Love the country you live in OR Live in the country you love

11, జులై 2017, మంగళవారం

అమర్ నాథ్ యాత్రలో మరణాలు - పౌర్ణమి ప్రభావం

సోమవారం రాత్రి 8.30 ప్రాంతంలో ఒక అమర్నాథ్ యాత్ర బస్సును కాశ్మీర్ ముస్లిం టెర్రరిస్ట్ లు ఎటాక్ చేసినప్పుడు ఏడుగురు చనిపోయారు. పదిహేడు మంది గాయపడ్డారు. వందనుంచి నూటయాభై మంది యాత్రికులను చంపడం టెర్రరిస్టుల లక్ష్యం అని చెబుతున్నారు. ఈ సంఘటన కూడా పౌర్ణమి పరిధిలోనే (ఆషాఢ బహుళ ద్వితీయ) రోజునే జరగడం గమనార్హం.

జూలై 10 నుంచీ 16 వరకూ ఉన్న కొన్ని గ్రహయోగాల వల్ల ఈ వారంలో ఇలాంటి సంఘటనలు, ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా చాలా జరుగుతాయి.

గతంలో పదిహేనేళ్ళక్రితం నా స్నేహితుడు సందీప్ కుమార్ భట్టాచార్జీ అతని భార్యా ఇద్దరూ ఇలాగే అమర్నాథ్ యాత్రలో జరిగిన బాంబు దాడిలో జమ్మూలో చనిపోయారు. పిల్లలిద్దరూ అనాధలయ్యారు. ప్రభుత్వం ఏదో డబ్బులిస్తుంది కానీ ప్రాణాలు వెనక్కు రావు కదా?

మన దేశంలో మనం యాత్ర కెళ్ళాలంటే కూడా భయపడే ఖర్మ ఇంకెన్నాళ్ళో??