“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, ఏప్రిల్ 2010, ఆదివారం

బుద్ధుని అసలైన జనన సంవత్సరం


నేను అమితంగా అభిమానించి, అనుసరించే అవతారమూర్తులలో శ్రీకృష్ణుడు, బుద్ధుడు ప్రముఖ స్థానాలు ఆక్రమిస్తారు. అంటే మిగిలిన అవతార పురుషులంటే నాకు ఇష్టం లేదని అర్ధం కాదు. ఒక్కొక్కరిలోని కొన్ని కొన్ని దివ్యగుణాలు నన్ను ఎక్కువగా స్పందింపచేస్తాయి. శ్రీరామచంద్రుని లోని ధార్మికత, పరశురామునిలోని వీరత్వం, నన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.అదే కోణంలో, మానవ పరిధిలోకి దిగివచ్చిన పరిపూర్ణమైన దివ్య మూర్తిగా శ్రీకృష్ణుని, ఎంతో దూర దృష్టి కలిగిన జ్ఞానమూర్తిగా బుద్ధుని ఆరాధిస్తాను.

బుద్ధుని జాతకం చూద్దామని చాలా ప్రయత్నం చేశాను. బీ వీ రామన్ వంటి ఉద్దండులు ఆయన జాతకం వేశారు. కాని వారు తీసుకున్న జనన తేదీ సరియైనది కాదు. ఇంగ్లీషువారు నిర్ధారించి ఇచ్చిపోయిన తేదీనే సరియైనది అని ఆయన అనుకొని దానికి జాతకం వేశాడు. పైగా తనకు నచ్చిన రామన్ అయనాంశ వాడాడు. అందుకే "నోటబుల్ హోరోస్కోప్స్" లో ఆయన ఇచ్చిన జాతకమూ విశ్లేషనా ఏదో అతికినట్లుగా ఉంటుంది కాని పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. జనన సంవత్సరం మీద అనేక వాద వివాదాలుండటం వల్ల బుద్ధుని సరియైన జాతకం ఇంతవరకూ దొరకలేదు.

ఇంగ్లేషువాళ్ళు మన చరిత్రని వ్రాయడానికి తీసుకున్న మైలురాళ్ళలో ముఖ్యమైనది అలెగ్జాండర్ దండయాత్ర. అదెప్పుడు జరిగిందో వాళ్ళకు తెలుసు గనుక దానిని ప్రామాణికంగా తీసుకున్నారు. అది క్రీపూ 327 లో జరిగింది. దానికి అనుసంధానం చేసి మన చరిత్ర మొత్తాన్నీ పునర్నిర్మించామని వాళ్ళు తలపోశారు. తరువాత, అశోకుని రాతి శాసనాలను, ఖరవేలుని శాసనాలను,పోల్చి చూచి వాళ్ళకు తోచిన చరిత్రను వాళ్ళు వ్రాశారు. కాని ఇంగ్లీషువాళ్ళ జాత్యహంకార ధోరణి వల్ల, ప్రక్రియ మొత్తం పూర్తి ఒంటెద్దు పోకడలతో సాగింది.

బైబిల్
లో చెప్పబడిన రీత్యా, మానవ సృష్టి మొత్తం క్రీస్తు పూర్వం నాలుగువేల సంవత్సరాల క్రితం మాత్రమే మొదలైంది అన్న భ్రమలో మునిగి, వాళ్ళు మన చరిత్రని మొత్తాన్ని మేరకు కుదించి పారేశారు. వక్ర చరిత్రను వ్రాశిన యూరోపియన్ స్కాలర్స్ లో ఫాదర్ హేరాస్ మొదలైన వీర క్రైస్తవాభిమానులు ఉన్నారు. కనుక వారు తమతమ శక్తిమేరకు మన దేశ చరిత్రను చక్కగా వక్రీకరించి, కుదించి వ్రాసి, మన ముఖాన పడేసి పోయారు. మనం కూడా చరిత్రనే గుడ్డిగా నమ్ముతూ పాఠ్యపుస్తకాలలో చదువుతూ వచ్చాము.

మతపిచ్చి బాగా ఉన్నటువంటి క్ర్రైస్తవ జాత్యహంకార చరిత్ర కారులు చేసిన ఒక పెద్ద తప్పు ఏమిటంటే, మన పురాణాలను కాకమ్మ కధల కింద కొట్టిపారేయటం. నిజానికి, పురాణాలలో మత విషయాలే గాక, అనేక ఇతర విషయాలు దర్శనం ఇస్తాయి. రోజుల నాటి సామాజిక, ఆర్ధిక పరిస్థితులు, ఆహారపుటలవాట్లు,నాగరికత, వేషధారణ, సంచార సాధనాలు మొ|| అనేక ఇతర విషయాలు వాటిలో దర్శనం ఇస్తాయి. వీటితో బాటుగా, రాజవంశాలు వాటి చరిత్ర, ఎందరు రాజులు వరుసగా ఎంతకాలం పాటు పరిపాలించారు, వాళ్ళ పేరులు ఏమిటి అన్న విషయాలు కూడా వంశవృక్షాలతో సహా వాటిలో చర్చించబడ్డాయి. ఇటువంటి వంశ చరిత్రలు మనకు హరివంశము మొదలైన కావ్యాలలోనూ, భవిష్యపురాణము, బ్రహ్మ వైవర్త పురాణము మొదలైన కొన్ని పురాణ గ్రంధాలలో దొరుకుతున్నాయి. వీటిని చరిత్ర కారులు ప్రామాణికంగా తీసుకోలేదు.

దీనికి మన తప్పు కూడా కొంత లేక పోలేదు. మన వాళ్ళలో సంస్కృతం బాగా వచ్చిన ప్రతి పండితుడూ కొన్ని కొన్ని శ్లోకాలను రచించి పురాణాలలో అక్కడక్కడా పిట్టకథలుగా, అసందర్భ ఘట్టాలుగా ప్రక్షిప్తం చేసి పారేశాడు. పురాణాలలో ఉన్న కొన్ని కొన్ని విషయాలు కూడా మనకే అసంబద్దం అనిపిస్తాయి. ఉదాహరణకు దశరధుడు డెబ్బై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడనీ, ఇలాటి కొన్ని విషయాలు అబద్దాలు అని మనకే తెలిసి పోతుంటుంది. ఇటువంటి వ్రాతలను చూచి యూరోపియన్ చరిత్ర కారులు మన పురాణాలు మొత్తాన్నీ కల్పనలుగా కొట్టిపారేశారు. పని చేయటానికి వారి మత దురభిమానం అగ్నికి ఆజ్యం పోసింది.

కొందరు చెప్పిన ప్రకారం, దశరధుడు డెబ్భై ఏళ్ళు మాత్రమే రాజ్యం చేశాడు. కాని దాన్ని డెబ్బై వేల ఏళ్ళుగా అర్ధం చేసుకోడానికి కారణం-సంస్కృత భాషలో ఒక పదానికి అనేక అర్ధాలు ఉండటం ఒక కారణం కావచ్చు. ఇదే విధంగా యుగాల లెక్కలు కూడా అర్ధం చేసుకోవాలి. ఇంకొందరు చెప్పేదాని ప్రకారం-ఉద్దేశ పూర్వకంగా మన చరిత్రను కుదించడానికి ఇంగ్లీషువాళ్ళే కొందరు పండితులకు డబ్బులిచ్చి ప్రక్షిప్త శ్లోకాలను మధ్య మధ్యలో రాయించారు. ఇది నిజమో కాదో మనకు తెలియదు కాని వారి జాత్యహంకార ధోరణి మటుకు నిజమే.

చరిత్రలో ఒకే పేరుతో అనేక వ్యక్తులు ఉంటారు. పేరుమీద అభిమానంతో తరువాత తరాల వాళ్ళూ కూడా అదే పేరును పెట్టుకోవటం మన దేశంలోనే కాదు. ప్రపంచం మొత్తంమీద కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు సీజర్- అనీ సీజర్- అనీ పెట్టుకుంటే మనవాళ్ళూ మాత్రం అలా చెయ్యకుండా అశోక అనో సముద్రగుప్త అనో శంకర అనో అదే పేరు పెట్టుకునే వారు. మొదటి శంకరాచార్య క్రీ పూ రెండవ శతాబ్ది వాడైతే, రెండవ శంకరాచార్య క్రీ ఎనిమిదో శతాబ్ది వాడైతే- ఇంగ్లీషు వాడు రెండవ తేదీనే ప్రామాణికంగా తీసుకున్నాడు. దానితో మధ్యలోని వెయ్యి సంవత్సరాలు గాలికి కొట్టుకుపోయాయి.

మరి
పరమ అద్వైతి అయిన మొదటి శంకరులు, భక్తి స్పోరకంగ వివిధ దేవతల పైన కుప్పలు తెప్పలుగా అనేక స్తోత్రాలు ఎలా వ్రాశారు? అదెలా సాధ్యం?
అన్న సందేహం వాళ్ళకు కలగలేదు. కనుక అదేపేరుగల భక్తి పరుడైన ఇంకొక శంకరుడు ఉండి ఉండవచ్చు అన్న ఆలోచనా వాళ్ళకు కలగలేదు. కంచి మఠంలో భద్రపరుచబడి, రెండువేల సంవత్సరాలనుంచీ వరుసగా వస్తున్న పీఠాధిపతుల క్రమాన్ని వాళ్ళ పేర్లనూ పరిశీలిద్దామన్న ఆలోచన కూడా వాళ్ళకు కలగలేదు. మరి ఈ విషయం నిజమైతే, ఆది శంకరుల వద్ద మొదలైన కంచి పీఠ ఆచార్యుల వివరాలు గత రెండు వేల ఏళ్ళ వివరాలతో సహా కంచి మఠంలో మన కళ్లఎదురుగా ఆర్కైవ్స్ గా కనిపిస్తుంటే, ఆదిశంకరులు ఎనిమిదో శతాబ్ది లో ఉండటం చరిత్ర పుస్తకాలలో మనం చదువుతున్నది ఎలా నిజం అవుతుంది అన్న సంగతీ ఎవరికీ తోచదు. విచిత్రమంటే ఇదే మరి.

అంటే క్రీస్తునూ, యూదు మతాన్నీ గొప్ప చెయ్యటం కోసం మిగిలిన ప్రాచీన మతాల చరిత్రను వక్రీకరించడానికి వాళ్ళు తెగబడినట్లేగా. ఇటువంటి వాళ్ళు, సత్యం గురించీ, అహింస గురించీ, నిర్మలత్వం గురించీ వేదికలెక్కి మనకు ఉపన్యాసాలు దంచటం చూస్తుంటే వారిది మరి దైవమతమా లేక సైతాన్ మతమా తెలియక మనకు బుర్ర గిర్రున తిరగటం లేదూ?

అలాగే, చరిత్రలో ఇద్దరు అశోకులు ఉన్న విషయాలను కూడా వారు విస్మరించారు. ఇటువంటి తప్పులతో తయారైన చరిత్రను మనకు అందించి పోయారు. కాని ప్రపంచవ్యాప్తంగా బయటపడుతున్న అనేక నిదర్శనాలు వైదిక నాగరికత యొక్క ప్రాచీనతను నిరూపిస్తున్నాయి. చివరకు వారిలో వారే కొందరు-- యూరోపియన్లు వ్రాశిన భారత చరిత్ర అంతా తప్పు, అసలైన చరిత్ర ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కోట వెంకటాచలం గారు ప్రయత్నాన్ని క్రిందటి తరంలో చేశారు గాని అనేక విమర్శలకు గురయ్యారు. విమర్శలు చేసింది కూడా మన వాళ్ళే. మనకు మన వాళ్ళంటే చులకన మాత్రమె గాక తెల్ల తోలంటే మహా గౌరవం అయి చచ్చింది మరి.

తరంలో పి. ఎన్. ఓక్ గారు, స్టీఫెన్ నాప్ అని అసలైన నామధేయం కలిగి తరువాత భారతీయ వైదిక మతాన్ని, వైష్ణవాన్ని లోతుగా అధ్యయనం చేసి, ముగ్దుడై, "నందనందన దాస" అని పేరు మార్చుకుని వైష్ణవ మతావలంబియైన ఒక విదేశీయుడు చేస్తున్న కృషీ చూచి అన్నా మనకు కళ్ళు తెరుచుకుంటాయో లేదో మరి. అనుమానమే.

స్టీఫెన్ నాప్ గారు పిలక పెట్టుకుని, పంచె కట్టుకుని,తులసి మాల ధరించి, నామాలు పెట్టుకుని దేశంలోని అన్ని వైష్ణవ క్షేత్రాలు దర్శించాడు. చాలా గుళ్ళలో విదేశీయుడనే సాకుతో ఈయన్ని లోపలికి రానివ్వలేదుట. ఆ విషయం రెండేళ్ళక్రితం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో జరిగిన ఒక సభలో ఆయనే స్వయంగా చెప్పాడు. మన ఖర్మ అలా ఉంది మరి. నేను ఆయన ఉపన్యాసం విని ముగ్దుణ్ణైనాను.

స్టీఫెన్ నాప్ గారి వెబ్ సైట్ మరియు మన మతాన్ని వివరిస్తూ సమర్ధిస్తూ ఆయన వ్రాసిన అనేక వ్యాసాలు ఇక్కడ చూడండి.

బుద్ధుని జనన సంవత్సరం గురించి మరికొంత వెలుగును ప్రసరింపచేసే లింక్ ఇక్కడ చూడవచ్చు. ఈ లాజిక్ ను బట్టి, బుద్ధుడు క్రీ పూ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పుట్టినట్లు స్పష్టమౌతున్నది.

వివరాల ఆధారంగా నేను తయారు చేసిన బుద్ధుని అసలైన జాతకం ముందు పోస్ట్ లో చూద్ధాము.