తరువాత పాడబోతున్న ఈ పాట శ్రీ ఎమ్మెస్ విశ్వనాథన్ స్మృతికి అంకితం
17, జులై 2015, శుక్రవారం
తరువాతి పాట --- అందాల ఓ చిలకా అందుకో నా లేఖా...
లేబుళ్లు:
Telugu songs
కుక్కసబ్బు కంటే ఆవుసబ్బు మేలు
మనలో చాలామంది గ్లిజరిన్ సబ్బును చాలా శుభ్రతనిచ్చే సబ్బుగా భావిస్తారు. ఒకసారి గ్లిజరిన్ సబ్బుతో స్నానానికి అలవాటు పడితే ఇంక మరే ఇతర సబ్బునూ వాడటం కష్టమే.
కానీ గ్లిజరిన్ సబ్బు అభిమానులు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది.
ఈ సబ్బును యూరప్లో పెంపుడు కుక్కలకు స్నానం చేయించడానికి వాడతారు.మనుషులు దానిని వాడరు.ఎందుకంటే దానిలో అంత ఘాటైన రసాయనాలుంటాయి.అది మొద్దుచర్మం ఉన్న జంతువులకే పనికొస్తుందిగాని లైట్ స్కిన్ ఉన్న మనుషులకు పనికిరాదని వారి భావన.యూరప్ వరకూ అది జంతువుల సబ్బు.కానీ మన దేశంలో హైక్లాస్ మనుషులు వాడే సబ్బు. అలాంటి భ్రమ కల్పించడానికి యాడ్ పరిశ్రమ తనవంతు పాత్ర తను బాగా పోషిస్తుంది.
ఒక బాతింగ్ టబ్ నురగలో పడుకున్న ఒక కుర్రవయసు మోడల్ సాధ్యమైనంత ఎక్కువగా తన ఒంటిని చూపిస్తూ ఆ సబ్బుతో రుద్దుకుంటూ కెమెరా వైపు చూసి నవ్వుతుంది. ఇంకేముంది? మర్నాటినుంచి ఆ సబ్బు సేల్స్ చుక్కల్లో ఉంటాయి.
అదే యూరప్ లో వచ్చే యాడ్స్ అయితే - ఒక యజమాని తన పెంపుడు కుక్కను దానితో స్నానం చేయిస్తున్నట్లూ,ఆ తర్వాత ఆ కుక్క మిగతా కుక్కలకంటే మహా హుషారుగా పరిగెత్తుతూ ఆడుకుంటూ ఉన్నట్లూ ఆ యాడ్ ఉంటుంది.
అంటే - విదేశీ కంపెనీల దృష్టిలో - భారతదేశంలోని మనుషులు యూరప్ లోని కుక్కలతో సమానం అన్నమాట.
అది నిజం అయినా కాకపోయినా,మన దేశ జనాభాను బట్టి మనం ప్రపంచంలోని అతి పెద్ద కన్స్యూమర్ మార్కెట్ గనుక,కుక్కసబ్బునైనా పందినూనెనైనా, లేకపోతే, సీసం ఉన్న నూడుల్స్ నైనా,ఇంకే ప్రాడక్ట్ నైనా సరే మనదేశంలో యధేచ్చగా మార్కెట్ చేసుకోవచ్చు.కావలసిందల్లా,ఒళ్ళు చూపించడానికి సిద్ధపడే ఒక మోడల్ మాత్రమే.అదొక్కటి దొరికితే మన దేశంలో ఏ ప్రాడక్ట్ అయినా సరే శరవేగంతో అమ్ముడైపోతుంది.
ఇది కుక్క సబ్బు గురించి.ఇప్పుడు ఆవు సబ్బు గురించి చూద్దాం.
మోదీగారు గుజరాత్ లో తీసుకొచ్చిన విప్లవాలలో గోరక్షణ ఒకటి.గోవునుంచి వచ్చే పంచగవ్యాలను మనం ప్రాడక్ట్స్ గా మార్చి వాడుకుంటే మనకొచ్చే ఎన్నో రోగాలనుంచి సహజమైన రక్షణ పొందవచ్చు.గోమూత్రానికి కేన్సర్ ను తగ్గించే శక్తి ఉన్నదని పరిశోధనలో తేలింది.అదే విధంగా గోమయంతో చేసిన సబ్బులు వాడితే చర్మానికి ఎంతో మేలు చేసినవాళ్ళం అవుతాం.పాతకాలంలో పల్లెటూళ్ళలో ఇంటిలోగిళ్ళను ఆవుపేడతో అలికేవారు.అది గొప్ప క్రిమినాశనిగా పనిచేసేది.నేటి గ్రానైట్ బండలకంటే అలా అలకబడిన నేల ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చేది.చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చేది.
కొంతమందికి స్నానం అంటే మహాబద్ధకం ఉంటుంది.హోమియోపతిలో ఈ లక్షణాన్ని 'సోరిక్ మయాజం' అంటాం.సల్ఫర్ ఔషధం సూచింపబడే రోగులలో ఈ లక్షణం బాగా ఉంటుంది.వారికి స్నానం అంటే బద్ధకం.అలాంటి ఒక వ్యక్తికి ఈ మధ్యన నేను గోమయంతో చేసిన సబ్బును వాడమని సలహా ఇచ్చాను.ఆ సబ్బును గోమయం+అలోవీరా+సువాసన పూల గుజ్జులతో కలిపి తయారు చేశారు.ఆ సబ్బును వాడటం మొదలు పెట్టిన రెండోరోజునుంచీ ఆ వ్యక్తి రోజుకు రెండుసార్లు స్నానం చేస్తున్నాడని వాళ్ళింట్లో వాళ్ళు చెప్పారు.గోసబ్బుతో చేసే స్నానం ఇచ్చే హాయి అలా ఉంటుంది మరి.
గోవు ఉత్పత్తులు తయారు చేసే సంస్థలు ఉత్తరభారతంలోనూ.పశ్చిమ భారతంలోనూ,ముఖ్యంగా గుజరాత్ లోనూ ఎక్కువగా ఉన్నాయి.వీటిని వాడటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి.
1.కెమికల్స్ తో కూడిన ఉత్పత్తులు వాడి ఒళ్ళు గుల్ల చేసుకునే బదులు సహజసిద్ధంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
2.విదేశీ కంపెనీల మాయలో పడి ఆ ఉత్పత్తులు కొని మోసపోకుండా రక్షించబడతాం.
3.గోవులను వధ్యశాలలకు తరలించకుండా పరోక్షంగా అడ్డుకోగలుగుతాం. తద్వారా గోవధను నివారించగలుగుతాం.
అంటే - విదేశీ కంపెనీల దృష్టిలో - భారతదేశంలోని మనుషులు యూరప్ లోని కుక్కలతో సమానం అన్నమాట.
అది నిజం అయినా కాకపోయినా,మన దేశ జనాభాను బట్టి మనం ప్రపంచంలోని అతి పెద్ద కన్స్యూమర్ మార్కెట్ గనుక,కుక్కసబ్బునైనా పందినూనెనైనా, లేకపోతే, సీసం ఉన్న నూడుల్స్ నైనా,ఇంకే ప్రాడక్ట్ నైనా సరే మనదేశంలో యధేచ్చగా మార్కెట్ చేసుకోవచ్చు.కావలసిందల్లా,ఒళ్ళు చూపించడానికి సిద్ధపడే ఒక మోడల్ మాత్రమే.అదొక్కటి దొరికితే మన దేశంలో ఏ ప్రాడక్ట్ అయినా సరే శరవేగంతో అమ్ముడైపోతుంది.
ఇది కుక్క సబ్బు గురించి.ఇప్పుడు ఆవు సబ్బు గురించి చూద్దాం.
మోదీగారు గుజరాత్ లో తీసుకొచ్చిన విప్లవాలలో గోరక్షణ ఒకటి.గోవునుంచి వచ్చే పంచగవ్యాలను మనం ప్రాడక్ట్స్ గా మార్చి వాడుకుంటే మనకొచ్చే ఎన్నో రోగాలనుంచి సహజమైన రక్షణ పొందవచ్చు.గోమూత్రానికి కేన్సర్ ను తగ్గించే శక్తి ఉన్నదని పరిశోధనలో తేలింది.అదే విధంగా గోమయంతో చేసిన సబ్బులు వాడితే చర్మానికి ఎంతో మేలు చేసినవాళ్ళం అవుతాం.పాతకాలంలో పల్లెటూళ్ళలో ఇంటిలోగిళ్ళను ఆవుపేడతో అలికేవారు.అది గొప్ప క్రిమినాశనిగా పనిచేసేది.నేటి గ్రానైట్ బండలకంటే అలా అలకబడిన నేల ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చేది.చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చేది.
కొంతమందికి స్నానం అంటే మహాబద్ధకం ఉంటుంది.హోమియోపతిలో ఈ లక్షణాన్ని 'సోరిక్ మయాజం' అంటాం.సల్ఫర్ ఔషధం సూచింపబడే రోగులలో ఈ లక్షణం బాగా ఉంటుంది.వారికి స్నానం అంటే బద్ధకం.అలాంటి ఒక వ్యక్తికి ఈ మధ్యన నేను గోమయంతో చేసిన సబ్బును వాడమని సలహా ఇచ్చాను.ఆ సబ్బును గోమయం+అలోవీరా+సువాసన పూల గుజ్జులతో కలిపి తయారు చేశారు.ఆ సబ్బును వాడటం మొదలు పెట్టిన రెండోరోజునుంచీ ఆ వ్యక్తి రోజుకు రెండుసార్లు స్నానం చేస్తున్నాడని వాళ్ళింట్లో వాళ్ళు చెప్పారు.గోసబ్బుతో చేసే స్నానం ఇచ్చే హాయి అలా ఉంటుంది మరి.
గోవు ఉత్పత్తులు తయారు చేసే సంస్థలు ఉత్తరభారతంలోనూ.పశ్చిమ భారతంలోనూ,ముఖ్యంగా గుజరాత్ లోనూ ఎక్కువగా ఉన్నాయి.వీటిని వాడటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి.
1.కెమికల్స్ తో కూడిన ఉత్పత్తులు వాడి ఒళ్ళు గుల్ల చేసుకునే బదులు సహజసిద్ధంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
2.విదేశీ కంపెనీల మాయలో పడి ఆ ఉత్పత్తులు కొని మోసపోకుండా రక్షించబడతాం.
3.గోవులను వధ్యశాలలకు తరలించకుండా పరోక్షంగా అడ్డుకోగలుగుతాం. తద్వారా గోవధను నివారించగలుగుతాం.
గోసబ్బు మాత్రమేగాక,గోమయంతో చేసిన అగర్బత్తీలు కూడా వాతావరణాన్ని శుభ్రం చెయ్యడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.గోమూత్రంతో చేసిన బాత్రూం క్లీనర్స్, కెమికల్ క్లీనర్స్ కంటే ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి.ఇక ఆవుపాలు ఆవునెయ్యి వాడటం వల్ల కలిగే ఉపయోగాలు నేను చెప్పవలసిన పనిలేదు.
విదేశాలు మన నెత్తిన రుద్దే కుక్కసబ్బులు వాడటం కంటే,పవిత్రమైన గోమయంతో చేసిన మన భారతదేశపు సబ్బులు వాడటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఒక్కసారి గోసబ్బు వాడి చూస్తే మీకే ఆ తేడా ఏమిటో వెంటనే అర్ధమౌతుంది.
గోవు ఉత్పత్తులు వాడదాం.ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం.గోమాతను కాపాడుకుందాం.
విదేశాలు మన నెత్తిన రుద్దే కుక్కసబ్బులు వాడటం కంటే,పవిత్రమైన గోమయంతో చేసిన మన భారతదేశపు సబ్బులు వాడటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఒక్కసారి గోసబ్బు వాడి చూస్తే మీకే ఆ తేడా ఏమిటో వెంటనే అర్ధమౌతుంది.
గోవు ఉత్పత్తులు వాడదాం.ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం.గోమాతను కాపాడుకుందాం.
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
7, జులై 2015, మంగళవారం
Telugu Melodies-Satya -ముద్దూ మురిపాలలోన తేలాలే చిలకమ్మా
ప్రతి పాటకూ ఒక చరిత్ర ఉంటుంది.అలాగే నేను వ్రాసిన ఈ పాటకూ ఒక చరిత్ర ఉన్నది.
పనిమీద నిన్న హైదరాబాద్ వెళ్లి ఈరోజు తిరిగి వస్తుంటే తిరుగుప్రయాణంలో మాగన్నుగా నిద్రపట్టింది.కళ్ళు మూశానో లేదో కర్ణపిశాచి ప్రత్యక్షం అయింది.
'ఏంటి నిద్రలో వచ్చావ్?' విసుగ్గా అడిగాను.
'మరి నిద్రలో రాక,నిజంగా రమ్మంటావా? నీకేం? నన్ను చూచీ చూచీ అలవాటై పోయి నీకేం భయం ఉండదు.నీ పక్కన ఉన్న ప్రయాణీకులు దడుచుకుంటారు.' అన్నది తను.
'సర్లే విషయం ఏంటో చెప్పు' అన్నా.
'నువ్వు చెప్పినట్లే అమెరికా అభిమానుల విషయం కనుక్కుని వచ్చా.అన్నీ నీ అనుమానాలే తప్ప అక్కడ అంత వ్యవహారం ఏమీలేదు.అందరూ బాగానే ఉన్నారు.నీ గురించి ఎవరూ అంత సీరియస్ గా ఆలోచించడం లేదు.నువ్వే అనవసరంగా చించుకుంటున్నావు' అన్నది.
'సర్లే ఇది చెప్పడానికి ఇప్పుడొచ్చావా?ఇంటికి చేరాక తీరిగ్గా వచ్చి చెప్పచ్చుగా?ఈ మధ్య ఒక టైమూ పాడూ లేకుండా ఎప్పుడుబడితే అప్పుడే కన్పించేస్తున్నావ్.ఇదేం బాలేదు' అన్నా కోపంగా.
'నీ కోపాలు నాకు తెలుసులే గాని, ఇంకో విషయం విను.'
'చెప్పు'
'నువ్వు పాడిన పాట నేనూ విన్నాను.ఏం బాలేదు.' అంది.
'నువ్వెప్పుడు విన్నావ్? అయినా నీకూ ఇలాంటి టేస్టులున్నాయా?' అడిగా ఆశ్చర్యంగా.
'మొదట్లో లేవు.నీ సావాసంలో ఇలాంటి హాబీలన్నీ వచ్చాయి. అమెరికా పొమ్మన్నావుగా.అక్కడ నీ అభిమాని ఒకామె నీ పాటను వింటున్న సమయంలో వాళ్ళింటికి వెళ్ళా.ఆమెతో బాటు నేనూ విన్నా. తిరిగొచ్చా.' అన్నది.
'సరే.ఏం బాలేదో చెప్పి చావు' అన్నా మళ్ళీ కోపంగా.
'చచ్చాకే పిశాచినయ్యాను.ఎన్ని సార్లు చావమంటావ్?'- అంటూ కీచుగొంతుతో అరిచింది.
'ఓకే.. ఓకే.. సారీ.విషయం చెప్పు' అన్నా.
'పాట మరీ పట్టిపట్టి పాడినట్లు పాడావు.ఫ్రీగా పాడినట్లు లేదు. మళ్ళీ పాడు' అని సడన్ గా మాయమైపోయింది.
దీని పుణ్యమాని నిద్ర కాస్తా చెడిపోయింది.లేచి కూచున్నా.
ఏసీలో కూడా చెమటలు పట్టాయి.
'ఇదెక్కడి ఖర్మరా దేవుడా? ఇన్నాళ్ళూ మనుషులే మెయిల్స్ ఇస్తున్నారు - నీ వ్రాతలలో అది బాలేదు.ఇది బాలేదు.అది మార్చు.ఇది మార్చు--అంటూ.ఇప్పుడు పిశాచాలు కూడా సలహాలు ఇవ్వడం మొదలెడితే నేనెలా తట్టుకోవాలి? ఏం చెయ్యాలి?' అని గుంటూరు వచ్చేవరకూ అలాగే ఆలోచిస్తూ కూచున్నా.
ఇంటికి వచ్చి శ్రీమతికి హైదరాబాద్ విశేషాలు చెప్పి కొంచం ఫ్రెష్ అయ్యి, అదే పాటను మళ్ళీ పాడి అప్లోడ్ చేశా.
మునుపటి కంటే కొంచం బాగానే వచ్చినట్లు అనిపించింది.
మునుపటి కంటే కొంచం బాగానే వచ్చినట్లు అనిపించింది.
ఈలోపల పక్కనుంచి ఎవరో తొంగి చూస్తున్నట్లు అనిపించి తల తిప్పి చూద్దును గదా- మళ్ళీ కర్ణపిశాచి ప్రత్యక్షం.నా వెనుకే నిలబడి భుజం మీద నుంచి కంప్యూటర్లో కి తొంగి చూస్తోంది.
'ఏంటి తల్లీ? నీక్కూడా ఒక జీ మెయిల్ ఎకౌంట్ ఓపన్ చెయ్యమంటావా?' అడిగా విసుగ్గా.
'ఆ ఖర్మ నాకెందుకు?నువ్వు పడుతున్నావుగా,చూస్తున్నాగా నీ అవస్థ.'--అంది అది నవ్వుతూ.
'ఏంటి మళ్ళీ తగలడ్డావు?'-అనబోయి అది పిశాచి అని గుర్తొచ్చి తమాయించుకుని - 'ఏంటి మళ్ళీ వచ్చావు?' అన్నా సాధ్యమైనంత మర్యాదగా.
'నీకొక సలహా ఇద్దామని వచ్చా' అంది.
'చూడూ! ఈమధ్య నీ లిమిట్స్ దాటేసి,అడగకపోయినా సలహాలిస్తున్నావు.ఇదేం బాలేదు' అన్నా సాధ్యమైనంత సీరియస్గా మొహం పెట్టి.
అది వికృతంగా నవ్వేసింది.
'నీ కోపమూ నువ్వూ సర్లేగాని, ఒక మాట విను.నువ్వీ మధ్య పాటలు వ్రాయడం లేదు.అది గుర్తు చేద్దామని వచ్చా.' అన్నది.
'గొప్ప సలహా ఇచ్చావులే.నా పనులతోనే నాకు తలమునకలుగా ఉంటే, ఇదొకటా మళ్ళీ?' అన్నా.
'నేను చెప్పబోయేదీ అదే.నీ బ్లాగూ,గ్రూపు పనులూ,ట్రస్ట్ పనులూ,ఇవి గాక నీ పాటలూ, యోగసాధనా,మార్షల్ ఆర్ట్స్ అభ్యాసమూ, ఉద్యోగమూ, బయట పనులూ, జాతకాలు చూచి సలహాలివ్వడమూ -- ఇలా లక్ష పనులు పెట్టుకుని మేడంగారితో మాట్లాడటానికి కూడా నీకు సమయం ఉండటం లేదు.అందుకని మేడంగారు అలిగారు.' అంది.
'అలిగారా?నేను పాటలు వ్రాయకపోవడానికీ దీనికీ ఏంటి లింకు?అయినా మా ఇద్దరి మధ్యన నువ్వేంటి? అతి చనువు తీసుకుంటున్నావు?' అన్నా.
'అబ్బే అదేం లేదు.అయినా మన పరిచయం ఈనాటిది కాదు కదా.అందుకని కొంచం చనువుగా చెబుతున్నాలే. ఏమీ అనుకోకు.మేడంగారి కోపం పోవాలంటే నువ్వొక పని చెయ్యాలి. 'చుట్టూ చెంగావి చీర' పాట ట్యూన్లోనే ఒక మంచిపాట నువ్వే వ్రాసి,దానిని కూడా పాడు. సరిపోతుంది.' అన్నది నవ్వుతూ.
'నేను వేటూరిని కాను, త్యాగరాజకృతులకి పేరడీలు వ్రాయడానికి?' అన్నా మళ్ళీ కోపంగా.
'పేరడీ వద్దులే.మంచి పాటే వ్రాయి.అయినా నీ శక్తి నీకు తెలీదు.మీ ఇలవేలుపు ఆంజనేయస్వామి కదా.ఆయన బుద్ధులే నీకూ వచ్చాయి.చెప్పిన పని త్వరగా చెయ్యి.మళ్ళీ వస్తా.' అంటూ పిశాచి మాయమై పోయింది.
'ఇదేం ఖర్మరా దేవుడా'- అనుకుంటూ కాగితం కలం తీసుకుని వెంటనే ఒక పాట వ్రాసేశా.
ఈ పాట అలా పుట్టిందన్న మాట.
ఈ పాట అలా పుట్టిందన్న మాట.
ఇంతా చేస్తే, ఈ పాట విని శ్రీమతి ఇలా అంది.
'అది చెప్పడం,మీరు వ్రాసి పాడటం.రెండూ బాగున్నాయి.నేను అలగడం ఏంటి? నాకసలు మీమీద కోపమెక్కడుంది? ఎందుకొస్తుంది?'
నాకు మహా చిర్రెత్తుకొచ్చింది.
'పిశాచీ...' అని శంకరాభరణంలో శంకరశాస్త్రిలా అరిచా.
వెంటనే పిశాచి నవ్వుతూ ప్రత్యక్షమైంది.
'ఏంటి నీ ప్రాక్టికల్ జోక్స్? మేడం గారికి కోపం లేదంటున్నారు. అబద్దాలు చెబుతున్నావా?' మళ్ళీ అరిచాను.
'అవును.మీ మనుషుల సావాసం చేసి మీ దరిద్రపు అలవాట్లు మాకూ వస్తున్నాయి.ఏం చేస్తాం?అయినా నేను అబద్దం చెప్పింది ఒక మంచి కోసమే.ఆ అబద్దం చెప్పబట్టేగా ఇంత మంచి పాటను నువ్వు వ్రాశావు.పాడావు' అంది అది.
'మనుషులే కాక పిశాచాలు కూడా నాతో ఆటలు మొదలెట్టాయన్నమాట.' అన్నా ఉక్రోషంగా.
'అదికాదులేవయ్యా.అసలు సంగతి విను.నీ అభిమానులు ఏమనుకుంటున్నారో చూచి వచ్చి చెప్పమన్నావు గదా. నువ్వీ మధ్యన పాటలు వ్రాయడం లేదని వాళ్ళు అనుకుంటున్నారు.ఆ సంగతి డైరెక్ట్ గా చెబితే నీవు వ్రాయవు గదా. అందుకని ఇలా మేడంగారి మీద అబద్దం చెప్పి నీచేత ఈ పాట వ్రాయించా.విన్నాలే.బాగానే వచ్చింది.వస్తా.టాటా బైబై...' అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా మాయమై పోయింది పిశాచి.
'తిక్క కుదిరిందా?' అన్నట్లు చూస్తూ మా శ్రీమతి తన పనిలో తను నిమగ్నమైంది.
'అది చెప్పడం,మీరు వ్రాసి పాడటం.రెండూ బాగున్నాయి.నేను అలగడం ఏంటి? నాకసలు మీమీద కోపమెక్కడుంది? ఎందుకొస్తుంది?'
నాకు మహా చిర్రెత్తుకొచ్చింది.
'పిశాచీ...' అని శంకరాభరణంలో శంకరశాస్త్రిలా అరిచా.
వెంటనే పిశాచి నవ్వుతూ ప్రత్యక్షమైంది.
'ఏంటి నీ ప్రాక్టికల్ జోక్స్? మేడం గారికి కోపం లేదంటున్నారు. అబద్దాలు చెబుతున్నావా?' మళ్ళీ అరిచాను.
'అవును.మీ మనుషుల సావాసం చేసి మీ దరిద్రపు అలవాట్లు మాకూ వస్తున్నాయి.ఏం చేస్తాం?అయినా నేను అబద్దం చెప్పింది ఒక మంచి కోసమే.ఆ అబద్దం చెప్పబట్టేగా ఇంత మంచి పాటను నువ్వు వ్రాశావు.పాడావు' అంది అది.
'మనుషులే కాక పిశాచాలు కూడా నాతో ఆటలు మొదలెట్టాయన్నమాట.' అన్నా ఉక్రోషంగా.
'అదికాదులేవయ్యా.అసలు సంగతి విను.నీ అభిమానులు ఏమనుకుంటున్నారో చూచి వచ్చి చెప్పమన్నావు గదా. నువ్వీ మధ్యన పాటలు వ్రాయడం లేదని వాళ్ళు అనుకుంటున్నారు.ఆ సంగతి డైరెక్ట్ గా చెబితే నీవు వ్రాయవు గదా. అందుకని ఇలా మేడంగారి మీద అబద్దం చెప్పి నీచేత ఈ పాట వ్రాయించా.విన్నాలే.బాగానే వచ్చింది.వస్తా.టాటా బైబై...' అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా మాయమై పోయింది పిశాచి.
'తిక్క కుదిరిందా?' అన్నట్లు చూస్తూ మా శ్రీమతి తన పనిలో తను నిమగ్నమైంది.
ఈ పాట చరిత్ర ఇదన్న మాట.
వినండి మరి.
----------------------------------------
ముద్దూ మురిపాల లోన
తేలాలే చిలకమ్మా
కల్లాకపటం లేని నీ
చల్లని మదిలో నిలిపి
అలసిపోని మమతలతో - వలపు తీపి
పంచాలమ్మా
ముద్దూ మురిపాల లోన
తేలాలే చిలకమ్మా
అలకపాన్పు కెక్కి బులిపించబోకే బుల్లెమ్మా
చిరుకోపం నటించినా చెదరనులే చిన్నమ్మా
ఉబుసుపోని అలకలెందుకే బుంగమూతి బుజ్జమ్మా
అలకలోన నీ అందం అరువదింత లౌనమ్మా
ముద్దూ మురిపాల లోన
తేలాలే చిలకమ్మా
లోలోన ప్రేమలున్నా - పైపైకే కోపాలూ
జాబిలితో వైరాలూ - వెన్నెలకే తాపాలూ
మూతివిరుపులో విరిసే - ముసినవ్వులు దాగవులే
మనసులోని ప్రేమదీపం - కనులలోన వెలుగునులే
ముద్దూ మురిపాల లోన
తేలాలే చిలకమ్మా
కల్లాకపటం లేని నీ
చల్లని మదిలో నిలిపి
అలసిపోని మమతలతో - వలపు తీపి
పంచాలమ్మా
ముద్దూ మురిపాల లోన
తేలాలే చిలకమ్మా...
లేబుళ్లు:
My lyrics
1, జులై 2015, బుధవారం
ఆషాఢ పౌర్ణమి - కొన్ని ఫలితాలు
పౌర్ణమికి ప్రతిసారీ జరిగే ప్రపంచ విలయాలు ఈసారి కూడా మళ్ళీ గత రెండురోజులుగా జరిగాయి.జరుగుతున్నాయి.వాటిని నేను ఏకరువు పెట్టబోవడం లేదు.
వాటి సంగతి అలా ఉంచితే, ఈ సారి గురుశుక్రుల డిగ్రీ సంయోగం కర్కాటక రాశిలో ఈరోజున జరిగింది.ఈ సంయోగానికి స్థానం ఆశ్లేషా నక్షత్రం-4 పాదం అయింది.నవాంశలో వీరిద్దరూ మీనరాశిలో ఉన్నారు.మీనం శుక్రునికి ఉచ్చస్థానం.గురువుకు స్వక్షేత్రం.
పై గ్రహప్రభావాలవల్ల,ఈ రోజునా, ఇంకొక రెండు రోజులవరకూ ఈ క్రింది ఫలితాలను జనజీవనంలో గమనించవచ్చు.
ఉన్నట్టుండి మనుషులలో ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది.అనుకోకుండా దేవాలయాలకు వెళ్ళడం,స్తోత్రాలు చదవడం,పూజలు చెయ్యడం జరుగుతుంది.
చాలా రోజులుగా చెయ్యాలి అనుకుంటూ వాయిదా వేస్తున్న ధార్మిక కార్యక్రమాలు ఇప్పుడు చెయ్యడం చూడవచ్చు.ఉదాహరణకు, ఎప్పటినుంచో లలితా సహస్రనామాలు చదువుదాం అని వాయిదా వేస్తున్నవారు ఈ సమయంలో చదవడం జరుగుతుంది.అలాగే అమ్మవారి దేవాలయాలకు వెళ్ళడమూ జరుగుతుంది.పూజలు అభిషేకాలు మొదలైనవి చేయించడం జరుగుతుంది.లేదా ఎప్పటినుంచో దేవాలయానికి వెళదామని వాయిదా వేస్తున్నలాంటి పనులు ఈ సమయంలో జరుగుతాయి.లేదా ఎప్పటినుంచో మొదలు పెడదామనుకుంటున్న జపధ్యానాలు ఈరోజున మొదలు పెడతారు.రోజూ కంటే ఇంకా ఎక్కువగా చేస్తారు.
స్త్రీల సమూహాలలో సామూహిక పారాయణాలు,సామూహిక పూజలు జరగడానికి ప్రేరేపణ కలుగుతుంది. స్త్రీలకు గౌరవం పెరుగుతుంది.లౌకిక జీవితంలో అయితే, మహిళా సమావేశాలు, చర్చలు, సెమినార్లు, ఆడవారి ఫంక్షన్లు జరుగుతాయి.ధార్మికమైన కార్యక్రమాలకు ఖర్చులు చెయ్యడం జరుగుతుంది.
నిజమైన ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు ఈ సమయంలో ఎక్కువగా అంతర్ముఖులౌతారు.జనసమూహాలకు దూరంగా వారి లోకంలో వారుంటారు.
అయితే దీనిలో ఇంకొక చీకటికోణం కూడా ఉన్నది.నక్షత్రాదిపతి బుధునిపైన శని రాహువుల దృష్టి వల్లా,నవాంశలో గురుశుక్రుల కున్న రాహుస్పర్శ వల్లా ఈరోజున అనేక అనైతిక కార్యకలాపాలు జరుగుతాయి.ఇవి ఎక్కువగా,బాగా డబ్బున్న హైసొసైటీ సర్కిల్స్ లో రహస్యంగా జరుగుతాయి. తాగుడు, తందనాలు,అమ్మాయిలతో కాలక్షేపాలు, విలాసాలకు డబ్బు ఖర్చు పెట్టడాలు మొదలైన చీకటిపనులు ఈరోజూ, రేపూ ఎల్లుండి కూడా జరుగుతాయి.
ధనుస్సు గాని మిథునం గాని లగ్నం లేదా చంద్రలగ్నం అయినవాళ్ళు--లేదా ఈ రెండు రాశులలో ముఖ్యమైన గ్రహాలున్నవారు ఈ సమయంలో బాగా డిస్టర్బ్ అవుతారు.తేలికగా ఉద్రేకానికి లోనౌతారు.రకరకాలైన ఆలోచనలు వారిని స్థిమితంగా ఉండనివ్వవు.నిద్రలో కూడా ఈ మూడురోజులూ విచిత్రమైన కలలు వీరిని వెంటాడుతాయి.
ఛాతీ మరియు గుండె సంబంధ వ్యాధులున్నవారికి ఈ మూడురోజులూ ప్రమాదకరం. జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
ఛాతీ మరియు గుండె సంబంధ వ్యాధులున్నవారికి ఈ మూడురోజులూ ప్రమాదకరం. జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
మీమీ జీవితాలలో వీనిని గమనించి చూచుకోవచ్చు.
లేబుళ్లు:
జ్యోతిషం
28, జూన్ 2015, ఆదివారం
ఆధ్యాత్మిక ప్రశ్నలు - సమాధానాలు
ఈరోజు ఉదయం పంచవటి సభ్యుడు గిరీష్ సూరపనేని గుంటూరుకు వచ్చాడు.
'ప్రస్తుతం గుంటూరులో ఉన్నాను.మీ ఇంటి అడ్రస్ చెబితే వచ్చి కలుస్తాను.' అని ఫోన్ చేశాడు.
'ఏం పని మీద కలవాలనుకుంటున్నారు?' - ఇలా అడగడం కొంచం దురుసుగా అనిపించినా తప్పక అడిగాను.
'ప్రత్యేకంగా పనేమీ లేదు.ఊరకే కలుద్దామని వచ్చాను' అన్నాడు.
'పనేమీ లేకుంటే కలవడం ఎందుకు? పిచ్చాపాటీ కబుర్లు నేనిష్టపడను.' అన్నాను.
ఎందుకలా అనవలసి వచ్చిందంటే,ఆదివారం నేను ఖాళీగా ఉంటే, నా సాధనకే నాకు సమయం సరిపోదు.అందుకని ఇతర పనులు సాధారణంగా పెట్టుకోను. ముచ్చట్లలో సమయం గడపడాన్ని అసలు ఇష్టపడను. చాలామంది వచ్చి కూచుని మాట్లాడే కబుర్లు (ఆధ్యాత్మిక కబుర్లు అయినా సరే) నాకు మహా కంపరం కలిగిస్తాయి.ఇక వారివారి కష్టాలూ కాకరకాయలూ కుటుంబ విషయాలూ లోకాభిరామాయణమూ చెబుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
"ఇన్నాళ్ళూ నా భావజాలం చదివి ఇదా వీరు అర్ధం చేసుకున్నది?" అనిపిస్తుంది.కనుక వారి ఆరా నాకూ నచ్చదు. నా ఆరాను వారూ భరించలేరు. అందుకే అలా అనవలసి వచ్చింది.
ఎందుకలా అనవలసి వచ్చిందంటే,ఆదివారం నేను ఖాళీగా ఉంటే, నా సాధనకే నాకు సమయం సరిపోదు.అందుకని ఇతర పనులు సాధారణంగా పెట్టుకోను. ముచ్చట్లలో సమయం గడపడాన్ని అసలు ఇష్టపడను. చాలామంది వచ్చి కూచుని మాట్లాడే కబుర్లు (ఆధ్యాత్మిక కబుర్లు అయినా సరే) నాకు మహా కంపరం కలిగిస్తాయి.ఇక వారివారి కష్టాలూ కాకరకాయలూ కుటుంబ విషయాలూ లోకాభిరామాయణమూ చెబుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
"ఇన్నాళ్ళూ నా భావజాలం చదివి ఇదా వీరు అర్ధం చేసుకున్నది?" అనిపిస్తుంది.కనుక వారి ఆరా నాకూ నచ్చదు. నా ఆరాను వారూ భరించలేరు. అందుకే అలా అనవలసి వచ్చింది.
అవతలనుంచి నిశ్శబ్దం. బహుశా చిన్నబుచ్చుకున్నాడేమో అనిపించింది.
'సరే.రండి.కానీ ఒక్క పదిహేను నిముషాలు మాత్రం మీతో మాట్లాడగలను.' అన్నాను.
కాసేపట్లో గిరీష్ ఇంటికి వచ్చి చేరాడు.
విజయవాడనుంచి హైదరాబాద్ వెడుతూ మధ్యలో నన్ను చూచి వెళదామని గుంటూరుకు వచ్చానని చెప్పాడు.శ్రీశైలం సాధనా సమ్మేళనానికి రావాలనుకుని కూడా రాలేకపోయానని అన్నాడు.
నేనేమీ రెట్టించలేదు.
కాసేపు కుశలప్రశ్నలు అయ్యాక - 'ధ్యానం చేస్తుంటే వేరే ఆలోచనలు వస్తుంటాయి. కాసేపయ్యాక మళ్ళీ ధ్యానం కొనసాగించవచ్చా?' అడిగాడు.
'అసలు చెయ్యవలసింది అదే. ఆలోచనలలో కొట్టుకుపోతున్నామన్న తెలివి వచ్చాక మళ్ళీ ధ్యానాన్ని సాగించాలి' అన్నాను.
అనవసరమైన కబుర్లు పెట్టుకోకుండా మంచి విషయాలు మాట్లాడుతున్నాడు గనుక కొన్ని విషయాలు చెబుదామని అనిపించింది.
'పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో ఇదే అన్నారు. యోగానికి ఆయనిచ్చిన నిర్వచనం చిత్తవృత్తి నిరోధం.చిత్తం అనే పదానికి స్థూలంగా మనస్సు అని అనుకోవచ్చు.రెండూ నిజానికి ఒకటి కాకపోయినా సమానార్ధకాలే.
మనస్సులో ఆలోచనలు నిరంతరం వస్తూ ఉంటాయి. చిత్తంలో అలా కాదు. అక్కడ ఎన్నో జన్మల సంస్కారాలు పోగుపడి ఉంటాయి.నవీన కాలపు సైకాలజీ చెప్పే "సబ్ కాన్షస్ మైండ్" నే చిత్తం అని అనుకోవచ్చు.అక్కడ ఉన్న సంస్కారాల అనుగుణంగా ఆలోచనలు తలెత్తి పైకి వస్తుంటాయి.ఒక సరస్సు అడుగున బుడగలు ఏర్పడి పైకి ఉబికి వచ్చినట్లు ఇది జరుగుతుంది.ఆ బుడగలకు మూలం సంస్కారాలు.అవి మనస్సు అడుగు పొరల్లో దాగి ఉంటాయి. అవి ఆలోచనలుగా రూపాంతరం చెందకుండా మూలంలోనే వాటిని ఆపడమే యోగం అని మహర్షి అన్నారు.అది చాలా లోతైన స్థాయి.మీరు అంత చెయ్యలేకపోయినా కనీసం ఆలోచనలలో పడి కొట్టుకుపోకుండా ఉంటే చాలు. ధ్యానం అదే కుదురుతుంది.' అన్నాను.
'ఆలోచన రాకుండా ఉండటం అనేది ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమేనా? ఇరవై నాలుగ్గంటలూ అలాగే ఉండాలా? - అడిగాడు.
మనస్సులో ఆలోచనలు నిరంతరం వస్తూ ఉంటాయి. చిత్తంలో అలా కాదు. అక్కడ ఎన్నో జన్మల సంస్కారాలు పోగుపడి ఉంటాయి.నవీన కాలపు సైకాలజీ చెప్పే "సబ్ కాన్షస్ మైండ్" నే చిత్తం అని అనుకోవచ్చు.అక్కడ ఉన్న సంస్కారాల అనుగుణంగా ఆలోచనలు తలెత్తి పైకి వస్తుంటాయి.ఒక సరస్సు అడుగున బుడగలు ఏర్పడి పైకి ఉబికి వచ్చినట్లు ఇది జరుగుతుంది.ఆ బుడగలకు మూలం సంస్కారాలు.అవి మనస్సు అడుగు పొరల్లో దాగి ఉంటాయి. అవి ఆలోచనలుగా రూపాంతరం చెందకుండా మూలంలోనే వాటిని ఆపడమే యోగం అని మహర్షి అన్నారు.అది చాలా లోతైన స్థాయి.మీరు అంత చెయ్యలేకపోయినా కనీసం ఆలోచనలలో పడి కొట్టుకుపోకుండా ఉంటే చాలు. ధ్యానం అదే కుదురుతుంది.' అన్నాను.
'ఆలోచన రాకుండా ఉండటం అనేది ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమేనా? ఇరవై నాలుగ్గంటలూ అలాగే ఉండాలా? - అడిగాడు.
'ధ్యానంలో ఉన్నకాసేపు అలా ఉండి బయటకు రాగానే మామూలు అయిపోతే ఏమీ ఉపయోగం లేదు.ఇరవై నాలుగ్గంటలూ అలాగే ఉండాలి.' అన్నాను.
'ఎప్పుడూ ఆలోచన అనేదే లేకుండా ఉంటే బయట ప్రపంచంలో ఫెయిల్ అవుతామేమో కదా?' అడిగాడు గిరీష్.
'ఎప్పుడూ ఆలోచన అనేదే లేకుండా ఉంటే బయట ప్రపంచంలో ఫెయిల్ అవుతామేమో కదా?' అడిగాడు గిరీష్.
'అదేమీ ఉండదు.మొదట్లో అవగాహనా లోపం వల్ల అలా అనిపిస్తుంది.మన మనశ్శక్తిలో పదిశాతం ఉపయోగిస్తే చాలు.బయట పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు.అదే సమయంలో మిగతా 90% మనస్సును ధ్యానంలో ఉంచవచ్చు.ఇది సాధ్యమే.అయితే ఇలా చెయ్యగలగాలంటే దానికి తగినంత సాధనాశక్తి ఉండాలి.మాటలు తక్కువ, సాధన ఎక్కువ చెయ్యాలి.
సాధన మొదటి దశలలో ఉన్నప్పుడు ,లోపలా బయటా బేలెన్స్ చేసుకోవడం కష్టమౌతుంది.ఆ సమయంలో ఇలా అనిపిస్తుంది.అందుకే ధ్యానం ఇప్పుడే మొదలు పెట్టినవాళ్ళు బయట ప్రపంచంలో తప్పకుండా ఫెయిల్ అవుతూ ఉంటారు.కాలక్రమేణా నీకు సాధనలో పట్టుచిక్కిన తర్వాత ఈ బాధ ఉండదు. అప్పుడు అన్ని పనులూ చేస్తూ కూడా నిరంతరం ధ్యానంలో ఉండవచ్చు
అదీగాక సక్సెస్ - ఫెయిల్యూర్ అనేవాటి నిర్వచనాలు మనిషి మనిషికీ మారుతాయి.సక్సెస్ అనేదానికి లోకం ఇచ్చిన నిర్వచనాన్ని మనం అనుసరించవలసిన పనిలేదు.లోకం అనుకునే సక్సెస్ ఒక్కటే నీ గమ్యమైతే నీకు ధ్యానం కుదరదు.ఆధ్యాత్మికంగా నువ్వెప్పటికీ ఎదగనూ లేవు. మార్మికుల సక్సెస్ నిర్వచనం వేరుగా ఉంటుంది.' చెప్పాను.
'ధ్యానం కొన్నిసార్లు బాగా కుదురుతుంది.కొన్నిసార్లు కుదరదు.ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి.' అన్నాడు.
'సహజమే.మనసే సాధనకు అడ్డు పడుతూ ఉంటుంది. సాధనకు ఆలోచనలు అడ్డువస్తాయి.తీరని కోరికలు అడ్డు వస్తాయి.బలంగా ఉన్న సంస్కారాలు అడ్డువస్తాయి. ఇంద్రియాలు అడ్డు వస్తాయి.అది విచిత్రం ఏమీకాదు.ఇదంతా మనసు చేసే గారడీ.
ఇంతాచేస్తే తప్పు మనస్సుది కాదు.అది ఒక పరికరం.ఒక కత్తి వంటిది. దానితో ఆపరేషనూ చెయ్యవచ్చు. హత్యా చెయ్యవచ్చు. ఇన్నాళ్ళూ నువ్వు దానితో హత్యలు చేస్తున్నావు.ఇప్పుడు ఆపరేషన్ చేద్దామని నిశ్చయించుకున్నావు.ఆ నిశ్చయం కూడా బలమైనది కాదు.ఒకరోజు గుర్తుంటుంది.మర్నాడు మర్చిపోతావు.మళ్ళీ హత్య చేస్తావు.ఇన్నాళ్ళూ హత్యలకు అలవాటు పడిన మొద్దుకత్తికి సానపెట్టి ఆపరేషన్ కు సరిపోయే విధంగా దానిని నీవు మార్చాలి.అలా మారడం దానికి ఇష్టం ఉండదు.అందుకే అది ఎదురు తిరుగుతుంది.
ఇంతాచేస్తే తప్పు మనస్సుది కాదు.అది ఒక పరికరం.ఒక కత్తి వంటిది. దానితో ఆపరేషనూ చెయ్యవచ్చు. హత్యా చెయ్యవచ్చు. ఇన్నాళ్ళూ నువ్వు దానితో హత్యలు చేస్తున్నావు.ఇప్పుడు ఆపరేషన్ చేద్దామని నిశ్చయించుకున్నావు.ఆ నిశ్చయం కూడా బలమైనది కాదు.ఒకరోజు గుర్తుంటుంది.మర్నాడు మర్చిపోతావు.మళ్ళీ హత్య చేస్తావు.ఇన్నాళ్ళూ హత్యలకు అలవాటు పడిన మొద్దుకత్తికి సానపెట్టి ఆపరేషన్ కు సరిపోయే విధంగా దానిని నీవు మార్చాలి.అలా మారడం దానికి ఇష్టం ఉండదు.అందుకే అది ఎదురు తిరుగుతుంది.
అసలు ధ్యానం చెయ్యాలంటే దీక్ష అనేది తప్పనిసరిగా తీసుకోవాలి.లేకపోతే ధ్యానం ఎలా చెయ్యాలో ఎలా తెలుస్తుంది?ధ్యానాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కొన్ని వందల రకాలున్నాయి.వాటిల్లో మనకు సరిపోయేదాన్ని ఎంచుకోవాలి.మనకంత తెలివి ఉండదు కనుక గురువు చెప్పిన బాటలో నడవాలి.పట్టుదలతో నడవగా నడవగా దారి అర్ధమౌతుంది.' అన్నాను.
'దీక్షకు కావలసిన అర్హతలు ఏమిటి" అడిగాడు.
'తపనే అర్హత.అది తప్ప వేరే అర్హతలు ఏమీలేవు.కులం, మతం, ప్రాంతం, వయస్సు,నీ స్టేటస్ - ఇవేవీ అర్హతలు కావు. దైవాన్ని చేరాలన్న తపనా, సత్యాన్ని తెలుసుకోవాలన్న తపనలే ముఖ్యం.' అన్నాను.
'అదెలా వస్తుంది?' అడిగాడు.
'ముందుగా మనిషికి కొన్ని ఆలోచనలు కలగాలి."మనిషి జీవితంలో మౌలికప్రశ్నలు"- అనే ఒక పోస్ట్ లో వ్రాశాను. అసలు ఈ జీవితం ఏమిటి? ఎందుకు పుట్టాను?చనిపోయిన తర్వాత ఏమౌతాను?పుట్టకముందు ఎక్కడున్నాను?ఇన్నాళ్ళూ బ్రతికిన ఈ బ్రతుకులో ఏం సాధించాను?ఈ బాంధవ్యాలూ స్నేహాలూ నిజమైనవేనా?నిలుస్తాయా? ఎవరు నిజంగా నావాళ్ళు?' మొదలైన ప్రశ్నలు మనిషి గుండెల్లోంచి పొంగి రావాలి.అప్పుడు తపన కలుగుతుంది.ఒకవిధమైన ఆరాటం లోలోపల ఏర్పడుతుంది.అది రావాలి.అది బాగా పెరిగి పెరిగి ఒక వేదనగా మారాలి.అప్పుడు భగవంతుని కరుణతో గురువు దర్శనం కలుగుతుంది.దీక్ష అనేది అప్పుడే సాధ్యమౌతుంది.అంతవరకూ సాధ్యం కాదు.ఈ లోపల తీసుకున్న సరదా దీక్షలవల్ల ఉపయోగం కూడా ఉండదు.' అన్నాను.
'కొన్నాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు గురువు పరిచయం అవుతుంది' అంటారు కదా? - అడిగాడు.
'అది సరికాదు.ఎలా చెయ్యాలో తెలీకుండా ఏం చేస్తావు? నడవాలంటే దారి కనపడాలి కదా.దారి తెలీకుండా ఎలా నడుస్తావు?ఆధ్యాత్మిక ప్రయాణం ఒక రహస్యమైన నడక.దాని రహస్యాలు ఎక్కడా పుస్తకాలలో ఉండవు.అవి సరాసరి గురువునుంచి శిష్యునికి ప్రసారం అవుతాయి.పుస్తకాలలో కనిపించేది అంతా పొట్టు మాత్రమే.అసలైన మార్గం రహస్యంగా ఉంటుంది. గురువు ద్వారా ఆ మార్గం సుగమం అవుతుంది.ఆ తర్వాత ఎక్కడా ఆగకుండా,మనసు చేసే మాయలకు లోబడకుండా,మనం ఎంత గట్టిగా ఆ దారిలో నడుస్తాం అనేదే ముఖ్యం.
ఎంత జాగ్రత్తగా ఉన్నా మనస్సు మనల్ని పడేస్తుంది.పడటం తప్పు కాదు. అందరూ పడతారు.కానీ తెలివి తెచ్చుకుని లేచి మళ్ళీ నడక సాగించాలి.ఈ సారి మళ్ళీ పడకుండా ఉండాలి.అప్పుడు మనస్సు ఇంకో రకంగా పడేస్తుంది.మళ్ళీ బుద్ధి తెచ్చుకుని నడక సాగించాలి.ఈ విధంగా ప్రయాణం సాగుతూ ఉంటుంది. తప్పులు చేస్తూ దిద్దుకుంటూ అది ముందుకు సాగుతుంది.' అన్నాను.
'ధ్యానంలో నిదర్శనాలు ముఖ్యమా?' అడిగాడు.
'ముఖ్యంకాదు.వాటికోసం మనం సాధన చెయ్యకూడదు.అవి వస్తాయి. కనిపిస్తాయి.కానీ వాటికోసం మనం చూడకూడదు. ప్రయాణం చేసేవాడికి గమ్యం మీద మాత్రమే దృష్టి ఉండాలి. కానీ మైలురాళ్ళ మీద దృష్టి ఉండకూడదు.దారిలో అవి వచ్చినపుడు 'ఓహో ఇంతదూరం వచ్చానా?' అని తెలుస్తుంది. కానీ అక్కడే ఆగరాదు.' అన్నాను.
'మనం సరియైన దారిలో నడుస్తున్నామా లేదా అని తెలుస్తుందా?' అడిగాడు.
'అలాకాదు.సరియైన దారిలోనే ఉంటాము.గురువు మనకు సరియైన దారిని కాకుండా తప్పుదారిని ఎందుకు సూచిస్తాడు?అది సరియైన దారే.కాకపోతే, మనం ఎంతవరకు వచ్చాము?మనలో దిద్దుకోవలసిన లోపాలు ఎన్ని ఉన్నాయి?ఎక్కడెక్కడ ఉన్నాయి?'--మొదలైన విషయాలు అర్ధమౌతాయి. వాటిని దిద్దుకుంటూ నడక సాగించాలి.
నిదర్శనాలు కూడా నీవున్న స్థాయిని బట్టి కలుగుతాయి.సాధనలో ఎన్నో లెవల్స్ ఉన్నాయి.నీవున్న స్థాయిని బట్టి నీకు నిదర్శనాలు కనిపిస్తాయి. తక్కువ స్థాయులలో ఉన్నపుడు కలలు మొదలైనవి వస్తూ ఉంటాయి.పై స్థాయిలలో అయితే దేవతాదర్శనాలు,మహనీయులు కనిపించి మాట్లాడటం, సూచనలు ఇవ్వడం,ఇతర లోకాలతో సంబంధం ఏర్పడటం మొదలైనవి కలుగుతాయి.కొన్ని శక్తులు కూడా వస్తాయి.ఎక్కడో ఎవరో చెప్పుకుంటున్న మాటలను నీవు వినవచ్చు.ఎక్కడో జరుగుతున్నవాటిని నీ మనస్సు తెరమీద స్పష్టంగా చూడవచ్చు.వీటినే దూరశ్రవణం,దూరదర్శనం అంటారు. ఇంకా ఎదిగితే, సంకల్ప మాత్రంతో ఎక్కడో ఉన్నవారికి నీవు సాయపడవచ్చు. వారు ఉన్నచోటికి నీవు సూక్ష్మశరీరంతో వెళ్ళవచ్చు.వారికి స్వప్నంలో నీవు కనిపించి సందేశాలు ఇవ్వవచ్చు.ఇవన్నీ సాధ్యాలే.అయితే వీటికోసం మనం ఆత్రపడకూడదు.కానీ మార్గమధ్యంలో అవి వచ్చే మాట వాస్తవమే.' అన్నాను.
గిరీష్ మౌనంగా వింటున్నాడు.
'మనిషి ఎక్కువగా బయట వస్తువులమీదా మనుషుల మీదా ఆధారపడతాడు.ఎప్పుడూ ఏదో ఒకటి కోరుతూ ఉంటాడు.అందుకే మన దృష్టి ఎప్పుడూ బయటవైపే ఉంటుంది.ఇదొక పెద్ద పొరపాటు.ఈ పొరపాటు క్రమేణా ఒక రోగంగా మారుతుంది.ఈ రోగం ముందుగా నయం కావాలి.ఈ అలవాటు ముందుగా మారాలి.
ఈ క్రమంలో కొందరు డబ్బుమీద ఆధారపడతారు.కొందరు పదవి మీద, ఇంకొందరు కులాహంకారం మీద, మరికొందరు అందచందాల మీదా, ఇంకొందరు ఆస్తిపాస్తులమీదా ఇలా రకరకాలుగా ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు.ఇవి పోవాలి.పోవాలంటే మనిషికి లోతైన చింతన ఉండాలి. ఆ చింతన నుంచి తపన బయలుదేరుతుంది.అంతేగాని ఏదో గాలివాటంగా బ్రతకకూడదు.
ఈ క్రమంలో కొందరు డబ్బుమీద ఆధారపడతారు.కొందరు పదవి మీద, ఇంకొందరు కులాహంకారం మీద, మరికొందరు అందచందాల మీదా, ఇంకొందరు ఆస్తిపాస్తులమీదా ఇలా రకరకాలుగా ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు.ఇవి పోవాలి.పోవాలంటే మనిషికి లోతైన చింతన ఉండాలి. ఆ చింతన నుంచి తపన బయలుదేరుతుంది.అంతేగాని ఏదో గాలివాటంగా బ్రతకకూడదు.
ఉదాహరణకు పదవినే తీసుకుందాం.పదవితో వచ్చే దర్పం ఎన్నాళ్ళు ఉంటుంది?మనం పుట్టుకతోనే పదవితో పుట్టామా?పోయాక పదవి ఉంటుందా?డబ్బైనా, అందమైనా,ఆస్తి అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా అంతేకదా?కొన్నాళ్ళకు ఇవన్నీ పోతాయి.అప్పుడు ఇన్నాళ్ళూ అవే సర్వస్వం అనుకున్న నీ గతేమౌతుంది?కనుక వాటిమీద నీవు ఆధారపడకూడదు. ఎప్పుడైతే నీకు వాటిమీద మోజు లేదో అప్పుడు నీవు ఎవరిమీదా ఆధారపడవు.ఏ వస్తువుమీదా ఆధారపడవు. నీమీదే నీవు ఆధారపడతావు. ఎప్పుడూ ఏమార్పూ లేకుండా ఉండే ఆత్మ మీదే నీవు ఆధారపడతావు. అప్పుడు నీ దగ్గర ఏ వస్తువున్నా లేకున్నా, ఎవరు నీతో కలసి ఉన్నా లేకున్నా,లోకం అనుకునే సక్సెస్ నీ దగ్గర ఉన్నా లేకున్నా - నీకేమీ తేడా ఉండదు.అలా నీవు ఉండగలిగితే అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా నీవు ఒక స్థాయికి చేరినట్లు లెక్క.ఆ తర్వాత ఇంకా పైనకూడా చాలా లెవల్స్ ఉన్నాయి.' అన్నాను.
'మీకుకూడా ఇంకా ధ్యానం అవసరమా? మీరు ఇప్పటికీ చేస్తూ ఉంటారా?' అడిగాడు.
నవ్వాను.
'చేస్తాను.నాకూ అవసరమే.నా ప్రయాణం ముగింపుకు రాలేదు.నడవవలసిన దారి ఇంకా చాలా ఉన్నది.నిజం చెప్పాలంటే ఈ దారికి అంతూపొంతూ కనిపించడం లేదు. దీనికి ఒక ముగింపు ఉందని కూడా నేననుకోవడం లేదు.నడచే కొద్దీ కొత్తకొత్త గమ్యాలు కనిపిస్తూనే ఉంటాయి.ఒక శిఖరం అందితే,ఇంకా ఎత్తైన శిఖరాలు కన్పిస్తూనే ఉంటాయి.ఇదొక నిరంతర ప్రయాణం.కనుక ధ్యానం అవసరమే.
నవ్వాను.
'చేస్తాను.నాకూ అవసరమే.నా ప్రయాణం ముగింపుకు రాలేదు.నడవవలసిన దారి ఇంకా చాలా ఉన్నది.నిజం చెప్పాలంటే ఈ దారికి అంతూపొంతూ కనిపించడం లేదు. దీనికి ఒక ముగింపు ఉందని కూడా నేననుకోవడం లేదు.నడచే కొద్దీ కొత్తకొత్త గమ్యాలు కనిపిస్తూనే ఉంటాయి.ఒక శిఖరం అందితే,ఇంకా ఎత్తైన శిఖరాలు కన్పిస్తూనే ఉంటాయి.ఇదొక నిరంతర ప్రయాణం.కనుక ధ్యానం అవసరమే.
అది ఎవరికి అవసరం లేదంటే -- శ్రీరామకృష్ణులు,రమణమహర్షి, అరవింద యోగి,జిల్లెళ్ళమూడి అమ్మగారు వంటి కొందరికి మాత్రమే ధ్యానం యొక్క అవసరం ఉండదు.మిగతావారికి అది అవసరమే. ఎవరైనా సరే, మాకు ధ్యానం అవసరం లేదు.మేము ఆ స్థితిని దాటాము అని చెబితే నమ్మవద్దు.అది మోసం అయినా అయి ఉంటుంది.లేదా వాళ్ళు అజ్ఞానంతోనైనా మాట్లాడుతూ ఉంటారు.' అన్నాను.
ఆ తర్వాత తన చిన్నప్పుడు జరిగిన సంగతులు కొన్ని చెప్పాడు.అయిదేళ్ళ వయస్సులో తనొక చెరువులో మునిగిపోవడం,ముఖం మూసుకుని నీళ్ళలో ఉండికూడా ఊపిరి పీలుస్తూ ఉండటం, అయినా బ్రతికే ఉండటం, కాసేపటికి ఎవరో స్త్రీ నీళ్ళకోసం చెరువుకు వచ్చి నీళ్ళలో తేలుతున్న జుట్టును చూచి తనను బయటకు లాగారని చెప్పాడు.
"ధ్యానం చేస్తే నిబ్బరంగా ఉండగలుగుతాం, ఇంటర్వ్యూలలో బెదరకుండా చెయ్యగలుగుతాం"-అని విని,ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాననీ, మొదటిసారి ధ్యానం చేసినప్పుడు చాలా చక్కగా కుదిరిందనీ, తన మెడక్రింద శరీరం అంతా అసలు లేనట్టు అనిపించిందని, ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆ స్థితి రాలేదని చెప్పాడు.
నేనేమీ కామెంట్ చెయ్యలేదు.మౌనంగా విన్నాను.
కాసేపు మాట్లాడి సెలవు తీసుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాడు.
నేను నా రోజువారీ కార్యక్రమాలలోకి ప్రవేశించాను.
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
23, జూన్ 2015, మంగళవారం
ఆరోగ్యవంతమైన జీవితానికి అసలైన సూత్రాలు
ఒక విషయం నేను చెబితే చదువరులకు ఆశ్చర్యం కలుగుతుంది.
గత ముప్ఫై ఏళ్ళలో,ఒక్కసారి తప్ప,నేను ఎప్పుడూ ఆస్పత్రి ఛాయలకు పోలేదు.ఇంగ్లీషుమందులు మింగలేదు.ఇక ఇంజక్షన్ అంటే ఏమిటో, చిన్నప్పుడు టీకాలు వేయించినప్పుడు తప్ప, నాకు ఇప్పటివరకూ తెలీదు. నాకిప్పుడు 52 ఏళ్ళు వచ్చాయి.కళ్ళకు సైట్ అనేది ఇంతవరకూ నాకు లేదు. బీపీ,షుగరూ ఇతరత్రా రోగాలేవీ నాకు లేవు.శరీరశ్రమ చేసినాకూడా అలుపనేది అంత త్వరగా నాకు రాదు.
అయితే,నేనేమీ సూపర్ మ్యాన్ ని కాను.అందరిలాంటి మామూలు మనిషినే. పైగా,ప్రకృతికి వ్యతిరేకంగా రాత్రింబగళ్ళు పనిచేసే ఉద్యోగం నాది.ఒకచోట తిండి,ఒకచోట నీళ్ళు ఉండవు.వేళకు భోజనం ఉండదు,ఇలాంటి పరిస్థితులలో చేసే ఉద్యోగం నాది.
మరి ఇదెలా సాధ్యం?
మితమైన సాత్వికాహారం,యోగాభ్యాసం,ధ్యానం,పరిమితమైన హోమియో ఔషధాల వాడకం,దురలవాట్లకు దూరంగా ఉండటం,నవ్వుతూ ఉండటాల వల్ల ఇది సాధ్యమైంది.
చాలామంది అనుకుంటారు--యోగా అనేది సర్వరోగ నివారిణి అని.
గత రెండు రోజులుగా ప్రచారం కూడా అలాగే జరుగుతోంది.నిన్నెవరో రాజకీయ నాయకుడు -- యోగా అనేది సర్వరోగ నివారిణి -- అని ఒక స్టేజీ మీద నుంచి చెప్పాడు.నాకు చచ్చే నవ్వొచ్చింది.ఆయన్ను చూస్తే, యోగా అనేదాన్ని ఎప్పుడూ చేసిన పాపాన పోలేదని తెలుస్తూనే ఉన్నది.
అది నిజం కాదు.
యోగా- అనేది నిన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. చక్కని ఫిట్ నెస్ ను ఇస్తుంది.కానీ -- నీకు వంశపారంపర్యంగా జీన్స్ లో వచ్చే రోగాలను అది తగ్గించగలదా? అంటే - గలదు, లేదు అని రెండు జవాబులు వస్తాయి.
సామాన్యంగా అందరూ కాసేపు చేసే యోగా ఆ పనిని చెయ్యలేదు.అది నీకు ఫిట్ నెస్ మాత్రమే ఇవ్వగలదు.వంశపారంపర్య రోగాలను అది తగ్గించలేదు.
కానీ, హైయ్యర్ యోగా అనేది ఆ పనిని చెయ్యగలదు.అయితే దానిని చెయ్యాలంటే, దానికి బోలెడంత ఓపిక కావాలి.శ్రద్ధ కావాలి.రోజూ ఉదయం మూడుగంటలు సాయంత్రం మూడుగంటలు హైయ్యర్ యోగాను చెయ్యగలిగితే,అప్పుడు నీ శరీరాన్ని అది సమూలంగా మార్చిపారేస్తుంది.నీలో ఉన్న ఎలాంటి దీర్ఘ రోగాన్నైనా సరే అది నయం చెయ్యగలుగుతుంది.కానీ అంత ఓపిక మనకెక్కడుంది?అంత తీరిక మనకెక్కడుంది?అంత శ్రద్ధ మనకెక్కడిది?రోజుకు ఆరుగంటలపాటు యోగాభ్యాసం చేస్తూ కూచుంటే మనల్ని పోషించేవాళ్ళెవరు?ఈ జీవన పోరాటంలో అది సాధ్యమేనా?సాధ్యం కాదు.
కనుక ఆహారనియమం,యోగాభ్యాసంతో బాటు,హోమియో ఔషధాలను మితంగా వాడుకుంటే,ఆ పని సులభంగా జరుగుతుంది.
వంశపారంపర్య దీర్ఘరోగులలో గనుక మనం గమనిస్తే, యోగాభ్యాసంవల్ల,వాళ్ళ బాధ కంట్రోల్లో ఉంటుంది.మినిమం స్టేజ్ లో ఉంటుంది.కానీ పూర్తిగా తగ్గదు. అలా అది పూర్తిగా తగ్గాలంటే,దానిని సమూలంగా కూకటివేళ్ళతో పెకలించగల హోమియో ఔషధాలవల్లే ఆ పని జరుగుతుంది.లేదా హయ్యర్ యోగాతో జరుగుతుంది.
ఏమిటి హోమియో ఔషధాల ప్రత్యేకత? అని మీకు అనుమానం రావచ్చు. మామూలు అల్లోపతి మందులు ఆ పనిని ఎందుకు చెయ్యలేవు? అని కూడా అనుమానం రావచ్చు.
ఈ రెంటికీ చాలా తేడా ఉన్నది.
హోమియోపతి మందులు పొటెన్సీ ఔషధాలు గనుక,దేహంతో చాలా సూక్ష్మ స్థాయిలలోకి వెళ్లి పని చేస్తాయి.ఇంగ్లీషు మందులు ఆ పనిని చెయ్యలేవు.
ఈ రెంటికీ అసలైన భేదం ఇంకొకటి ఉన్నది.
ఇంగ్లీషు మందులు శరీరం చెయ్యవలసిన పనిని అవి చేసి, శరీరానికి బద్ధకాన్ని పెంచుతాయి.అందుకని శరీరం వాటిమీద ఆధారపడి పోయే పరిస్థితి తలెత్తుతుంది.ఒక మందుల కట్టను ఎక్కడికి పోయినా మోసుకు పోవలసిన ఖర్మ పడుతుంది.తిండి తిన్న వెంటనే ఆ కట్టను తెరిచి ఆ మందులు ప్రతిరోజూ మింగవలసిన గతి పడుతుంది.ఒక్కరోజు అవి వేసుకోకపోతే కుప్పకూలిపోయే పరిస్థితికి మిమ్మల్ని ఆ మందులు తీసుకెళతాయి.
హోమియో ఔషధాలు పనిచేసే తీరు అలా ఉండదు.
అవి శరీరపు రోగనిరోధక శక్తిని ఉత్తెజపరుస్తాయి.శరీరం తన పనిని తాను మునుపటిలా చేసుకునేటట్లు చేస్తాయి.తన రోగాన్ని తానే నయం చేసుకునే స్థాయికి ప్రాణశక్తిని ఉద్ధరిస్తాయి.కనుక వాటిని అదేపనిగా ప్రతిరోజూ వాడవలసిన పని ఉండదు.
ఇంగ్లీషు మందుల వాడకంలో -- అనవసరమైన కెమికల్స్ క్రమేణా దేహంలో పోగుపడుతూ ఉంటాయి.కొన్నాళ్ళ తర్వాత రోగం ఒక అవయవం నుంచి ఇంకొక అవయవం మీదకు ప్రాకుతూ పోతుంది.ముదురుతూ పోతుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్ లనేవి ఆ విధానంలో తప్పకుండా కలుగుతాయి.
కానీ హోమియోపతిలో అలాంటి పరిస్థితి ఉండదు.ఇందులో హానికర రసాయనాలు ఏమీ ఉండవు.అవి శరీరంలో పోగుపడవు.రోగం అన్ని అవయవాలకూ ప్రాకదు.ముదరదు.ఉత్తేజితమైన ప్రాణశక్తి వల్ల రోగం కూకటి వేళ్ళతో పెకలింపబడుతుంది.
యోగాద్వారా కూడా ఈ అద్భుతాన్ని సాధించవచ్చు.కానీ మామూలుగా అందరూ చేసే అరగంట యోగా వల్ల ఈ అద్భుతం జరగదు.హయ్యర్ యోగా మాత్రమే ఈ పనిని చెయ్యగలదు.
ఒక అరగంటలో ఎన్ని ఆసనాలు వెయ్యగలరు? అవి కూడా ఎంత సరిగ్గా తప్పులు లేకుండా చెయ్యగలరు? ఆసనాలనేవి అసలైన యోగాభ్యాసంలో ఎంత భాగం గనుక?
యోగాలో ఆసనాలతో పాటు,షట్కర్మలు,ముద్రలు,క్రియలు,బంధాలు, ప్రాణాయామ సాధనలు,ధారణాభ్యాసాలు,మంత్రజపం మొదలైన కొన్ని వందల టెక్నిక్స్ ఉన్నాయి.అవన్నీ కలసినదే హయ్యర్ యోగా. దానిని ప్రతిరోజూ కనీసం మూడుగంటలపాటు చేస్తే అప్పుడు ఈ అద్భుతం జరుగుతుంది. దేహంలోని రోగాలన్నీ మటుమాయం అవుతాయి.శరీరం వజ్రకాయం అవుతుంది.అంతేగాని పైపైన ఒక పది ఆసనాలు సూర్యనమస్కారాలు చేస్తే ఈ అద్భుతం జరగదు.
వంశపారంపర్య వ్యాధులు లేని మనిషి ఈ రోజున ప్రపంచంలో ఎక్కడా లేడు. పరిపూర్ణ ఆరోగ్యవంతుడూ ఎక్కడా లేడు.కనుక ఈ రోగాలు పోయి, మనిషి ఆరోగ్యంగా బ్రతకాలంటే,ఒక్కటే మార్గం -- ఆహారనియమం,యోగాభ్యాసం, మితంగా హోమియో ఔషధాల వాడకం,దురలవాట్లకు దూరంగా ఉండటం.
ఇది తప్ప -- ప్రపంచమంతా గాలించినా సరే -- దీనికి వేరే మార్గం ఇంకేమీ లేదు.
ఈ రోజువారీ షెడ్యూల్ ను క్రమం తప్పకుండా పాటించగలిగితే,అరవైలో కూడా ఇరవైలాగా హుషారుగా ఉండవచ్చు.జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందంగా జీవించవచ్చు.నేను పుస్తకపరిజ్ఞానంతో ఈ మాటను చెప్పడం లేదు.అనుభవంతో చెబుతున్నాను.నేను చెబుతున్నవాటిని నా జీవితంలో ఆచరించి, ఫలితాలను పొంది, ఈ మాటను చెబుతున్నాను.
అయితే, ఈ మార్గం అందరికీ నచ్చదు. అన్నీ మానుకొని అలా బ్రతకకపోతే ఏం?అనేవారు చాలామంది ఉన్నారు.ఈ రకంగా నోరు కట్టేసుకుని వెయ్యేళ్ళు బ్రతకడం కంటే అన్నీ తింటూ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఒక నెల బ్రతికినా చాలు అనుకునేవారూ అనేవారూ చాలామంది ఉన్నారు.నా స్నేహితులే చాలామంది ఈ మాటను పది పదిహేనేళ్ళ క్రితం కూడా అనేవారు. ఇప్పుడు వారందరూ రకరకాల రోగాలతో గుప్పెళ్ళు గుప్పెళ్ళు మందులు మింగుతున్నారు.అది వారి ఖర్మ.
అలాంటి వారికి జీవితం అంటే -- ప్రతిరోజూ సాయంత్రానికి త్రాగడం, ఇష్టం వచ్చిన మాంసాలు తెగతినడం,సాధ్యమైనంత మంది అమ్మాయిలతో తిరగడం, షాపింగులు చెయ్యడం,బ్యూటీ ప్రాడక్ట్స్ ఎడాపెడా కొనేసి వాడటం,హోటళ్ళలో పడి నానాచెత్తా తినడం,ప్రతిదానికీ ఉద్రేకపడిపోతూ జీవితాన్ని గడుపుతూ అదొక ఘనమైన ఎంజాయ్ మెంట్ అనే భ్రమలో ఉండటం,ఏదైనా రోగం వస్తే కార్పోరేట్ ఆస్పత్రిలో చేరి బెడ్ మీద పడుకొని శరీరాన్ని వాళ్లకు అప్పజెప్పడం--ఇవన్నీ చెయ్యడానికి కావలసింది బోలెడంత డబ్బు గనుక--పొద్దున్న లేచిన దగ్గరనుంచీ రాత్రి పడుకునే వరకూ పరుగులు పెడుతూ, డబ్బు డబ్బు డబ్బు అని కలవరిస్తూ దానికోసమే బ్రతకడం -- ఇంతే.
అసలైన జీవితం ఇది కాదు.
చక్కని ఆరోగ్యంతో,ప్రశాంతమైన మనస్సుతో,పరిపూర్ణ ప్రజ్ఞతో,ఉల్లాసకరమైన జీవితాన్ని గడుపుతూ,చేతనైనంతలో సాటి మనిషికి సాయం చేస్తూ,అన్ని టెన్షన్ల మధ్య ఉన్నాకూడా,ఏ టెన్షనూ లేకుండా,నిశ్చలంగా,నిబ్బరంగా ఉంటూ,అత్యాశ లేకుండా,జెలసీ లేకుండా,కోపతాపాలు దరిచేరకుండా, ప్రతిదానికీ క్రుంగిపోకుండా,తన మనస్సును తన కంట్రోల్ లో ఉంచుకుని గడిపేదే అసలైన జీవితం.
అప్పుడే మనిషికి అసలైన ఆనందం అంటే ఏమిటో అర్ధమౌతుంది.అయితే ఈ ఆనందం ఊరకే అనుకున్నంత మాత్రాన లభ్యంకాదు.'ఈ ఆనందం నాకూ కావాలి'- అని తలచుకున్నంత మాత్రాన అది రాదు.
ఈ ఆనందం సొంతం కావాలంటే మన దినచర్య మారాలి.
మన ప్రయారిటీస్ మారాలి.
మన ఆలోచనా విధానం మారాలి.
మన అలవాట్లు మారాలి.మన పద్ధతులు మారాలి.
వెరసి మన జీవన విధానమే మారాలి.
డబ్బుకోసం,బయట వస్తువులకోసం,అవిచ్చే సోకాల్డ్ సుఖాలకోసం మన ఉరుకులు పరుగులు తగ్గాలి.ఇతరులతో మనల్ని పోల్చుకుని మనం పడే టెన్షన్లు మాయం కావాలి.వస్తువులలో ఆనందం ఉన్నదనే భ్రమ మనల్ని వదలాలి.బయట ప్రపంచంలో కొత్త కొత్త సుఖాల కోసం అన్వేషణ ఆగిపోవాలి.
మినిమం సౌకర్యాలతో - మేగ్జిమం ఆనందంతో బ్రతికే కళను మనం నేర్చుకోవాలి.
వెరసి మన జీవన విధానమే మారాలి.
డబ్బుకోసం,బయట వస్తువులకోసం,అవిచ్చే సోకాల్డ్ సుఖాలకోసం మన ఉరుకులు పరుగులు తగ్గాలి.ఇతరులతో మనల్ని పోల్చుకుని మనం పడే టెన్షన్లు మాయం కావాలి.వస్తువులలో ఆనందం ఉన్నదనే భ్రమ మనల్ని వదలాలి.బయట ప్రపంచంలో కొత్త కొత్త సుఖాల కోసం అన్వేషణ ఆగిపోవాలి.
మినిమం సౌకర్యాలతో - మేగ్జిమం ఆనందంతో బ్రతికే కళను మనం నేర్చుకోవాలి.
ప్రకృతితో,దైవంతో మమేకమైన జీవితాన్ని మనం గడపగలగాలి.అప్పుడే మంచి ఆయుస్సుతో,మంచి ఆరోగ్యంతో,మంచి మనస్సుతో మనం ప్రశాంతంగా జీవించగలుగుతాం.మనం ఆనందంగా ఉండటమే గాక,మన చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందంగా ఉంచగలుగుతాం.మన పిల్లలని కూడా చక్కగా పెంచగలుగుతాం.వారికి కూడా మన వారసత్వాన్ని అందించగలుగుతాం.
అలా ఉండగలిగితే -- అంతకంటే జీవితంలో కావలసింది ఇంకేముంటుంది?
ఆనందం కోసమేగా మనిషి అన్వేషణ.
కాదంటారా?
అలా ఉండగలిగితే -- అంతకంటే జీవితంలో కావలసింది ఇంకేముంటుంది?
ఆనందం కోసమేగా మనిషి అన్వేషణ.
కాదంటారా?
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
22, జూన్ 2015, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)


