24, నవంబర్ 2018, శనివారం

హిందువులందరికీ ప్రాత:స్మరణీయుడు - గురు తేజ్ బహదూర్

Kashmiri Pandits meeting Guru Tegh Bahadur in 1675
నిన్న ఒకరు నన్నిలా అడిగారు.

'ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ! గుడికెళ్ళి వచ్చారా?'

'ఎందుకు?' తిరిగి ప్రశ్నించాను.

'అదేంటి? హిందువువై ఉండి, అందులో బ్రాహ్మిన్ అయి ఉండి, మీరు ఇలాగేనా ఉండేది? ఈరోజు గుడికెళ్ళి దీపాలు వెలిగించి రావాలి. కనీసం మాకు తెలిసినంతైనా మీకు తెలీదా?' అతని గొంతులో హేళన ధ్వనించింది.

నవ్వాను

'తెలుసు. నీకంటే చాలా ఎక్కువే నాకు తెలుసు. ఈ రోజు ఏం చెయ్యాలో, రేపేం చెయ్యాలో కూడా తెలుసు. నేను మీ అంత అజ్ఞానంలో, చీకట్లో, దురాశలో కూరుకుపోయి లేను. నిజమైన బ్రాహ్మణత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నిజానికి నువ్వే 'హిందువు' అన్న పదానికి తగవు.' అన్నాను.

'అదేంటి?' అన్నాడు ఆ వ్యక్తి.

'మీకు ఆస్తినిచ్చిన తల్లిదండ్రులను మీరు మర్చిపోతే దాన్ని ఏమంటారు?' అడిగాను.

'దానికంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అలాంటి మనిషిని అనడానికి నాదగ్గర మాటల్లేవు' అన్నాడు తను.

'కనీసం ఈ మాత్రం జ్ఞానమైనా నీలో ఉంది. సంతోషం. మరి నీకు హిందువు అనిపించుకునే భిక్షను పెట్టిన వ్యక్తిని నువ్వు మరచిపోతే దాన్ని ఏమంటారు?' అడిగాను.

'అది మరీ ఘోరం అవుతుంది! నాకు భిక్ష పెట్టాడా? ఎవరాయన? అయినా, నేనడిగినదానికీ దీనికీ సంబంధం ఏమిటి?' అడిగాడు.

'సంబంధం ఉండబట్టే అడుగుతున్నాను. కార్తీక పౌర్ణమి, గురు నానక్ జన్మదినం. ఈ రోజున నువ్వు చెయ్యాల్సింది గుడికి వెళ్లి దీపాలు వెలిగించడం కాదు. గురునానక్ ను స్మరించి ఆయన బోధనలను ఆచరించే ప్రయత్నం చెయ్యాలి.

నువ్వు గుడికి వెళ్ళినా వెళ్లకపోయినా దేవుడు ఉంటాడు. నువ్వు వెలిగించవలసిన దీపాలు బయటవి కావు, అవి జ్ఞానదీపాలు. అవి నీలో వెలగాలి. నీ లోలోపల చీకటి ఉంచుకుని బయట నెయ్యిపోసి వెయ్యి దీపాలను వెలిగించినా చీమంత కూడా ఉపయోగం లేదు. లోపల చీకటి అంటే ఏమిటో నీకసలు తెలుసా?' అడిగాను.

'తెలీదు' అన్నాడు.

'సరే ! దాని గురించి ఇంకో రోజు చెబుతా. అయిపోయిన నిన్న గురించి ఎందుకు గాని, ప్రస్తుతానికి ఈరోజు విలువ చెబుతాను విను.

ఈరోజు ఒక మహామనీషి నీకోసం, నాకోసం, మనందరి కోసం, తన తలను ఇస్లాం క్రూరపు కత్తికి ఆనందంగా అర్పించాడు. ఆయన తన శిరస్సును అలా అర్పించడం వల్లనే, ఈనాడు నువ్వూ నేనూ ఇంకా కోట్లాది హిందువులూ ఈ దేశంలో హిందువులుగా మిగిలి ఉన్నాం. హాయిగా బ్రతుకుతున్నాం. లేదంటే మూడొందల ఏళ్ళ క్రితమే మన తాతముత్తాలు ముస్లిములుగా మార్చబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా అదే అయి ఉండేవాళ్ళం. ఈ సంగతి తెలుసా నీకు?' అడిగాను.

'తెలీదు' అన్నాడతను ఆశ్చర్యంగా.

'తెలీకపోతే విను. ఆయనే గురు తేజ్ బహదూర్. గురుగోవింద్ సింగ్ తండ్రి. సిక్కుల తొమ్మిదో గురువు. ఆయన తన శిరస్సును ఔరంగజేబ్ కసాయికత్తికి అర్పించిన మహత్తరమైన రోజు ఈరోజు. ఆయనే లేకపోతే నువ్వు ఈనాడు లేవు. ఆయన గుర్తున్నాడా నీకసలు?' అడిగాను.

నమ్మలేనట్లుగా చూచాడు ఆ వ్యక్తి.

'ఇదే మన హిందువులకు పట్టిన అసలైన దరిద్రం. మీకోసం ప్రాణాన్ని గడ్డిపోచలాగా ఇచ్చిన మహాత్ముడిని మీరు మర్చిపోవడమే మీరు చేస్తున్న మహాపాపం. కార్తీకమాసంలో గుడికి వెళ్లి దీపాలు వెలిగించి రావడం కాదు మీరు చెయ్యవలసింది. ఈ మహాత్ముడిని తలచుకుని రెండు కన్నీటి బిందువులు రాల్చాలి మీరంతా. అది ఒదిలేసి చెత్త నియమాలన్నీ పాటిస్తున్నారు మీరు. ఈయనే లేకుంటే మీరంతా ఈరోజున ముస్లిములుగా గడ్డాలు పెంచుకుని బ్రతుకుతూ ఉండేవాళ్ళు. తెలుసా? సిగ్గుందా నీకసలు? నువ్వసలు హిందువువేనా? ఇదేనా హిందూమతం అంటే?' అడిగాను సూటిగా.

బిత్తరపోయాడు అతను.

'ఏంటిదంతా? ఎవరాయన?' అన్నాడు.

'సరే నీ ఖర్మ. నీ చరిత్రే నీకు తెలీనంత అజ్ఞానంలో ఉన్న నువ్వా నాకు కార్తీకమాసం గురించీ హిందూమతం గురించి, బ్రాహ్మణత్వం గురించి చెప్పేది? పోయి ఇంటర్ నెట్లో వెతుక్కో. కనీసం అప్పుడైనా నమ్ముదువుగాని. అప్పుడైనా నీకు అసలైన హిందూమతం అంటే ఏమిటో తెలుస్తుంది.' అన్నాను జాలిగా.

అతను అదోలా చూస్తూ మౌనంగా వెళ్ళిపోయాడు. ఇలాంటివాళ్ళు మన హిందువుల్లో చాలామంది ఉన్నారు. అందుకే మన దేశంలోనే మన ఖర్మ ఇలా తగలడింది.

ఈరోజున భారతదేశంలో ప్రతి హిందువూ పొద్దున్నే లేవగానే చెయ్యవలసింది - మొబైల్లో ఏం మెసేజీలు వచ్చాయి? ఏం వీడియోలు వచ్చాయి? - అని చూసుకోవడం కాదు. ఇంకా కళ్ళు కూడా తెరవక ముందే, మొట్టమొదట భక్తితో స్మరించవలసింది మహాత్ముడైన గురు తేజ్ బహదూర్ ను. ఎందుకంటే - ఒక శిక్కుగురువై ఉండి, హిందూధర్మం కోసం తన తలను బలి ఇచ్చాడాయన. తన కోసం, తన శిక్కుల కోసం కాదు. హిందువుల  కోసం ! మనందరి కోసం !

ఈ సంఘటన సరిగ్గా 24-11-1675 నాడు జరిగింది. అంటే 343 ఏళ్ళ క్రితం జరిగింది. సరిగ్గా ఈరోజునే గురు తేజ్ బహదూర్ మనందరికోసం ప్రాణత్యాగం చేశాడు!

ఈ సంఘటన జరిగిన రోజున తట్టుకోలేక భూమి వణికింది. ఆకాశం రోదించింది. పంచభూతాలు విలవిల లాడాయి. గురు తేజ్ బహదూర్ చేసిన మహత్తర త్యాగాన్ని చూచి సాక్షాత్తూ ఆ దేవుడే కన్నీరు కార్చాడు.

ఇదంతా 26-5-1675 న మొదలైంది. ఆరోజునే కాశ్మీరీ పండిట్స్ వచ్చి గురు తేజ్ బహదూర్ని కలిశారు. రక్షించమని ప్రార్ధించారు.

అసలిదంతా ఏంటో తెలియాలంటే, మూడొందల ఏళ్ళు వెనక్కు వెళ్ళాలి. చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోవాలి.

భారతదేశాన్ని 1658 నుంచి 1707 వరకూ దాదాపు ఏభై ఏళ్ళపాటు ఔరంగజేబ్ అనే ఒక ఛండాలపు సైతాన్ గాడు పరిపాలించాడు. వీడు ముఘల్ పాదుషాలలో పరమ కిరాతకుడు, నీచాతినీచుడు. వీడి సమాధి ఔరంగాబాద్ లో ఉంది. వీడు అక్బర్ మునిమనవడే గాని అక్బర్ లో ఉన్న శాంతి, సహనం, వీడిలో లేవు. వీడు సింహాసనం ఎక్కడానికి అమాయకులైన తన అన్నలు ముగ్గురినీ చంపించాడు. తన తండ్రియైన షాజహాన్ ను జైల్లోపెట్టి అతను చనిపోయేవరకూ అందులోనే ఉంచి, కన్నతండ్రినే చంపిన పరమదుర్మార్గుడు. మన దేశపు సింహాసనాన్ని ఏభైఏళ్ళు ఎక్కి కూచుని ఈ వేదభూమిని పరిపాలించాడా దరిద్రుడు.

ఆ ఏభై ఏళ్ళూ హిందువులకు కాళరాత్రులే. ఆ ఏభై ఏళ్ళలో ఎన్ని లక్షలాది మంది హిందువులు గొంతుమీద కత్తిని పెట్టి ఇస్లాంలోకి మార్చబడ్డారో లెక్కేలేదు. ఎంతమంది హిందూస్త్రీలు మానభంగాలకు హత్యలకు గురయ్యారో లెక్కే లేదు.

వీడి కుయుక్తులకూ, వీడు హిందువులను పెట్టిన బాధలకూ అంతేలేదు. హిందువులైనవారు తమ సంపాదనలో, వ్యవసాయ పంటలో, 60% శాతాన్ని 'జిజియా' అనే పన్నురూపంలో ముఘల్ పాదుషా కాళ్ళదగ్గర అర్పించుకోవాలి. ఇది ఎందుకూ అంటే - వాళ్ళు ముస్లిములు కానందుకు. ఏడాదంతా కష్టపడిన సంపాదనలో వారికి మిగిలేది 40% మాత్రమే. ఆ ట్యాక్స్ తో ముస్లిమ్స్ అందరూ మహారాజభోగాలు అనుభవిస్తూ ఉండేవారు. ఇష్టం వచ్చిన అరాచకాలు చేస్తూ ఉండేవారు. వాళ్లకు ఎదురు చెబితే చావే గతి. అది కూడా భయంకరమైన చిత్రహింసలతో కూడిన చావు ! ఇదంతా తట్టుకోలేక చాలామంది మానసికంగా బలహీనులైన హిందువులు ఇస్లాంలోకి మారిపోయి జిజియాను, ప్రభుత్వహింసను తప్పించుకున్నారు. వాళ్ళే నేడు ఇండియాలో మనకు కనిపిస్తున్న నల్ల ముస్లిములు.

ఇవేవీ చాలక, ఔరంగజేబ్ ఇంకో పని చేశాడు. కాశ్మీర్లో ఉన్న హిందూపండితులను అందర్నీ ముస్లిమ్స్ గా మార్చేస్తే, ఆఫ్ఘనిస్తాన్ కూ, ఇండియాకు మధ్య ఉన్న 'హిందూ అడ్డుగోడ' కూలిపోతుందని, ఇరాన్ నుంచీ సెంట్రల్ ఇండియా వరకు అంతా అప్పుడు ఇస్లాంరాజ్యంగా మార్చవచ్చనే ఒక పధకం వేశాడు. దాన్ని అమలుపరుస్తూ, ఒక ప్లాన్ ప్రకారం కాశ్మీర్ పండిట్స్ ను హింస పెట్టడం ప్రారంభించాడు.

ఆ ప్లాన్ ఇప్పటికీ సజీవంగానే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ టెర్రరిస్టుల పధకం ఇదే. దీనికోసమే వాళ్ళు ఈనాటికీ కాశ్మీర్లో చిచ్చు రేపుతూనే ఉన్నారు. అమాయకులైన హిందువులను చంపుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న కసబ్ గాడు చేసింది ఏమిటి? సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రతిరోజూ చేస్తున్నదేమిటి?

కాశ్మీర్ పండిట్స్ చాలా నిష్టాగరిష్టులైన హిందువులు. అంతేకాదు, వాళ్ళు వేదవేదాంగాలలో మంచి నిష్ణాతులు కూడా. ఫిలాసఫీలో దిట్టలు మాత్రమేకాదు, నీతి నియమాలతో కూడిన ధార్మిక జీవనం గడిపే శుద్ధమైన మనుషులు వాళ్ళు. అలాంటి కమ్యూనిటీ ఒకటి, కాశ్మీర్లో తమకు అడ్డుగా ఉండటం ఔరంగజేబుకు ఏ మాత్రమూ నచ్చలేదు. వాళ్ళనెలాగైనా నాశనం చెయ్యాలని, వాళ్ళమీద నానా రకాల ట్యాక్స్ లు వేశాడు. ఏడాది అంతా కష్టపడినా, ట్యాక్స్ పోను వాళ్లకు ఏమీ మిగిలేది కాదు. ఔరంగజేబు యొక్క ఈ పాలసీల వల్ల స్వతహాగా సంపన్నులైన వాళ్ళు, చూస్తూ ఉండగానే బికారులుగా మారిపోయారు. అయినా సరే, దరిద్రాన్ని భరించడానికైనా సిద్ధపడ్డారు గాని, ధర్మాన్ని ఒదులుకోవడానికి మాత్రం వాళ్ళు సిద్ధపడలేదు. ఎంతకీ వాళ్ళు లొంగకపోతుంటే, ఔరంగజేబు గాడు చివరకు ఒక రాక్షస ప్లాన్ వేశాడు.

క్రీ.శ. 1675 సంవత్సరంలో వాళ్లకు ఒక అంతిమతేదీని నిర్ణయించాడు. ఆ తేదీలోపు కాశ్మీర్లో ఉన్న పండిట్స్ అందరూ వారివారి కుటుంబాలతో సహా, ఇస్లాంలోకి మారితే మారాలి. లేదంటే, అందరినీ మూకుమ్మడిగా సైన్యంచేత చంపిస్తానని, వాళ్ళ ఇళ్ళను ఆస్తిపాస్తులను ఆడవాళ్ళను ముస్లిమ్స్ వచ్చి ఆక్రమించుకుంటారనీ ఆజ్ఞ జారీ చేశాడు.

కాశ్మీరీ పండిట్స్ కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. చూస్తుండగానే ఆ తేదీ దగ్గరకు వచ్చేస్తున్నది. ఎవరితో వాళ్ళ గోడు చెప్పుకోవాలి? ఎవరు వారి ఘోషను వింటారు? ఎవరు వాళ్ళను రక్షిస్తారు? రాజే దుర్మార్గుడైతే ఇక ప్రజలను రక్షించేదెవరు? పులుల మధ్యన ఉన్న గోవులమంద లాగా తయారైంది వారి పరిస్థితి. ఎటు పోవాలో తోచడం లేదు.

ఆలోచించగా ఆలోచించగా వారికి ఒకేఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఆయనే శిక్కుల తొమ్మిదో గురువైన గురు తేజ్ బహదూర్. సిక్కు గురువులకూ కాశ్మీరీ పండిట్స్ కూ దగ్గర సంబంధం ఉన్నది. సిక్కు గురువులలో చాలామంది సంస్కృతాన్ని, మన గ్రంధాలను కాశ్మీరీ పండిట్స్ దగ్గరే నేర్చుకున్నారు. అందుకని వారంటే వీరికి గౌరవభావం ఉన్నది. పైగా ముఘలుల రాక్షసత్వాలను ధైర్యంగా ఎదుర్కొన్నది సిక్కులే. కనుక గురు తేజ్ బహాదూర్ ను శరణు కోరాలని కాశ్మీరీ పండిట్స్ అందరూ నిశ్చయించుకున్నారు.

25-5-1675 న పండిట్ కృపారాం నాయకత్వంలో కాశ్మీరీ పండిట్స్ అందరూ వచ్చి పంజాబ్ లో ఉన్న గురు తేజ్ బహాదూర్ కు తమ సమస్యను విన్నవించుకున్నారు. తమను రక్షించమని ప్రార్ధించారు. ఎందుకంటే - ఆ కాలంలో ముస్లిముల రాక్షసత్వానికీ, అరాచకాలకూ ఎదురు నిలిచి సామాన్య ప్రజలను ఆదుకున్నది సిక్కు గురువులే కాబట్టి.

ఎంత ఆలోచించినా ఏం చెయ్యాలో ఎవరికీ తట్టలేదు. ఈ మారణహోమాన్ని ఎలా ఆపాలో తెలియలేదు. వీరి సమస్యను విన్న గురువు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు.

అసలు వేదభూమియైన ఈ నేల, దుర్మార్గులూ, ఆచారహీనులూ అయిన ముస్లిం పాదుషాల చేత ఇన్ని వందలఏళ్ళు ఎందుకు పాలించబడింది? అలాంటి ఖర్మ ఈ దేశానికి ఎందుకు పట్టింది? హిందూరాజులలో ఐకమత్యం లేకపోవడం వల్లా, హిందువులలో ఐకమత్యం లేకపోవడం వల్లా ఈ దుస్థితి కలిగింది. అదే ఉంటె, ఎక్కడో ఇరాన్ నుంచీ ఆఫ్గనిస్తాన్ నుంచీ ప్రతి దోపిడీజాతీ వచ్చి ఈ దేశాన్ని ఎలా దోచుకోగలుగుతుంది? మన దేవాలయాలను, శిల్పసంపదను ఎలా ధ్వంసం చెయ్యగలుగుతుంది? ఇంతమంది రాజులున్నారు ఎందుకు? హిందువులలో ఐకమత్యం రావాలంటే ఏం చెయ్యాలి? వారిలో జాగృతి కలగాలంటే ఏం చెయ్యాలి? తీవ్రంగా ఆలోచించిన గురు తేజ్ బహదూర్ కు ఒకే ఒక మార్గం కనిపించింది.

ఒక గురువు, ఒక మహనీయుడు, ఒక మహాత్ముడైన వ్యక్తి ఈ రాక్షసపాలనకు బలి కావాలి. తన ప్రాణాన్ని అర్పించాలి. తద్వారా మిగతావారంతా రక్షింపబడతారు. అప్పుడైనా కనీసం ఈ సమాజంలో జాగృతి వస్తుంది. అప్పుడే ఇస్లాం అరాచకం ఈ దేశంలో విషంలా వ్యాపించకుండా ఆపబడుతుంది. ఇది తప్ప మార్గం లేదు. ఆ మహనీయుడు ఎవరు? ఇంకెవరు? తనే ! కనుక తనే తన ప్రాణాన్ని త్యాగం చెయ్యాలి. అప్పుడే ఈ వేదభూమి రక్షింపబడుతుంది. అంతే ! ఇది తప్ప వేరే మార్గం లేనే లేదు.

ఇలా నిశ్చయించుకున్న గురు తేజ్ బహదూర్, కాశ్మీరీ పండిట్స్ కు ఇలా చెప్పాడు.

'మీరు ఔరంగజేబ్ కు ఒక తీర్మానాన్ని పంపండి. గురు తేజ్ బహదూర్ గనుక తన మతం మారి, ఇస్లాం స్వీకరిస్తే, మేమంతా ఆయన్ను వెంబడించి, మేము కూడా ఇస్లాంలోకి మారతాం. ఆయన మారకపోతే మేమూ మారం.' అనేదే ఆ తీర్మానం.

అనుకున్నట్లుగానే ఆ తీర్మానం ఔరంగజేబ్ కు చేరవెయ్యబడింది.

అది చదివి ఔరంగజేబ్ చాలా సంతోషించాడు. వేలాదిమందితో పోల్చుకుంటే ఒక్కడిని మతం మార్చడం చాలా తేలిక. గురు తేజ్ బహాదూర్ మారితే అందరూ పొలోమంటూ మారతారు. ఇది చాలా బాగుంది. సరేనన్నాడు ఔరంగజేబ్. వెంటనే గురువును డిల్లీకి రమ్మని హుకుం జారీ చేశాడు.

11-7-1675 న తన ప్రియ శిష్యులు కొంతమందితో కలసి డిల్లీకి బయల్దేరాడు గురు తేజ్ బహదూర్. మార్గమధ్యంలోనే ఆయన్ను బంధించిన ముఘల్ సైనికులు ఆయన్ను నానాహింసా పెడుతూ డిల్లీకి తీసుకొచ్చారు.

నవంబర్లో విచారణ మొదలైంది.

వారు చూపిన ఆశలన్నింటినీ గురువు తిరస్కరించాడు. డబ్బునీ, అధికారాన్నీ, అందగత్తెలైన వనితలనూ - ఇలా ఎన్ని ఆశలను చూపించినా సరే - అన్నింటినీ రెండో మాట లేకుండా 'ఛీ' కొట్టాడు. ఇస్లాంలోకి మారడం మాత్రం జరిగేపని కాదని తేల్చి చెప్పేశాడు.

మన దేశాన్ని పాలించిన ముస్లిం పాదుషాలు పరమ కిరాతకమైన ప్లాన్స్ తో జనాన్ని భయభ్రాంతులను చేసేవాళ్ళు. బ్రతికి ఉండగానే చర్మం ఒలిపించడం, రోజుకొక్క అవయవాన్ని నరుకుతూ రావడం, నూనె గానుగలో వేసి మనిషిని పిప్పి చెయ్యడం, సలసలా మరుగుతున్న నీళ్ళలో మనిషిని వేసి ఉడకబెట్టడం, బ్రతికి ఉండగానే తగలబెట్టడం - ఈ విధంగా వాళ్ళు వేసే శిక్షలు చాలా దారుణంగా కిరాతకంగా ఉండేవి. వాటిని నాలుగురోడ్ల కూడలిలో అమలు చేసేవాళ్ళు. అవి చూసిన జనం భయంతో గడ్డ కట్టుకుపోయి కిక్కురు మనకుండా సుల్తాన్లకు లొంగి పోయేవాళ్ళు. ఈ విధంగా 'భయం' అనే ఒకే ఒక అస్త్రంతో మన సమాజాన్ని లొంగదీసుకున్నారు ముస్లిం సుల్తానులు. అదే వాళ్ళ స్ట్రాటజీ !

కాకతీయ మహారాజైన ప్రతాపరుద్రుడిని బ్రతికి ఉండగానే చర్మం ఒలిపించి చర్మం లేని ఆ మాంసపు ముద్దను ఒక బండిమీద గుంజకు కట్టి నిలబెట్టి, దాని ఊరేగింపుగా తీసుకెళుతూ, "తమకు ఎదురు తిరిగితే ఎవరికైనా ఇదేగతి" అని చాటింపు వేస్తూ, సౌత్ ఇండియాలో చాలా రాజ్యాలను భయభ్రాంతులకు గురిచేసి ఆయా రాజ్యాలను, ప్రజలను డిల్లీ పాదుషాలు దోచుకున్న సంగతి నేడు ఎందరికి తెలుసు? వాళ్ళు చేసే ఘోరాలు, సృష్టించే భయభ్రాంతులు అలా ఉండేవి !

కానీ, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎన్ని ఆశలు చూపించినా గురువు లొంగడం లేదని వెర్రెక్కి పోయిన ఔరంగజేబ్, గురువు ఎదురుగా అతని ప్రియశిష్యులను చిత్రహింసలు పెడితేనైనా గురువు లొంగుతాడని దుర్మార్గపు ప్లాన్ వేశాడు.

ముందుగా గురువు ప్రియశిష్యుడైన భాయీ దయాళ్ దాస్ ను ఒక సలసలా మరుగుతున్న గంగాళంలోని నీటిలో వేసి బ్రతికి ఉండగానే ఉడకపెట్టమని ఆజ్ఞాపించాడు. దయాళ్ దాస్ కిమ్మనలేదు. గురువులను దైవాన్ని స్మరిస్తూ ధ్యానస్థితుడై మౌనంగా ఆ శిక్షను అనుభవించి దైవసాన్నిధ్యానికి చేరుకున్నాడు.

అయినా గురు తేజ్ బహదూర్ చలించలేదు. కాశ్మీర్లోని హిందూ పండితులను తలచుకుంటూ ధ్యానంలో నిశ్చలంగా ఉండిపోయాడు.

నవంబర్ 11 న గురువుకు ప్రియశిష్యులైన మరొక్క ఇద్దరిని పరమ కిరాతకంగా చంపించాడు ఔరంగజేబ్. భాయీ మతీదాస్ ను బ్రతికి ఉండగానే నిలువుగా రెండు ముక్కలుగా రంపంతో కోయించాడు. భాయీ సతీదాస్ ను దూదితో చుట్టి, నూనె పోసి, అగ్నిని అంటించారు. అంటే, సజీవదహనం చేశారు. అయినా సరే, వాళ్ళిద్దరూ చలించకుండా గురుధ్యానంలో దైవధ్యానంలో మరణాన్ని కౌగలించుకుని అమరత్వాన్ని పొందారు.

ఇన్ని చేసినా గురు తేజ్ బహదూర్ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు గాని 'ఇస్లాం లోకి మారతాను' అని చెప్పలేదు.

'నీ కళ్ళముందే నీ ప్రియశిష్యులను ఎంత దారుణంగా చంపామో చూశావు కదా ! మర్యాదగా ఇప్పుడైనా ఇస్లాంలోకి మారు. ఈ రాజభోగాలను, ఈ అందగత్తెలను అనుభవించు. ఆనందంగా జీవించు. చావును కొనితెచ్చుకోకు' అని ఔరంగజేబ్ చెప్పాడు గురువుతో.

ఉదాత్తమైన తన మతాన్ని వదలిపెట్టి, రాక్షస ఇస్లాంలోకి మారడం అసంభవం అని తలపోశాడు గురువు. పైగా, తాను వారి మాటకు ఒప్పుకుంటే లక్షలాది మంది కాశ్మీరీ పండిట్స్ వెంటనే ఇస్లాం లోకి మారవలసి వస్తుంది. అది జరిగే పని కాదు.

'మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను మాత్రం ఇస్లాం లోకి మారను గాక మారను.' అన్నాడు శాంతంగా గురు తేజ్ బహదూర్.

'ఆఖరు సారి అడుగుతున్నాం. మారుతావా లేదా?' గద్దించాడు ఔరంగజేబ్.

'నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా జవాబు ఒకటే. నా ప్రాణం పోయినా సరే, ఆనందమేగాని, ఇస్లాంలోకి మాత్రం మారను. అది జరగని పని' అని గట్టిగా జవాబిచ్చాడు గురు తేజ్ బహదూర్.

'ఇతన్ని తల నరికి చంపెయ్యండి' ఆజ్ఞాపించాడు పాదుషా.

ఆ ఆజ్ఞను విని పద్మాసనంలో శాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానస్థితిలోకి వెళ్లిపోయాడు గురు తేజ్ బహదూర్. కసాయి కత్తి గాలిలోకి లేచింది, గురువు శిరస్సు ఎగిరి అవతల పడింది. ఆయన దేహం మాత్రం పద్మాసనంలో దైవధ్యానంలో అలాగే కూర్చుని ఉంది.

గురు తేజ్ బహదూర్ మహత్తర త్యాగానికి భూమి వణికింది. గాలి స్తంభించింది. పంచభూతాలు గడగడలాడాయి. చూస్తున్న ముస్లిం అధికారులు మాటలేక నిర్ఘాంతపోయారు.

ఈ సంఘటనను చూచి ఆ దేవుడే కన్నీరు కార్చాడు.

ఆ విధంగా కాశ్మీరీ పండిట్స్ ముస్లిములుగా మారకుండా రక్షింపబడ్డారు. వాళ్ళే కాదు, మొత్తం ఇండియానే రక్షింపబడింది. హిందువులందరూ రక్షింపబడ్డారు. ఈ నాడు మనం హిందువులుగా హాయిగా ఈ దేశంలో బ్రతుకుతున్నామంటే, మన మతాన్ని చక్కగా అనుష్టించుకుంటూ ఉన్నామంటే, దానికి ఒకే ఒక్క మహనీయుని త్యాగం కారణం ! ఆయనే గురు తేజ్ బహదూర్ !!

'సిర్ దియా సర్ న దియా' అని ఆయనను గూర్చి అంటారు. అంటే, శిరస్సును అర్పించాడు గాని, ధర్మాన్ని వదలలేదు అని అర్ధం.

ఎంత ధన్యాత్ముడాయన ! ఎంతటి మహాత్ముడాయన !

ఆయనకు, ఆయన ప్రియశిష్యులకు స్వాగతం చెప్పడానికి సాక్షాత్తూ ఆ భగవంతుడే స్వర్గద్వారంలో వేచిఉండి వారిని తన చేతులలోకి తీసుకున్నాడని నా విశ్వాసం !! 

ఈ సంఘటన సరిగ్గా 24-11-1675 న జరిగింది. నేటికి సరిగ్గా 343 ఏళ్ళ క్రితం ఇదే రోజున జరిగింది.

జరిగిన ప్రదేశం డిల్లీలోని చాందినీ చౌక్. 

అదే ప్రదేశంలో ఈ రోజున సగర్వంగా నిలబడి ఉంది గురుద్వారా సీస్ గంజ్. 

డిల్లీలో చూడవలసిన ఏకైక ప్రదేశం ఇదేనని నా ప్రగాఢవిశ్వాసం !

హిందూమతాన్ని, వేదభూమిని రక్షించాలని ప్రయత్నించిన వాళ్ళు, దానికోసం ప్రాణాలు అర్పించినవాళ్ళు ఎందఱో చరిత్రలో ఉన్నారు. వారిలో అగ్రస్థానం గురు తేజ్ బహదూర్ ది.

ఎందుకంటే ఆయన తనకోసం ఈ త్యాగం చెయ్యలేదు. తన శిక్కుల కోసం చెయ్యలేదు. హిందువుల కోసం చేశాడు. వారిని ఔరంగజేబుగాడి సైతాన్ పరిపాలన నుండి కాపాడటం కోసం చేశాడు. తనకు సంబంధం లేని మనుషుల కోసం మహత్తరమైన త్యాగం చేశాడు. హిందూధర్మాన్ని రక్షించడం కోసం చేశాడు.

మనుషుల పాపాల కోసం జీసస్ చనిపోయాడని అంటారు. అది నిజం కాదు. తర్వాత తరాలలోని మిషనరీలు అల్లిన కట్టుకధ అది. కానీ హిందువుల మతస్వేచ్చను కాపాడటం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు గురు తేజ్ బహదూర్. నా దృష్టిలో జీసస్ కంటే, గురు తేజ్ బహదూర్ ఎంతో గొప్పవాడు. ఎంతో మహనీయుడు !

వాళ్ళెలా మహాత్ములయ్యారో తెలియకుండా, ఎవరికిబడితే వారికి 'మహాత్మా' అని బిరుదులిచ్చి వాడవాడలా వారికి శిలావిగ్రహాలు కట్టిస్తున్న మనం, మనకోసం తమ ప్రాణాలను గడ్డిపోచల్లా అర్పించిన గురు తేజ్ బహదూర్ వంటి నిజమైన మహాత్ములను సిగ్గులేకుండా మర్చిపోయాం. ఇంతకంటే సిగ్గులేనితనం ఎక్కడైనా ఉంటుందా?

మనలాంటి కృతజ్ఞతలేని జాతి, 800 ఏళ్ళు కాదు కొన్నివేల ఏళ్ళపాటు ఔరంగజేబ్ వంటి నీచుల పరిపాలనలో ఉన్నాకూడా బుద్ధి తెచ్చుకోదు. గురు తేజ్ బహదూర్ లాంటి ఇంకెందరు నిజమైన సద్గురువులు, మహనీయులు మనకోసం ప్రాణత్యాగం చేసినాకూడా మనకు బుద్ధిరాదు. అలా బుద్ధి తెచ్చుకోనంతవరకూ, మనం పోగొట్టుకున్న ఆత్మాభిమానాన్ని తిరిగి పొందనంతవరకూ మన సమాజానికి నిష్కృతి లేదుగాక లేదు.

గురు తేజ్ బహదూర్ తన శిరస్సును అర్పించి 300 ఏళ్ళైనా కూడా ఘనత వహించిన మన పాలకుల పాలసీల వల్ల కాశ్మీర్ సమస్య ఈనాటికీ ఇంకా రావణకాష్టంలా మండుతూనే ఉంది. ఎవరి కోసమైతే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడో ఆ కాశ్మీర్ పండిట్స్, అదే కాశ్మీర్లో ముస్లిం టెర్రరిస్టుల చేతులలో ఊచకోత కొయ్యబడి, భయంతో పారిపోయి వచ్చి డిల్లీలో పేవ్ మెంట్ల మీద ఈనాటికీ డేరాలు వేసుకుని చిన్నచిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. స్వార్ధపరులైన గత ప్రభుత్వాల నాయకులలో, వాళ్ళను నిజంగా పట్టించుకుంటున్న నాధుడంటూ ఎవడూ లేడు.

చరిత్రను గుర్తు చేసుకుంటే ఒళ్ళు గగుర్పాటు కలిగే అలాంటి రోజు ఈ నవంబర్ 24.

మనం నిజంగా హిందువులమైతే, కార్తీకమాసంలో చెయ్యాల్సింది, పిచ్చి కోరికలు కోరుకుంటూ గుళ్ళలో దీపాలు వెలిగించి, ఏదో సాధించినట్లు ఎగురుకుంటూ ఇంటికి రావడం కాదు. మనకోసం గురు తేజ్ బహదూర్ చేసిన త్యాగాన్ని ఈనాడు మనమందరం స్మరించాలి. ఆయన్ను తలచి ఆవేదనతో రెండు కన్నీటి బిందువులను రాల్చాలి. ఆయన త్యాగానికి భక్తితో చేతులెత్తి నమస్కరించాలి. ఆయన ఏ విలువల కోసమైతే బ్రతికాడో, వాటికోసం మనమూ బ్రతకాలి. అప్పుడు - మనం నిజమైన హిందువులమైనట్లు. నిజమైన భారతీయులమైనట్లు ! అంతేగాని మనకు తోచిన పిచ్చిపనులు మనం చేసుకుంటూ మనమూ హిందువులమే, మన మతం చాలా గొప్పదని  చంకలు చరుచుకుంటే ఏమీ ఉపయోగం లేదు !

గురు తేజ్ బహదూర్నీ ఆయన ప్రియశిష్యులనూ భక్తితో స్మరించినప్పుడే, కార్తీకమాసాన్ని మనం నిజంగా జరుపుకున్నట్లు, అందులోనూ దైవం మెచ్చే విధంగా జరుపుకున్నట్లు అవుతుంది !

ఈరోజేం చెయ్యాలో మీరే ఆలోచించుకోండి మరి !
read more " హిందువులందరికీ ప్రాత:స్మరణీయుడు - గురు తేజ్ బహదూర్ "

23, నవంబర్ 2018, శుక్రవారం

గురు నానక్ జయంతి - 2018


ఈ రోజు కార్తీక పౌర్ణమి. గురునానక్ జయంతి. నాందేడ్ సీరీస్ వ్రాస్తున్న సమయంలోనే గురునానక్ జయంతి రావడం యాదృచ్చికం కాదు.

ఈయన 29-11-1469 న పాకిస్తాన్లోని తల్వాండీలో జన్మించాడు. డెబ్బై ఏళ్ళు బ్రతికి 22-9-1539 న మరణించాడు. పౌర్ణమి రోజున జన్మించిన వారి జాతకాలలో ఆధ్యాత్మిక యోగాలుంటే వాళ్ళు దైవమార్గంలో చాలా ఉన్నతస్థాయికి చేరుకుంటారనడానికి ఈయన జాతకం కూడా ఒక నిదర్శనమే.

సిక్కులు ఈయన్ను తమ ఆదిగురువుగా భావిస్తారు. ఈయన హిందూ క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. అప్పటికే ఉన్న భక్తిమార్గాన్నీ, నిరాకార బ్రహ్మోపాసననూ కలిపి దానికి సామాజిక సమానత్వాన్ని జోడించి ఈయన సిఖ్ పంధాను తయారు చేశాడు. అనవసరమైన తంతులను పూజలను ఈయన నిరసించాడు. నిజమైన సద్గురువులు అందరిలాగే, ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికతకే ఈయన పెద్దపీట వేశాడు. వారిలాగా ఈయనది కూడా యూనివర్సల్ మైండే.

ఈయన జీవితాన్ని అందులోని సంఘటనలనూ ఏకరువు పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. అవి చాలాచోట్ల దొరుకుతాయి. ఈయన చెప్పిన బోధనలను క్లుప్తంగా చూద్దాం.

1. దైవం ఒక్కటే. దాని పేరు ఓమ్. అది నిరాకారం. అన్ని జీవులలో అంతరాత్మగా ఉన్నది. దానికోసం విగ్రహాలలోనో లేదా ఇంకెక్కడో వెదకడం వృధా.

2. పూజారులు, పురోహితుల మధ్యవర్తిత్వం అవసరం లేకుండా ప్రతివారూ దైవాన్ని సరాసరి తామే అనుభూతి చెందవచ్చు.

3. అనునిత్యం దైవనామాన్ని ధ్యానపూర్వకంగా స్మరిస్తూ తనలోని పంచపాపాలకు - అంటే, కామం, క్రోధం. లోభం, మోహం, అహంకారం -  వీటికి అతీతంగా నిత్యజీవితంలో బ్రతకడమే అసలైన పూజ. అదే అసలైన సాధన. మిగతా పూజలన్నీ పనికిమాలినవి.

4. ప్రతివారూ కష్టపడి ధర్మంగా బ్రతకాలి. అన్యాయపు ఆర్జన పనికిరాదు. మోసపు జీవితం పనికిరాదు. అలాంటి శుద్ధమైన జీవితమే దైవానికి నచ్చుతుంది.

5. సంసారాన్ని వదలి సన్యాసం తీసుకోవాల్సిన పనిలేదు. సంసారంలో ఉంటూనే దైవానుభూతి పొందవచ్చు. సమాజం పట్ల తన బాధ్యతను సన్యాసి నిర్వర్తించడు. కానీ సంసారి ఆ పని చేస్తూనే దైవసాధన కూడా చేస్తాడు. కనుక సన్యాసం కంటే సంసారమే గొప్పది.

6. కొండకోనల్లో సమాజానికి దూరంగా ఉంటూ తపస్సు చెయ్యవలసిన పని లేదు. సమాజంలో ధర్మంగా బ్రతుకుతూ, నీ పనిని నువ్వు సక్రమంగా, దైవానికి నచ్చేలాగా చేస్తూ, సాధన చెయ్యడమే నిజమైన సాధన.

7. నిత్యజీవితమే సాధన కావాలి, అంతేగాని వేషంకోసం కాసేపు చేసే పూజా, కోరికలు తీరడం కోసం చేసే దీక్షలూ పనికిరానివి.

8. మానవులలో కులం మొదలైన భేదాలు పనికిరావు. దైవం ఎదుట అందరూ సమానులే. కనుక మానవులలో సోదరభావం ఉండాలి. ఒకరికొకరు సహాయపడే తత్త్వం ఉండాలి.

9. సమాజంలో ఒక వృత్తి ఎక్కువా ఇంకొకటి తక్కువా కాదు. దేని విలువ దానిదేనని గ్రహించి ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం కావాలి. ఇంకొకరిపైన ద్వేషం పనికిరాదు.

ఈ విధంగా, నానక్ ఉపదేశాలన్నీ, మౌలికమైన హిందూమతానికి ప్రతిబింబాలుగా కనిపిస్తాయి. వీటిని ప్రతి సద్గురువూ ఒప్పుకున్నాడు, బోధించాడు. అలా బోధించిన గురువులు నానక్ కి ముందూ ఉన్నారు, తర్వాతా ఉన్నారు. ఆచరించే వారే లేరు !

ఈయన జాతకంలో నవాంశచక్రంలో ఉచ్చవక్ర శనితో బాటు, కేతువు, చంద్రుడు ఉండటం వల్ల - మనం ఈనాడు చూస్తున్న డొల్ల మతాచరణలకు భిన్నమైన నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం ఈయనకు కలిగింది. ఈయన ఎన్నో మహిమలను చేశాడు. కష్టాలలో ఉన్న ఎందరినో తన శక్తితో ఆదుకున్నాడు.

ఈయన శక్తి, దివ్యత్వము, మహిమా తర్వాతి గురువులకు పరంపరగా అందాయని శిక్కులు నమ్ముతారు. గురు గ్రంధసాహిబ్ లో ఈయన చెప్పిన బోధలు దాదాపు వెయ్యిదాకా ఉన్నాయి. అవన్నీ కూడా - భగవంతుడు ఒక్కడే, మానవులంతా ఒక్కటే, మనిషి ధర్మంగా బ్రతకాలి, అనవసర పూజలు, తంతులు. దీక్షలు వద్దు, నిత్యజీవితమే సాధనగా మారాలి, సాటిమనిషికి సాయం చెయ్యి, నీలోని పంచపాపాలకు అతీతంగా ఉండు, నిత్యం భగవంతుని నామాన్ని స్మరించు, శుద్ధంగా బ్రతుకు - అనే మూలసూత్రాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.

ఏ సద్గురువైనా చెప్పినవి ఇవే. కాకుంటే అప్పటికే ఉన్న హిందూమతంలోనుంచి నానక్ ఒక మార్గాన్ని తయారుచేసి, దానిని ముందు తను ఆచరించి, ఆ తర్వాత తన శిష్యులకు (సిక్ఖులకు) బోధించాడు. అది నేడు 'సిఖ్ మతం' అంటూ ఒక ప్రత్యేక పంధాగా రూపుదిద్దుకుంది.

'అయ్యప్పగుడిలోకి ఆడాళ్ళు రావచ్చా లేదా?' లాంటి చెత్త విషయాలమీద కాకిగోల చేస్తున్న నేటి హిందూసమాజం ఈ పనికిమాలిన కాలక్షేప ఆధ్యాత్మికతను వదిలిపెట్టి గురునానక్ వంటి మహనీయులైన సద్గురువులు చూపించిన అసలైన ఆధ్యాత్మికతను ఆచరిస్తే ఎంత బాగుంటుంది? కానీ మన కుహనా మతాచారపరులకు నిజమైన ఆధ్యాత్మికత ఎప్పటికైనా ఎక్కుతుందా? కనీసం అర్ధమౌతుందా? అసలు మన సమాజం ఏనాటికైనా నిజంగా ధార్మికంగా మారుతుందా? ఆధ్యాత్మికంగా ఎదుగుతుందా?

గురునానక్ ఈ భూమ్మీద నడయాడి 550 ఏళ్ళు గడిచాయి. కానీ ఈరోజుకైనా, ఆయన చెప్పిన మార్గంలో ఎంతమంది నిజంగా నడుస్తున్నారు? సందేహమే ! గురు నానక్, శిక్ఖులకు మాత్రమే గురువు, మనకు కాదు అనుకోవడం పెద్ద పొరపాటు. అలాగే, ఆయన బోధనలు శిక్కులకు చేసినవి, మనకు కాదు అని అనుకోవడం కూడా అతిపెద్ద పొరపాటే !

ఈ మహనీయుని, ఆయన బోధనలను, కనీసం ఈరోజైనా భక్తిపూర్వకంగా స్మరించుకుందాం. ఆచరించే ప్రయత్నం చేద్దాం !
read more " గురు నానక్ జయంతి - 2018 "

21, నవంబర్ 2018, బుధవారం

నాందేడ్ యాత్ర 9 - (గురుగోవింద్ సింగ్ ఎలా మరణించాడు?)

'ఏం నేను అడగకపోతే నా మనసులో ఏముందో నీకు తెలీదా?' అడిగాను.

'ఆహా ! తెలిస్తే మాత్రం, నువ్వు అడగకుండా మేమెందుకు చెబుతాం? నీ నోటివెంట ప్రశ్న వస్తే వినాలని మాకుంటుంది. ప్రశ్నను నువ్వెలా అడుగుతావో గమనిస్తాం' అంది.

నేనూ సూటిగా పాయింట్ కొస్తూ - 'గురుగోవింద్ సింగ్ ఎలా మరణించాడు? ఎక్కడ మరణించాడు?' అనడిగాను.

ఫకాల్న నవ్వింది వటయక్షిణి.

'అందరూనేమో నిధులకు, లంకెబిందెలకు దారి చెప్పమని, నడమంత్రపు సిరి వచ్చే మార్గం చెప్పమని, ఇంకా ఏవేవో అలాంటి కోరికలు కోరుతుంటే, నువ్వేంటి చరిత్రలో ఎప్పుడో జరిగిన విషయాలు త్రవ్వి చెప్పమని అడుగుతున్నావు?' అంది.

'నీకు తెలుసు కదా నేనదో టైపని? అందుకే అలా అడుగుతున్నాను'

'అవునా? గురుగోవింద్ సింగ్ ఎలా చనిపోయాడో ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఎచీవ్ చేసేది ఏముంది?' అడిగింది తను.

'అబ్బో ! ఇంగ్లీషు పదాలు మాట్లాడుతున్నావే? మీకు ఇంగ్లీషు కూడా వస్తుందా?' అడిగాను నేను.

'మాకే భాషా రాదు. కానీ అన్ని భాషలూ వస్తాయి' అంది.

'అదెలా సాధ్యం?' తెలిసినా తెలీనట్లే అడిగాను.

'నీకు తెలిసి కూడా మళ్ళీ నాచేత ఎందుకు చెప్పించడం?' అంది తను.

తన మాటనే తనకు వప్పజెబుతూ, 'నాకు తెలిసినా నువ్వెలా చెబుతావో వినడం నాకిష్టం' అన్నాను.

మళ్ళీ నవ్వింది యక్షిణి.

'చతురుడవే. కర్ణపిశాచి చెబితే ఏమో అనుకున్నాను. నిజమేనన్న మాట' అంది నవ్వుతూ.

'అది సర్లే. మీకు ఇంగ్లీషు ఎలా వచ్చిందో చెప్పు ముందు' అడిగాను నేనూ నవ్వుతూ.

'మీ భూమ్మీద భాషలు ఏవీ మాకు రావు. మేము మీ ఆలోచనలతో ట్యూన్ అవుతాం అంతే, మీరు ఆలోచించాలంటే ఏదో ఒక భాష అవసరంకదా. భాష సహాయంతోనే మీరు ఆలోచించడం గాని, మాట్లాడటం గాని చేస్తారు. ఆ ప్రాసెస్ తో మేము కనెక్ట్ అవుతాం. జవాబు చెబుతాం. అందుకే మీ భాషలోనే జవాబు చెప్పినట్లు మీకనిపిస్తుంది. నిజానికి నేనేమీ మాట్లాడటం లేదు. జస్ట్ భావతరంగాలను నీకు ప్రసారం చేస్తున్నాను. కానీ నేను నీ ఆలోచనలతో ట్యూన్ అయి ఉండటంతో, నా భావాలు నీ భాషలోకే ట్రాన్స్ లేట్ కాబడి నీకు వినిపిస్తున్నాయి. లేదా వినిపించినట్లు నువ్వు ఫీలవుతున్నావు. ఇదంతా నీకు తెలుసనీ నాకు తెలుసు. కావాలని నాతో చెప్పిస్తున్నావనీ తెలుసు.' అంది తను.

నవ్వాను నేను.

'అవునూ నువ్వు ఉండేది ఎక్కడ?' అడిగాను తమాషాగా.

నేను తమాషాగా అడిగినా తను మాత్రం యమా సీరియస్ గా ఒకవైపు చూపిస్తూ 'అదిగో అక్కడ' అంది.

అటు చూచిన నాకు చీకట్లో జడలు విరబోసుకున్నట్లు ఊడలతో ఒక మర్రిచెట్టు కనిపించింది.

'అదే నా నివాసస్థానం.' అంది యక్షిణి.

నేనింకేమీ రెట్టించలేదు. యక్షిణిలు చెట్లమీద ఉంటారని నాకు తెలుసు. వటయక్షిణి నివాసం మర్రిచెట్టనీ అందుకే ఆమెకా పేరు వచ్చిందనీ నాకు తెలుసు.

'గురుగోవింద్ సింగ్ సంగతి చెప్పు' అన్నాను.

'ఆయన ఇక్కడ చనిపోలేదు. పంజాబ్ లోనే చనిపోయాడు. డిల్లీసుల్తాన్ పంపించిన ఇద్దరు ఆఫ్ఘన్ హంతకులూ ఆయన్ను కత్తులతో పొడిచినది నిజమే. డిల్లీ సుల్తాన్ బహదూర్ షా ను గద్దెనెక్కించింది గురుగోవింద్ సింగే. గురుసహాయం లేకుండా ఉంటే అతను సింహాసనం ఎక్కేవాడే కాదు. కానీ గురువుకు అతడు నమ్మించి ద్రోహం చేశాడు.

హిందూస్తాన్ ను బహదూర్ షా ధర్మంగా పరిపాలిస్తాడని గురుగోవింద్ సింగ్ అనుకున్నాడు. సుల్తాన్ కూడా గద్దెనెక్కేదాకా మంచిగా నటించాడు. కానీ తన సైన్యాదిపతులైన ముస్లిముల చెప్పుడు మాటలు విని, గురుగోవింద్ సింగ్ ఎప్పటికైనా తనకు అడ్డేననీ, అతన్ని అంతం చెయ్యాలని ప్లానేశాడు సుల్తాన్. అందుకే మంచిగా ఉంటున్నట్లు నటిస్తూనే గురువును హత్య చేయించాలని కుట్ర చేశాడు. దానికోసం ఇద్దరు పఠాన్ హంతకులను ఆఫ్ఘనిస్తాన్ నుంచి రప్పించాడు. వాళ్ళిద్దరూ నాందేడ్ లొ ఉన్న గురువు దగ్గరకు వచ్చారు. మంచిగా వినయంగా నటిస్తూ ఆయనతోనే ఉన్నారు. ఒకరోజున గురువు తన డేరాలో నిద్రిస్తూ ఉండగా, హటాత్తుగా ఎటాక్ చేసి ఆయన్ను కత్తులతో పొడిచారు. గురువు పక్కనే తల్వార్ ఎప్పుడూ ఉంటుంది. యుద్ధవిద్యలలో ఆయన నిపుణుడు. మెలకువ వచ్చిన ఆయన వెంటనే తన పక్కన ఉన్న తల్వార్ దూసి ఒక హంతకుడి తలను అక్కడే నరికేశాడు. కానీ అప్పటికే ఆయన గుండె క్రిందుగా బలమైన కత్తిపోటు తిన్నాడు. ఈ గోలా అరుపులూ విని అక్కడకు వచ్చిన శిష్యులు ఆ రెండోవాడిని పట్టుకుని నరికేశారు. ఇదీ జరిగింది' అన్నది యక్షిణి.

'ఇక్కడిదాకా నాకూ తెలుసు. ఆ తర్వాత ఏమైందో చెప్పు' అడిగాను.

'ఆ తర్వాత ఏమైందో కూడా నీకు తెలుసు. ధ్యానంలో నువ్వు చూచావు. అయినా చెబుతా విను. గురువు గాయాలు తగ్గడానికి డ్రెస్సింగ్ చెయ్యమని తన పర్సనల్ డాక్టర్ అయిన ఒక ఇంగ్లీష్ సర్జన్ ను నాందేడ్ కు పంపించాడు సుల్తాన్ బహదూర్ షా. అతను గురువుకైన గాయాలకు డ్రెస్సింగ్ చేశాడు. అప్పుడే గురుగోవింద్ సింగ్ ఆలోచనలో పడ్డాడు.

'ఒకవైపు తన శిష్యులలో కూడా కొన్ని విభేదాలు వస్తున్నాయి. వారిలో గ్రూపు తగాదాలు తలెత్తుతున్నాయి. ఇంకోవైపు సుల్తాన్ తో నిరంతర విరోధం. ప్రతిరోజూ ముస్లిములతో గొడవలే. ఏరోజున ఏవైపు నుంచి ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలీదు. ఈ దేశంకోసం, ప్రజలకోసం, తన కుటుంబం అంతా సర్వనాశనం అయిపొయింది. కానీ ప్రజలు స్వార్ధపరులు. వాళ్ళలో చైతన్యం ఎప్పటికీ రాదు. ధర్మవర్తనం ఎప్పటికీ రాదు. తమలాంటి గురువులు ఎంతగా మొత్తుకుని చెప్పినా వారిలో స్వార్ధమూ, కపటమూ రోజురోజుకూ పెరుగుతున్నదే గాని తగ్గడం లేదు.

హిందూరాజులు కూడా ముస్లిం సుల్తాన్లతో చేతులు కలిపి ఒకరి గుట్లుమట్లు ఇంకొకరు సుల్తాన్లకు చేరవేస్తున్నారు. వాళ్లకు తొత్తులైపోతున్నారు. పైగా, తనతో ఈ గురుపరంపర పదిమంది గురువులదాకా వచ్చింది. ఈ పదిమందిలో ఆరుగురు హింసాత్మకంగానే చనిపోయారు. తన పిల్లలు కూడా సర్ హింద్ సుల్తాన్ చేతిలో చంపబడ్డారు. తనకు వారసులు లేరు. తన తరువాత ఇంకొక గురువు ఉంటే, అతన్నీ ఈ ముస్లిం సుల్తానులు వెంటాడి చంపడం ఖాయం. తరతరాలుగా ఈ రక్తం ఎప్పటికీ ఇలా చిందుతూనే ఉంటుంది. కనుక ఈ 'గురుచరిత్ర' కు ఇక చరమగీతం పాడాలని ఆయన నిశ్చయించుకున్నాడు. దానికోసం ఒక ప్లాన్ వేశాడు.

ఒకరోజున అల్లెత్రాడు బిగించి బాణాన్ని సంధిస్తున్నట్లుగా ఆయన నటించాడు. అప్పుడు తన ఛాతీకి ఇంగ్లీష్ సర్జన్ వేసిన కుట్లు పిగిలిపోయినట్లు నటించాడు. అందులోనుంచి కొంత రక్తం కారింది కూడా. శిష్యులు గుడ్డలతో కట్లు కట్టారు. కానీ రక్తం ఆగలేదు. రెండు రోజులు అలా బాధపడినట్లు నటించి, మూడోరోజున చుట్టూ మరుగు ఉన్న ఒక పెద్ద డేరాను కట్టమని, దాని మధ్యలో తనకు చితి పేర్చమనీ ఆయన చెప్పాడు. తన తర్వాత మానవగురువులు ఉండరనీ, 'గురు గ్రంధ సాహిబ్' మాత్రమే మీకు గురువనీ ఆయన ఆదేశించాడు.

ఆ తర్వాత తన శిష్యుల నందరినీ డేరాకు వీపు పెట్టి నిలబడమనీ, తెల్ల వారే వరకూ తిరిగి చూడద్దనీ గట్టిగా ఆదేశించిన ఆయన, తన గుర్రం 'నీల' మీద ఎక్కి, చితి పేర్చిన డేరాలోకి వెళ్లి దానిని అంటించి, అందులో తన పిడిబాకును వేసి, చితి బాగా అంటుకునే వరకూ ఉండి, ఆ తర్వాత డేరా వెనుక నున్న ద్వారం గుండా నార్త్ ఇండియా వైపు సాగిపోయాడు. శిష్యులు తెల్లవారేవరకూ అలాగే కూర్చున్నారు. తెల్లవారి చితి పూర్తిగా ఆరిపోయాక వాళ్ళు వెళ్లి చూస్తే ఆరిపోయిన చితిలో గురువు యొక్క పిడిబాకు ఒక్కటే వారికి దొరికింది. ఆయన ఎముకలూ, గుర్రం ఎముకలూ ఏవీ దొరకలేదు. తన గుర్రాన్ని ఎక్కి గురువు స్వర్గానికి వెళ్లిపోయాడని వాళ్ళు అనుకున్నారు. అప్పటికి ఆయన నార్త్ వైపు అనేక మైళ్ళు వెళ్ళిపోయాడు.

అలా వెళ్లివెళ్లి పంజాబ్ చేరుకొని మారుపేరుతో అక్కడ చాలాకాలం నివసించిన ఆయన పంజాబ్ లోనే మామూలుగా అందరూ మరణించేటట్లే మరణించాడు. ఈ విధంగా పదితరాలుగా సాగిన ఈ గురుచరిత్రకు ఆయన ఒక చక్కని ముగింపు నిచ్చాడు. సిక్కులు మాత్రం ఆయన చెప్పినట్లుగా, గురుగ్రంద్ సాహిబ్ నే వారి గురువుగా భావిస్తూ వస్తున్నారు. ఇదీ అసలు జరిగిన కధ' అంది యక్షిణి.

'ఇదంతా నేను వ్రాస్తే జనం నమ్ముతారా?' అడిగాను.

'ఏమో నాకేం తెలుసు? అయినా ఒకరిని నమ్మించవలసిన ఖర్మ నీకెందుకు? వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, ఈ పదిమంది గురువుల తర్వాత ఇంకా నలుగురు గురువులున్నారని నమ్మే ఒక శాఖ సిక్కులలో ఉంది. వాళ్ళు కూడా గురుగోవింద్ సింగ్ నాందేడ్ లొ చనిపోలేదని నమ్ముతున్నారు. అయితే, వీళ్ళు సిక్కులలో మైనారిటీలు.' అంది యక్షిణి.

'అయితే నాకు ధ్యానంలో కనిపించినది వాస్తవమేనన్నమాట' అనుకున్నాను.

'అవును. అది నిజమే. నీ గురువులు వారి జీవితంలో ఒక్కసారి కూడా అబద్దం చెప్పలేదు. అలాంటి సత్యమూర్తులు వారు. వాళ్ళు నిన్నెప్పుడూ రక్షిస్తూనే ఉన్నారు. నిన్ను సత్యమార్గంలో నడిపిస్తూనే ఉన్నారు. వాళ్ళు చూపించినవి సత్యాలే.' అంది తను.

'అబద్దాలే నిజాలనుకుంటూ లోకం ఎంత మాయలో బ్రతుకుతున్నది?' అన్నాను నేను.

ఈ మాట అంటుండగానే, వెనుక నుంచి - 'సాబ్. ఆప్ యహా అంధేరే మే అకేలే బైట్ కే కిస్సే బాత్ కర్తే హై?' అన్న మా పాయింట్స్ మ్యాన్ స్వరం వినిపించింది.

వెనక్కు తిరిగి చూచాను.

పాయింట్స్ మ్యాన్ మనోజ్ తన చేతిలో ఫ్లాస్క్, టీ కప్పుతో కనిపించాడు.

నేను వాటివైపు చూడటం గమనించి - 'ఆప్ యహా ఆనా దేఖా హమ్ నే. డేడ్ ఘంటా హోగయా. ఇసీలియే మై చాయ్ లాయా ఆప్కే లియే' అంటూ చాయ్ కప్పులో పోసి అందించాడు.

నా ఎదురుగానే కూచుని ఉన్న యక్షిణి అతనికి కనిపించడం లేదని నాకర్ధమైంది. మౌనంగా టీ కప్పు తీసుకుని సిప్ చేస్తూ ' టీక్ హై. తుం జావో. మై తోడీ దేర్ మె నీచే ఆజావూంగా' అన్నాను సీరియస్ గా.

అనుమానంగా నావైపు చూస్తూ అతను పరిగెత్తినట్లుగా క్రిందకు వెళ్ళిపోయాడు.

అతనలా పరిగెత్తడం చూస్తున్న యక్షిణి మళ్ళీ కిసుక్కున నవ్వింది.

ఆమెకు ఆఫర్ చెయ్యకుండా నేనొక్కడినే టీ త్రాగుతున్నానే అని నాకు అనిపించింది. ఆమె నా ఆలోచనకు హిందీలో జవాబు చెప్పింది.

'పీవో. కోయీ బాత్ నహీ. హమ్ లోగ్ చాయ్ నహీ పీతే. తుం జాన్తే హో హమ్కో క్యా చాహియే. వో దేదో. బస్. మై చల్ రహా హు' అంటూ ఆమె మంచులా గాలిలో కరిగిపోయింది.

నవ్వుకుంటూ చాయ్ తాగేసి టైం చూచాను. దాదాపు రెండౌతోంది. అంటే దాదాపు గంటన్నర సేపు ఇక్కడ కూచుని ఉన్నానన్నమాట !

లేచి ఒళ్ళు విరుచుకున్నాను. మెల్లిగా టెర్రేస్ చివరకు వచ్చి దూరంగా కనిపిస్తున్న మర్రిచెట్టు వైపు చూచాను. చీకట్లో అది ఒక దయ్యం లాగే కనిపిస్తోంది. యక్షిణి అక్కడకు చేరుకుందన్న మాట. నవ్వొచ్చింది !

మెల్లిగా క్రిందకు దిగి వచ్చాను.

నేనొచ్చేసరికి, క్రింద స్టేషన్ మాష్టారూ, పాయింట్స్ మ్యానూ, ఇంకో ఇద్దరూ ఏదో భయంభయంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నన్ను చూడగానే టక్కున మాటలు ఆపేశారు.

'మనోజ్. ఔర్ ఏక్ కప్ చాయ్ దేదో' అన్నా కుర్చీలో కూచుంటూ. మనోజ్ లోపలకి పరిగెత్తి చాయ్ తెచ్చి ఇచ్చాడు. తాపీగా దాన్ని సేవించి, నా పనిలో పడ్డాను. తెల్లవారేదాకా వాళ్ళు నాతో ఏమీ మాట్లాడలేదు. నన్ను అదోరకంగా భయంభయంగా చూస్తుండటం మాత్రం అప్పుడప్పుడూ గమనించాను. నేనూ వాళ్ళతో ఏమీ రెట్టించలేదు.

చూస్తుండగానే తెల్లవారింది. హోటల్ కి తీసికెళ్ళే కార్ వచ్చింది. అందులో కూచుని హోటల్ కు బయల్దేరాను. కారు పోతున్న దారిలోనే మర్రిచెట్టు కనిపిస్తోంది దూరంగా.

దాన్ని దాటేవరకూ దానినే చూస్తూ ఉండిపోయిన నేను సీటు వెనక్కు ఆనుకుని కళ్ళు మూసుకున్నాను.

కారు హోటల్ వైపు దూసుకు పోతోంది.

(ఇంకా ఉంది)
read more " నాందేడ్ యాత్ర 9 - (గురుగోవింద్ సింగ్ ఎలా మరణించాడు?) "

20, నవంబర్ 2018, మంగళవారం

నాందేడ్ యాత్ర 8 - (వట యక్షిణి)

మాల్ టెక్ డి స్టేషన్లో రెండో రోజు నైట్ డ్యూటీ.

ఆ స్టేషన్ అంత పెద్దగా ఎందుకు కట్టారో నాకర్ధం కాలేదు. అక్కడ ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఏవీ ఆగవు. పాసింజర్ రైళ్ళు కూడా ఈ సెక్షన్లొ తక్కువే. ఎక్కే మనుషులూ లేరు. దిగే మనుషులూ లేరు. రాత్రంతా నిర్మానుష్యంగా ఊరికి దూరంగా అడివిలో ఉన్న అంతపెద్ద స్టేషన్లో బిక్కుబిక్కు మంటూ ఒక స్టేషన్ మాస్టర్, ఒక పాయింట్స్ మ్యాన్, నేను. స్టేషనేమో రెండు అంతస్తులతో మైసూర్ మహారాజా ప్యాలస్ అంత పెద్దదిగా ఉంది. మొదటి అంతస్తులో ఎన్నో రూములున్నాయి. అవన్నీ లాక్ చేసి ఉన్నాయి. కొన్ని తెరిచే ఉన్నాయి. వాటిల్లో ఎవరూ లేరు. ఏ ఆఫీసులూ లేవు. మరి అంత పెద్ద స్టేషన్ ఎందుకు కట్టారో, ఎందుకు అలా వదిలేశారో నాకైతే అర్ధం కాలేదు. సర్లే ఇండియాలో జరిగే విచిత్రాలలో ఇదీ ఒకటి కావచ్చు అనుకుని ఇక ఆలోచించడం మానేశాను.

రెండు రోజులుగా నేను చూచిన సంఘటనలతో, నాకు ధ్యానంలో అర్ధమైన విషయాలతో ఈ నాందేడ్ యాత్రంతా చాలా విచిత్రంగా అనిపించింది. సచ్ ఖండ్ గురుద్వారాలో గురు గోవింద్ సింగ్ ను డిల్లీ సుల్తాన్ పంపించిన కిరాయి హంతకులైన ఇద్దరు పఠాన్ సోదరులు కత్తులతో ఎటాక్ చేసి పొడిచారని, వారిలో ఒకరిని ఆయనే చంపేశాడని, మరొకరిని ఆయన శిష్యులు పట్టుకుని చంపేశారని చెప్పారు. ఆ గాయాలతోనే ఆయన నాందేడ్ లోనే చనిపోయాడని అంటారు. కానీ సచ్ ఖండ్ గురుద్వారాలో నాకేమీ అలాంటి వైబ్రేషన్స్ అనిపించలేదు.అక్కడ ఒక సద్గురువు హత్య చెయ్యబడిన వైబ్రేషన్స్ గానీ, చనిపోయిన వైబ్రేషన్స్ గానీ లేవు. మరేంటి ఈ మిస్టరీ? చరిత్ర అలా చెబుతోందేమిటి? అందరూ దానినే నిజమని నమ్ముతున్నారేమిటి? నాకేమో దానికి వ్యతిరేకంగా అనిపిస్తోంది ఏమిటి?

ఒకవైపు డ్యూటీ చేస్తున్నానే గాని, మనస్సులో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి.

చూస్తుండగానే అర్ధరాత్రి దాటింది. టైం చూచాను. 12.15 అయింది. ఒక రెండుగంటల పాటు పని లేదు. కనుక కొంచం రిలాక్స్ అవచ్చు. మెల్లిగా లేచి బయటకు వచ్చాను. స్టేషన్ మాస్టర్ ప్రశ్నార్ధకంగా చూచాడు.

'సాబ్. ఇస్ సమయ్ మే బాహర్ మత్ జాయియే. ఏతో జంగల్ హై. సాప్ గీప్ ఫిర్తే రెహతే హై. అగరాప్కో చాయ్ చాహియే తో, మై బనాకే లాయా ఘర్ సే. పూరా ఫ్లాస్క్ భరా ఛాయ్ హై.' అన్నాడు వినయంగా.

నవ్వాను.

'ఫికరో మత్. ముజ్కొ కోయీ డర్ నహీ హై. మై ఏక్ దొ ఘంటే మే వాపస్ ఆతా హు. దేఖ్తే రహో' అని చెప్పి పై అంతస్తులలోకి వెళ్ళే మెట్లవైపు దారి తీశాను.

వాళ్ళలా చూస్తూ ఉండిపోయారు. క్రిందటి రాత్రి కూడా చీకట్లో నేను ఒంటరిగా తిరుగుతూ ఉండటం వాళ్ళు గమనించారు.

మెట్లెక్కి స్టేషన్ పైకి వెళ్లాను. మొదటి అంతస్తు యధావిధిగా నిర్మానుష్యంగా ఉంది. కారిడార్ కు రెండువైపులా కలిపి దాదాపు ఇరవై రూములున్నాయి. కారిడార్లో ఒక లైట్ వెలుగుతోంది. రెండో అంతస్తు పైకి దారితీశాను. అక్కడ లైట్లు లేవు. చీకటిగా ఉంది. మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి ఆ వెలుగులో మెట్లెక్కసాగాను. నిన్న రాత్రి నేను మెట్లెక్కిన గుర్తులుగా మెట్లమీదున్న దుమ్ములో నా పాదముద్రలే కనిపిస్తున్నాయి. వాటిని చూస్తుంటే, నాకంటే ముందు ఏదో ఒక అజ్ఞాతశక్తి నడుస్తూ నాకు దారి చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది. మెట్లెక్కి టెర్రేస్ మీదకు వెళ్ళే తలుపు తీసుకుని విశాలమైన టెర్రేస్ మీదకు అడుగు పెట్టాను.

ఇంకో అంతస్తు వెయ్యడం కోసం సగం వేసి వదిలేసిన పిల్లర్స్ అక్కడ కనిపిస్తున్నాయి. కట్టుబడి చేస్తూ సగంలో వదిలేసినట్లుగా ఉంది. చుట్టూ చూచాను. దూరంగా నాందేడ్ నగరం లైట్లలో మెరుస్తూ కనిపించింది. ఇంకోవైపు దూరంగా మసక వెన్నెలలో తెల్లని గురుద్వారా కనిపించింది. తలెత్తి పైకి చూచాను. నల్లని ఆకాశంలో చుక్కల గుంపులు కనిపించాయి. చుట్టూ చీకటి. ఒంటరితనం. మైళ్ళ దూరం ఎవరూ లేరు. ఈ ఫీలింగ్ నాకు చాలా నచ్చుతుంది. ఎంతసేపైనా అదే లోకంలో అలా ఒక్కడినే ఉండాలనిపిస్తుంది. ఇలాంటి వాతావరణం నా చిన్నప్పటి రోజుల్ని నాకు గుర్తుకు తెస్తుంది. మా పల్లెటూళ్ళో చెరువు గట్టున ఉన్న మర్రిచెట్టు క్రింద ఒక చిన్న వినాయకుడి గుడి ఉంటుంది. దాని వెనుక కూచుని చీకట్లో చెరువును చూస్తూ ధ్యానం చేసిన రాత్రులు గుర్తొస్తాయి.

అక్కడే చీకట్లో నిలబడి చాలాసేపు ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాను. నేను విన్న విషయాలూ, ధ్యానంలో దర్శించిన విషయాల గురించి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని అనిపించింది. మళ్ళీ అంతలోనే 'సెకండ్ ఒపీనియన్' అనే ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. ఆత్మలనుంచి ఎవరైనా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారా మరి !

ఒక దిమ్మమీద కూచుని చీకట్లోకి చూస్తూ కర్ణపిశాచిని మంత్రాన్ని స్మరించాను. విచిత్రం ! ఆమె కనిపించలేదు. కాసేపాగి మళ్ళీ ఒకసారి పిలిచాను. అయినా ఆమె రాలేదు. ఏంటీ విచిత్రం? ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదే? అనుకుంటూ, ఈ సారి వటయక్షిణీ మంత్రాన్ని స్మరించాను. ఇంకా విచిత్రం? ఆమె కూడా రాలేదు. ఆశ్చర్యం అనిపించింది. 

ఏంటి ఇలా జరుగుతోంది? అనుకుంటూ రెండోసారి ఆమె మంత్రాన్ని స్మరిస్తూ ఉండగా - 'కొంచం తలత్రిప్పి వెనక్కు చూడండి. ఎంతసేపూ ముందుచూపే కాదు కొంచం వెనుకచూపు కూడా ఉండాలి తమరికి' అన్న స్త్రీ స్వరం ఒకటి కొంచం ఎగతాళిగా నా వెనుకనుంచి వినిపించింది. అదే సమయంలో వటయక్షిణి దేహంనుంచి వచ్చే ఒక రకమైన ఘాటువాసన నా ముక్కుపుటాలను అదరగొట్టింది.

తాపీగా తలతిప్పి వెనక్కు చూచాను.

నా వెనుకే కొంచందూరంలో ఇంకో దిమ్మమీద కూచుని విలాసంగా కాలు ఊపుతున్న వటయక్షిణి కనిపించింది. తెల్లటి చీరలో, విరబోసుకున్న జుట్టుతో ఆమె ఎంతో అందంగా ఉంది. ఆ మసక వెన్నెల్లో మిలమిలా మెరిసిపోతోంది. కానీ ఆమెలో ఏదో తెలియని క్రౌర్యమూ, లెక్కలేనితనమూ, నిర్లక్ష్యమూ గోచరిస్తున్నాయి. అవి యక్షిణీలకుండే సహజలక్షణాలే. ఆమె నాకు కొత్త కాకపోవడంతో ఆమె వైపు తిరిగి చనువుగా ఇలా అడిగాను.

'ఏంటీ నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ముందు పిలిస్తే వెనుకనుంచి వస్తున్నావ్?'

తన కోరపళ్ళు తళుక్కుమని మెరిసేలా ఆమె నవ్వింది.

'కాళీమాతను ధ్యానించే నిన్ను నేనేం భయపెట్టగలన్లే గాని నన్నెందుకు పిలిచావో చెప్పు?'

'కర్ణపిశాచి ఏమై పోయింది? పిలిస్తే ఎందుకు రాలేదు? ముందీ సంగతి చెప్పు?'

'తను నీ మీద అలిగింది. దాదాపు ఏడాది నుంచీ నువ్వామెను పిలవడం మానేశావు. అందుకే నువ్వు పిలిచినా వెంటనే రావడం లేదు. తను రాకపోతే నువ్వు నన్ను పిలుస్తావని తెలుసు. అందుకే నన్ను వెళ్ళమని చెప్పింది.'

'ఓహో! మీకు అలుగుళ్ళు కూడా ఉన్నాయా?' అనుకున్నా మనసులో.

ఆమె నా ఆలోచనను చదివింది.

'ఎందుకుండవు? మేమూ మీలాంటి వాళ్ళమే. కాకుంటే పరిణామక్రమంలో మీకంటే రెండు మెట్లు పైన ఉన్నాం అంతే ! మీకుండే భావోద్రేకాలన్నీ మాకూ ఉంటాయి. సర్లే. ఎందుకు పిలిచావో చెప్పు.' అంది వయ్యారంగా లేచి నిలబడుతూ.

(ఇంకా ఉంది)
read more " నాందేడ్ యాత్ర 8 - (వట యక్షిణి) "

15, నవంబర్ 2018, గురువారం

నాందేడ్ యాత్ర 7- (బందా ఘాట్ గురుద్వారా)

ఊరు మనకు పరిచయం లేదు గనుక ఆటో ఎక్కి బయల్దేరాను. కొద్ది సేపట్లోనే గోదావరి ఒడ్డున ఉన్న బందా ఘాట్ గురుద్వారాకు చేర్చాడు ఆటోవాలా. నవరాత్రులనేవి సిక్కులకు వచ్చే మొదటి పండుగ కనుక వాళ్ళు చాలా బాగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకని అక్కడంతా పండుగ వాతావరణంలా ఉంది.

గోదావరిని చూస్తూనే ప్రాణం లేచి వచ్చింది. కాసేపు ఆ నది ఒడ్డునే కూర్చున్నాను. సూర్యాస్తమయం అవడానికి ఇంకా సమయం ఉంది. నదిమీద నుంచి వచ్చే గాలితో కలసి సూర్యుని వెలుగు చాలా ఆహ్లాదకరంగా ఉంది. కాసేపు అక్కడ కూర్చుని, సూర్యకాంతిని ఆస్వాదించి, గురుద్వారాలోకి వెళ్లాను. అక్కడ కొద్దిసేపు మౌనంగా ధ్యానంలో కూర్చున్నాను. మనస్సు బందాసింగ్ బహదూర్ నివసించిన కాలంలోకి, మూడొందల ఏళ్ళ వెనక్కు వెళ్ళిపోయింది. ఎన్నో విషయాలు కనిపించాయి. ఎన్నో విషయాలు అర్ధమయ్యాయి. అలా ఒక మూలన కూర్చుని ఒక గంటసేపు ధ్యానంలో ఉన్నాను.

ధ్యాని చేతుల్లో ఉన్న వజ్రాయుధం ధ్యానమే. దాని ద్వారానే అతనికి సమస్తమూ తెలుస్తుంది. దానిద్వారానే అన్ని విషయాలూ అర్ధమౌతాయి. ఇతరులు చూడలేనివి కనిపిస్తాయి. ఇతరులు వినలేనివి వినిపిస్తాయి. ఎందుకంటే అంతా మనస్సు పైనే ఆధారపడి ఉంది గనుక, అది మన చెప్పుచేతల్లో ఉంటే మన దగ్గర అన్నీ ఉన్నట్లే. అది మనం చెప్పినట్లు వినకుంటే అన్నీ ఉన్నా ఏమీ లేనట్లే మరి !

సిక్కులకు ఈ గురుద్వారా చాలా ముఖ్యమైనది కావడంతో అమృత్ సర్ నుంచి కూడా సిక్కులు చాలామంది గుంపులు గుంపులుగా బస్సులలో కార్లలో వస్తున్నారు.  ఇంతలో ముగ్గురు సిక్కులు వచ్చి, హార్మోనియం, తబలాలు శృతి చేసుకుని సాయంకాల కీర్తనలు మొదలు పెట్టారు. ఒక గంటన్నరసేపు చక్కని కీర్తనలు ఆలపించారు. వింటూ కూర్చున్నాను. ముగ్గురూ చిన్నవాళ్ళే గాని చాలా భక్తిభావంతో పాడుతున్నారు. రకరకాల సంగతులు వేస్తూ రాగప్రస్తారాలతో చక్కగా హిందూస్తానీ రాగాలలో కీర్తనలు పాడారు. వాళ్లకు సంగీతం వచ్చని నాకర్ధమైంది.

చాలామంది వచ్చి గురుగ్రంద్ కు ప్రణామం చేసి వెళ్ళిపోతున్నారు గాని శ్రద్దగా కూర్చుని ఎవ్వరూ కీర్తనలు వినడం లేదు. నేనొక్కడినే మొదటినుంచీ చివరవరకూ వాటిని వింటూ మౌనంగా కూర్చోవడం గాయకులు గమనించారు. కీర్తనలు ముగిశాయి.

వాళ్ళు లేచి బయటకు వచ్చారు. ఇంతలో గురుద్వారా లంగర్ నుంచి వాళ్లకు చాయ్ వచ్చింది. ఒకచోట నిలబడి మాట్లాడుకుంటూ చాయ్ త్రాగటం మొదలుపెట్టారు. నేను వెళ్లి వాళ్ళను పరిచయం చేసుకున్నాను.

'మీరు చక్కగా పాడారు' అని నేనన్నాను.

వాళ్ళు నాతో వెంటనే సింక్ అయిపోయారు. వారిలో ముఖ్య గాయకుని పేరు ఆత్మారాం సింగ్. నాకు కూడా చాయ్ ఆఫర్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు గాని లంగర్ నుంచి మూడే చాయ్ లు వచ్చాయి. అందుకని ఆత్మారాం తను త్రాగబోతున్న కప్పులోనుంచి సగం చాయ్ వేరే కప్పులో పోసి నాకిచ్చాడు. గురూపదేశాలలో ముఖ్యమైన 'సోదరభావాన్ని' వాళ్ళు ఆ రకంగా ఆచరణలో పెడుతున్నందుకు నాకు సంతోషం కలిగింది.

పరిచయాలయ్యాయి.

తను విజయవాడలో, హైదరాబాద్ లొ చదువుకున్నానని ఆత్మారాం సింగ్ అంటూ నాతో తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాడు.

'నేను విజయవాడ గురునానక్ కాలేజీలో చదువుకున్నాను. మా నాన్న అక్కడే పోస్ట్ మాన్ గా పనిచేసేవాడు. జీతం సరిపోక రాత్రిళ్ళు రిక్షా తొక్కి మరికొన్ని డబ్బులు సంపాదించేవాడు. ఆ రకంగా మమ్మల్ని చదివించాడు.' అన్నాడు ఆత్మారాం సింగ్.

'అయ్యో ! పగలు పోస్ట్ మాన్ గా పనిచేసి, రాత్రిళ్ళు రిక్షా తొక్కేవాడా?' అడిగాను.

'అవును. కష్టపడి బ్రతకమని గురు ఆదేశం. అందుకే సిక్కులలో అడుక్కునేవాళ్ళు మీకు కన్పించరు. మేము ఏదో ఒక పని చేసి ఎలాగో ఒకలాగ ధర్మంగా బ్రతుకుతాం. ఉన్నంతలో గౌరవంగా బ్రతుకుతాం. కానీ అడుక్కోం. కాయకష్టం మాకు అలవాటే. అందుకే మా నాన్న అలా కష్టపడి మమ్మల్ని చదివించాడు. మెల్లిగా మేము ఆర్ధికంగా స్థిరపడ్డాం. నేను విజయవాడ మ్యూజిక్ కాలేజీలోనే డిప్లొమా చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ లొ చాలా కాలం ఉన్నాను. అక్కడ మాకు ఒక ఇల్లు ఉంది. దానిని అద్దెకు ఇచ్చి ఇక్కడకు వచ్చేశాను.' అన్నాడు.

'ఎందుకు? హైదరాబాద్ నచ్చలేదా?' అడిగాను.

'అవును. అక్కడ సొసైటీ బాగాలేదు. ఎక్కడ చూచినా అధర్మం, విలాసాల వెనుక పరుగులు, వ్యామోహాలు తప్ప ఇంకేమీ లేవు. నాకు ఆ సొసైటీ అసహ్యం వేసింది. అందుకే హైదరాబాద్ వదిలేశాను. ఇక్కడకు వచ్చి ఈ గురుద్వారాలో ఉంటున్నాను. కీర్తనలు పాడే గ్రూప్ లొ చేరాను. ఈ ట్రూప్ తో కలసి లండన్, ఆస్ట్రేలియా, కెనడా అన్నీ తిరిగాను. నేను పెళ్లి చేసుకోను. నా జీవితాన్ని దైవానికి, గురువుకు, సిఖ్ ధర్మానికి అంకితం చేశాను' అన్నాడు.

అతని వైపు సాలోచనగా చూచాను.

మహా ఉంటే అతనికి ముప్పై ఏళ్ళుంటాయి లేదా ఇంకా తక్కువే ఉండవచ్చు. అతని స్వరంలో ధ్వనించిన నిజాయితీ నాకు నచ్చింది. ఇంత చిన్న వయసులో ఇంత మంచి పరిపక్వత కలిగినందుకు సంతోషం వేసింది. 'ఇందుకన్నమాట నీతో మాట్లాడాలని నాకనిపించింది' అనుకున్నాను.

'ఒకసారి అమృత్ సర్ వెళ్లి రండి. జీవితంలో ఒకసారైనా గోల్డెన్ టెంపుల్ చూడాలి. మీరు వెళ్ళే ముందు నాకు ఫోన్ చెయ్యండి. అక్కడ మావాళ్ళకు చెబుతాను. మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. మీకేమీ ఇబ్బంది ఉండదు' అన్నాడు ఆత్మారాం సింగ్.

'సరే. ప్రయత్నిస్తాను' అన్నాను.

'చూస్తున్నారుగా. ఇది మాకు చాలా ముఖ్యమైన పండుగ. బస్సులు వేసుకుని పంజాబ్ నుంచి కూడా చాలామంది ఈ గురుద్వారాకు వస్తున్నారు. ట్రక్కులలో గుర్రాలు, ఏనుగులు కూడా వస్తున్నాయి చూడండి. ఇది బందా సింగ్ బహదూర్ నివసించిన ప్రదేశం. ఇక్కడే ఆయన గురు గోవింద్ సింగ్ జీ ని దర్శించారు. భావి ప్రణాళికా నిర్దేశం పొందారు. పంజాబ్ లొ ఇప్పుడు మనం చూస్తున్న సిక్కు రాజ్యానికి ఇక్కడే బీజం పడింది. అంతా తిరిగి చూడండి. బాగుంటుంది. నాకు వేరే పనుంది వస్తా మరి' అని సెలవు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.

నేను కూడా అదంతా తిరిగి చూచాను.పంజాబ్ నుంచి గుర్రాలు వచ్చేశాయి. ఏనుగులు కూడా ఉన్నాయని అన్నారుగాని నాకు కనిపించలేదు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న సిక్కులతో అక్కడంతా పండుగ వాతావరణంలా ఉంది. ఎవరి పనులు వాళ్ళు ఉత్సాహంగా చేసుకుంటున్నారు. వాళ్ళలో నాకు నచ్చిన గుణాలలో ముఖ్యమైంది - ఉత్సాహం. ఎవరికీ నీరసం గాని, బద్ధకంగాని, ఏడుపు ముఖాలుగాని లేవు. అహంకారం లేదు. అందరూ కలసి మెలసి ఉత్సాహంగా డేరాలు వెయ్యడం, సామాన్లు సర్దుకోవడం. వంటలు చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ లక్షణాలు నాకు బాగా నచ్చేశాయి. చూస్తుండగానే చీకటి పడింది. నేను కాసేపు అవన్నీ చూస్తూ అక్కడే తిరుగుతూ కాలం గడిపాను. 

మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళవలసి ఉండటంతో వెనక్కు బయలుదేరక తప్పింది కాదు. హోటల్ కి వెళ్లి కాసేపు రిలాక్స్ అయ్యి, మాల్ టెక్ డీ స్టేషన్ కి వెళదామని అనుకుంటూ వెనక్కు బయలుదేరాను. దారి అర్ధం కావడంతో నడుస్తూనే హోటల్ కు చేరుకున్నాను.







Banda Singh meeting Guru Govind Singh at Nanded













(ఇంకా ఉంది)
read more " నాందేడ్ యాత్ర 7- (బందా ఘాట్ గురుద్వారా) "

12, నవంబర్ 2018, సోమవారం

Martial Arts Short Film-2

మరికొన్ని ఫోటోలను ఇక్కడ చూడండి.





























read more " Martial Arts Short Film-2 "