచుకుంటే, ఈ బచ్చాలందరూ ఏమై పోతారసలు? ఊహకికూడా అందదు.

కానీ ఆయన క్షమించారు. అది ఆయనలోని దైవత్వం !

ఇంకా చెప్పాలంటే, ఆ టైములో జీసస్ నిస్సహాయుడు. శిలువ వేయబడుతున్నాడు. ఎంతగా మొరపెట్టుకున్నా తన దేవుడు కూడా  తనను పట్టించుకోలేదు. ఆ సమయంలో, ప్రార్ధించడం తప్ప జీసస్ ఇంకేం చేయగలడు? అయినా, కోప్పడకుండా క్షమించాడు. అంతవరకూ గొప్పవిషయమే !

కానీ మోదీగారు నిస్సహాయుడు కాదు. యంత్రాంగమంతా ఆయన చేతులలో ఉన్నది. ఒక కనుసైగ చేస్తే చాలు, ఏది జరగాలో అది జరుగుతుంది. కానీ ఆయనలా చేయలేదు. ఓర్పువహించాడు. క్షమించాడు. కనుక, నా దృష్టిలో జీసస్ కంటే మోదీగారే గొప్పవాడు.   

ఆయన దేశానికి క్షమార్పణ చెప్పాలట ! ఇదొక డిమాండా అసలు? దీనినొక ఇష్యూ చేస్తున్నాడు పప్పు. తన ముందున్న మైకు స్విచ్చి ఆన్ చేసుకోకుండా, మైకు కట్ చేశారని గోల చేస్తున్నాడు. అందుకే పప్పు అనేది !

క్షమార్పణ ఆయన చెప్పడమేంట్రా దరిద్రుల్లారా ! మనందరి చర్మాలతో ఆయనకు చెప్పులు కుట్టించినా, ఆయన ఋణాన్ని ఈ దేశం తీర్చుకోలేదురా  దేశద్రోహుల్లారా !

---------------------

పార్లమెంటు సమావేశాలను ముందుకు పోనివ్వకుండా, బిల్లులు పాసు కానివ్వకుండా  మన ఎంపీలు చేస్తున్న అల్లరీ గోలా ప్రజలలో అసహ్యాన్ని పుట్టిస్తున్నది. 

వీళ్లా మన MP లు? అని సిగ్గుపడవలసి వస్తున్నది. ఏదో రోడ్లమీద అరిచే జంతువులలాగా 'ఓ...' అని MP లు పార్లమెంటులో అరుస్తున్నారంటే, మన దేశానికి ప్రజాస్వామ్యం ఏమాత్రమూ సరిపోదని నేనెప్పుడూ అనేమాట నిజమేనని రుజువౌతున్నది. ఎంత డబ్బులుపెట్టి ఓట్లు కొనుక్కుని గెలిస్తే మాత్రం, కాస్త డీసెన్సీ డెకోరం ఉండద్దూ ! మేన్యుఫేక్చరింగ్ డిఫెక్టా?

----------------------

గతపదేళ్లలో మన దేశం ఎన్నో మైలురాళ్లను దాటింది. ఎన్నో దేశాలను దాటేసి ముందుకొచ్చేసింది. మోదీగారు సాధించిన విజయాలను, దాటిన మైలురాళ్లను వ్రాయాలంటే వందకు పైన ఉన్నాయి. 

దేశం బాగుపడిపోతున్నది. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నది. ఎక్కడా ఎలాంటి గొడవలూ లేవు. పెడదామన్నా వీలుకావడం లేదు. ఇంకోసారి మోదీగారి ప్రభుత్వం వస్తే ఇక మనం దుకాణాలు మూసుకోవలసిందే, అన్న తీవ్రమైన భయానికి కాంగ్రెసు, కమ్యూనిస్టులు, ఇస్లామిక్ పార్టీలు, ఇతర కొమ్ముపార్టీలు లోనయ్యాయి. వాటికి మనచుట్టూ పొంచి ఉన్న శత్రుదేశాలు కాపుకాశాయి. ఎగదోశాయి. సరే, వీళ్లకు ఫండింగ్ చేసే దొంగలెలాగూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. బొద్దింకలు పుట్టుకొచ్చాయి. 

సరే, వాటికి కూడా వాళ్ళ నిరసనను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వబడింది. దానిని సాకుగా తీసుకొని 'చలో పార్లమెంట్' అని పార్లమెంట్ వైపు పోబోయాయి. వేటు పడింది. అదికూడా లైట్ గా పడింది.

దానిని హైలైట్ చేసి, FCRA వంటి ముఖ్యమైన బిల్లులు పాసవ్వకుండా చెయ్యాలని విపక్షాలు పార్లమెంట్ సమావేశాలలో నానా అల్లరీ చేస్తున్నాయి. కానీ వాటి దేశద్రోహపోకడలను దేశం గమనిస్తూనే ఉంది. వీళ్ళవెనుక ఎవరున్నారో, ఫండింగ్ ఎక్కడనుంచి వస్తున్నదో, పార్లమెంట్లో చర్చలకు ఎందుకిలా అడ్డుపడుతున్నారో, నేడు అందరికీ తెలుసు.

విపక్షాల ఎజెండా ఒకటే. ఏదోరకంగా గొడవలు లేవనెత్తి, నేపాల్, శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో జరిగినట్టు ప్రభుత్వాన్ని కూలద్రోయాలని కంకణం కట్టుకున్నాయి. మనదేశం బాగుపడకూడదు. అగ్రరాజ్యంగా అవతరించకూడదు. మిగతాదేశాలతో సమానంగా తలెత్తుకుని గర్వంగా నిలబడకూడదు. నాశనం కావాలి. ఇదే వీళ్ళ ఆశయం.

పేపర్ లీకు జరిగింది. దానిని గుర్తించి తగిన చర్యలన్నీ వెంటవెంటనే తీసుకున్నారు. ఇంకేం కావాలి? ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేయవలసిన అవసరం ఏముంది? సరే, నైతికకోణంలో చేశాడు. ఇప్పుడు అమిత్ షాను, మోదీగారిని కూడా చేయమంటున్నారు. తర్వాత దేశం దేశద్రోహపార్టీల చేతులలోకి వెళ్ళిపోతుంది. చైనా, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ ఇంకా ఇతరశత్రుదేశాల చేతులలోకి వెళ్ళిపోతుంది. ఐదారేళ్లలో సర్వనాశనమై పోతుంది. అదేగా వీళ్లకు కావలసింది?

దీనిని మనమెందుకు జరగనివ్వాలి? మా డిమాండ్లు మాకూ ఉన్నాయ్ !

FCRA బిల్లు పాసవ్వాలి. మతమార్పిడి మాఫియాలు అంతం కావాలి. దేశద్రోహపార్టీలు అంతం కావాలి. అల్లర్లు ఆగడాలు, కుట్రలు అంతం కావాలి. ఆ దిశగా ఏమేం చెయ్యాలో అన్నీ చెయ్యాలి.  అంతేగాని, ప్రభుత్వం వెనుకకు తగ్గడానికి వీల్లేదు. ఇదే మా డిమాండ్.

ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడం మీవల్ల అవుతుందా?

---------------------

శాంతియుతంగా నిరసన చెయ్యవలసిన విద్యార్థులు విధ్వంసానికి దిగవచ్చా?

నిరసనలో పాల్గొన్నవారికి పాకిస్తాన్ నుంచి, బాంగ్లాదేశ్ నుండి ఫుడ్ ఆర్దర్లు ఎలా జరిగాయి?

నిరసనకారులు మాట్లాడిన మాటలేంటి? చేసిన నినాదాలేంటి?

పోలీసులను కొట్టటమేంటి? మహిళా జర్నలిస్టులను అల్లరి చేయడమేంటి?

ఇవన్నీ మంచిపనులేనా? శాంతియుతం అంటే ఇదేనా?  

పెల్లెట్ గన్స్ వాడారని గోలచేస్తున్న కమ్యూనిస్టులు, మీ చైనాలో జరిగిన తియానన్ మెన్ స్క్వేర్ సంఘటనకు ఏమంటారు?

పోలీసుచర్య అంటూ గోలచేస్తున్న కాంగ్రెస్, ఎమర్జెన్సీని గురించి ఏమి జవాబు చెబుతుంది?

ఇతర రాష్ట్రాలలో పేపరులీకులైనపుడు, విద్యాశాఖామంత్రులు ఎందుకు దిగిపోవడం లేదు?

సరే, శాంతియుతంగా నిరసన చేసినవారిపైన కేసులుండవు. మరి, విధ్వంసకారులను, ఆ గుంపులో దూరిపోయిన నేరస్తులను, పాతకేడీలను కూడా వదిలేయాలా? ఏ చట్టప్రకారం?

--------------------------

మోదీగారు మనిషి కాదురా దరిద్రుల్లారా ! ఆయన దైవాంశసంభూతుడు. మన దేశాన్ని రక్షించడానికి పుట్టిన దేవుడు. ఆయనే లేకపోతే, నేడు మనమందరమూ మనదేశంలోనే బానిసబ్రతుకులు బ్రతుకుతూ ఉండేవాళ్ళం. అలాంటి దేవుడిని అలా తిడుతున్నారా? మీరసలు మనుషులేనా?

పెద్దమనసుతో మీరు క్షమించినా, ఈ దేశద్రోహులను మేము క్షమించలేము. చిన్నపిల్లలైనా సరే, వీళ్లకు తీవ్రమైన శిక్షలు పడాల్సిందే. వీళ్ళనిలా వదిలేస్తే, కొన్నేళ్ళకు వీళ్ళే తీవ్రవాదులు, నేరస్తులు, సమాజానికి చీడపురుగులు అవుతారు. వీళ్ళను వదిలెయ్యడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం !

------------------

FCRA బిల్లు రావాలి. మతమార్పిడులు పూర్తిగా ఆగాలి. రిజర్వేషన్ అంతం కావాలి. మెరిట్ కు గుర్తింపు రావాలి. అవినీతి అంతం  కావాలి. రాజ్యాంగాన్ని మార్చాలి. డెమోక్రసీని తొలగించి, ఉదారవాద నియంతృత్వం రావాలి. 

ఇవి మా డిమాండ్స్.

----------------------------

మన దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు. ఉదారవాద నియంతృత్వం (Benevolent Dictatorship) ఒక్కటే మనకు సరైనది. నేడుకాకపోయినా, భవిష్యత్తులోనైనా ఇదే నిజమౌతుంది. అమ్మాబాబూ అని ఒళ్ళో కూచోబెట్టుకుంటే మనదేశంలో ఎవడూ మాటవినడు. తొక్కి నారతీస్తేనే మంచిగా ఉంటారు.

దేశద్రోహులనెవరినీ క్షమించకూడదు. వాళ్ళు ప్రజలైనా సరే ! పార్లమెంటులో లేకిగా ప్రవర్తిస్తున్న నాయకులైనా సరే ! వాళ్ళను సపోర్ట్ చేస్తున్న పార్టీలైనా సరే. ఎవరినీ వదలడానికి వీల్లేదు.

మన దేవుడైన మోదీగారిని దూషించేవాళ్లను ఆయన క్షమించినా, మనం క్షమించకూడదు. అలాంటివాళ్ళందరినీ క్షమిస్తూ కూచుంటే, దేశద్రోహుల కుట్రలకు బలై, దేశం అధోగతి పాలవుతుంది. నిజాయితీపరులు, దేశభక్తులు, కాస్తైనా ఆలోచన ఉన్నవారందరూ కళ్లుతెరవాలి. మారుమాటలేకుండా మోదీగారిని, బీజేపీని సపోర్ట్ చేయాలి. దేశద్రోహుల పనిపట్టాలి.

దేశద్రోహుల ప్రచారాలను త్రిప్పికొట్టండి. మీమీ స్థాయిలలో ప్రతిఘటించండి. న్యాయాన్ని ధర్మాన్ని రక్షించండి.

బాగా గుర్తుంచుకోండి !

ధర్మం మౌనంగా ఉంటే, అధర్మానికి వంతపాడినట్లే అవుతుంది ! 

read more " దేవుడిని తిడతారా జంతువుల్లారా? "

30, జులై 2026, గురువారం

సత్యం - అసత్యం

దూరపు ఊళ్లలో ఉన్న శిష్యులను గురుపూర్ణిమ కోసం ఆశ్రమానికి రావద్దనే నేను చెబుతాను. ఈ ఇంటర్నెట్ యుగంలో అసలెక్కడికీ పోనవసరం లేదు. ఎక్కడవాళ్ళు అక్కడే ఉండి, అన్నీ చేయవచ్చు.

ఇక్కడున్నా, ఎక్కడున్నా, ఉండవలసిన విధంగా ఉంటే అన్నీ జరుగుతాయి. అది లేనప్పుడు, ఎక్కడికొచ్చినా ఏమీ ఒరగదు.

కానీ, దగ్గర ఊళ్లలో ఉన్న శిష్యులు కొంతమంది, వద్దన్నా వస్తూ ఉంటారు. భౌతికంగా వచ్చి ఇక్కడ కాసేపైనా ఉంటే, వాళ్లకు బాగుంటుంది. అదేవిధంగా, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాదులనుండి కొంతమంది నిన్న ఆశ్రమానికి వచ్చారు.

మాటలసందర్భంలో, ఒక శిష్యురాలు ఇలా అన్నది. 

'ఒంగోలు నుండి వస్తుంటే దారిపొడుగూతా  పందిళ్లు, బాబా కటౌట్లు. రోడ్డుపక్కన పందిళ్ళేసి గురుపౌర్ణమంటూ భోజనాలు చేస్తున్నారు. చాలా జాలేసింది వాళ్ళని చూస్తుంటే'.

నవ్వాను.

'కానీ నాకు మాత్రం, బాబా కటౌట్ చూసిన ప్రతిసారీ మీరే గుర్తుకు వచ్చారు' అన్నది.

'మంచిదేగా. అలాగైనా ఒక మంచిపని జరిగింది బాబావల్ల' అన్నాడొక శిష్యుడు.

అందరూ నవ్వేశారు.

'అంతే ! అసత్యాన్ని చూచినా సత్యం గుర్తుకురావడమే హిందూమతవిధానం' అన్నాను.

'వాళ్లకూ మాకూ తేడా ఏమిటి?' అని ఒక శిష్యుడడిగాడు.

'సత్యమేదో ఆసత్యమేదో తెలుసుకోలేని స్థితిలో వాళ్ళున్నారు, సత్యాన్ని సత్యంగా గుర్తించగలిగే స్థితిలో మీరున్నారు. అదే తేడా' అన్నాను.

ఆర్భాటాలకు, అన్నసంతర్పణలకు, అతిచేష్టలకు, అనవసరపుగోలకు అతీతంగా, అసలైన గురుపౌర్ణమి వేడుక మా ఆశ్రమంలో అద్భుతంగా జరిగింది.

read more " సత్యం - అసత్యం "

27, జులై 2026, సోమవారం

రాములవారు

మొన్న ఒంగోలుకు వెళుతూ దారిలోని ఒక వెల్డింగ్ షాపుదగ్గర ఆగాను.

అక్కడ ఇనుపపైపులతో ఒక రధాన్ని తయారు చేస్తున్నారు. తయారు చేయిస్తున్నది మనకు తెలిసినవాళ్ళే.

అక్కడ నా పనిని ముగించుకుని ఒంగోలుకు బయలుదేరబోతుండగా, అడగకపోయినా రధం గురించి చెబుతూ ' మా ఊళ్లో రామాలయానికి, ఊరేగింపుకి' అన్నాడతను.

'అలాగా. బాగుంది' అన్నాను.

'ఒకసారి రాండి. మా రాములవారిని చూద్దురుగాని' అని ఆహ్వానించాడతను.

 'సరే వీలైనప్పుడు వస్తాలే' అన్నాను.

'అట్టా అనుకుంటే ఎప్పుడొచ్చేది? రేపు పౌర్ణమికి రధం ఊరేగింపు. భలే ఉంటుంది. రాండి' అన్నాడు.

'చిన్నప్పటినుంచీ చాలా చూశాను. ప్రస్తుతం ఆసక్తి లేదు' అన్నాను.

'పోనీ రాములవారిని చూడండి' అన్నాడు.

ఒక్కక్షణం అతనివైపు చూచి, 'చూస్తున్నాను' అన్నాను.

'ఎక్కడా?' అన్నాడు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ.

'ఇక్కడ' అంటూ ఛాతీపైన చేయివేసుకున్నాను.

ఈసారి అయోమయంగా చూస్తున్నాడు.

'రాములవారు ఇక్కడే ఉన్నారు. ఆయన్ని చూట్టానికి గుడికెందుకు? అయినాసరే, మీరు మంచిగా పిలిచారు కదా. వీలైనప్పుడు తప్పకుండా వస్తాను మీ ఊరికి' అన్నాను.

అతనికర్ధమైంది. ఇంకేమీ అడగలేదు.

నా దారిన ఒంగోలుకు బయల్దేరాను.

read more " రాములవారు "

పేలపిండి

చాలామందిలో ఒక జబ్బును గమనిస్తున్నాను. 

ఆశ్రమంలో మేమేం చేస్తున్నాము? మా ఆదర్శాలేమిటి? మా గమ్యాలేమిటి? వాటిని అందుకోవడానికి మేమనుసరిస్తున్న మార్గమేమిటి? ఇవేవీ వారికి ఆవసరం లేదు. దానిబదులు, వాళ్ళిష్టప్రకారం గానూ, వాళ్ళు ఊహించుకున్నట్లుగానూ మేమున్నామా లేమా? అన్నదానిని మాత్రమే చూస్తున్నారు. 

నన్ను కలుస్తున్నవారిలో, మాట్లాడుతున్న వారిలో అందరూ ఇలాగే ఉన్నారు.

వాళ్ళెలా ఉన్నప్పటికీ,  యధాప్రకారం నాకు మాత్రం నవ్వూ, జాలీ, ఈ రెండే కలుగుతున్నాయి.

మొన్నొకరోజున ఒకాయనతో ఫోన్లో మాట్లాడుతున్నాను.

మాటలసందర్భంలో 'ఈరోజు తొలి ఏకాదశి' అన్నాడాయన.

నేనేమీ మాట్లాడలేదు.

'ఇవాళ విష్ణుదేవునికి పేలపిండి నైవేద్యం పెట్టాలి' అన్నాడు.

'అవునా !' అన్నాను.

'మీరు చేస్తున్నారా ఆశ్రమంలో?' అడిగాడు.

'మీరన్నది పేలపిండా లేక పేలాలపిండా?' అడిగాను.

అంత సున్నితంగా చెబితే ఈ జనానికెక్కడ అర్ధమౌతుంది?

'అదేలెండి. పేలాల పిండే. మా పల్లెటూళ్ళలో ఇలా కూడా అంటాము' అన్నాడు నవ్వుతూ.

నేనేమీ అనలేదు.

'ఏకాదశినాడు విష్ణుదేవునికి ఈ నైవేద్యం పెడిదే మంచిది' అన్నాడు మళ్ళీ.

యూట్యూబ్ యూనివర్సిటీలో బాగానే చదువుకుంటున్నాడు. ముచ్చటేసింది.

'విష్ణువు అనే పదానికి అర్ధమేమిటి?' అడిగాను.

'ఏముంది? విష్ణువే' అన్నాడు.

ఇంకేం మాట్లాడగలం?

నాకీమాత్రం కూడా తెలీనందుకు అతనికి నామీద చాలా జాలేసినట్టుంది.

'చెయ్యండి గురువుగారు. చేస్తే మంచిది' అన్నాడు మళ్ళీ.

'నాకు బట్టతలుంది. పేలు పడే అవకాశం లేదు.' అన్నాను.

పెద్దగా నవ్వి, 'అయితే ఏమైంది? నాకూ ఉంది, ప్రతి మొగాడికీ కొద్దో గొప్పో ఉంటుంది' అన్నాడు.

'పేలే లేనప్పుడు పేలపిండితో పనేముంది?' అన్నాను.

'అర్ధం కాలేదు' అన్నాడు నీరసంగా.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది' అని ఫోన్ పెట్టేశాను.

read more " పేలపిండి "

26, జులై 2026, ఆదివారం

తెలివిలేని సంత

మొన్న పనుండి ప్రక్కఊరికెళ్ళాను.

మైకులో సాయిబాబా భజన వినవచ్చింది.

కావలసిన వస్తువులు కొంటూ ఉండగా, తెలిసిన ఒకతను కనిపించి, 'సాయిబాబా సప్తాహం జరుగుతోంది. గుడికి రండి' అని పిలిచాడు.

'ఎందుకది?' అన్నాను.

' నాలుగురోజులలో గురుపౌర్ణిమ కదా ! అందుకని చేస్తున్నాం' అన్నాడు.

జాలికలిగింది.

'గురుపూర్ణిమ అయితే, సాయిబాబాకి భజనెందుకు? అసలు సాయిబాబాకి భజనేంటి? మీరు చేయడమేంటి?' అన్నాను.

ఈ పల్లెటూరి జనానికి ఏమి చెప్పినా ఎక్కదు.

'భజన బాగుంటుంది. వచ్చి చూడండి' అన్నాడు నా మాట వినిపించుకోకుండా.

'తెలివిలేని సంతలోకి తెలివితో ఉన్నవారెందుకు?' అని, నాకు కావలసిన వస్తువులను తీసుకొని ఆశ్రమానికి బయలుదేరాను.

read more " తెలివిలేని సంత "

30, జూన్ 2026, మంగళవారం

రామమందిర చందాచోరీ వివాదం

అయోధ్య రామమందిరం మొదలవడమే గొడవలతో మొదలైంది. 

మొదలుపెట్టి రెండేళ్లు కూడా కాకముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. భక్తులిచ్చిన చందాలు దొంగిలించబడటం చాలా బాధాకరం. దేశం మొత్తంమీద హిందువుల నమ్మకం తీవ్రంగా దెబ్బతిన్నది.

తిరుమలలో ఇదే జరిగింది. పట్టుకున్న S.I హత్యకు గురయ్యాడు. ఇప్పుడు అయోధ్యలోనూ అదే నేరం జరిగింది. పద్మనాభస్వామి ఆలయంలో వేరేరకంగా ఇదే జరిగింది. మొత్తానికి, దేవుడంటే భక్తులకు భక్తి ఉన్నప్పటికీ, ఆలయంలో పనిచేసేవాళ్లకు  మాత్రం ఏదీ ఉండదని తేలిపోయింది.

ఆలయాలలో అవినీతి, దొంగతనాలు,  జరగడం. అదికూడా భక్తులు చేయడం చాలా బాధాకరం. 'మిశ్రా, శుక్లా, పాండే' అనేపేర్లు బ్రాహ్మణులు. 'బన్సాల్' అంటే వైశ్యులు. యాదవ్ అంటే తెలిసినదే. వీళ్ళే ఇలాంటిపనులు చేస్తే ఇక ఎవర్ని ఏమనుకోవాలి? మేనేజ్మెంట్ లో వేరే కులాలు మతాలవాళ్ళు ఉన్నపుడు వారిని అనుకున్నాం గతంలో. ఇప్పుడు చేసిందెవరు? ఎవర్ని అనాలి? ఏమనాలి?

మేనేజ్ మెంట్ అంటే ఇదేనా? అందులోనూ అయోధ్యరామాలయం వంటి సంస్థను ఇలాగేనా నడిపేది? పైగా, ఉన్నవాళ్ళందరూ పెద్దపెద్దవాళ్లు?

చిన్నదొంగలను పట్టిచ్చి. లేదా పట్టుకున్నవారిని లేపేసి, సినిమాటిగ్గా పెద్దదొంగలు తప్పించుకుంటారని గతంలో చాలావాటిలో రుజువైంది. ఇప్పుడేమౌతుందో చూడాలి.

---------------------

ఎప్పుడూ ఎదురుగా కనిపిస్తుంటే దేవుడు కూడా చీపై పోతాడు. అందుకే, దూరాన్నించి దర్శనంకోసం వచ్చిన భక్తులకున్న భక్తి, అక్కడున్న పూజారికి ఉండదు. హుండీ డబ్బులు లెక్కించేవారికి అసలే ఉండకపోవచ్చు.

ఎదురుగా ఊరిస్తున్న డబ్బూ బంగారాలు ముఖ్యంగాని, గుళ్లో ఉన్న రాతిబొమ్మ మనకెందుకు? మనం పెడితేనేగా దానికి తిండి? అయినా తినేది దేవుడు కాదుగా, మనమే. కనుక మనకు మనమే ముఖ్యం, దేవుడు కాదు.

దేవుడికి కూడా డబ్బుతోనే విలువ. ఇంకా చెప్పాలంటే, అసలు విలువ డబ్బుకే గాని, దేవుడికి  కాదు.

నిజానికి, డబ్బు సంపాదించడానికి దేవుడొక ఆధారం. ఇది వాస్తవం.

ఇదే వాస్తవం !

అదంతా అలా ఉంచితే, జ్యోతిషం ఏమంటున్నదో చూద్దాం.

------------------------

ప్రాణప్రతిష్ఠ 22 జనవరి 2024 న మధ్యాన్నం 12. 30 కు జరిగింది.

అప్పట్లోనే పుష్యమాసం ముహూర్తం మంచిది కాదని చాలామంది అన్నారు. ఎవరూ వినలేదు. అది శూన్యమాసం. ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది.

దేవాలయ శిఖరం, కలశం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ట చేయడం మంచిది కాదని కూడా చాలామంది అన్నారు. కానీ చేసేవారు చేశారు. ఇప్పుడిలా అయింది.

ఆనాటి గ్రహస్థితులు ఇలా ఉన్నాయి.

ఉచ్ఛచంద్రుడు ఎదురులేని ప్రజాభిప్రాయాన్ని సూచిస్తున్నాడు. కనుక దేశంలోని హిందువులందరి మద్దతుతో ఆలయం నిర్మాణమైంది.

అష్టమంలో కుజ బుధ శుక్రులున్నారు. శుక్రుడు ఇంటిదొంగలకు సూచకుడు. బుధుడు కుటుంబసభ్యులకు, అనుచరులకు సూచకుడు. కుజుడు రహస్యశత్రువులకు సూచకుడు. ఈ ముగ్గురూ కలసి నష్టానికి సూచికైన అష్టమంలో ఉన్నారు. ప్రస్తుతం జరిగింది అదే !

ప్రస్తుతం నడుస్తున్న దశ -- కుజ శుక్ర చంద్ర దశ. కుజశుక్రులిద్దరూ పెద్దనష్టాన్ని సూచిస్తున్న అష్టమంలో ఉండటాన్ని చూడవచ్చు. ఈ దశ మార్చి 2026 నుండి ఏప్రియల్ 2027 వరకూ ఉంది. మార్చిలోనే ఈ గొడవంతా బయటపడటం మొదలుపెట్టింది.

అధికారయంత్రాగాన్ని సూచించే సూర్యుడు మతసంబంధమైన నవమంలో పాపార్గళంలో చిక్కుకుపోయాడు. కనుక అధికారులూ యంత్రాంగమూ ఇరుకున పడ్డారు. సూర్యవిదశ సరిగ్గా మే - జూన్ నెలలలోనే నడిచింది.

దశమాధిపతి శని దశమంలో ఉన్నప్పటికీ, పాపార్గళంలో చిక్కుకున్నాడు. లాభస్థానంలోని గురుఛండాలయోగం నీతిలేని అనుచరులను (ఆలయ సిబ్బందిని) సూచిస్తున్నది. వీరివల్ల ఆలయమర్యాదకు ఘోరమైన కళంకం చుట్టుకుంది.

కుజదశ మార్చి 2028 వరకు ఉన్నది. అంతవరకూ పరిస్థితి బాగుపడదు.

ఆ పైన వచ్చే రాహుదశ 2046 వరకూ ఉంటుంది. అప్పుడూ, గురుఛండాలయోగం వల్ల ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది.

ఇంతకంటే ముందుకు ప్రస్తుతం చూడనవసరం లేదు.

-------------------------

బయటనుండి వచ్చి దేవాలయాలను కొల్లగొట్టారని, కూలగొట్టారని రాక్షసులమాదిరిగా ప్రవర్తించారని తురకలను అనుకోవడం దేనికి? ఇంటిదొంగల సాయం లేకుండా వాళ్ళు ఆపనులు చేయగలిగేవారా? ఇప్పుడు మనవాళ్ళు చేస్తున్నదేమిటి?

ఇప్పుడు దోషులు కూడా ఇంటిదొంగలే. హిందూమతం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఇంటిదొంగలమీదనే.

మన దేవుళ్ళపైన దేవాలయాలపైన మనకే గౌరవం లేదు. ఇక బయటవాళ్ళకెలా ఉంటుంది?

దేవుడికే ద్రోహం చేసేవాళ్ళు, మనుషులను ఒదులుతారనుకోవడం వెర్రితనం ! కాకపోతే, నీతికి మారుపేరుగా నిలవాల్సిన వాళ్ళే ఇలా చేస్తే, ఇక ఎవర్ని నమ్మగలం? అందులోనూ VHP, RSS కార్యకర్తలా? కోట్లాది హిందువుల హృదయాలు గాయపడ్డాయి.

వచ్చిన చెడ్డపేరు పోవడం చాలా కష్టం.

ముహూర్తసమయంలో నవాంశలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రాశిలోనే ఉన్నాడు. గురువు అనుగ్రహిస్తే కష్టాలనుండి తేలికగా బయటపడవచ్చు.  కానీ, ఆ అనుగ్రహానికి తగిన అర్హత మనలో ఉండాలి. అప్పుడే అది మనకు లభిస్తుంది. ఊరకే మాత్రం రాదు. 

ఈ మొత్తం వ్యవహారంలో యోగి ఆదిత్యనాథ్ ఒక్కడే నిజాయితీగా, ధైర్యంగా నిలబడ్డాడు.

చూద్దాం దీనినెలా పరిష్కరిస్తారో? పోయిన పరువునెలా తిరిగి రాబట్టుకుంటారో?

read more " రామమందిర చందాచోరీ వివాదం "

29, జూన్ 2026, సోమవారం

అసహ్యమేస్తున్న పబ్లిక్ జీవితం

నేను రైల్వేలోనే రిటైరయ్యాను. కానీ నేడు రైల్లో ప్రయాణం చేయాలంటే ఇష్టపడటం  లేదు. ఏసీలో ఫ్రీపాస్ ఉన్నప్పటికీ రైల్వేప్రయాణం చేయకుండా ఏసీబస్సుల్లోనో, సొంతకార్లోనో పోతున్నాను. దూరమైతే విమానమే. సర్వీస్ లో ఉన్నప్పుడూ రైల్వేపాసులు వాడలేదు. ఇప్పుడూ వాడటంలేదు. అప్పుడు లీవులు కూడా మురిగిపోయేవి. ఇప్పుడు పాసులు కూడా మురిగిపోతున్నాయి. కారణం?

జనాల వెకిలి, దురుసు, మాస్ ప్రవర్తనలు నచ్చక ! రైలు ప్రయాణాలు నచ్చక !

ఎవడికీ ఎక్కడా సివిక్ సెన్స్ గాని, కామన్ సెన్స్ గాని ఉండటం లేదు.  నాకు ఊహ తెలిసినప్పటినుండీ ఇలాగే ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా ఎక్కువైంది. అప్పుడు మంచి, మర్యాద, మానవత్వం అనేవి కాస్త ఉండేవి. ఇప్పటి మనుషులలో ఎక్కడా కనిపించడం లేదు.

"ప్రయివేట్ లైఫ్ మీ ఇష్టం, పబ్లిక్ లోకి వస్తేమాత్రం ఏమైనా అంటాం" అని శ్రీ శ్రీ అనేవాడు. దాని సందర్భం వేరే ఏదో అయినప్పటికీ, అందరూ ఆయన మాటలని మాటల్లోనే కాక, చేతలలో కూడా అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది.

పబ్లిక్ రంగం మొత్తం, అది ఏదైనా సరే, దారితప్పింది. ప్రభుత్వసర్వీసులు ఏవైనా సరే, ముఖ్యంగా ట్రాన్స్ పోర్ట్ రంగాలు ఛండాలంగా తయారయ్యాయి. పెరిగిపోయిన జనాభా, సంస్కారం లేని డబ్బు, వెకిలి సినిమాలు, ఇక రాజకీయుల సంగతి చెప్పనే అక్కర్లేదు, అన్నింటినీ మించి సోషల్ మీడియా - ఇవన్నీ కలిసి మనిషిని చాలావేగంగా సంస్కారహీనుడిగా మార్చేస్తున్నాయి.

మొన్న బాంబేట్రెయిన్లో చిన్నగొడవ పెద్దదై, పొడుచుకునేదాకా పోయింది. అతను చనిపోయాడు. ఇతను అరెస్టయ్యాడు. మళ్ళీ ఇద్దరూ వాళ్ళ జీవితాలలో సామాన్యపౌరులే. ఇరుగూపొరుగూ "ఇద్దరూ మంచివాళ్ళే" అని చెబుతారు.

రైల్వే ఏసీలలో ఒకప్పుడు క్లాస్ పాసింజర్లు మాత్రమే ప్రయాణించేవారు. ఇప్పుడు మాసై పోయింది. ఏసీ ఫస్ట్ క్లాస్ కూడా ఛండాలంగా తయారైంది. తిన్నవన్నీ కాళ్ళదగ్గరే పారేస్తూ, మొబైల్ సౌండ్ పెద్దగా పెడుతూ, గట్టిగా అరుస్తూ, సంతలాగా చేస్తున్నారు. చాలా ట్రెయిన్లలో ఏసీల కంటే స్లీపర్లే కాస్త నయమనిపిస్తున్నాయి. వాటిల్లో పాసింజర్స్ కొంచెం పద్దతిగా ఉంటున్నారు. ఆఫ్ కోర్స్ ఇది అన్ని రూట్లకూ వర్తించదనుకోండి. బీహార్, బెంగాల్ వైపును నుండి వచ్చే రైళ్లయితే, అది ఏ క్లాసయినా సరే, ఎక్కకపోవడమే మేలు.

ఒక రైల్వే ఆఫీసర్ అయి ఉండీ మీరిలా చెబుతున్నారేంటని మీరనుకోవచ్చు. సర్వీసులో ఉన్నపుడు కూడా ఇదే చెప్పేవాణ్ణి. నా పరిధిలో సమస్యలను వెంటనే సాల్వ్ చేసేవాణ్ణి. కానీ నాలాంటి వాళ్ళు ఆ వ్యవస్థలో సముద్రంలో కాకిరెట్టలు. రైల్వే ఒక్కటే కాదు, ప్రతి ప్రభుత్వవ్యవస్థా, పబ్లిక్ వ్యవస్థా ఇలాగే ఉన్నాయి.

ఎక్కడైనా వ్యవస్థలు కొద్దిగా బాగుంటే, జనాలు ఛండాలంగా తయారయ్యారు.

అసలు, జనజీవనంలోకొస్తే, ఎక్కడైనా సరే, అది నరకమే. మనుషులే అలా తయారయ్యారు. క్లాస్ ను మన దేశంలో కోరుకుంటే, హైక్లాస్ గేటెడ్ కమ్యూనిటీలలో ఉండాలి. లేదా నాలాగా ఒక అడవిలోకెళ్ళిపోయి ఉండాలి. ఆఫ్ కోర్స్, హైక్లాస్ కమ్యూనిటీలలో హైక్లాస్ మెంటాలిటీస్ ఉంటాయని గ్యారంటీ ఏమీ లేదు. అక్కడెక్కువగా హైక్లాస్ క్రిమినల్స్ ఉంటారు. మరేం చెయ్యాలి? మిగిలిన ఛాయిస్ ఒక్కటే, అయితే హిమాలయాలు, లేదా అడవి. 

లేకిమనుషులు కన్పించనంత దూరం వెళ్ళిపోయి అక్కడ అజ్ఞాతంగా ఉండటం ఒక్కటే పరిష్కారం. అయితే ఇలా చెయ్యడానికి అందరికీ అవకాశాలుంటాయా? అంటే, ఖచ్చితంగా ఉండవు. కర్మ ఒప్పుకోదు. బంధాలు వదలవు. బ్రతుకుపోరును వదిలిపోలేరు.

ఇలాంటి జ్ఞానోదయాలు మన దేశంలో చాలా త్వరగా వస్తాయి. వేరే దేశాలలో అయితే రావు. అందుకే, విదేశాలకు వెళ్ళినవాళ్ళు, ఏదోరకంగా అక్కడే సెటిలవుదామని అనుకుంటారు గాని, తిరిగిరారు. వాళ్ళు చెప్పే కారణాలు కూడా ఇవే - ఎక్కడచూసినా జనం, ట్రాఫిక్ సమస్యలు, సరైన రోడ్లు పరిశుభ్రతా లేకపోవడం, పెరిగిపోతున్న ఖర్చులతో నిత్యజీవితమే టెన్షన్ గా మారడం, మనుషులలో సివిక్ సెన్స్ లేకపోవడం, వ్యవస్థలన్నీ జవాబుదారీతనం లేనివిగా అవడం, ఆహారకల్తీ, మెడికల్ మాఫియా, భవిష్యత్తు గ్యారంటీ లేకపోవడం ఇవన్నీ కారణాలుగా వారు చూపిస్తున్నారు. ఇవన్నీ నిజాలే.

విదేశాలలో కొన్నే సమస్యలుంటాయి. మనదేశంలో మాత్రం నిత్యజీవితమే ఒక సమస్య. డబ్బున్నవాడికైనా, లేనివాడికైనా, మధ్యలోవాడికైనా ఎవరికైనా ఇది తప్పదు. ఇక్కడ ప్రతిదీ ఒక పోరాటమే. ఒక గందరగోళమే. ఒక పరుగే. కారణాలేంటంటే, ఎక్కడ చూసినా జనం, సివిక్ సెన్స్ లేకపోవడం, వ్యవస్థలు ఫెయిలై పోతూ ఉండటం, ఎక్కడా జవాబుదారీతనం లేకపోవడం. 

కనుక, చివరాఖరికి తేలేది ఒక్కటే, ఎవడి ఖర్మ వాడు అనుభవిస్తూ, ఏడుస్తూ బ్రతకడమే.

చేతనైతే ఈ జనాలకు, ఈ పొల్యూషన్ కు, దూరంగా పోయి మనదేశంలోనే బ్రతకడం,  లేదంటే విదేశాలకు పారిపోయి అక్కడ బ్రతకడం, ఈ రెండూ కాకపోతే, మన ఖర్మ అనుకుని ఏడుస్తూ ఇక్కడే ఇదే సొసైటీలో బ్రతకడం. ఈ మూడే చివరికి మిగులుతున్నాయి.

పబ్లిక్ మాత్రం భరించలేనంత చౌకబారుగా, లేకిగా తయారౌతున్నారనేది వాస్తవం ! దీనికి కారణాలెన్నున్నప్పటికీ, వాటిని ఎవరూ ఏమీ చేయలేనంతగా కుళ్లిపోతున్నాయనేది కూడా వాస్తవమే !

read more " అసహ్యమేస్తున్న పబ్లిక్ జీవితం "

27, జూన్ 2026, శనివారం

నేను సన్నాసుల్లో కలుద్దామనుకుంటున్నాను

ఈ మధ్య ఒక అపరిచితునినుంచి ఫోనొచ్చింది. సంభాషణ రసవత్తరంగా జరిగింది. మీకందరికీ కూడా తెలియాలని పోస్ట్ చేస్తున్నాను.

'హలో' అనగానే, ఎవరో అపరిచితుడు 'నాకు దీక్ష కావాలి' అన్నాడు సూటిగా.

'ఏం దీక్ష ? ఎందుకు?' అన్నాను.

'చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి' అన్నాడు.

'ఎవరికి?' అడిగాను.

'నాకే' అన్నాడు.

'దీక్షతో ప్రాబ్లమ్స్ పోతాయని ఎవరు చెప్పారు?' అడిగాను.

దానికి సమాధానం చెప్పకుండా 'నేను సన్నాసుల్లో కలుద్దామనుకుంటున్నాను' అన్నాడు.

'కలువ్. దానికి నా పర్మిషనెందుకు?' అన్నాను.

'మీదగ్గర దీక్ష తీసుకుని కలుద్దామని' అన్నాడు.

'దీక్షకూ సన్నాసుల్లో కలవడానికి సంబంధం లేదు' అన్నాను.

దీక్ష అనగానే, 'సరే ఇస్తాం. ఫలానా రోజున వచ్చేయ్, పనీపాటా లేకుండా ఇక్కడే ఉందువుగాని ' అనకపోయేసరికి అతనికి కోపం వచ్చేసింది.

'ఇంతకూ మీదగ్గరేముంది?' అన్నాడు.

'నాదగ్గర చాలా ఉన్నాయ్. అవన్నీ నీకు పనికిరావు. నీకేం కావాలోచెప్పు' అన్నాను.

'చెబుతున్నాగా. ఎన్నిసార్లు చెప్పాలి?' అన్నాడు దురుసుగా.

'అసలు నీ సమస్య ఏంటో చెబితే కదా తెలిసేది?' అన్నాను.

'మా ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయింది' అన్నాడు.

'పోతే పోనీ పీడా వదిలింది' అన్నాను.

'అదికాదు. ముగ్గురు పిల్లలున్నారు' అన్నాడు.

'నువ్వు పెంచు. నీ పిల్లలేగా?' అన్నాను.

'మరి తన పిల్లలు కారా?' అడిగాడు కోపంగా.

'ఏమోమరి నాకేం తెలుసు?' అన్నాను.

'వేరేవాడితో లేచిపోయింది' అన్నాడు.

'ఇన్నేళ్ల తర్వాత నీలో ఏం నచ్చలేదో మరి?' అన్నాను.  

'వాళ్లిద్దరూ కనిపిస్తే చంపేస్తాను' అన్నాడు.

'అందుకే కనపడకుండా దాక్కున్నారు' అన్నాను.

'ఎంతకాలం దాక్కుంటారు?' అన్నాడు.

'అది నాకెలా తెలుస్తుంది? అయినా, కోర్టు వాళ్లనే సపోర్ట్ చేస్తుంది' అన్నాను.

'ఏమీ చెప్పలేనోడివి నువ్వేంది సన్నాసం ఇచ్చేది?' అన్నాడు.

'నేనిస్తానని ఎప్పుడన్నాను? అయినా, మీ ఇద్దరూ వదిలేస్తే పిల్లల్నెవరు చూస్తారు?' ప్రశ్నించాను. 

'దేవుడు చూసుకుంటాడు' అన్నాడు.

'ఏ దేవుడు?' అడిగాను.

'ఎవరో ఒక దేవుడు' అన్నాడు.

'కనేది మీరూనూ, చూసుకునేది దేవుడా?' అడిగాను.

దానికి సమాధానం చెప్పకుండా, 'మరి నువ్వేం చేస్తావు?' అడిగాడు ఏకవచనంలోకి దిగుతూ.

'నేనా? సన్నాసులకు పెళ్లిళ్లు చేస్తాను' అన్నాను.

'అదేంటి?' అన్నాడు.

'నీలాంటి సన్నాసికి అర్ధం కాదులే' చెప్పాను.

'అదేంటి? ఇంకా కాలేదుగా?' అన్నాడు.

'అవ్వక్కర్లేదు. నువ్వు ఆల్రెడీ అదే, నిన్ను నువ్వు గుర్తించుకో. చాలు' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

దీక్షలూ, సన్యాసాలూ పిల్లాటలై పోయాయి. ప్రతివాడూ ఒక కాషాయవస్త్రం కట్టుకుంటూ ఉండటంతో దాని విలువే పోతున్నది. మన హిందూమతంలో ఒక సెంట్రల్ గవర్నింగ్ బాడీ అంటూ లేకపోవడంతో, ఒక కట్టుబాటు, ఒక అదుపు అంటూ లేకపోవడంతో, ఎవడు పడితేవాడు  ఏదో ఒకటి చెబుతూ ఉండటంతో, ఇలాంటివాళ్లకు అసలు తమ మతమంటే ఏమిటో తెలీకుండా తయారైంది.

కోరికలు తీరడానికి దీక్షలు, పూజలు, గుళ్ళు, గోపురాలు, మంత్రాలు, తంత్రాలు, ఇవే హిందూమతమని కోట్లాదిమంది భ్రమిస్తున్నారు. అంతేగాని, అదేంటో, అదేమి చెబుతున్నదో, ఎలా బ్రతకమని చెబుతున్నదో ఎవరికీ పట్టడంలేదు. ప్రతివాడూ తన ఇష్టానుసారం అన్నీ చేస్తూ, ఒక బొట్టు పెట్టుకుని, ఒక గుడికెళ్ళి వస్తే చాలు, ఒక పూజ చేస్తే చాలు, అన్నీ అయిపోతాయి, ఇదే హిందూమతం అనుకోవడమే నేడు హిందూమతానికి పట్టిన అతిపెద్ద దరిద్రమని నా ఉద్దేశ్యం.'

'ఎర్రగుడ్డలేసుకుని కూచుంటే చాలు, లైఫు సెటిలైపోతుంది. ఆపైన మనల్ని పోషించాల్సిన పని సమాజానిదే. ఇదే సన్నాసం' అని చాలామంది ఇలాంటివాళ్ళు ఊహిస్తుంటారు. అలాంటివాళ్ళు దేశమంతా తిరుగుతూ అడుక్కుంటూ ఉండే దొంగసాధువులలో కలవాలి. 

సన్యాసం అని స్పష్టంగా పలకలేనివాడికి, బాధ్యతలను నెరవేర్చలేనివాడికి , సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనలేనివాడికి, కుటుంబాన్ని దాని ఖర్మకొదిలేసి జల్సాగా గాలికి తిరగాలనుకునేవాడికి సన్యాసమేంటసలు? సన్యాసమనేది ఎంత చీప్ అయిపోయిందో? అసలు, ప్రతివాడికీ సన్యాసార్హత ఉందా? ఉంటుందా?

ఇలాంటి సన్నాసులకు మళ్ళీ సన్నాసమెందుకసలు?

read more " నేను సన్నాసుల్లో కలుద్దామనుకుంటున్నాను "

26, జూన్ 2026, శుక్రవారం

మీ పిల్లలే మీ శత్రువులు

మొన్న పూనాలో, నిన్న బెంగుళూరులో జరిగిన సంఘటనలు, మన సంతానమే మన శత్రువులని ఋజువు చేస్తున్నాయి. 

అందరూ అలాగే ఉంటారా? అంటే, ఉండకపోవచ్చు. కానీ, మెజారిటీని బట్టి అలా అనవలసి వస్తున్నది. నేటికాలంలో, సంతానం చేతుల్లో బాధలుపడకుండా, 'మా పిల్లలతో మేము హాయిగా సుఖంగా న్నాము' అని ఏ తల్లిదండ్రులైనా చెప్పగలరా? గుండెమీద చేయివేసుకుని, నిజాయితీగా అలా చెప్పగలిగిన వాళ్లకు లక్షరూపాయలు బహుమతిగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

ఖర్మకాలితే తనవారే తనకు శత్రువులౌతారు. దీనిని వివరించే ఆణిముత్యంలాంటి సంస్కృతసుభాషితం ఒకటున్నది.

శ్లో||ఋణకర్తాపితా శత్రుర్మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు: పుత్రఃశత్రురపండితః ||

అప్పులు మిగిల్చిపోయిన తండ్రి, వ్యభిచారిణియైన తల్లి, అందమైన భార్య, పండితుడు కాని కుమారుడు - ఈ నలుగురూ తన శత్రువులని ఈ సుభాషితం అంటుంది.

పై శ్లోకంలో కూతుళ్ళ గురించి లేదు. ఎందుకంటే, అప్పట్లో వారికి స్వతంత్రం లేదు. కనుక వారితో సమస్య లేదు. కానీ ప్రస్తుతం ఏ కుటుంబంలో చూచినా సమస్యలన్నీ కూతుళ్లు కోడళ్లతోనే. అంటే ఆడపిల్లలతోనే. ప్రతికూతురూ ఒకింటి కోడలేగా ! అలాగే, ప్రతి కోడలూ ఒకింటి కూతురేగా ! 

ఇప్పుడు ఆడపిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. బయట ఊళ్లలో, హాస్టళ్లలో ఉంటున్నారు.  అంతవరకూ బాగానే ఉంది. కానీ, ఎల్కేజీ నుంచే స్నేహాలెక్కువయ్యాయి. అదేంటని అడిగితే, అడిగినవారిని అడవిమనుషుల్లాగా చూస్తున్నారు. తల్లిదండ్రులను లెక్కచేయడం లేదు. సమాజంలో అంతటా అతిస్వాతంత్య్రం వెల్లివిరుస్తోంది. ఇష్టం వచ్చినట్లు సహజీవనాన్ని, సహకారజీవనాన్ని కోర్టులు కూడా సమర్ధిస్తున్నాయి. ఒక్కసారి మేజర్ అయ్యాక, "ఎవడైతే నాకేంటి?" అనే ధోరణి ఎక్కువైపోయింది.

ఒకప్పుడు తండ్రి, భర్త లేదా అన్నల సంరక్షణలో ఆడపిల్లలు ఉండేవారు. కానీ, ఇప్పటివారికి ఏ సంరక్షణా అవసరం లేదు. ఒకప్పుడు మగాడి దౌర్జన్యానికి ఆడది బలైపోతూ ఉండేది. నేడు ఆడది రోడ్డెక్కి అల్లరిచేస్తుంటే మగాడు ఇంట్లోదూరి దాక్కోవాల్సి వస్తోంది.

చదువులు, ఆర్థికస్వాతంత్య్రం, పదవులు, హోదాలు, బయట పరిచయాలు అన్నీ మంచివే. కానీ ఎంతవరకు? సంస్కారం లేని చదువులెందుకు? హద్దులు తెలియని స్నేహాలెందుకు? అవసరాలు తప్ప ఆప్యాయతలు లేని బంధుత్వాలెందుకు? కనీస మానవత్వం కూడా లేని ఈ బ్రతుకులెందుకు?

పూనా కేసులోగాని, బెంగుళూరు కేసులో గాని నేరస్తులు, డ్రామస్తులు, కూతుళ్లే. బాధితులేమో తల్లిదండ్రులు.

మొదటికేసులో, కాబోయే భర్తను మాత్రమే ఆ అమ్మాయి చంపేసింది. అదికూడా అంత క్రూరంగా లోయలోకి తోసేసి మరీ ! రెండవకేసులో తల్లిని, తండ్రిని, చెల్లెలిని ముగ్గురినీ  స్పాట్లో పొడిచి పారేసింది. ఎవరికోసం? నిన్నగాక మొన్న పరిచయమైన ఒక క్రైస్తవ అపరిచితుడికోసం.

డబ్బు, స్వార్ధం, విలాసాలు, సరదాలు, పైశాచికత్వం తప్ప చాలామంది నేటి ఆడపిల్లలలో ఇంకేమీ కనిపించడం లేదు. స్త్రీసహజ గుణాలైన నెమ్మది, ఓర్పు, ప్రేమతత్త్వం, జాలిగుండె ఇవేవీ ఎవరిలోనూ కనిపించడం లేదు. తల్లిదండ్రులంటే ప్రేమ లేకపోతే మానె, కనీసం కృతజ్ఞత, విశ్వాసం  లాంటివి కూడా ఉండటం లేదు.

ఒకరకంగా చూస్తే,  ఈ ట్రెండ్ మంచిదే. వినాశనం త్వరగా వస్తుంది. అంతా అయిపోయాక గానీ మనకు బుద్ధిరాదు కదా ! నిజానికి ఏ ట్రెండునూ వెనుకకు మరలించలేం. అందరం ముందుకే పోవాలి, అదెక్కడికి తీసుకుపోయినా సరే !

మరొక్క పాతికేళ్లలో పెళ్లిళ్లు, పిల్లలు  మొదలైనవేవీ ఉండకపోవచ్చు.  కేవలం, సహజీవనాలు, సహకార జీవనాలు, వస్తుమార్పిళ్ళలాగా వ్యక్తిమార్పిళ్లు మాత్రమే ఉంటాయేమో?

చూద్దాం, అప్పటిదాకా మనం బ్రతికుంటే !

read more " మీ పిల్లలే మీ శత్రువులు "

15, మే 2026, శుక్రవారం

సనాతనాన్ని మళ్ళీ నిర్మూలిద్దాం

'సనాతనాన్ని నిర్మూలించాలి' అని ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ అన్నాడు. దానికి వంతపాడుతూ TVK ఎమ్మెల్యే ముస్తఫా 'సనాతనాన్ని నిర్మూలించడానికే మేము పుట్టాము' అన్నట్లుగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి  జోసెఫ్ విజయ్ ఏమీ మాట్లాడలేదు. ఊరకే చూస్తూ కూచున్నాడు.

కేరళలో కాంగ్రెస్ వచ్చింది. కర్ణాటకలో ఇప్పటికే ఉంది. తమిళనాడులో హిందూవ్యతిరేక ప్రభుత్వమే ఒక క్రొత్త ముసుగులో మళ్ళీ వచ్చింది.  తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. ఆంధ్రా ఒక్కటే అటూ ఇటూ ఊగులాడుతోంది.

ఇది చాలా మంచి పరిణామం.

పదిహేనేళ్ల తర్వాత, రాష్ట్రం సర్వనాశనం కాబోతున్న అంచులో మాత్రమే బెంగాల్ కు బుద్దొచ్చింది. ఇప్పుడు తవ్వుతుంటే సరిహద్దులలో వందలాది సొరంగాలు బయటపడుతున్నాయి. కోటిమంది పైన బాంగ్లాదేశ్ ముస్లిములు, రోహింగ్యాలు మన దేశంలో ఇప్పటికే ఉన్నారు. బెంగాల్లో బీజేపీ రాకపోయి ఉంటే ఒకటి రెండేళ్లలో దేశం మొత్తం  పాకిస్తాన్ బాంగ్లాదేశ్ ల చేతులలోకి వెళ్ళిపోయి ఉండేది. కనీసం చివరి నిముషంలోనైనా బెంగాలీలు కళ్ళు తెరిచారు. సంతోషం.

కానీ దక్షిణాది అయిదురాష్ట్రాలకు మాత్రం ఇంకా తెలివి రావడంలేదు. బహుశా ఇంకా ఇంకా చేతులు కాలాలేమో? అప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తారేమో? 

ఈ వైరస్ ను ఇప్పుడు సౌత్ రాష్ట్రాలు పెంచి పోషిస్తున్నాయి. వీటికెప్పుడు బుద్ధొస్తుందో తెలీదు. చూడబోతే మన దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనికిరాదని అనిపిస్తోంది. ఇదంతా ఊహించే, ఇలా జరగాలని చాలా ముందునుంచి కోరుకునే, ఇటువంటి పరిపాలనావ్యవస్థను, ఇటువంటి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారేమో ఘనత వహించిన నాయకులనిపిస్తోంది.

పూర్తిగా కుళ్లిపోయేదాకా కళ్ళు మూసుకోవడం, చివర్లో లబో దిబో అనడం మనకు అలవాటేగా?

తమిళనాడు హిందువులారా !  లేవకండి. ఇదేవిధంగా నిద్రపోతూ ఉండండి. 'మిమ్మల్ని నాశనం చెయ్యడానికే మేం వచ్చాం' అనేవాళ్లకే ఓట్లేసి గెలిపించుకోండి. ఉదయనిధికి, ముస్తఫాకి,  జోసెఫ్ విజయ్ లాంటి వాళ్ళకి పూర్తిగా మద్దతివ్వండి.  కాళ్లకు మొక్కండి. సన్మానాలు చెయ్యండి. వెనక్కు తగ్గద్దు. ఇదే అజెండాతో ముందుకెళ్ళండి. ఒకనాటికి మీకే తెలుస్తుంది. అప్పటికి మీకు ఉనికే ఉండదు.

వ్యక్తిగతస్వార్ధాలకోసం దేశాన్నే ముంచేసేవాళ్ళని మన దేశంలోనే చూడగలం మరి !

It happens only in India !

read more " సనాతనాన్ని మళ్ళీ నిర్మూలిద్దాం "

14, మే 2026, గురువారం

ఏమి దేశం? ఏమి ప్రజలురా బాబు?

తమిళనాడులో ప్రభుత్వం మారింది. సినిమానటుడు జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. తమిళప్రజలు తెలుగుప్రజలకు ఏమీ తీసిపోరని మళ్ళీ ఋజువైంది.

చూడబోతే దక్షిణాదిరాష్ట్రాలకు వేటికీ దూరదృష్టి, వాస్తవికదృష్టి లేవని అర్థమౌతోంది. కాకపోతే ఒకటి ! ప్రజలకు ఛాయిస్ లేదు. నెగటివ్ ఓటు పనిచేస్తోంది. ఉన్నవాళ్లలో కాస్త మెరుగనిపించిన వాడిని ఎన్నుకుంటున్నారు. అయిదేళ్ల తర్వాత మళ్ళీ మోసపోయామని గ్రహిస్తున్నారు. మన దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది. 

అయితే, తమిళప్రజలకు అన్నామలై నచ్చలేదు. విజయ్ నచ్చాడు.

అన్నామలై విద్యావంతుడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు. IIM గ్రాడ్యుయేట్. IPS సాధించాడు. ముక్కుసూటి ఆఫీసర్. వాటిని వదిలేసి దేశంకోసం ప్రజలకోసం రాజకీయాలలోకి వచ్చాడు. అతను ప్రజలకు నచ్చలేదు.

జోసెఫ్ విజయ్ సినిమాకుటుంబం నుంచి వచ్చాడు. ఇంటర్ మాత్రమే పాసయ్యాడు. అదికూడా అవలేదని, మధ్యలో మానేశాడని కొంతమంది అంటున్నారు. తల్లిదండ్రుల అండదండలతో హీరో అయ్యాడు. ఉద్రేకాలను రెచ్చగొట్టే పంచ్ డైలాగులతో, వాస్తవదూరమైన కథలతో జనాలకు దగ్గరయ్యాడు. వాట్సాప్ గ్రూపులతో, ఇంస్టాగ్రామ్ రీళ్ళతో పార్టీ పెట్టాడు. ఆచరణలో చెయ్యలేని, పనికిరాని వాగ్దానాలు గుప్పించాడు. జనాలు మెచ్చారు. గెలిచాడు. ముఖ్యమంత్రి అయ్యాడు.

ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి.  మరి రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఏంటో చూద్దామా?

2011 లో AIADMK ఓడిపోయి DMK అధికారంలోకి వచ్చింది. అప్పుడు రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల్లో  ఉంది.

15 ఏళ్ల తర్వాత ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుతో DMK ప్రభుత్వం విజయ్ కి పగ్గాలు అప్పగించింది. అంటే ఈ 15 ఏళ్ల హయాంలో, 5 లక్షల కోట్ల అప్పు కాస్తా, 10 లక్షల కోట్ల అప్పుగా మారింది.

తమిళనాడు వార్షికబడ్జెట్ 3.44 లక్షల  కోట్లు. అంటే, బడ్జెట్ కు మూడురెట్లు అప్పులున్నాయి. ఒక కుటుంబం దృష్టిలో మాట్లాడుకోవాలంటే, నెలకు పదివేలు సంపాదన అయితే, ముప్పై వేలు అప్పుంది. ఇదంతా ఎలా తీరాలి? ఎవరు తీర్చాలి?

ఈ తెచ్చిన అప్పులన్నీ ఎలా ఖర్చుపెట్టబడ్డాయి?

రకరకాల స్కీముల కింద ప్రజలకు కొంత పందేరం చెయ్యడం, కొంత నొక్కెయ్యడం ఇదే ఎక్కడైనా జరిగేది, జరుగుతున్నది కూడా. ఆ డబ్బులన్నీ ఎక్కడకు పోతున్నాయి? ఏ స్విస్ బ్యాంక్ కో, ఏ సింగపూర్ కో తరలిపోతున్నాయి. అంతేగాని, రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పెట్టడంగాని, ఒక రెవెన్యూ సృష్టించే ప్లాన్ గాని లేవు. ఉద్యోగాల సృష్టి లేదు. సంపద సృష్టి లేదు. అప్పులు తేవడం, వాడుకోవడం, దేశసంపదంతా విదేశీ బ్యాంకులకు తరలిపోవడం. ఇదీ గత 70 ఏళ్లుగా జరిగింది. ఈ వరస ఒక్క తమిళనాడులోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తంతు నడుస్తోంది. ప్రజలు ఎక్కడైనా గొర్రెలేగా !

జనాలకు ఇదంతా పట్టదు. మన కులపోడైతే చాలు, నెలకింత అని డబ్బులిస్తుంటే చాలు, మనోళ్లు చేసే దౌర్జన్యాలు, నేరాలు అన్నీ మాఫీ చేస్తుంటే చాలు, వాడు దేవుడు. 

ఈ డబ్బులన్నీ ఎక్కడనుంచి వస్తాయి? అన్న ఆలోచన ఎవడికీ లేదు. రాష్ట్రం ఎటుపోయినా మనకనవసరం ! వాస్తవాలు ఎవరికీ  అక్కర్లేదు. నాలుగు డైలాగులు చెప్పి ఉద్రేకాలను రెచ్చగొట్టి, పది వాగ్దానాలు చేస్తే చాలు, ఓట్లు పడిపోతాయి. తర్వాత, మనం కట్టే టాక్స్ ని సగం నొక్కేసి, సగం మనకే పంచేసి చేతులు దులుపుకుంటారు. అదేమంటే కేంద్రం సాయం చెయ్యడం లేదంటారు. ఈలోపల రాష్ట్రం ఇంకా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.

ఇలాంటి ప్రజలకు ఇలాంటి ప్రభుత్వాలు రాక ఇంకేమొస్తాయి?

ఇంకొక విచిత్రం చెప్పనా !

సమాజంలో ఏ ఉద్యోగానికైనా ఒక అర్హత కావాలి. పాతిక ముప్పై ఏళ్ళు చదువుకొని, ఎన్నో పరీక్షలు వ్రాసి, కష్టపడితే గాని ఒక స్థాయి ఉద్యోగం రాదు. కానీ రాజకీయాలకు మాత్రం ఏ విధమైన అర్హతా అవసరం లేదు. 

ఆటోడ్రైవర్ మంత్రి కావచ్చు. మేకప్ మ్యాన్ ప్రభుత్వ చీఫ్ విప్ కావచ్చు. స్టూడియో బాయ్ స్పీకర్ కావచ్చు. "అనుభవం లేకుండా రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తావు నాయనా?" అంటే, "ఐఏఎస్ లున్నారు కదా, వాళ్ళని పెట్టి నడిపిస్తాం" అంటారు. వాళ్లలో నిజాయితీపరులెందరు?

UPSC లో ఏడాదికేడాది క్వాలిటీ తగ్గిపోతున్నది. మజ్జిగ పలచబడిపోతున్నది. రెండు ముక్కలు ఇంగ్లీషు గట్టిగా మాట్లాడలేని వాళ్ళు IAS, IPS అవుతున్నారు. టెన్త్ తప్పినవాళ్లు, ఇంటర్ నాలుగుసార్లు రాసినవాళ్లు UPSC లో సెలక్ట్ అవుతున్నారు. చాలామందిలో కులపిచ్చి, డబ్బుపిచ్చి చాలా ఎక్కువగా ఉంటోంది. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసినవే. ఊహలు కావు.

నేను IRTS కేడర్ లో చూశాను. నిజాయితీపరులను, నిక్కచ్చిగా ఉండేవాళ్ళను, అవినీతి చెయ్యనివాళ్లను కనీసం వేళ్ళపైన కూడా లెక్కపెట్టలేము. చాలావేళ్ళు మిగిలిపోతాయి. అలా ఉంటుంది పరిస్థితి.

అది సెంట్రల్ సర్వీసయినా, స్టేట్ సర్వీసయినా, నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎటూ మొగ్గకుండా, అవినీతికి పాల్పడకుండా, రూలు ప్రకారం పనిచేసే అధికారులు ఎక్కడా లేరు. అందరూ ఏదో ఒకచోట పడిపోయేవారే, ఏదో ఒక పార్టీకి, ఒక భావజాలానికి కొమ్ముకాసేవారే. ఉంటే గింటే నిజాయితీపరులు ఒకరిద్దరున్నారేమో అక్కడక్కడా ! వాళ్ళనెలాగూ పక్కన పెట్టేస్తారు కాబట్టి బాధ లేదు.

అనుభవం లేని నాయకులతో, నైతికస్థాయిలేని అధికారులతో రాష్ట్రాలుగాని, దేశాలుగాని ఎలా ఎదుగుతాయో, ఎక్కడకు ఎదుగుతాయో దేవుడికే ఎరుక !

ఇకపోతే మరొక కొసమెరుపు ! 

తన వ్యక్తిగతజ్యోతిష్కుడిని ప్రభుత్వసలహాదారుగా నియమించిన జోసెఫ్ విజయ్, అందరినుంచీ ప్రతిఘటన రావడంతో  ఆ ఆర్డర్ ను మర్నాడే హడావుడిగా కేన్సిల్ చేశాడు.

అసలు, క్రైస్తవం భారతీయజ్యోతిష్యాన్ని ఒప్పుకుంటుందా? జోసెఫ్ కి మన జ్యోతిష్యమెందుకు? లేక, అవసరం ఉంటే ఏదైనా పరవాలేదా?

ఆమాత్రం ఒత్తిడిని తట్టుకోలేనివాడు, ముందుముందు రాబోయే రాజకీయసంక్షోభాలను, బలపరీక్షలను, రాష్ట్రసమస్యలను ఎలా తట్టుకుంటాడనేది అసలైన ప్రశ్న !

మళ్ళీ, ఈ విమర్శించిన ప్రతిపక్షాలన్నింటికీ ఎవడో ఒక జ్యోతిష్కుడు, ఒక స్వామీజీ తప్పకుండా ఉంటారు. ఇందిరాగాంధీకి ధీరేంద్ర బ్రహ్మచారి, ఎన్టీ రామారావుకు మోహన్ రెడ్డి, ఇపుడు జోసెఫ్ విజయ్ కి రాధన్ పండిట్ ఇలా ప్రతి ఒక్కరికీ ఉంటారు. నార్త్ లో అయితే ఇంకా చాలామంది ఉంటారు. రాజకీయులకు, జ్యోతిష్కులకు, స్వామీజీలకు ఉండే అక్రమసంబంధాలు లోకానికి కొత్తేమీ కాదు.

కాకపోతే, ఈ మొత్తం ప్రహసనంలో ఒక్క విషయం మాత్రం అర్ధంకావడం లేదు. పదేళ్ల తర్వాత జోసెఫ్ విజయ్ సిఎం అవుతాడన్న విషయాన్ని ముందే చెప్పిన రాధన్ పండిట్ వట్రివేల్ కు, తనకు ఇవ్వబడిన పదవి ఒక్కరోజులో ఊడిపోతుందన్న సంగతి తెలుసా లేదా అనేదే ప్రశ్న ! తన జాతకం తను చూసుకోలేదా?

లోకానికి జోస్యాలు చెప్పే జ్యోతిష్కులకు, తమ జాతకం తమకే తెలీకపోవడం ఏంటో ఈ వింత ! 

ఎవరికీ దూరదృష్టి లేదు, సరియైన ప్లానింగ్ లేదు. నిజాయితీ లేదు, నిస్వార్ధధోరణి లేదు. ఇలాంటి తెలివిలేని దురాశాపరులైన ప్రజలతో, ఇలాంటి అవకాశవాద అవినీతి రాజకీయాలతో, అవినీతి అధికారులతో, ఈ దేశం, ఈ రాష్ట్రాలు బాగుపడటం చాలా కష్టం. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప !

ఏంటా అద్భుతం?

ప్రతిరాష్ట్రానికీ ఒక యోగి, ఒక హిమంతశర్మ లాంటివాళ్లు ముఖ్యమంత్రులుగా ఉండటమే ఆ అద్భుతం. అలాంటి అద్భుతమేదీ కనుచూపుమేరలో కనిపించడం లేదు.

It happens only in India అనుకోవడం తప్ప ఈలోపల మనం చేసేదేముంది?

read more " ఏమి దేశం? ఏమి ప్రజలురా బాబు? "

28, మార్చి 2026, శనివారం

ఎడారిమతాలున్నచోట శాంతి ఉండదు

నిన్న శ్రీరామనవమి నాడు తన నియోజకవర్గంలోని  ఆకివీడులో, ఒక రామాలయాన్ని సందర్శిద్దామని వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిమీద, ఆయనవెంట ఉన్న వారిమీద కత్తులతో, మేకులతో భౌతికదాడి జరిగింది. పోలీస్ ఎస్కార్ట్ తో ఆయన ఆ గుంపునుండి బయటకు రావలసి వచ్చింది. ఆయన వెంట ఉన్నవారిలో కొంతమందికి గాయాలయ్యాయి.

దాడిచేసినది దళితక్రైస్తవుల ముసుగులో ఉన్నవారని ఆయన ఆరోపించారు.

శాంతిని అనుసరించవలసిన క్రైస్తవులు దాడిచేయడమేంటి? అదీగాక మేకులతో దాడిచేయడమేంటి? నాకైతే నవ్వొచ్చింది. అంటే, వారు నమ్మే జీసస్ ను రోమన్లు మేకులు కొట్టి చంపేశారు గనుక, వాళ్లకు నచ్చని అందరినీ మేకులతో దాడిచేద్దామని ప్రయత్నమా? ఇదెక్కడి వింతో నాకైతే అర్ధం కాలేదు.

పశ్చిమగోదావరి జిల్లాలలో గత అరవై డెబ్బయి ఏళ్లుగా క్రైస్తవప్రచారం ముమ్మరంగా జరిగింది. అనేక సంస్థలు పుట్టుకొచ్చి, లక్షలమంది నిమ్నవర్గపు హిందువులను క్రైస్తవులుగా మార్చేశాయి. చాలాచోట్ల ఊళ్లకు ఊళ్లే ఈ విధంగా మార్చబడ్డాయి. అలా మారినవారిలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ప్రముఖంగా ఉన్నారు. వారిలో తక్కువశాతం మంది మాత్రం ఇప్పటికీ మారకుండా నీతిగా ఉన్నారు.

నీతిగా అని ఎందుకన్నానంటే, చెప్పుకునే మతమేమో క్రైస్తవం, పేపరుమీద మతమేమో హిందూమతం. లేకపోతే రిజర్వేషన్ రాదుగా? మరి, అది నీతెలా అవుతుంది? అందుకని అలా అనవలసి వచ్చింది !

అంతకుముందు ఆయా ఏరియాలలో అన్నింటిలోనూ రామాలయాలుండేవి. క్రమేణా అవి పాడుబడిపోయాయి. సందుసందుకీ చర్చిలు వెలిశాయి. దశమభాగాలు దండుకొని పాస్టర్లు కోటీశ్వరులయ్యారు. మతవ్యాపారాలు విస్తరించాయి. ఓట్లకోసం నాయకులు వారికి తందానతాన పాడారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయి. చీలికలు ఏర్పడ్డాయి.

దేశంలో నార్త్ ఈస్ట్ లోని సెవెన్ సిస్టర్ రాష్ట్రాలు ఏకమొత్తంగా క్రైస్తవంలోకి మార్చబడ్డాయి. ఈ పని గత యాభై ఏళ్లుగా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత స్దానం ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లాదే అని నా అనుమానం. అంత ఎక్కువగా కన్వర్షన్స్ అక్కడ జరిగాయి.

ఈ లోపల, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని, రికార్డులో హిందువులుగా ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా మారి అనేకమంది డబల్ బెనిఫిట్ పొందారు. అక్కడేమో రిజర్వేషను, ఇక్కడెమో మతప్రచారం, విదేశీఫండ్స్, వాటిలో ముప్పావలా నొక్కేసి, పావలా పంచి మళ్ళీ మతమార్పిడులు, ఈ విధంగా ఈ అవినీతికుట్రలు దశాబ్దాలుగా సాగుతూ వచ్చాయి.

నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో, ఇప్పటివరకూ హిందూరిజర్వేషన్ వరాలను అనుభవిస్తూ, సమాజంలో క్రైస్తవులుగా చెలామణీ అవుతున్న దొంగలందరూ బయటకు రావల్సి ఉంటుంది. పెద్దపెద్ద ఉద్యోగాలలో ఇప్పటికే తరతరాలుగా స్థిరపడి ఉన్న వీరంతా,  ఆ విధంగా బయటపడి తమ తప్పులను ఒప్పుకుంటారా? సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సరే. పిల్లికి గంటకట్టేదెవరు? చూడాలి.

పోతే, ఇన్ని దశాబ్దాలుగా, ఈ న్యాయవిరుద్ధమైన రిజర్వేషన్ ను ఉపయోగించుకొని ఇప్పటివరకూ ఎన్ని కోట్లమంది ఉద్యోగాలు సంపాదించారో లెక్క తీయవలసిన అవసరం ఉన్నది. మరి, అన్ని కోట్లమంది అసలైన అర్హులు తమ అవకాశాలను పోగొట్టుకున్నట్లే కదా? వారికి జరిగిన నష్టాన్నెవరు పూడుస్తారు? పూడ్చిపెట్టబడిన  ప్రభువు లేచొచ్చి పూడుస్తాడా?

అదలా ఉంచితే, శాంతిమతాలైన క్రైస్తవం, ఇస్లాంలు ఎక్కడ అడుగుపెడితే అక్కడ చీలికలు, విభేదాలు, గొడవలు, హింస, యుద్ధాలు, నాశనం తప్పకుండా జరుగుతుందనేది నిజం. నేడు ప్రపంచంలోని ఏ దేశంలో చూచినా ఇది రుజువౌతుంది. కారణమేంటంటే, వారి మూలసిద్ధాంతమే - 'నా మతం కరెక్టు, నీది తప్పు. మా దేవుడు రైటు, మీవాడు రాంగు, మతం మారతావా చస్తావా?' అనేది తప్ప ఇంకొకటి ఉండదు. ఉన్నతమైన తత్త్వశాస్త్రం గాని, తమకంటే ప్రాచీనమైన మతాలనుండి కాపీకొట్టకుండా సొంతంగా పుట్టిన భావాలు గాని, వాటిలో ఎక్కడా లేకపోవడం ఇంకొక కారణం.

క్రైస్తవానికీ, ఇస్లాముకూ యూదుమతమే మూలం. వాటిపైన తిరుగుబాటుగా పుట్టిన ఇస్లాం ఆ రెండింటితో ఇప్పుడు యుద్ధం చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాల మధ్యన ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? ఈ మూడూ అబ్రహామిక్ మతాలే. వీటితో ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి వస్తున్నది. మళ్ళీ ఈ మూడూ చెప్పేవి శాంతి కబుర్లే. వింతగా లేదూ?

మొదటి ప్రపంచయుద్ధంలో 2 కోట్ల 20 లక్షలమంది చనిపోయారు. రెండవ ప్రపంచయుద్ధంలో 8 కోట్ల 50 లక్షలమంది చనిపోయారు. 1095 CE నుండి 1291 CE వరకూ జరిగిన క్రూసేడ్స్ లో 90 లక్షలమందిని, కేవలం క్రైస్తవులు కాని కారణం చేత, అమానుషంగా హింసించి చంపేశారు పోపు అనుచరులు. అంటే దాదాపుగా 12 కోట్లమంది అమాయకులను ఇప్పటిదాకా ఈ రెండు శాంతిమతాలూ పొట్టనపెట్టుకున్నాయి. ఇదేనా శాంతి అంటే?

1560-1812 CE  మధ్యలో జరిగిన గోవా ఇంక్విజిషన్స్ లో వందలాదిమంది హిందువులను దారుణంగా హింసించి సజీవదహనాలు చేశారు. లేదా మతాలు మార్చారు. ఇది మన గోవారాష్ట్రంలోనే జరిగింది. ఏ విధంగా అమాయకులైన హిందువులను హింసించారో చదివితే రక్తం ఉడికిపోతుంది. ఇదా క్రైస్తవం? వీళ్లదా శాంతిమతం? శాంతివచనాలు చెప్పే అర్హత క్రైస్తవానికి అసలుందా?

నేడు సెవన్ సిస్టర్స్ మొత్తాన్నీ ఒక క్రైస్తవదేశంగా మార్చేసి ఇండియానుండి విడదీయాలని పెద్ద కుట్ర జరుగుతోంది. ఇది నిజమా కాదా? సాక్షాత్తు బంగ్లాదేశ్ గతప్రధాని షేక్ హసీనానే  ఈ మాట చెప్పింది. నిన్నగాక మొన్న టూరిస్ట్ వీసాలపైన ఇండియాకు వచ్చి మణిపూర్, మిజోరాం ప్రాంతాలలో క్రైస్తవమతప్రచారం చేస్తూ, ఆయుధాలు సప్లై చేస్తూ ఉక్రెయిన్ దేశస్థులు, అమెరికన్లు దొరికిపోలేదా? దీనిని శాంతి అంటారా? క్రీస్తు ఇలాంటి కుట్రలను చెయ్యమని చెప్పాడా?

1947 దేశవిభజన సమయంలో దాదాపు 20 లక్షలమంది భారతీయులు చంపబడ్డారు. వేలాదిమంది హిందూమహిళలు రేపులకు గురయ్యారు. 1989 లో జరిగిన కాశ్మీర్ మారణకాండలో దాదాపుగా 1000 మంది కాశ్మీర్ పండిట్లు దారుణంగా చంపబడ్డారు. కారణం? వాళ్ళు హిందువులు కావడమే. వేలాదిమంది హిందూమహిళలు రేపులకు గురయ్యారు. ఎప్పటివో ఎందుకు? ప్రస్తుతం బాంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మారణకాండ ఏమిటి? ఎంతమందిని చంపారు? ఎన్ని రేపులు జరిగాయి? ఎన్ని ఇళ్ళు ధ్వంసం చేశారు? ఇదంతా ఇస్లాం చేసింది కాదా? ఇది ఇంకొక శాంతి మతమా? మనం నమ్మాలా?

1980 - 88 మధ్యలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని 20 లక్షలమంది చచ్చారు.

అందరూ ముస్లిములే ఉన్నచోట షియాలు, సున్నీలు అని కొట్టుకుంటారు. అందరూ క్రైస్తవులే ఉన్నచోట కాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు అని కొట్టుకుంటారు. వీళ్ళలో ఇంకా చాలా గ్రూపులు, డినామినేషన్లు ఉన్నాయి. బయటకు ఆ గొడవలన్నీ కనిపించవు. లోతుగా చూచినవారికి మాత్రమే అర్ధమౌతాయి. తెలియనివారికి మాత్రం అవి చాలా శాంతిమతాలని మాయమాటలు చెబుతారు.

జనాభాను పెంచుకొని దేశదేశాలు ఆక్రమించి, విద్వేషాలు రెచ్చగొట్టి, ఆ దేశస్థులను లేకుండా రూపుమాపడమే వీళ్ళ అజెండా. శాంతి అనేది దీనికి ఒక ముసుగు మాత్రమే.

చరిత్ర చదువుకుంటే ఇవన్నీ అర్ధమౌతాయి. ఏమీ తెలియకుండా డబ్బులకు అమ్ముడుపోయి, పాస్టర్లు, ముల్లాలు చెబుతున్నది నిజమనుకుంటే ఇలాగే ఉంటుంది మరి ! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీస్పీకర్ పరిస్థితే  ఇలా ఉంటే, ఇక ఆ ఏరియాలలో ఇతరపౌరులు శాంతిగా బ్రతికేదెలా సాధ్యపడుతుంది? ఆలోచించండి. హైద్రాబాద్ పాతబస్తీ లాగా, పశ్చిమగోదావరి జిల్లా కూడా తయారైనట్లు కనపడుతోంది. దానికీ దీనికీ మూలం ఆ రెండుమతాలే. అవి అడుగుపెట్టిన చోట శాంతి అనేది ఉండదనేది వాస్తవం.

ఇంకా సందేహాలేమైనా మిగిలున్నాయా?

read more " ఎడారిమతాలున్నచోట శాంతి ఉండదు "

23, మార్చి 2026, సోమవారం

మన హిందూమతం చాలా గొప్పది

'ఫలానా హిందూసంస్థ నుండి మాట్లాడుతున్నాము' అంటూ ఈమధ్య ఒక ఫోన్ కాలొచ్చింది.

పరిచయాలయ్యాక. 'ఎందుకు ఫోన్ చేస్తున్నారు?' అడిగాను.

'మీ కృషి చాలా బాగుంది. మీ వ్రాతలన్నీ మేము చదువుతాము. ముఖ్యంగా, క్రైస్తవాన్ని, ఇస్లాంను మీరు విమర్శించే తీరు బాగుంటుంది' అన్నారు.

'మన హిందూమతాన్ని కూడా విమర్శిస్తూనే ఉంటాను. అది చదవలేదా?' అడిగాను.

'చదువుతున్నాము. అందుకే ఈ ఫోన్. మనల్ని మనమే విమర్శించుకుంటే ఎలా?' అన్నాడాయన.

'ఆత్మవిమర్శ మంచిదేగా?' అడిగాను.

'అది తగ్గించి, ఇతర మతాలను ఎండగట్టడంపైన దృష్టి పెట్టండి. ఇది మా రిక్వెస్ట్' అన్నాడు.

'అది సరే. కానీ మన  హిందువుల పిచ్చిపోకడలను వదిలేస్తానని మాత్రం చెప్పలేను' అన్నాను.

'అది చెయ్యడానికి మతాచార్యులున్నారుగా?' అన్నాడు.

'ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు మన మతాచార్యులు?' అడిగాను.

'అంటే వాళ్ళ పరిమితులు వాళ్ళకుంటాయి కదండీ' అన్నాడు.

'పరిమితులుంటాయి సరే. హిందువులు తప్పులు చేస్తున్నపుడు, 'ఇది తప్పు. వద్దు చెయ్యకండి' అని ఎందుకు చెప్పడం లేదు? హిందూమత మూలాల గురించి, అసలైన హిందూమతం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు?' అడిగాను.

దానికి జవాబు చెప్పకుండా, 'మనమందరం ఐకమత్యంగా ఉండాల్సిన సమయం వచ్చింది' అన్నాడు.

'ఇప్పుడు క్రొత్తగా వచ్చేదేముంది? చరిత్రలో ఇటువంటి కాలాలు చాలాసార్లు వచ్చాయి. చాలాసార్లు మనం ఫెయిలయ్యాం' అన్నాను.

'కనుకనే ఇప్పుడు మనం కలిసుండాలి' అన్నాడు.

'కలిసుండక విడిపోయిందెప్పుడు?' అన్నాను.

'అంటే, అందరూ ఒక్క త్రాటిపైకి రావాలి' అన్నాడు.

ఆయన మాటలు రాజకీయ పడికట్టు పదాలలాగా ధ్వనించాయి.

'ఎక్కడుంది ఆ త్రాడు?' అడిగాను.

 జవాబు లేదు.

'మీరు చెప్పలేకపోయినా, నేను చెబుతున్నాను వినండి. నేనా త్రాటిపైననే ఉన్నాను. లేనివాళ్ళని దానిపైకి రమ్మనే నేనూ చెబుతున్నాను. ఈ క్రమంలోనే మన హిందూమతంలోకి రోజురోజుకూ వచ్చి చేరుతున్న పిచ్చిపోకడలను ఖండిస్తున్నాను' అన్నాను.

'కొంచెం వివరిస్తారా?' అడిగాడు.

'చూడండి. శివుడు, విష్ణువు. అమ్మవారు, ఇతర ప్రామాణిక హిందూదేవతలందరినీ మేము  ఒప్పుకుంటాము. క్రొత్తగా తయారౌతున్నవారిని, చేర్చబడుతున్నవారిని మాత్రం ఒప్పుకోము. పోతే, వైష్ణవులు శైవాన్ని ఒప్పుకుంటారా?' అడిగాను.

'ఒప్పుకోరనుకోండి. దానిని కూడా మేము ప్రయత్నిస్తున్నాము' అన్నాడు.

' మరి శైవులు వైష్ణవాన్ని ఒప్పుకుంటారా?' అడిగాను.

' ఒప్పుకోరు' అన్నాడు.

' అలాగే,  ఏ శాఖైనా మిగతావారిని ఒప్పుకోవు. ఇదంతా తప్పని, దేవతాస్వరూపాలన్నీ ఒకే పరబ్రహ్మము యొక్క  అనేకరూపాలని ఏ ఆచార్యుడు, ఏ గురువు చెబుతున్నారు?' అడిగాను.

' మేమూ ప్రయత్నిస్తున్నాము. ఈ సత్యాన్ని జనంలోకి తీసికెళ్ళడానికి' అన్నాను.

'దానిని అర్ధం అయ్యేటట్లుగా చేయాలంటే, పురాణకధలను వదలిపెట్టి, ఉపనిషత్తులను బోధనాగ్రంధాలుగా తీసుకోవాలి. పురాణాలు తెలివిలేని పామరజనంకోసం వ్రాయబడినవి. ఉపనిషత్తులు జ్ఞానభాండాగారాలు. సామాన్యజనానికి కూడా వాటిలోని జ్ఞానాన్ని వివరించి చెప్పాలి. అంతేగాని పురాణకధలను పట్టుకొని కూచోకూడదు' అన్నాను.

' సామాన్యజనం వాటిని అర్ధం చేసుకోవడం కష్టమే. మేమూ ప్రయత్నిస్తున్నాము' అన్నాడు.

'నేనూ అదే చేస్తున్నాను. ఈ క్రమంలో మన వెర్రిపోకడలను ఖండించడం కూడా చాలా అవసరం. ఆత్మవిమర్శ లేకపోతే, మనకున్న అతిఉదారత్వానికి, అసలు సత్యమే కొన్నాళ్ళకు మరుగునపడే ప్రమాదముంది. అప్పుడు అసలైన హిందూమతం ఉండదు. చిల్లరదేవుళ్లు, దొంగస్వాములు మాత్రమే మిగులుతారు' అన్నాను.

'మాకు మీరిచ్చే సలహా?' అడిగాడు చివరకు.

'ఇతరమతాల డొల్లతనాన్ని ఎండగట్టవలసిందే. అదే సమయంలో, మన హిందూమతంలో ఇప్పటికే ఉన్నవీ, క్రొత్తగా చేరుతున్నవీ వెర్రిపోకడలను కూడా ఎండగట్టాలి. తొలగించాలి. ఈ రెండుపనులూ సమాంతరంగా సాగాలి. అప్పుడే అసలైన హిందూమతమెంత గొప్పదో, దానిని అర్ధం చేసుకోలేక, హిందువులమనుకుంటున్నవారు కూడా ఎలా  తప్పుదారిన పోతున్నారో, జనాలకు అర్ధమౌతుంది. దానినే నా పుస్తకాల ద్వారా, మా సంస్థద్వారా నేను చేస్తున్నాను. చాలామందిని ఇప్పటికే జాగృతపరచాను. ఇంకా కొనసాగిస్తున్నాను. నేనేకాదు. దేశభక్తి, దైవభక్తి ఉన్న ఏ హిందువైనా ప్రస్తుతం చేయవలసింది ఇదే' అన్నాను.

'ప్రణామాలు' అని ఫోన్ పెట్టేశాడాయన.

read more " మన హిందూమతం చాలా గొప్పది "

12, మార్చి 2026, గురువారం

గ్యాసుదేవుని మహిమలు

ఇవాళ తెల్లవారుఝామున బ్రహ్మముహూర్తంలో మంచినిద్రలో ఉండగా నారదమహర్షి కలలో కొచ్చాడు.

'నాయనా ! నీవు ఆశ్రమమునకే పూర్తిగా పరిమితమై పోయితివి. బయటి ప్రపంచమును ఈషణ్మాత్రమూ పట్టించుకొనుటలేదు. మరీ దద్దమ్మవగుచున్నావు. అప్పుడప్పుడు కాస్త బయటకు కూడా వెళ్లి లోకసంచారము చేయుచుండుము. అప్పుడు మాత్రమే నీకు లోకపుతీరు అవగతం కాగలదు' అని సెలవిచ్చి, నేనేదో చెబుదామనుకునేలోపు డామ్మని మాయమైపోయాడు.

'దేవతలకీ ఋషులకీ కూడా ప్రస్తుతం తీరిక ఉండటం లేదు. అందరూ డెలివరీ బాయ్స్ అయిపోతున్నారు. చెప్పాలనుకున్నది చెప్పేయడం మాయమైపోవడం. ఎదుటివాడి రియాక్షన్ కోసం ఆగడం లేదు. స్పీడు బ్రతుకులైపోయాయి. ఏం చేస్తాం?' అనుకుంటూ బద్దకంగా నిద్రలేచాను.

ఫ్రెష్షయ్యి, ప్రధానశిష్యురాలిని తీసుకుని లోకసంచారానికి బయల్దేరాను.

అదేంటో మరి, టిఫిన్ చేద్దామంటే అన్ని హోటళ్ళూ మూసేసి ఉన్నాయి. కనీసం టీ షాపులు కూడా లేవు.

'ఏంటిది? ఇంతఘోరకలిగా యున్నది?' అని శిష్యురాలిని అడిగాను.

'యుద్ధం ప్రభావంతో గ్యాసు ఆగిపోయింది. హోటళ్లు బంద్' అని  చెప్పింది

ఒక గేటెడ్ కమ్యూనిటీ ముందు అందరూ కర్రలతో కొట్టుకుంటున్నారు.

'ఇదేంటి? ఈ విధముగా యుద్ధము చేయుచున్నారు?' అడిగాను.

'అది యుద్ధం  కాదు. ఒక్కటే గ్యాస్ సిలెండర్ ఉందిట. దానికోసం అందరూ అలా కొట్టుకుంటున్నారు' చెప్పింది.

'గతంలో నా చిన్నప్పుడు, నీళ్ళపంపులవద్ద ఈ దృశ్యములను చూచితిని. ఇప్పుడు ఈ విధముగా చూడవలసి వచ్చినది. ఇదియేకదా మాయాప్రభావము' అన్నాను.

'నోరుముయ్యి' అన్నట్టు చూసింది శిష్యురాలు.

'ఇరాన్ యుద్ధం వల్ల ఇలా ఉంది' అన్నది. 

'యుద్దమా? అదెక్కడ?' అన్నాను అయోమయంగా.

'అందుకే అప్పుడప్పుడూ లోకసంచారం చెయ్యమని మహర్షి చెప్పింది' అన్నది కోపంగా.

'ఓహో నా అగ్నానం నీక్కూడా తెలిసిపోయిందా?' అనుకుని మాట్లాడకుండా ఊరుకున్నాను. 

కొద్దిగా ముందుకెళ్లాం.

'గ్యాసు నామమె పావనము, ప్రభు గ్యాసే రక్షణ కారణము' అంటూ ఒక ప్రార్ధనామందిరంలో నుంచి మైకు మోగుతోంది.

'రామరామ ! బంగారంలాంటి పాటని ఇదేంటి ఇలా మార్చేశారు? అన్నాను విస్తుపోతూ.

'నిన్ననే గ్యాసుదేవుని వైపు కన్వర్ట్  అయ్యారు.యుద్ధం ప్రభావం' కామ్ గా అంది శిష్యురాలు.

మతిపోయింది.

ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి 'గ్యాసో హో సిలెండర్' అంటూ ఇంకో చోటనుంచి పెద్దగా శోకాలు వినిపించాయి.

భయమేసింది.

'ఇదేంటి? వీళ్ళుకూడానా?' అన్నాను.

'అవును. గ్యాసు దొరకడం లేదుగా. కన్వర్ట్ కాక వాళ్ళకీ తప్పలేదు' అంది శిష్యురాలు.

ఇంకో వందగజాలు వెళ్లేసరికి ఇంకొక గుడిలో నుండి శ్లోకాలు వినిపించాయి.

'గ్యాసుదేవాయ నమః, గ్యాసుప్రభువే నమః, గ్యాసురాజాయ నమః, సిలెండరు మాతాయ నమః' అంటూ మైకు పెద్దగా మ్రోగుతోంది.

'వీళ్ళకేం పోయేకాలం?' అడిగాను. 

'కన్వర్ట్ కావడానికి వీళ్ళు ముందుంటారు  కదా. నిన్ననే ఎవరో గ్యాస్ సిలెండర్ ఇచ్చారట. వెంటనే మతం మారిపోయారు. గ్యాసుమీద అష్టోత్తరాలు రాసుకున్నారు. పాడుతున్నారు' అన్నది శిష్యురాలు.

విరక్తిగా నవ్వుకున్నాను.

ఇంతలో ఒక పెద్దగుంపు ఎదురొస్తే ప్రక్కకు తప్పుకుని 'ఏంటా?' అని చూచాం.

అందరి తలలపైనా గ్యాస్ సిలెండర్ ఆకారంలో టోపీలున్నాయి.

'వీళ్లెవరు?' అడిగాను.

'సిలెండర్ ఫౌండేషన్' అని క్రొత్తసంస్థ. సిలెండరు బొమ్మని అలా నెత్తిమీద పెట్టుకుని రోడ్లమీద తిరుగుతుంటే, స్థూలదేహంలో నుండి సూక్ష్మదేహం బయటకొచ్చి, ఎక్కడెక్కడో తిరుగుతుందట' అంది శిష్యురాలు.

'అంటే, స్థూలదేహం రోడ్లమీద తిరుగుతుంటే, సూక్ష్మదేహం లోకలోకాలు తిరుగుతుందా? ఎందుకలా? రెండూ ఒకేచోట చావచ్చుగా?' అడిగాను.

'ఏమో? నీ దేహానికి ఒకచోట ఉండటం ఇష్టమైనట్టే, వాళ్ళ దేహాలకు బయటతిరుగుళ్లు ఇష్టం. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, కాదనడానికి మనమెవరం?' అంది శిష్యురాలు.

ఖాళీగా ఉంటే ఎవడైనా వచ్చి సిలెండర్ టోపీ పెడతాడేమో అని భయమేసి వెంటనే జేబులోంచి కర్చీఫు తీసి తలచుట్టూతా కట్టుకున్నాను.

మరికొన్ని అడుగులేసేసరికి, ఒక బోర్డు కనిపించింది.

'గ్యాసు రావడం లేదని విసిగిపోతున్నారా? మీకు గ్యాసు ఎప్పుడు వస్తుందో గ్యారంటీగా చెప్పబడును' ఇట్లు ప్రసిద్ధ కోయజ్యోతిష్కులు, అని దానిమీద  రాసుంది.

'గ్యాసు రావడం ఏంటి?' అన్నాను అర్ధం కాక.

'అంటే, గ్యాస్ సిలెండర్ డెలివరీ అని అర్ధం' అంది శిష్యురాలు చిరాగ్గా.

'ఓహో అదా ! చివరకు వీళ్ళుకూడా తయారయ్యారా?' అన్నాను నిరాశగా.

'అప్పుడే ఏమైంది? అటుచూడండి' అంది శిష్యురాలు.

'మీ మోకాలు చూసి, గ్యాసు ఎప్పుడొస్తుందో చెప్పబడును. జాతకంతో పనిలేదు' అని ఇంకో బోర్డు కనిపించింది.

'ఇదేంటి ఇలా పెట్టాడు?' అన్నాను.

'అందరూ చేతులు, ముఖాలు చూసి జ్యోతిష్యం చెబుతున్నారు కదా. వెరైటీగా ఉంటుందని ఇలా పెట్టాడు. బ్రెయిన్ అక్కడే ఉంటుందని వాళ్ళ పెద్దదొర చెప్పాట్ట. అందుకే వాళ్ళు మోకాళ్ళు మాత్రమే చూస్తారు' అంది.

'ఇక నా వల్లకాదు. పీచే ముడ్' అని గట్టిగా అరిచాను. 

కట్ చేస్తే, ఇద్దరం ఆశ్రమంలో తేలాం.

'హమ్మయ్య' అని గాలి పీల్చుకునేలోపు, ఫోన్ మ్రోగింది.

ఫోనెత్తి 'హలో' అనేలోపే, 'గురూగారు. నాకిప్పుడే అబ్బాయి పుట్టాడు. బెడ్ పక్కనించే ఫోన్ చేస్తున్నా. ఏం పేరు పెట్టమంటారు?' అడిగాడు ఒక పరమాణువు.

'నీకు పుట్టటం ఏంటి?' అరిచాను విసుగ్గా.

'అంటే, వాళ్ళావిడకని అర్ధం. నువ్వూ నీ చచ్చు సందేహాలు' అని పక్కనించి గిచ్చింది శిష్యురాలు.

'గ్యాసు నాధ్' అని పెట్టుకో ఫో' అని మళ్ళీ ఫోన్లోకి అరిచాను.

'టాంక్యూ గురూజీ. మా ఆవిడక్కూడా కలలో గ్యాసునాధుడు కనపడి, పుట్టబోయే పిల్లాడికి తన పేరే పెట్టాలని. లేకపోతే మా సంగతి తేలుస్తానని బెదిరించాట్ట. మేముకూడా ఇదే అనుకున్నాము. కానీ సెకండ్ ఒపీనియన్ కోసం మీకు ఫోన్ చేశాము. మీరు కూడా అదే చెప్పారు. టాంక్యూ సోమచ్' అని పొంగిపోతున్నాడు.

'ఎక్కువ పొంగిపోకు, పొయ్యిలో పడగలవు' అన్నాను.

'ఇంకొక్క విషయం గురూజీ. మా చెల్లెలిక్కూడా ఇప్పుడే అమ్మాయి పుట్టింది. దానికేమని పేరు పెట్టాలి?' అడిగాడు.

'అస్సలు టైం వేస్ట్ చెయ్యడం లేదురా మీరు?' అనుకుంటూ, 'సిలెండర్ రాణి' అని పెట్టండి. ఎలాగూ పెద్దయ్యాక అయ్యేది అదేగా' అన్నాను.

'టాంక్యూ గురూజీ' అని ఫోన్ పెట్టేశాడు శిష్యుడు.

'హమ్మయ్య' అని చుట్టూ చూడగానే శిష్యులెవరూ కనిపించలేదు.

'వీళ్లంతా ఎక్కడికి పోయారు?' అరిచాను కోపంగా.

'కట్టెపుల్లలేరుకు రావడానికి పక్కపొలాల్లో తిరుగుతున్నారు. మనకీ గ్యాసు లేదు మరి' అంది శిష్యురాలు.

ప్రశ్నార్ధకంగా చూశాను.

'ప్రపంచం ఎన్ని కష్టాలలో ఉందో చూశారు కదా గురూజీ. ఏదైనా రెమెడీ చెప్పి పుణ్యం సంపాదించుకోండి' ప్రాధేయపడింది శిష్యురాలు.

తీవ్రంగా ఆలోచించాను. 

'ఓకే ! దీనికొకటే మార్గముంది. వెంటనే అందరూ టవల్స్ కట్టుకుని దీక్ష మొదలుపెట్టండి. నలభైరోజులపాటు అదే టవల్లో ఉండాలి. అదే మన దీక్షాడ్రస్సు. 'జై గ్యాసుదేవాయ నమః' అనే మహామంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. అన్నిపనులూ మానేసి దీన్ని రోజుకు ఇరవైకోట్లసార్లు జపించాలి. నలభైరోజులపాటు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అయితే, 'స్ట్రా'తో బిందెలోనుంచి  పీల్చుకుంటూ తాగచ్చు. కానీ గాలిమాత్రం ఈ నలభైరోజులపాటు అస్సలు పీల్చరాదు. అప్పుడన్ని సమస్యలూ గాలిలో కలసిపోతాయి. వెంటనే అన్నిదేశాలలో ఉన్న మన శిష్యులందరికీ మెయిల్స్ పంపండి. అందరూ ఈ దీక్షను మొదలుపెట్టండి' ఆజ్ఞాపించాను.

'ఓకే గురూజీ !' అని శిష్యురాలు ఆ పనిలోకి దిగింది.

'జై గ్యాసునాధాయ నమః' అనుకుంటూ నేను పక్కమీద వాలాను.

read more " గ్యాసుదేవుని మహిమలు "

26, ఫిబ్రవరి 2026, గురువారం

సోదియోగి

ఆశ్రమంలో ఒక పెళ్లి పెట్టుకున్నాం. దానికని శిష్యులు ఒక్కొక్కరే వస్తున్నారు.

ఇవాళ టిఫిన్లయ్యాక మాట్లాడుకుంటూ ఉండగా శిష్యులు ఒక ప్రతిపాదన తెచ్చారు.

'గురూజీ. మీరేమనుకోకపోయితే ఒక చిన్న మాట' అన్నారు.

'చెప్పండి' అన్నాను.

'ఏమీలేదు. మీరిప్పటిదాకా మొదలుపెట్టిన భజనలు, డాన్సులు అన్నీ పాతబడిపోయాయి. ఇప్పుడవేవీ అమ్ముడుపోవడం లేదు. ఆశ్రమానికి ఆదాయం తగ్గిపోయింది. అందుకని మాదొక కొత్త ఐడియా' అన్నారు.

ఆదాయమనేసరికి నాకు నూతనోత్సాహం పెల్లుబికింది.

'త్వరగా చెప్పండి' అన్నాను పక్కమీదనుంచి బద్దకంగా లేస్తూ.

'ఏమీలేదు. మీ రెండుపాదాలకు ఫోటో తీసి AI టూల్స్ తో సరిదిద్ది, ఆ ఫోటోలను మార్కెటింగ్ చేద్దామని అనుకుంటున్నాం. ముందు మీ శిష్యులందరూ కొనుక్కుంటారు. ఆ తర్వాత అందరూ కొనుక్కుంటారు' అన్నారు.

నాకనుమానం వచ్చింది.

'అందరూ ఎందుకు కొనుక్కుంటారు?' అడిగాను.

'పిచ్చిజనం ఏదైనా కొనుక్కుంటారు. అంతా మనం మార్కెటింగ్ చేయడంలో ఉంటుంది. ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన బాబాలు, గురువులు అందరూ ఎలా అయ్యారు మరి? ఈ ఫోటో  దగ్గరుంటే మీకు అదృష్టం  తన్నుకుంటూ వస్తుంది అని ప్రచారం చేద్దాం. చచ్చినట్టు కొనుక్కుంటారు' అడిగారు శిష్యులు.

అదీ నిజమేగా అనిపించింది.

'ఫొటోను కొనుక్కున్నవాళ్ళు దానిని పూజామందిరంలో అందరు దేవుళ్లతో బాటుగా పెట్టుకుంటారు. లేదంటే ఆ దేవుళ్లను మీ పాదాల క్రింద పెడతారు. లేదా, భక్తి ముదిరితే చిన్న చిన్నకార్డులుగా మార్చి జేబులలో పెట్టుకుంటారు. ఇంకా ముదిరిపోతే లాకెట్లుగా మార్చి మెళ్ళో దండలుగా వేసుకుంటారు. మీ పాదాలకు ప్రచారమూ అవుతుంది. మనకు ఆదాయమూ వస్తుంది. ఎలా ఉంది ఐడియా?' అడిగారు శిష్యులు.

ఇన్నాళ్లూ ఈ ఐడియా రానందుకు నామీద నాకే చెడ్డ చిరాకేసింది.

'వెరీ గుడ్ ఐడియా. ఎంత పెడుతున్నారు రేటు?' అడిగాను.

'ఒక కాలుకు రెండువేలు చొప్పున రెండుకాళ్ళకూ నాలుగువేలు పెడదాం' ముక్తకంఠంతో డిసైడ్ చేశారు శిష్యులు.

'మన కాళ్లకు అంత విలువుందా?' అని నాకు అనుమానమేసినప్పటికీ, వాళ్ళు చెబుతున్నారు గనుక, ఉందేమోలే అనిపించి 'ఓకే. ప్రొసీడ్. అయితే ఈ స్కీముకు ఏ పేరు పెడుతున్నారు?' అని అడిగాను.

'బురిడీబాబా లేదా సోదియోగి' అని రెండు టైటిల్స్ అనుకుంటున్నాం, మీరు ఏదో ఒకటి డిసైడ్ చెయ్యండి' అన్నారు శిష్యులు.

'బాబా పాతబడిపోయింది. యోగి బెటర్' అన్నాను.

'సరే గురూజీ, 'సోదియోగి' టైటిల్ ని ఫైనల్ చేద్దాం' అన్నారు శిష్యులు.

'ఎక్సలెంట్. గో ఎహెడ్. విజృంభించండి. ఈ ఫోటోలు లక్షలాది అమ్ముడుపోవాలి. మనకు కోట్లు వచ్చిపడాలి. మరి, ఆ డబ్బుతో ఏం చేద్దాం?' అడిగాను.

'ఏముంది? నల్లమల అడవులలో ఒక నూరెకరాలు కొనేద్దాం' అన్నారు శిష్యులు.

'అడవులు అలా అమ్మరు' అన్నాను కోపంగా

'మరీ మంచిది. అమ్మకపోతే ఆక్రమిద్దాం. ఆక్రమించేసి మన ఆశ్రమం బ్రాంచిని అక్కడ కడదాం' అన్నారు.

'భలే బాగుంది. ఇక పనిమీదుండండి' అని  ఆజ్ఞాపించాను.

'సరే గురూజీ, మీరు విశ్రాంతి తీసుకోండి. మిగతా పని మేము చూసుకుంటాం' అంటూ వాళ్ళు పనిలోకి దిగారు.

నేను పక్కమీద వెనక్కు వాలి, మళ్ళీ యూట్యూబులో మునిగిపోయాను.

read more " సోదియోగి "