1, ఆగస్టు 2022, సోమవారం

ఉద్యోగపర్వం ముగిసింది

నిన్నటితో సుదీర్ఘమైన ఉద్యోగపర్వం ముగిసింది.

ఇక ఆశ్రమవాసపర్వం మొదలు కాబోతోంది. 

నేటినుండి ఉద్యోగబాధ్యతలు, దానికి సంబంధించిన పరిమితులు లేవు గనుక,  24x7 సాధన, బోధన ఈ రెండే ఇక నుండి ప్రాముఖ్యతలు.

పూర్తిస్థాయి ఆధ్యాత్మికజీవితం, అర్హులకు మార్గదర్శనం ఇక సూటిగా మొదలవుతాయి.

నా శిష్యులకు, నా వ్రాతలను అభిమానించే పాఠకులకు, అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.

ఈ సుదీర్ఘప్రయాణంలో సరిక్రొత్త అధ్యాయానికి సిద్ధం కండి.

నేడే అది ప్రారంభం !

read more " ఉద్యోగపర్వం ముగిసింది "

19, జులై 2022, మంగళవారం

శభాష్ చైనా

శభాష్ చైనా !

ఏమాటకామాటే చెప్పుకోవాలి. చైనాను చూచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నిజానికి అనేక రంగాలలో చైనా మనకంటే 50 ఏళ్ళు ముందుకెళ్ళిపోయింది. అంగారకగ్రహం పైన చైనా తన రోవర్ ను దించి ఏడాది అవుతోంది. మనమేమో కనీసం చంద్రుడిని కూడా చేరుకోలేకుండా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి చైనా సాధించిన విజయాలు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందుకు కాదు.

నిన్న జిన్ జియాంగ్ ప్రావిన్స్ ను దర్శించిన ప్రెసిడెంట్ జిన్ పింగ్ ఒక గట్టి హెచ్చరికలాంటి ప్రకటనను చేశాడు. 'ఇస్లామనేది చైనాలో ఉండాలంటే చైనీయ పద్ధతిలో మాత్రమే ఉండాలి' అనేదే ఆ ప్రకటన. 'లేదంటే?' అనే మాటకు అక్కడ ఆస్కారం లేదు. 'లేదంటే, నువ్వుండవు' అని చైనా ప్రభుత్వం అంటుంది. అంతే ! అలా అయితేగాని అక్కడ పరిస్థితి అదుపులో ఉండదనేది చరిత్రనుంచి చైనా నేర్చుకున్న గుణపాఠం !

చైనాలోని వాయవ్యదిక్కులో ఉన్న ఈ  ప్రావిన్స్ లో ఊగిర్ ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్నారు. ఎక్కడైనా ముస్లిమ్స్ మెజారిటీగా ఉంటే ఏమౌతుందో చైనాలో కూడా అదే జరిగింది. ఇస్లామిక్ టెర్రరిజం మొదలు కాబోయింది. అది చైనాగాని ఇండియా కాదు కదా? ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. గట్టిచర్యలు తీసుకుంది. లక్షలాదిమంది ఊగిర్ ముస్లిమ్స్ ని  జైళ్లలాంటి క్యాంప్స్ లో పెట్టి, మంచి మసాలా ట్రీట్మెంట్ ఇచ్చి, వాళ్లకు ఎక్కిన ఇస్లామిక్ తీవ్రవాద పిచ్చిని వదిలించింది. లక్షలాది ఆడాళ్లకు ఫెమిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించింది. ప్రక్క ప్రావిన్స్ లో ఉన్న హాన్ తెగ ప్రజలను లక్షలాదిగా ఈ ప్రావిన్స్ కు తరలించింది. ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఈ విధంగా నీరుగార్చేసింది.

అమెరికా, బ్రిటన్, కెనడాలు 'చైనాలో మానవహక్కుల ఉల్లంఘన' అంటూ దుమ్మెత్తి పోశాయి. ఏ ఆసియా దేశమైనా ఎదుగుతుంటే అవి సహించలేవన్నది చరిత్ర చెబుతున్న నిజం. అందుకని వాళ్ళ కంట్రోల్లో ఉన్న UN వంటి సంస్థలను ఉసిగొలిపి చైనాను ఇబ్బంది పెట్టాలని చూశాయి.  కానీ చైనా ఎవరిమాటా వినలేదు. 'మా దేశపు సమస్యలను దిద్దుకోవడం మా ఇష్టం' అంది. 'బయటవాళ్ళు నోళ్లు మూసుకోండి' అంది. అనడమే కాదు, బయటవాళ్ళవీ, లోపలవాళ్ళనీ నోళ్లు మూయించింది.

నిన్న ప్రెసిడెంట్ జిన్ పింగ్ ఈ చక్కటి వార్ణింగ్ ఇచ్చాడు. 'ఇస్లాం లేదు ఏమీ లేదు. మీరు చైనాలో ఉండాలంటే, చైనీయులుగా ఉండాల్సిందే. వేరే దారి లేదు' అని నర్మగర్భంగా చెప్పాడు.

అందుకే అంటున్నాను, 'శబాష్ చైనా' అని.

ఈ విధంగా ఇండియా చెప్పగలదా? చెప్పలేదు. కారణం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థలు మాత్రమే. ఈ సంగతి చైనాకు కూడా తెలుసు. గతంలో ప్రెసిడెంట్ జిన్ పింగ్ అన్నాడు కూడా, 'ఇండియాలోని రాజకీయ వ్యవస్థ (పార్లమెంటరీ డెమోక్రసీ ) అనేదే దాని శాపం' అని.

చైనాలో ఒకటే పార్టీ. మనది బహుపార్టీ వ్యవస్థ. చైనాది నియంతృత్వం. మనది ప్రజాస్వామ్యం. చైనా రాజ్యాంగం మనలాగా కలగూరగంప కాదు. వాళ్లకు కావలసినది వాళ్ళు రాసుకున్నారు.  మనమేమో మనకు అక్కర్లేనివన్నీ కాపీ కొట్టి రాసుకున్నాం. అదే మన అభివృద్ధికి ప్రతిబంధకం కావడమేగాక, మన నాశనానికి వెసులుబాట్లను ఇస్తున్నది. రాజ్యాంగంలోని లొసుగులను వాడుకుని దేశద్రోహశక్తులు మనదేశంలో బలపడుతున్నాయి. చైనా చేసినట్లు వీటిని కట్టడి చేయడం ఇండియాకు చాలా కష్టంతో కూడుకున్న పని. కారణం? ఇక్కడి వ్యవస్థలో అన్నీ లొసుగులే.

అసలు మన రాజ్యాంగాన్ని అలా వ్రాయించడంలో బ్రిటిష్ వాళ్ళ లాంగ్ టర్మ్ కుట్ర ఉందన్నది నాకున్న సందేహం. కాశ్మీర్ ని ఎలా తయారుచేసి మనకంటించి పోయారో, ఇండియా పాకిస్తాన్ అంటూ రెండు దేశాలను తయారుచేసి కూడా, మళ్ళీ ముస్లీమ్స్ ని ఇక్కడ ఉంచి పోయారో. కుల, మత విభేదాలను నాయకులమధ్యలో రెచ్చగొట్టి పోయారో,  మన రాజ్యాంగాన్ని కూడా ఆ విధంగా వ్రాయించడంలో వాళ్ళ పాత్ర ఉన్నదని నా నమ్మకం. వాళ్ళే డైరెక్ట్ గా వ్రాయకపోయినా, వ్రాసిన వాళ్ళను ప్రభావితం చేయడానికి చాలా అవకాశాలున్నాయి.

ఆ రాజ్యాంగం ప్రకారం దిద్దబడిన మన వ్యవస్థ ఎలా తయారైందంటే, ఒక సమస్యకు చైనాలో అయితే ఒక ఏడాదిలో పరిష్కారం అయ్యేది ఇక్కడ ఏళ్లకేళ్లు పట్టినా అది పరిష్కారం కాదు. మౌలికమైన వ్యవస్థాగత లోపాలే దీనికి కారణం. చైనాలో లోపలిశత్రువులు లేరు. ఇండియాలో అడుగడుక్కీ వ్యతిరేకవాదులే. ప్రతి మంచిపనికీ అడ్డుపడేవాళ్ళే. 'అన్నిటికంటే దేశం గొప్పది' అనే భావన ఒక్క హిందువులలో మాత్రమే ఉండటం ఈ దేశపు దురదృష్టం.

జనాభాలో ప్రపంచ నెంబర్ 1 గా అతిత్వరలో మనమే మారబోతున్నాం. ప్రస్తుతం కాశ్మీర్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బెంగాల్, యూపీ, బీహార్, తెలంగాణ ఇలా చాలా రాష్ట్రాలలో ఇస్లామిక్ తీవ్రవాద ధోరణులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి వ్యవస్థతో, ఇలాంటి జనాభాతో, ఇండియా భవిష్యత్తు ఎలా ఉంటుంది? అన్నది ప్రశ్నార్ధకమే అయినప్పటికీ, ప్రస్తుతానికి ఈ సమస్యను వాళ్ళదైన శైలిలో డీల్ చేస్తున్నందుకు మాత్రం చైనాను  శభాష్ అనకుండా ఉండలేం.

మన శత్రువులో అయినా సరే, మంచిగుణం ఒకటి ఉన్నపుడు దానిని మెచ్చుకోవడం, అనుసరించడం ఉత్తమలక్షణం కదా మరి ! కానీ మెచ్చుకోవడం వరకూ సరే. అనుసరించాలంటే మన వ్యవస్థే మనకు అడ్డుగా ఉంది. అంతా మన రాజ్యాంగ కర్తల దూ ....... ర దృష్టి ఫలితం మరి !!!

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో??

read more " శభాష్ చైనా "

16, జులై 2022, శనివారం

'Savitri Upanishad' Our new E Book released


మా సంస్థనుండి వెలువడుతున్న 49 వ పుస్తకంగా Savitri Upanishad ఇంగ్లీషు పుస్తకం విడుదలౌతున్నది. గతంలో తెలుగులో విడుదలైన ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ పాఠకుల ఉపయోగార్ధమై ఇంగ్లీషులోకి అనువదించి విడుదల చేస్తున్నాము. దీనిగురించి ఇంతకుముందే వ్రాశాను గనుక అదంతా మళ్ళీ చెప్పను.

ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి చక్కని అనువాదం  చేసిన నా శిష్యురాలు గాయత్రికి, తప్పులను దిద్దిన అఖిలకు, ప్రచురణలో ముఖ్యపాత్రలను పోషించిన సరళాదేవి, అఖిల, ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు. ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా ఉచిత పుస్తకంగా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.

read more " 'Savitri Upanishad' Our new E Book released "

11, జులై 2022, సోమవారం

నేను మీ ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను

ఈ రోజున ఒక మెయిలొచ్చింది.

'నా పేరు ఫలానా. నేను మీ ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను' అన్నది దాని సారాంశం.

నాకర్ధం కాలేదు.

'సారీ మాది అనాధాశ్రమం కాదు' అని తిరిగి మెయిలిచ్చాను.

ఈసారి సుదీర్ఘమైన మెయిలొచ్చింది. ఆయనకు కోపం వచ్చిందని అర్థమౌతోంది.

'మీకెలా కనిపిస్తున్నాను? నేను స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసి ఈ మధ్యనే రిటైరయ్యాను. పదేళ్లనుంచీ మీ బ్లాగు ఫాలో అవుతున్నాను. నాకు డొంకతిరుగుడు నచ్చదు. మీరంటే నాకు నమ్మకం కలగలేదు. మీరు మధ్య మధ్యలో రాసే కామెడీ పోస్టులే దానికి కారణం. నిజంగా ఆధ్యాత్మికం ఉంటే అలాంటి కామెడీ చెయ్యరని నా నమ్మకం. ఆధ్యాత్మికమంటే సీరియస్ వ్యవహారం. కామెడీ కాదు.

పైగా, మీకు ఆశ్రమం లేదు. అందుకే మిమ్మల్ని నేనిన్నాళ్ళూ నమ్మలేకపోయాను. ఇప్పుడు మీరు ఆశ్రమం పెట్టారు. అందుకే కొద్దిగా మీరంటే నమ్మకం కుదిరింది. మా ఆవిడ రెండేళ్ల క్రితం గతించింది. పిల్లలు సెటిలయ్యారు.  అందుకే ఇప్పుడు మీ ఆశ్రమంలో వచ్చి ఉందామనుకుంటున్నాను, ఎంత కట్టాలి? వగైరా గైడ్ లైన్స్ చెబుతారా?' అంటూ మెయిల్ ఇచ్చాడు.

నవ్వొచ్చింది. ఆయనకిలా మెయిలిచ్చాను.

గైడ్ లైన్స్ చెప్పడం నాకు చాలా ఇష్టం. వినండి.

1. పిచ్చోళ్లకు మా ఆశ్రమంలో చోటు లేదు. అందుకని, 'నేను పిచ్చోడ్ని కాను' అని ఒక రాగిరేకును మీ మెడలో కట్టుకోవాలి. ఆర్నెల్లకోసారి డాక్టర్ చేత దానిని సర్టిఫై చేయించి మాకు చూపిస్తూ ఉండాలి.

2. ఇది వృద్ధాశ్రమం కాదు. మీకస్సలు ప్రవేశం లేదు. వయసులోనూ మనసులోనూ వృద్ధులను మా ఆశ్రమంలో అనుమతించం. కానీ ఆ రూలు మాకు వర్తించదు.

3. మీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడికొచ్చి ఉండటానికి అస్సలు కుదరదు. ఎందుకంటే, మా లైఫ్ స్టైల్ మీరు ఒక్కరోజు కూడా తట్టుకోలేరు. మా లైఫులో స్టైలే ఉండదు.

4. ఇప్పుడు ముఖ్యమైన గైడ్ లైన్ వినండి. ఎంత కట్టాలి? అని అడిగారు కదా. మేము చిన్నచిన్న ఎమౌంట్స్ తీసుకోము, మీ ఆస్తి మొత్తం మా ఆశ్రమానికి రాయాలి. ఆ తరువాత, మాకిష్టమైతే మీకింత ముద్ద పెడతాం. లేదంటే మాతోబాటు పస్తు ఉంచుతాం. మీరు నోరెత్తకూడదు. ఎత్తినా జవాబు ఉండదు.

5. ఒకసారి మీ ఆస్తి మొత్తం మాకు రాసిచ్చాక, మీ వారసులకు నచ్చక, ఏవైనా లీగల్ మేటర్స్ ఉంటే, అన్నీ జెనీవా కోర్టులోనే తేల్చుకుంటాం. ఇండియా కోర్టులంటే మాకు నమ్మకం లేదు.

6. ఉన్నట్టుండి మా ఆశ్రమంలో అందరమూ కనపడకుండా పోవచ్చు. మళ్ళీ ఎప్పుడొస్తామో, అసలొస్తామో లేదో ఎవరికీ చెప్పం. అప్పటిదాకా ఆ అడవిలో మీరొక్కరే ఉండవలసి వస్తుంది. దిక్కూ దివాణం ఉండదు.

7. ఆశ్రమంలో ఎన్నాళ్ళున్నా బోధనలేమీ ఉండవు. పైగా మధ్యమధ్యలో పిలిచి 'ఏం నేర్చుకుంటున్నావ్?' అని పరీక్షలు పెడుతూ ఉంటాం. ఫెయిలయితే పనిష్మెంట్ ఉంటుంది.

8. నాతో ఎవరేది మాట్లాడినా దానిని బ్లాగులో రాసేస్తాను. అది నా అలవాటు. ఇప్పుడు మీ మెయిల్ని కూడా రాయబోతున్నాను. మీరు హర్టయితే నాకు  సంబంధం లేదు.

ఇన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మీకు నచ్చితే చేరవచ్చు. ఇందులో కామెడీ ఏమీ లేదు. చాలా సీరియస్' అని మెయిలిచ్చాను.

ఇంకా రిప్లై రాలేదు. 

I am still waiting...
read more " నేను మీ ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను "

9, జులై 2022, శనివారం

మా క్రొత్త పుస్తకం 'ఆత్మోపనిషత్' విడుదలైంది

నేడు మా క్రొత్త పుస్తకం 'ఆత్మోపనిషత్' విడుదలైంది. ఇది అధర్వణవేదం లోనిది. ఇది నా కలం నుండి వెలువడుతున్న 48 వ పుస్తకం.

అంగీరసఋషి యొక్క బోధగా ఈ గ్రంధం దర్శనమిస్తుంది. ఈయన ఋగ్వేదకాలపు ఋషులలో ఒకరు. సప్తఋషులలో కూడా ఒకరిగా ఈయనను లెక్కిస్తారు. దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ అనే మూడు సులభమైన భావనలతో సృష్టిని, మానవజీవితాన్ని, సాధనాక్రమాన్ని అంతటినీ కేవలం 32 శ్లోకములలో వివరించడం ఈ గ్రంధపు ప్రత్యేకత.

ఇది సామాన్యోపనిషత్తుల కోవకు చెందినది. ఇవి చిన్నచిన్న ఉపనిషత్తులే అయినప్పటికీ, వీటిలో చెప్పబడిన తత్త్వం మాత్రం అగాధమైనదిగా ఉంటుంది. వీటిని సరిగ్గా అర్ధం చేసుకుంటే, వేదాంతతత్త్వమంతా సులభంగా అర్ధమౌతుంది.

మరొక్కమాట ! ఇవి పైపైన చదివి పడేసే కధల పుస్తకాలు కావు. ఇవి కనీసం పదివేల సంవత్సరాల నాటి విజ్ఞానపు నిధులు. ఈ నాటికీ హిందూమతాన్ని సజీవంగా ఉంచుతున్న అతీతజ్ఞానపు పునాదులు ఇవే.

దీనిలోని ఒక్కొక్క శ్లోకాన్నీ ధ్యానించి ఆయా లోతుపాతులను అర్ధం చేసుకోవలసి ఉంటుంది.  ఉపనిషత్తులను చదువలసిన విధానం అదే. ఈ కోణం లో చూచినప్పుడు, చిన్నదైన ఈ పుస్తకం ఒక జన్మకు సరిపోయే గైడ్ బుక్ అవుతుంది. యధావిధిగా, ఈ ఒక్క పుస్తకాన్ని దిక్సూచిగా పెట్టుకుంటే చాలు, మనిషి జీవితం ధన్యమౌతుంది. ఈ మాట, నేను వ్రాస్తున్న అన్ని పుస్తకాలకూ వర్తిస్తుంది. అందుకే, నేను వ్రాస్తున్న ప్రతి పుస్తకావిష్కరణలోనూ ఇదేమాటను చెబుతూ ఉంటాను. ఇంకా  చెప్పాలంటే, మొత్తం పుస్తకం కూడా అక్కర్లేదు.  పుస్తకంలోని ఒక్క శ్లోకం చాలు, మనిషి జీవితాన్ని పునాదిగా ఉంటూ ఒక సౌధాన్ని దానిపైన నిర్మించడానికి. అయితే, దానిని అర్ధం చేసుకోవాలి, ధ్యానించాలి, జీవితంలోకి దానిని అనువదించుకోవాలి. అప్పుడే నేను చెబుతున్న ఈ అద్భుతం సాధ్యమౌతుంది.

సాధన చెయ్యలేకపోతే పోయారు ! కనీసం వీటిని చదవండి. మన హిందూమతపు ప్రాచీనవిజ్ఞానం ఎంత అద్భుతమైనదో తెలుసుకోండి. కొంతమేరకైనా ధన్యత్వాన్ని అందుకోండి.

ఈ పుస్తకం వ్రాయడంలో నా సహచరులు సరళాదేవి, అఖిల, ప్రవీణ్,  చావలి శ్రీనివాస్ ల పాత్ర ఎంతో ఉంది. వీరి సహాయం లేకుంటే  ఈ పుస్తకం వెలుగును చూచేది కాదు. వీరికి నా  ధన్యవాదములు, ఆశీస్సులు. 

యధావిధిగా, ఇది కూడా Google Books నుండి ఇక్కడ లభిస్తుంది.

read more " మా క్రొత్త పుస్తకం 'ఆత్మోపనిషత్' విడుదలైంది "

3, జులై 2022, ఆదివారం

మా ఆశ్రమం మొదలైంది - 8 (Some more photos)

 
























read more " మా ఆశ్రమం మొదలైంది - 8 (Some more photos) "

మా క్రొత్త English పుస్తకం 'Pranagnihotra Upanishad' విడుదల

మా సంస్థనుండి  వెలువడుతున్న 47వ  పుస్తకంగా  'Pranagnihotra Upanishad'  English E Book నేడు విడుదలైంది. ఈ పుస్తకం Google play books నుండి ఉచిత పుస్తకంగా లభిస్తుంది. కావలసినవారు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పుస్తకం ఇంతకుముందు తెలుగులో విడుదలైంది. అంతర్జాతీయ పాఠకులకోసం ఇప్పుడు ఇంగ్లిష్ లో లభిస్తున్నది.

మా పబ్లికేషన్ టీమ్ లోకి క్రొత్తగా చేరిన నా శిష్యురాలు గాయత్రిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. తెలుగు పుస్తకాన్ని ఎంతో చక్కని ఇంగ్లిష్ లోకి అనువాదం చేసిన ఈమెకు నా ఆశీస్సులు. ముందు ముందు మరిన్ని పుస్తకాలను ఇంగ్లిష్ లోకి అనువాదం చేసే అదృష్టం తనకు లభించాలని ఈ అమ్మాయిని ఆశీర్వదిస్తున్నాను.

Google play books నుండి ఈ పుస్తకాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 0.99 డాలర్స్ కి Kindle Book గా కూడా ఇక్కడ Amazon నుండి లభిస్తుంది.

read more " మా క్రొత్త English పుస్తకం 'Pranagnihotra Upanishad' విడుదల "

1, జులై 2022, శుక్రవారం

మా ఆశ్రమం మొదలైంది - 8 (రుద్రుడు - వాయువు - ఆంజనేయుడు)

శనివారం నాడు ఉపన్యాసాల సందర్భంలో, 'అతిరుద్రం - యోగం' అనే విషయం మీద పీ హెచ్ డీ చేస్తున్న వెంకటసుబ్బయ్య గారిని కూడా మాట్లాడమని కోరాం. వేదం నుంచీ పురుషసూక్తం నుంచీ కోట్ చేస్తూ తన రీసెర్చి విషయాలను కొన్నింటిని ఆయన వివరించాడు.

ఉపన్యాసం తరువాత ఆయనకు ఇలా చెప్పాను.

'మీ ఉపన్యాసం బాగుంది. మీకు పనికొచ్చే కొన్ని రహస్యాలను చెబుతాను వినండి. 'రోదయతీతి రుద్ర:' అన్నట్లు రోదింపజేసేవాడు రుద్రుడు. అంటే ఏడిపించేవాడని అర్ధం. ఏకాదశ రుద్రులంటే ఏకాదశ ఇంద్రియములు. అంటే, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సులు. ప్రతి మనిషీ ఈ పదకొండు ఇంద్రియముల వలలో చిక్కి జీవితమంతా ఏడుస్తూనే ఉంటాడు. చనిపోయేటప్పుడు కూడా ఏడుస్తాడు. అలా ప్రతివారినీ ఏడిపిస్తాయి కాబట్టి, ఇవి 'రుద్రులు' అనబడతాయి.

ఇంద్రియములు ప్రాణసహాయంతో పనిచేస్తాయి. ప్రాణం వాయుతత్త్వ ప్రధానమైనది. కనుక రుద్రునికీ వాయువుకూ సంబంధం ఉన్నది. నిజానికి రెండూ ఒకటే. ఆంజనేయుడు వాయుసుతుడని, రుద్రాంశసంభవుడని చెప్పడంలోని అర్ధం ఇదే.

వాయువునే మరుత్తులంటారు. వాయువనేది వాతావరణంలో ఉంటుంది. అంటే, భూమికి, శూన్యాకాశానికి మధ్యనున్న  వాయుసంచారప్రాంతం. దీనిని సైన్స్ Atmosphere అంటుంది. వాయువు ఆకాశంలో సంచరిస్తుంది. అందుకనే, ఆంజనేయస్వామికి కూడా ఆకాశగమన శక్తి ఉండేది.

యోగం ప్రధానంగా ప్రాణం మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణాయామమనేది  యోగాభ్యాసంలో అతిముఖ్యమైన అంగం. వాయుబంధనంతోనే ప్రాణాయామం జరుగుతుంది. కనుక యోగసాధనకు ఆంజనేయుడు సూచకుడు.

మూలాధారం భూమి అనుకుంటే, సహస్రారం శూన్యాకాశమనుకుంటే, మధ్యలోని సుషుమ్నామార్గం వాయుమండలం అవుతుంది. దానిలో సంచరించే ప్రాణవాయువే ఆంజనేయుడు. ఈ విధంగా, రుద్రతత్వానికీ, వాయువుకూ, యోగానికీ సంబంధం ఉన్నది'.

ఈ రహస్యాన్ని వివరించి చెప్పిన తర్వాత, ఇంకో విషయాన్ని కూడా ఆయనకు చెప్పాను.

శాస్త్రాధ్యయనం, పాండిత్యములు మంచివే. కానీ వాటిలో చిక్కుకుపోకండి. అవి సర్వస్వములు కావు.  పాండిత్యంతో విషయం పైపైన అర్ధమౌతుంది. కానీ రహస్యాలు తెలియవు. అనుభవాలు అందవు. అహంకారం మాత్రం మిగులుతుంది.

ఈ శ్లోకం వినండి.

శ్లో || ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్యపి పునః పునః

ఇదమేకం సునిష్పన్నం యోగశాస్త్రం పరం మతం || 

అన్ని శాస్త్రాలనూ బాగుగా పరిశీలించి, మళ్ళీ మళ్ళీ ఆలోచించగా ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తుంది.  అదేమంటే, 'యోగమే సర్వోత్తమమైన శాస్త్రము'. అని.

ఎందుకని? పాండిత్యంతో సిద్ధి రాదు. యోగంతో మాత్రమే వస్తుంది. కాబట్టి యోగమే సర్వోత్తమం. 

సాధన లేని పాండిత్యం వృధా అని గ్రహించండి' అంటూ ముగించాను.

నా మాట ఆయనకెంతవరకు నచ్చిందో నాకు తెలియదు. కానీ నేను చెప్పవలసినది, ధర్మసమ్మతమైనది నేను చెప్పాను.

కర్మ కొంతవరకూ తీరనిదే ఎవరూ సాధనామార్గంలో అడుగును పెట్టలేరని నాకు తెలుసు. కానీ విషయాన్నీ స్పష్టంగా అర్ధం చేసుకోవడంలో తప్పు లేదు. అది చాలా ముఖ్యం. ముందుగా దారి తెలియాలి కదా ! ఆ తరువాత, ప్రయాణం చెయ్యాలా లేదా నిర్ణయించుకోవచ్చు.  దారి తెలిసిన వెంటనే అందరూ ప్రయాణం మొదలుపెట్టలేరు కూడా ! ప్రయాణం మొదలవ్వాలంటే ఎన్నో కలసి రావాలి. అది, వారివారి కర్మపరిపక్వతను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో టైంలో మొదలౌతుంది. ఎందరికో, అసలు ప్రయాణం అంటూ మొదలవ్వకుండానే జీవితం ముగిసిపోతూ ఉంటుంది.

(ఇంకా ఉంది)

read more " మా ఆశ్రమం మొదలైంది - 8 (రుద్రుడు - వాయువు - ఆంజనేయుడు) "

29, జూన్ 2022, బుధవారం

మా ఆశ్రమం మొదలైంది - 7 (గురువు - సద్గురువు)

ఆదివారంనాడు జిల్లెళ్ళమూడిలో ఉన్నపుడు వర్ధని అక్కయ్య ఒక మాటంది.

అమ్మ ఎప్పుడూ 'నేను గురువును' అని చెప్పలేదు. 'నాకు శిష్యులు లేరు అందరూ శిశువులే' అనేది. అయితే ఒక సందర్భంలో మాత్రం, ఎవరో ఏదో అడిగితే, 'నేను గురువును కాదన్నాను గాని, సద్గురువును కాదనలేదుగా?' అన్నది.

ఈ మాటను వినడంతో నాకు చాలా సంతోషం కలిగింది.

అమ్మ సాహిత్యంలో ఈ మాటను నేనెక్కడా చదవలేదు. అయితే, ఆ విధంగా చెప్పినా చెప్పకపోయినా, అమ్మ సద్గురువే అని నేనెప్పుడూ అనుకుంటాను. మాతృభావంతో, 'నేను తల్లిని మీరు నా పిల్లలు' అని అమ్మ అని ఉండవచ్చు. కానీ, ఆ విధంగా చూచినా  కూడా,తల్లిని మించిన గురువెవరుంటారు? ప్రతి మనిషికీ మొదటి గురువు తల్లే కదా !

ఇంతకీ గురువుకూ సద్గురువుకూ భేదం ఏమిటి?

దేనిని నేర్పించేవాడైనా గురువే. 'సత్' ను గురిగా చూపించేవాడే సద్గురువు.

ఇంతే ఈ మాటలకున్న భేదం.

'సత్' అంటే? 'సత్' అంటే సత్యమని, 'ఉన్నది' అని, బ్రహ్మమని అర్ధాలు. దానికి దారిచూపేవాడు సద్గురువు. అమ్మ చెప్పిన మాటలలో సత్యం తొణికిసలాడుతూ ఉంటుంది, మరి అమ్మ సద్గురువు కాకుండా ఎలా ఉంటుంది?

'సద్గురు' అని మనకి మనం పేరు పెట్టుకోవడం కాదు. అలా పెట్టుకున్నంతమాత్రాన మనం సద్గురువులం అయిపోము. 'మహాత్మా' అని ఎవరో మనకి బిరుదునిస్తే మనం మహాత్ములం అయిపోతామా? బెంగాలీలు 'చక్రవర్తి' అని పేరు పెట్టుకుంటారు. అంతమాత్రాన వారందరూ చక్రవర్తులైపోతారా? ఇదీ అంతే.

సత్యాన్ని గురిగా చూపించేవాడే సద్గురువు. అలా చూపాలంటే, ముందు అదేంటో అతనికి తెలిసి ఉండాలి. దానిని అతడు చేరుకొని ఉండాలి. అనుభవంలో తెలుసుకుని ఉండాలి. అప్పుడే ఇంకొకరికి గురిగా, గురుతుగా దానిని చూపించగలుగుతాడు.

అతని యోచనలలో, మాటలలో, చేతలలో, సత్యం తప్ప ఇంకేదీ ఉండకూడదు. అతడు సత్యస్వరూపుడై, సత్యంతో నిండినవాడై ఉండాలి.

అలాంటివాడే 'సద్గురువు' అనిన పదానికి అర్హుడు.

(ఇంకా ఉంది)

read more " మా ఆశ్రమం మొదలైంది - 7 (గురువు - సద్గురువు) "

మా ఆశ్రమం మొదలైంది - 6 (సత్యాన్వేషణ)

సత్యాన్వేషకులు చాలామంది ఏసీ రూములలో కూచుని సోషల్ మీడియాలో పోస్టులు రాస్తుంటారు. వీడియోలు చేస్తుంటారు. లేదా అమెరికాలో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ, అప్పుడప్పుడూ అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటూ, అదేదో గొప్ప ఘనకార్యమని భ్రమిస్తూ ఉంటారు. యూట్యూబు వీడియోలు చూసి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు.

కానీ, సత్యాన్వేషణ అనేది సుఖంతో కూడిన జీవితంతో రాదు. త్యాగాలతోనూ, కష్టాలతోనే అది వస్తుంది.

మెహర్ బాబా గారైతే, 'నీ అంతట నువ్వు ఎంతగా బాధల్ని వరిస్తావో అంతగా ఆధ్యాత్మికంగా ఎదుగుతావు' అనేవారు. స్వయానా ఆయన జీవితమంతా అలాగే గడిచింది మరి !

మొన్న శనివారం రాత్రి, ఆశ్రమ ప్రారంభానికి వచ్చిన 42 మందీ, ఆశ్రమస్థలంలోనే ఉన్నాం. పొలంలోని మట్టిలో టార్పాలిన్ పట్టనొకదానిని పరుచుకుని దానిపైనే రాత్రంతా పడుకున్నాం.  కొంతమంది కటికనేలమీద పొలం మట్టిలోనే పడుకున్నారు. ఎటు చూసినా జనసంచారం లేదు. దగ్గరలో ఉన్న పల్లెటూరికి పోవాలంటే 2 కి, మీ నడవాలి. కరెంట్ లేదు. వసతులు లేవు. సభ్యులందరూ ఏసీ రూములలో హాయిగా పడుకునేవారే. కానీ ఇక్కడ కనీసం ఫ్యాన్ కూడా లేదు. అయినా సరే, హాయిగా నీలాకాశం క్రింద గాలికి నిద్రించారు.  అందరికీ హాయిగా మంచి నిద్ర పట్టింది. వాళ్ళ ఇళ్లలో కూడా అంత హాయిగా నిద్రపట్టలేదని నాతో అన్నారు. పాములొస్తాయని, పురుగులు కుడతాయని, దొంగలొచ్చి దోచుకుంటారని ఏ భయమూ లేదు. ఆ కటికచీకట్లో రాత్రంతా హాయిగా నిద్రపోయారు. ఏమౌతుందో అనే ఆలోచనే రాలేదు. సేఫ్టీ గురించి చింతే లేదు. ఆడవాళ్ళందరినీ, దగ్గరలోని పల్లెటూరిలో మేము తీసుకున్న ఇంటికి వెళ్లి అక్కడ నిద్రించమని, పొద్దున్నే లేచి కార్లలో రమ్మని చెప్పాను, కానీ వాళ్ళు కూడా మాతోనే అక్కడే ఉంటామన్నారు. అలాగే ఉన్నారు కూడా.

ఆదివారం జిల్లెళ్ళమూడికి వెళ్ళినపుడు, వసుంధరక్కయ్యతో ఈ విషయాన్నీ చెబితే, ఆమె ఇలా అన్నారు.

'1960 లలో జిల్లెళ్ళమూడిలో కూడా అలాగే ఉండేది. ఏ వసతులూ లేవు. అమ్మ మాతోబాటే నేలమీదే పడుకునేది.  మేము అమ్మ చుట్టూ కటిక పొలాలలో నేలమీదనే పడుకునేవాళ్ళం. అమ్మ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు కూడా, అలాగే మట్టిలోనే నిద్రపోయేవారు. మట్టిలోనే కూచునేవారు, ఉండేవారు. అదే మట్టిని వచ్చినవాళ్ళను ప్రసాదంగా ఇచ్చేది అమ్మ'.

'ప్రస్తుతం మా పరిస్థితీ అంతే' అన్నాను.

ఒక ఆశయం కోసం తపించేవాళ్ళు సౌకర్యాలను ఎందుకు పట్టించుకుంటారు? సుఖాలే కావాలంటే హాయిగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఏసీల క్రింద ఉండవచ్చు కదా? పడుతూ లేస్తూ ఇంతదూరం వచ్చి, బేసిక్ సౌకర్యాలు కూడా లేనిచోట, ఇంత రిస్క్ చేసి అడవిలో ఉంటూ, ఒక మనిషిని ఇంతగా నమ్ముతున్నారంటే, ఇది సత్యాన్వేషణ కాకపోతే మరేమిటి?

జిల్లెళ్ళమూడి నుండి మా ఆశ్రమానికి తిరిగి వచ్చాక, రాత్రిపూట కూర్చొని మాట్లాడుతూ, మా వాళ్ళతో ఇలా చెప్పాను.

'మీ అందరూ అతిత్వరలో ఎన్నో అతీతానుభవాలను పొందబోతున్నారు. ఈరోజు నేను చెబుతున్న ఈ మాటను రికార్డ్ చేసి పెట్టుకోండి. దైవాన్ని మీరు ప్రత్యక్షంగా దర్శిస్తారు. అంతేకాదు, మిమ్మల్ని చూచి, ముందుముందు ఎంతోమంది నేర్చుకుంటారు. మన సాధనామార్గాన్ని గురించి తెలుసుకుంటారు. ధన్యులౌతారు. నన్ను నమ్మి, ఈరోజున మీరు పడుతున్న కష్టం వృధా కాదు. నా మాట నిజం కావడాన్ని అతి త్వరలో మీరు చూస్తారు,  మన ఆశ్రమంలో ముందుముందు ఎంతో సాధన జరుగుతుంది. మీరే చేస్తారు. ఇక్కడికి వచ్చినవాళ్లు ధన్యులౌతారు.'

తనకోసం ఇంతగా తపించేవారికి భగవంతుడు మాత్రం దూరంగా ఎలా ఉండగలడు? ఎంతకాలం ఉండగలడు? 

(ఇంకా ఉంది)

read more " మా ఆశ్రమం మొదలైంది - 6 (సత్యాన్వేషణ) "